ఒక ప్రత్యామ్నాయ సంస్కృతి : ప్రజా కళాకారులు, గ్రంథాలయాలు

రంగవల్లి స్మారక గ్రంథాలయ వార్షికోత్సవం: జూకంటి అనుభూతి

On
ఒక ప్రత్యామ్నాయ సంస్కృతి : ప్రజా కళాకారులు, గ్రంథాలయాలు

నేటి ఆధునిక ప్రపంచానికి దూరంగా,.. నిజమైన ప్రజా ప్రతినిధులతో....

  ఈనెల 13న రంగవల్లి విజ్ఞాన కేంద్రం( గ్రంథాలయం) వార్షికోత్సవం వేములవాడ దగ్గర మరియు  ఆమె 26వ వర్ధంతిని పురస్కరించుకొని ఒక సమావేశం రంగవల్లి విజ్ఞాన కేంద్రం కార్యవర్గం ఏర్పాటు చేయడం  జరిగింది. అందులో నన్ను "ప్రజా గ్రంధాలయాల  ఆవశ్యకత"  ' విమల మిగతా ముఖ్యులు కోరినారు. ఇందుకొరకు ఉదయం 11 గంటల వరకు నేను సిరిసిల్ల నుండి వేములవాడ కమాన్ దగ్గర  నూతనంగా నిర్మించిన రంగవల్లి విజ్ఞాన కేంద్రానికి చేరుకున్నాను. తీవ్రమైన చలిని లెక్క చేయకుండా అప్పటికే  ఉత్తర తెలంగాణ జిల్లాలలోని వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు అమరుల కుటుంబాల వారు  వచ్చారు . భుజాన గొంగడి వేసుకున్న పురుషులు ఎర్ర దుస్తువులు ధరించిన స్త్రీలు యువకులు మొత్తానికి అరుణోదయ కళాకారులందరూ రోడ్డు దగ్గరికి నుంచి కొంచెం లోపల ఉన్న విజ్ఞాన కేంద్రం వరకు ఒక పాటల ఊరేగింపుగా వెళ్లడానికి తయారు అవుతున్నారు.  కొందరి యువకులు  డప్పుతో  కొందరు నడుస్తున్నారు . విమల నన్ను" అన్నా  నడుస్తారే మీరు" అడిగింది . "నేనూ నడుస్తాను" అంటూ తారు రోడ్ వైపు అడుగులు వేశాను . సిరిసిల్ల కరీంనగర్ రోడ్డు పక్కన పాతిన రంగవల్లి విజ్ఞాన కేంద్రం బోర్డు దగ్గర నుండి కొంతమంది ఎర్రజెండాలు చేత పట్టుకోగా పనికొందరు డప్పు దరువు వాయిస్తూ పాటలు పాడుకుంటూ ఒక గోగు పూల ఊరేగింపు భవనం వైపు కదిలింది.

           సభకు అధ్యక్షత వహించిన విమల తో పాటు ప్రత్యేక అతిథి ప్రొఫెసర్ కొల్లపురం విమల,విశిష్ట అతిథిగా నేనూ పాల్గొన్నాను.

          సహజంగా అధికార, విపక్ష పార్టీలు నిర్వహించే సభలకు ముందు వెనుక ఉండే  ఆర్భాటాలు అట్టి సభలకు ప్రజలు తరలించడానికి వాహనాలు ఏర్పాటు చేయడం సభకు వచ్చిన వారికి ఇతోదికంగా మర్యాదలు చేయడం యాంత్రికంగా జరుగుతున్నవి. అందుకు భిన్నంగా  ఒక ప్రత్యామ్నాయ ప్రజా సంస్కృతి కి గుర్తుగా స్వచ్ఛందంగా తరలివచ్చిన వారికి సమాజం పట్ల స్పష్టమైన అవగాహన కలిగిన ఈ ప్రాంతంలో జరిగిన అనేక పోరాటాలలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాల్గొని వారి వారి కారణాలవల్ల మౌనం వహించి జరుగుతున్న అన్ని పరిణామాలను  ప్రేక్షకుడిగా గమనిస్తున్న వారు కూడా ఈ సమావేశంలో బాధ్యులుగా చురుకైన పాత్ర నిర్వహించారు .

