గ్రామ రాజకీయాల్లోకి ఏఐ ఎంట్రీ

ఏఐ మార్ఫింగ్‌తో ఓటర్లలో అయోమయం

On
గ్రామ రాజకీయాల్లోకి ఏఐ ఎంట్రీ

గ్రామాల్లో మర్ఫింగ్ వీడియోల కలకలం

* ఏఐ మార్ఫింగ్‌తో ప్రత్యర్థులపై దుష్ప్రచారం

* గ్రామ రాజకీయాల్లోకి ఏఐ ఎంట్రీ

* ఏఐ మార్ఫింగ్‌తో ఓటర్లలో అయోమయం


భీమదేవరపల్లి డిసెంబర్ 10 (ప్రజామంటలు) :

మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల వేళ రాజకీయ వేడి పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కడ చూసినా ఏఐ సిత్రాలు, మర్ఫింగ్ వీడియోలు కలకలం రేపుతున్నాయి. అభ్యర్థుల పేర్లు, ఫోటోలు వాడుకుని కల్పిత వీడియోలు, మార్ఫింగ్ ఆడియోలు తయారుచేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

*అభ్యర్థులపై వ్యక్తిగత విషయాల బహిర్గతం పేరుతో నకిలీ ప్రచారం*

కొంతమంది ప్రత్యర్థులపై తప్పుడు ఆరోపణలు, వ్యక్తిగత విషయాల పేరిట కల్పిత పోస్టులు, ఫేక్ స్క్రీన్‌షాట్లు, డీప్‌ఫేక్ వీడియోలు తయారుచేసి వాట్సాప్ గ్రూపుల ద్వారా వ్యాప్తి చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. గ్రామస్థులు ఏది నిజం, ఏది నకిలీ అన్నది తేల్చుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు.

*వాట్సాప్ పోస్టుపై సర్పంచ్ అభ్యర్థి ఫిర్యాదు*

భీమదేవరపల్లి మండలంలోని ఓ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి తనపై అభ్యంతరకరంగా, తప్పుడు సమాచారంతో రూపొందించిన ఏఐ పోస్టులు పంచుతున్నారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ పోస్టులు గ్రామంలో తన ప్రతిష్ఠ దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా చేసినవని అభ్యర్థి ఆరోపించారు.

*ముల్కనూర్‌లో అధికార పార్టీ నాయకురాలిపై కల్పిత వీడియో*

ముల్కనూర్‌లో ఓ అధికార పార్టీ మహిళా నాయకురాలి ఫోటోను ఉపయోగించి, తాను మాట్లాడినట్లు కృత్రిమంగా తయారు చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఘటన పట్ల సదరు నాయకురాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇది తమను అపకీర్తి పర్చేందుకు ప్రత్యర్థులు చేస్తున్న అనైతిక చర్య అని పేర్కొన్నారు. 

*ఎన్నికల్లో ఏఐ దుర్వినియోగంపై ఆందోళన*

స్థానికంగా ఏఐ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ, అభ్యర్థుల అసలు మాటలను మార్చడం, మాట్లాడని మాటలు మాట్లాడినట్లుగా చూపడం, ఫేక్ స్క్రీన్‌షాట్లతో అపోహలు రేకెత్తించడం, ప్రత్యర్థులపై అవమానకర పోస్టులు చేయడం లాంటివి పెరుగుతున్నాయని అధికారులు హెచ్చరించారు.

*పోలీసుల హెచ్చరిక*

భీమదేవరపల్లి, వంగర ఎస్సైలు రాజు, దివ్య ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ఎన్నికల సమయంలో తప్పుడు వార్తలు, ఫేక్ వీడియోలు పంచడం నేరమని, అసత్య సమాచారాన్ని ఫార్వర్డ్ చేసినా క్రిమినల్ కేసులు నమోదవుతాయని హెచ్చరించారు. ఏఐ మార్ఫింగ్‌కు పాల్పడేవారిపై ఐటీ చట్టం సెక్షన్ల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.