       మధ్య మధ్య అరుణోదయ కళాకారుల పాటలతో ఇప్పటివరకు అమరత్వం పొందిన వీరుల త్యాగాలను కీర్తిస్తూ తలుచుకొని గణంగా నివాళులు అర్పించారు.  పరిమితంగా నైనా ఆసక్తికరంగా స్త్రీలు పురుషులతో పాటు ఆలోచనా పరులు సామాన్యులు వచ్చారు . చాలామంది ఈ సమాజం ఎటు పోతుంది అనే ఆలోచనలను పంచుకున్న వారితో  చివరి వరకూ జరిగింది.

    అరుణోదయ కళాకారులు పాడుకునే  పాటలలో ఎక్కువగా రచించిన కవి మిత్ర అలియాస్ అమర్ అలియాస్ కూర దేవేందర్ ఈ సభలో ఉండడం విశేషం. ఆయన సహచరి విమల అధ్యక్షత వహించడం వచ్చిన  ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పలకరించడం మాత్రమే కాదు వీరు ఎంతో ఆత్మీయంగా కలివిడిగా మాట్లాడే తీరును చూస్తే ప్రజా ఉద్యమాల నిర్మాణంలో నిబద్ధత ఆచరణ ప్రత్యక్షంగా కనబడింది.

        అంతేకాకుండా ఒక ఆశయం కోసం లక్ష్యం కోసం పనిచేసే అమరవీరులైన వారి భార్యలు, అనేక విధాలుగా గాయపడిన మాజీ సహచరులు ఈ ఒక పూట సభలో తమ తమ ఊర్ల నుండి స్వచ్ఛందంగా వచ్చి ఎంతో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.

         అమెరికాలోని ఇతర దేశాలలోని వివిధ యూనివర్సిటీలను హ్యుమానిటీస్ భాగంలో బోధన చేసింది. తిరిగి వచ్చి హైదరాబాదులోని అమెరికా స్టడీస్ లో ప్రొఫెసర్ గా పని చేస్తున్న కొల్లాపురం విమల ఉపన్యాసంలో స్థానిక ఉదాహరణ లను తీసుకొని సమాజ సంక్షోభం గురించి వివరించిన అంశాలు  పాల్గొన్న వారిని దీర్ఘమైన ఆలోచనలు పడవేసింది. సమాజంలో స్త్రీ పురుషుల మధ్య అనేక చిక్కుముళ్లను సుధా రంగా విద్యార్థులకు చెప్పినట్టు విప్పి చెప్పింది.

       సభాధ్యక్షత వహించిన  గాయకురాలు, నాయకురాలైన విమల ఇక్కడ జరిగిన పోరాటాల గురించి ఆయా పోరాటంలో ఆయా సంఘటనలలో నేల కొరిగిన అమరవీరుల  త్యాగాలను స్మరించుకుంటూ వివరించింది.

      నేను  ప్రజా గ్రంధాలయాల ఆవశ్యకతను నా యొక్క అనుభవాలు,నేను చదివిన పుస్తకాలు నన్ను తీర్చిదిద్దిన గ్రంధాల గురించి వివరించాను. ప్రస్తుత  అత్యాధునిక కాలంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన తాత్వికవేత్తల గ్రంథాలను మహనీయుల ఆత్మకథలను జీవిత వాస్తవాలకు అద్దం పట్టిన గొప్ప కథలు,  నవలలు వ్యాసాల పుస్తకాల  అధ్యయనం చేయాల్సిన  అవసరం ఎంతో ఉందన్నాను.   నీ జీవితాన్ని నువ్వు నిర్మించుకోవడానికి నీ చుట్టూ ఉన్న సమాజాన్ని అర్థం చేసుకోవడానికి, ఒక ప్రజా దృక్పథం ఏర్పరచుకోవడానికి ప్రజా గ్రంధాలయాల అవసరం   గ్రామ గ్రామాలలో నెలకొల్పాల్సిన ఆవశ్యకత మరింత ఏర్పడిందని చెప్పాను.

        ఉపన్యాసానికి ఉపన్యాసానికి నడుమ అరుణోదయ కళాకారులు అద్భుతమైన పాటలు పాడారు. డబ్బు దరువులతో కాళ్ల గజ్జల సవ్వడితో సభా ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. చివరగా ఆ సమావేశంలో పాల్గొన్న ప్రజాసంఘాల నాయకులతో మాట్లాడించడం వలన  వివిధ సమస్యల సమాహారమైన సంధి కాలం దిశ దశల తీరు పైన వారి ఆలోచనలను మిగతావారు పంచుకున్నట్లు అయింది. సమావేశం దాదాపు మూడు గంటల పైగా జరిగింది. అనంతరం అందరూ కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ  ఆయా వ్యక్తుల జీవితాలను ఒకరికొకరు కలబోసుకుంటూ భోజనం చేశాము.

సభ ముగియగానే ఎక్కడి వారు అక్కడికి వెళ్ళక విజ్ఞాన కేంద్రంలో కూర్చుని సాయంత్రం వరకు అందరూ కలిసి మెలిసి మాట్లాడుకున్నారు.

        అనేక ప్రజా పోరాటాల సమావేశాలను, ప్రజాస్వామ్య పార్టీల సభలను దగ్గరగా చూసిన అనుభవాలు అనేకం ఉన్నాయి.. కానీ ఎన్నో దశాబ్దాల తర్వాత మళ్లీ ఇటువంటి సభలో పాల్గొనడం వలన నాకు ఒక ఆశాజనకమైన ఊరట లభించింది.ఒక ప్రత్యామ్నాయ సమాజ నిర్మాణం గురించిన కలలకు కొత్త రెక్కలు వచ్చాయి. మళ్ళీ కొన్ని సంవత్సరాలకు సరిపడా ఆశాజనకమైన  ఇంధనాన్ని అందించింది. ఒకానొక నూతనోత్సాహాన్ని,  ఉద్వేగాన్ని కలిగించిందనడంలో ఏమాత్రం సంశయం లేదు.

                   ----జూకంటి జగన్నాథం, అధ్యక్షులు,

అఖిల భారతీయ తెలంగాణ రచయితల వేదిక.FB నుండి.

Join WhatsApp

More News...

Local News 

చౌలామద్దిలో ఓటు హక్కు వినియోగించిన తుల ఉమ, డా. తుల రాజేందర్

చౌలామద్దిలో ఓటు హక్కు వినియోగించిన తుల ఉమ, డా. తుల రాజేందర్ చౌలామద్ది డిసెంబర్ 15 (ప్రజా మంటలు): ఈరోజు జరిగిన 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చౌలామద్ది గ్రామంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తుల ఉమ, తుల గంగవ్వ స్మారక ట్రస్ట్ చైర్మన్ డా. తుల రాజేందర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని...
Read More...
State News 

గాంధీ మెడికల్ కాలేజీ మాజీ హెచ్ఓడి డా.రత్నకుమారి కన్నుమూత 

గాంధీ మెడికల్ కాలేజీ మాజీ హెచ్ఓడి డా.రత్నకుమారి కన్నుమూత  సికింద్రాబాద్, డిసెంబర్ 15 (ప్రజామంటలు): సికింద్రాబాద్ గాంధీ మెడికల్‌ కాలేజీ బయోకెమిస్ట్రీ విభాగం మాజీ హెచ్‌ఓడీ డా. జి. రత్నకుమారి సోమవారం కన్నుమూశారు. గాంధీ మెడికల్‌ కాలేజీ పూర్వ విద్యార్థినిగా, అదే కళాశాలలో సేవలందించి పదవీ విరమణ పొందారు. నిబద్ధత గల అధ్యాపకురాలిగా పేరు పొందారు ఆమె గతంలో ఇచ్చిన డిక్లరేషన్ మేరకు ఆమె డెడ్...
Read More...