*ప్రజలకు విజ్ఞప్తి*

నకిలీ వీడియోలు, ఏఐ పోస్టులు వస్తే వెంటనే నిజానిజాలు ఖరారు చేసుకోవాలని, గ్రామ పెద్దలు, అధికారులు పోలీసులకు సమాచారమివ్వాలని, అనుమానాస్పద పోస్టులను షేర్‌ చేయరాదని స్పష్టం చేశారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

గ్రామ రాజకీయాల్లోకి ఏఐ ఎంట్రీ

గ్రామ రాజకీయాల్లోకి ఏఐ ఎంట్రీ గ్రామాల్లో మర్ఫింగ్ వీడియోల కలకలం * ఏఐ మార్ఫింగ్‌తో ప్రత్యర్థులపై దుష్ప్రచారం * గ్రామ రాజకీయాల్లోకి ఏఐ ఎంట్రీ * ఏఐ మార్ఫింగ్‌తో ఓటర్లలో అయోమయం భీమదేవరపల్లి డిసెంబర్ 10 (ప్రజామంటలు) : మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల వేళ రాజకీయ వేడి పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కడ చూసినా ఏఐ సిత్రాలు, మర్ఫింగ్ వీడియోలు కలకలం రేపుతున్నాయి....
Read More...
Local News 

ట్రాఫిక్ నిబంధనల పై యమధర్మరాజు అవగాహన : ట్రాఫిక్ పోలీసులతో కలిసిరోడ్డు ప్రమాదాలపై అవేర్నెస్

ట్రాఫిక్ నిబంధనల పై యమధర్మరాజు అవగాహన : ట్రాఫిక్ పోలీసులతో కలిసిరోడ్డు ప్రమాదాలపై అవేర్నెస్ సికింద్రాబాద్, డిసెంబర్ 09 (ప్రజామంటలు) :  రోడ్డు ప్రమాదాల పై అవగాహన కలిగించేందుకు నార్త్ జోన్ ట్రాఫిక్ పోలీసులు వినూత్న రీతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అతివేగం, రాంగ్ పార్కింగ్, సిగ్నల్ జంపింగ్, ట్రిపుల్ రైడింగ్ వల్ల కలిగే రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేకంగా యమధర్మ రాజు వేషదారితో ట్రాఫిక్ కూడళ్ల వద్ద వాహనదారులకు అవగాహన కలిగిస్తున్నారు....
Read More...
Filmi News  State News 

చలనచిత్ర రంగ అభివృద్ధికి పూర్తి సహకారం — సీఎం రేవంత్ రెడ్డి

చలనచిత్ర రంగ అభివృద్ధికి పూర్తి సహకారం — సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ డిసెంబర్ 08 (ప్రజా మంటలు): తెలంగాణలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీలో స్టూడియోలు ఏర్పాటు చేసుకునే వారికి ప్రభుత్వము పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025 రెండో...
Read More...
State News 

రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ

రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ హైదరాబాద్ డిసెంబర్ 09 (ప్రజా మంటలు): భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025 సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను విర్చువల్‌గా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో...
Read More...
Local News 

గాంధీ ఆస్పత్రిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

గాంధీ ఆస్పత్రిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి సికింద్రాబాద్, డిసెంబర్ 09 (ప్రజా మంటలు):  సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీఆస్పత్రిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు.  పోలీసులు తెలిపిన వివరాలు.. గాంధీ ఎమర్జెన్సీ వార్డు వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్న దాదాపు 45-50 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తిని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది ఆసుపత్రిలో అడ్మిట్ చేయించారు. అయితే సదరు...
Read More...
Local News 

పోష్ యాక్ట్–2013పై అవగాహన ర్యాలీ

పోష్ యాక్ట్–2013పై అవగాహన ర్యాలీ సికింద్రాబాద్, డిసెంబర్ 09 (ప్రజామంటలు) : పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణకు కఠినంగా అమలు అవుతున్న పోష్ యాక్ట్–2013 గురించి అవగాహన కల్పించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ హైదరాబాద్ జిల్లా కమిటీ, యాక్షన్ ఎయిడ్, భరోసా సంయుక్తంగా మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించింది. న్యూ బోయిగూడ నుంచి గాంధీ ఆస్పత్రి ఎదురుగా...
Read More...
Local News 

రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను సందర్శించిన అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి.

రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను సందర్శించిన అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి. ఇబ్రహీంపట్నం డిసెంబర్ 9 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):   ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని మోడల్ స్కూల్ నందు గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై  రిసెప్షన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి సందర్శించినారు, మరియు అలాగే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని గండి హనుమాన్ చెక్ పోస్ట్ ని కూడా
Read More...

"అవినీతిని నిర్మూలిద్దాం- దేశాన్ని అభివృద్ధి చేద్దాం’’ 1064 టోల్ ఫ్రీ నెంబర్ తో అవినీతికి అడ్డుకట్ట జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

   జగిత్యాల డిసెంబర్ 9 (ప్రజా మంటలు)అవినీతి నిరోధక వారోత్సవాలు పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ   1064 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయడం ద్వారా అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చని   జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ ఛాంబర్ లో జిల్లా ఎస్పీ అశోక్...
Read More...
Local News 

ఆదం సంతోష్ ఆధ్వర్యంలో ఘనంగా సోనియమ్మ బర్త్ డే సెలబ్రేషన్స్..

ఆదం సంతోష్ ఆధ్వర్యంలో ఘనంగా సోనియమ్మ బర్త్ డే సెలబ్రేషన్స్.. సికింద్రాబాద్, డిసెంబర్ 09 (ప్రజామంటలు): అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన  సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా సికింద్రాబాద్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే, ఇంచార్జీ  అదం సంతోష్ కుమార్ ఆమెకు  హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కేక్‌ కటింగ్‌, పండ్ల పంపిణీ,...
Read More...
Local News 

బన్సీలాల్ పేట లో సోనియమ్మ 79వ జన్మదిన వేడుకలు

బన్సీలాల్ పేట లో సోనియమ్మ 79వ జన్మదిన వేడుకలు సికింద్రాబాద్, డిసెంబర్ 09 (ప్రజామంటలు): సికింద్రాబాద్, బన్సీలాల్‌పేట్ డివిజన్‌లోని జబ్బర్ కాంప్లెక్స్ లో కాంగ్రెస్ పార్లమెంటరీ చైర్‌పర్సన్  సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దీపక్ జాన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డివిజన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఐత చిరంజీవి ఆధ్వర్యంలో పటాకులు కాల్చారు....
Read More...
Local News 

ఎన్నికల కోడ్ నియమాల్లో  ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించుకోవాలి :ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి 

ఎన్నికల కోడ్ నియమాల్లో  ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించుకోవాలి :ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి  (అంకం భూమయ్య) గొల్లపల్లి డిసెంబర్ 09 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉండడంతో నిబంధనలు పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు ఎస్ఐ,కృష్ణ సాగర్ రెడ్డి మళవారం మండలంలోని రాఘవపట్నం ,గుంజపడుగు, వెలుగుమట్ల ,చందోలి, దమ్మన్నపేట  శ్రీరాములపల్లి గ్రామాలలో పర్యటించి ప్రజలకు ఎన్నికలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని అలాగే ఎన్నికల సమయంలో వాట్స్అప్...
Read More...

4,  21 వార్డులలో అభివృద్ధి పనులకు    భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

4,  21 వార్డులలో అభివృద్ధి పనులకు    భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల డిసెంబర్ 9 ( ప్రజా మంటలు) పట్టణ 21వ వార్డులో 15 లక్షలతో సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు భూమిపూజ చేసి,4వ వార్డులో చెరువు కట్ట పోచమ్మ ఆలయం దగ్గర 4 లక్షల తో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ అంతకుముందు వార్డు అభివ్రుద్ది...
Read More...