తుంగూర్ సర్పంచ్ గా గెలుపొందిన అర్షకోట రాజగోపాల్ రావును, పాలకవర్గంను సన్మానించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ 

తుంగూర్ సర్పంచ్ గా గెలుపొందిన అర్షకోట రాజగోపాల్ రావును, పాలకవర్గంను సన్మానించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్  జగిత్యాల డిసెంబర్ 15 (ప్రజా మంటలు)తుంగూర్ సర్పంచ్ గా గెలుపొందిన అర్షకోట రాజగోపాల్ రావును, ఉపసర్పంచ్ మరియు పాలకవర్గంను జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ శాలువా కప్పి సన్మానం చేసి అభినందించారు.  జగిత్యాల నియోజకవర్గంలోని సుమారు 70 గ్రామాల్లో తనపై  ఎంతో నమ్మకముంచి, ప్రజల అభిమానంతో గెలుపొందిన సర్పంచ్ లకు అభినందనలు తెలియజేసి సన్మానించారు....
Read More...

ఎమ్మెల్యే సంజయ్ బలపరిచిన సర్పంచులు ఉపసర్పంచ్ లు వార్డు సభ్యులను అభినందించి సత్కరించిన ఎమ్మెల్యే

ఎమ్మెల్యే సంజయ్ బలపరిచిన సర్పంచులు ఉపసర్పంచ్ లు వార్డు సభ్యులను అభినందించి సత్కరించిన ఎమ్మెల్యే జగిత్యాల డిసెంబర్ 15 (ప్రజా మంటలు)జగిత్యాల పట్టణ పొన్నాల గార్డెన్స్ లో జగిత్యాల నియోజకవర్గం లో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ బలపరిచిన 70 మంది సర్పంచులు మరియు ఉప సర్పంచ్ లు వార్డు సభ్యులు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందగా 65 మంది గ్రామ పంచాయతీ సర్పంచ్ ,ఉప సర్పంచ్ పాలకవర్గ సభ్యులను...
Read More...
Local News 

రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే...గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం..- మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ 

రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే...గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం..- మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్  గొల్లపల్లి డిసెంబర్ 15 (ప్రజా మంటలు :అంకం భూమయ్య) గొల్లపల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ  ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఆవుల జమున సత్యం (ఉంగరం గుర్తు) ఓటు వేసి గెలిపించాలని కోరారు.సత్యం వెనుక బిఆర్ఎస్ పార్టీ, కొప్పుల ఈశ్వర్, కెటిఆర్,...
Read More...
Local News  State News 

సామాజిక తెలంగాణయే నా ధ్యేయం.. 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: X "ఆస్క్ కవిత"లో కల్వకుంట్ల కవిత

సామాజిక తెలంగాణయే నా ధ్యేయం.. 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: X హైదరాబాద్, డిసెంబర్ 15 (ప్రజా మంటలు): సామాజిక తెలంగాణ సాధననే తన ప్రధాన లక్ష్యంగా తీసుకున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. 2029 ఎన్నికల్లో జాగృతి పోటీలో ఉంటుందని వెల్లడించారు. సోమవారం ట్విట్టర్ (ఎక్స్) వేదికగా నిర్వహించిన #AskKavitha కార్యక్రమంలో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. ఈ ఇంటరాక్షన్...
Read More...
State News 

వావ్...దంపతులిద్దరూ గెలిచారు... ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయి..

వావ్...దంపతులిద్దరూ గెలిచారు... ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయి.. సికింద్రాబాద్,  డిసెంబర్ 15 (ప్రజా మంటలు):  పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రామన్నపేట గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోచమ్మల ప్రవీణ్(8వ వార్డు) మంజుల (10వ వార్డు) దంపతులు ఇద్దరు వేర్వేరు వార్డుల్లో పోటీ చేశారు. చిత్రం ఏమిటంటే ఇద్దరికి 98-98 ఓట్లు చొప్పున  వచ్చాయి.   కాగా ప్రవీణ్ రామన్నపేట---...
Read More...
Local News 

పాషం భాస్కర్ మృతిపై జి. రాజేశం గౌడ్ సంతాపం

పాషం భాస్కర్ మృతిపై జి. రాజేశం గౌడ్ సంతాపం ఇబ్రహీంపట్నం డిసెంబర్ 15 (ప్రజా మంటలు): ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన మాజీ సర్పంచ్‌, మండల అధ్యక్షుడిగా సేవలందించిన పాషం భాస్కర్ గారు అనారోగ్య కారణాలతో మృతి చెందారు. ఆయన అకాల మరణం కుటుంబ సభ్యులకు తీరని లోటుగా మారింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి జి. రాజేశం గౌడ్  తన భార్య  శ్యామలాదేవితో కలిసి పాషం...
Read More...
State News 

కవితమ్మపై తప్పుడు ప్రచారం ఆపాలి.. నిరాధార ఆరోపణలకు తీవ్ర పరిణామాలు: తెలంగాణ జాగృతి నేతలు

కవితమ్మపై తప్పుడు ప్రచారం ఆపాలి.. నిరాధార ఆరోపణలకు తీవ్ర పరిణామాలు: తెలంగాణ జాగృతి నేతలు హైదరాబాద్ డిసెంబర్ 15. (ప్రజా మంటలు):తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మపై పథకం ప్రకారం తప్పుడు ప్రచారం జరుగుతోందని జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, సీనియర్ నేత సయ్యద్ ఇస్మాయిల్ ఆరోపించారు. సోమవారం బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు ఈ వ్యాఖ్యలు చేశారు. వి. ప్రకాష్ అనే వ్యక్తి...
Read More...

మోతే గ్రామపంచాయతీ వార్డ్ సభ్యులను అభినందించి సత్కరించిన డా .భోగ శ్రావణి ప్రవీణ్

మోతే గ్రామపంచాయతీ వార్డ్ సభ్యులను అభినందించి సత్కరించిన డా .భోగ శ్రావణి ప్రవీణ్ జగిత్యాల డిసెంబర్ 15 (ప్రజా మంటలు)మోతే గ్రామపంచాయతీ ఎన్నికల్లో వార్డ్ మెంబర్లుగా గెలుపొందిన పల్లెకొండ రాజేశ్వరి-ప్రశాంత్ , ధనపనేని నరేష్  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి ని మర్యాదపూర్వకంగా కలువగా వారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల అర్బన్ మండల అధ్యక్షులు రాంరెడ్డి, సునీల్,ప్రశాంత్ మరియు...
Read More...

పొలాస గ్రామపంచాయతీ నూతన ఉపసర్పంచ్ ,వార్డ్ సభ్యులను సత్కరించిన డా భోగ శ్రావణి

పొలాస గ్రామపంచాయతీ నూతన ఉపసర్పంచ్ ,వార్డ్ సభ్యులను సత్కరించిన డా భోగ శ్రావణి    జగిత్యాల రూరల్ డిసెంబర్ 15(ప్రజా మంటలు)  మండలం పొలాస గ్రామం నూతన ఉపసర్పంచ్ మరియు వార్డు మెంబర్స్ గెలుపొందగా ఈరోజు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి ని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలువగా గెలుపొందిన ఉప సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్లను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మిల్కూరి...
Read More...
National  State News  International  

భారత మార్కెట్‌లో బ్రిటిష్ ఎయిర్వేస్ విస్తరణ – ఢిల్లీకి మూడో డైలీ ఫ్లైట్

భారత మార్కెట్‌లో బ్రిటిష్ ఎయిర్వేస్ విస్తరణ – ఢిల్లీకి మూడో డైలీ ఫ్లైట్ న్యూఢిల్లీ డిసెంబర్ 14:భారతదేశంలో తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు బ్రిటిష్ ఎయిర్వేస్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్–యూకే మధ్య పెరుగుతున్న ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఫ్లైట్ ఫ్రీక్వెన్సీలు పెంచడంతో పాటు సేవలను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. 2026 నుంచి (అనుమతులకు లోబడి) లండన్ హీత్రో – న్యూఢిల్లీ మార్గంలో మూడో డైలీ...
Read More...