పెండ్లి నిరాకరణపై రెచ్చిపోయిన బావ : గొంతులో కత్తి దించి, యువతిని దారుణంగా చంపిన మానవ మృగం
రక్తపు మడుగులో కుప్పకూలి ప్రాణాలు విడిచిన పవిత్ర వారాసిగూడ పీఎస్ పరిధిలో పట్టపగలు అమానవీయ ఘటన
సికింద్రాబాద్, డిసెంబర్ 08 (ప్రజా మంటలు ):
పెండ్లికి నిరాకరించిందనే కోపంతో వరసకు బావ అయ్యే ఓ మానవ మృగం 18ఏండ్ల యువతిని పట్టపగలు ఆమె ఇంట్లోనే గొంతులో కత్తి దించి, అతి దారుణంగా హత్య చేశాడు. వారాసిగూడ పోలీసులు తెలిపిన వివరాలు...ఏపీ రాష్ర్టంలోని శ్రీకాకుళం జిల్లా కు చెందిన కాంతారావు, లక్ష్మీ దంపతులు తమ ఇద్దరు కూతుళ్ళను తీసుకొని జీవనోపాధికై గత పదేండ్ల క్రితం సిటీకి వచ్చారు.
వారాసిగూడ పీఎస్ పరిధిలోని బాపుజీనగర్ లోని హన్మాన్ ఆలయం పక్కనున్న బిల్డింగ్ లో అద్దెకు ఉంటున్నారు. కాంతారావు బిల్డింగ్ పనులు చేసే మేస్ర్తీగా, భార్య లక్ష్మీ కూలీ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద కూతురు పవిత్ర(18) ఇంటర్పూర్తి చేసి, ప్రస్తుతం కంప్యూటర్ శిక్షణ తీసుకుంటుంది. కాంతారావు కు బంధువు అయిన జవహార్ నగర్ లో నివాసం ఉంటున్న శ్రీకాకుళం వాసి ఉమాశంకర్ (27)కు తన కూతురు ను ఇచ్చి వివాహం చేయాలను కున్నారు.
అయితే టైల్స్ పనిచేసే ఉమాశంకర్ ఇటీవల మద్యానికి బానిసై సక్రమంగా పనికి వెళ్ళుతుండకపోవడంతో పవిత్రకు చేయాలనుకున్న పెండ్లిని దాదాపుగా క్యాన్సల్ చేసుకున్నారు. ఇదే విషయమై ఉమాశంకర్ కొంతకాలంగా వీరితో గొడవపడుతున్నాడు. ఇటీవల విజయవాడ వెళ్ళి కనకదుర్గమ్మ వారిని దర్శనం చేసుకున్న కాంతారావు కుటుంబసభ్యులు సోమవారం తిరిగి ఉదయం సిటీలోని తమ ఇంటికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న ఉమాశంకర్ సోమవారం మద్యాహ్నం కాంతారావు ఇంటికి చేరుకున్నాడు. తనకు చెప్పకుండా విజయవాడ ఎలా వెళ్తారని కుటుంబసభ్యులతో గొడవకు దిగాడు.
ఈ క్రమంలో పెండ్లికి నిరాకరించందనే కోపంతో అప్పటికే రగులుతున్న ఉమాశంకర్ తన వెంట తెచ్చుకున్న కత్తితో కుటుంబసభ్యులు చూస్తుండగానే పవిత్ర మెడపై కత్తి దించి బలంగా పొడిచాడు. దాంతో కుప్పకూలిన పవిత్ర గొంతు నుంచి రక్తం ఉబికివచ్చి, గది అంతా రక్తపు మడుగు అయింది. దించిన కత్తిని గొంతులో నుంచి తీసి, కత్తిని, తన మొబైల్ ను అక్కడే పడేసిన ఉమాశంకర్ అక్కడి నుంచి పరారీ అయ్యాడు. ఒక్కసారిగా పవిత్ర రక్తపు మడుగులో పడి గిలగిల కొట్టుకుంటూ ప్రాణాలు విడవడంతో తల్లి లక్ష్మీ, తండ్రి కాంతారావు, చెల్లెలు రేవతి(17) లు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
తేరుకొని గుండెలు పగిలేలా రోదించారు. చుట్టుపక్కల వాళ్ళు గమనించి, వారాసిగూడ పోలీసులకు సమాచారం ఇవ్వగా, చిలకలగూడ ఏసీపీ శశాంక్ రెడ్డి, ఎస్ఐ సుధాకర్ లు పోలీసు సిబ్బంది, క్లూస్ టీమ్ తో ఘటన స్థలానికి చేరుకొని ఆధారాలను, వివరాలను సేకరించారు. అక్కడున్న సీసీ టీవీల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. పవిత్ర చెల్లెలు రేవతి అయ్యో అక్కా...అంటూ గుండెలు బాదుకుంటూ.. రోధించడం అక్కడున్న అందరిని కలిచివేసింది.
వారాసిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పరారీ అయిన నిందితుడు ఉమాశంకర్ జాడ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలు గా ఏర్పడి, గాలిస్తున్నట్లు తెలిపారు.
––
–ఫొటోలు:
More News...
<%- node_title %>
<%- node_title %>
పెండ్లి నిరాకరణపై రెచ్చిపోయిన బావ : గొంతులో కత్తి దించి, యువతిని దారుణంగా చంపిన మానవ మృగం
రక్తపు మడుగులో కుప్పకూలి ప్రాణాలు విడిచిన పవిత్ర
వారాసిగూడ పీఎస్ పరిధిలో పట్టపగలు అమానవీయ ఘటన పోలింగ్ రోజున ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకం* జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
*కొడిమ్యాల డిసెంబర్ 8 (ప్రజా మంటలు)
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ లో భాగంగా
సోమవారం రోజున కొడిమ్యాల మండలం కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రిసైడింగ్ అధికారులకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ పరిశీలించి పలు అంశాల మీద ప్రిసైడింగ్ అధికారులకు అవగాహన కల్పించారు.... జాతీయ మాలల క్రైస్తవ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులుగా ప్రవీణ్
**
జగిత్యాల, డిసెంబర్ 8(ప్రజా మంటలు) భారత జాతీయ మాలల క్రైస్తవ ఐక్యవేదిక జగిత్యాల జిల్లా అధ్యక్షులుగా ముద్దమల్ల ప్రవీణ్ ను నియమించారు. సోమవారం జగిత్యాల లో జాతీయ మాలల ఐక్య వేదిక సమావేశం అధ్యక్షులు మ్యాదరి శ్రీహరి అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర నాయకులు హాజరుకాగా ఇదే వేదికగా జాతీయ... స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల కోసం ఫ్లాగ్ మార్చ్ * ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అన్ని వర్గాల ప్రజలు పోలీసులకు సహకరించాలి
జగిత్యాల రూరల్ డిసెంబర్ 8 (ప్రజా మంటలు)
సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాబితా పూర్ గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సి.ఐ సుధాకర్ మాట్లాడుతూ.... ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ గమ్యస్థానానికి సుఖంగా చేరుకోవాలి ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం
జగిత్యాలడిసెంబర్ 8 (ప్రజా మంటలు) ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ గమ్యానికి సుఖ ప్రయాణం చేయాలని ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం టౌన్ ఎస్ఐ రవికిరణ్ అన్నారు.
సోమవారం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాలతో డిఎస్పి రఘు చందర్ సూచనలతో టౌన్ సిఐ కరుణాకర్ పర్యవేక్షణలో arive alive కార్యక్రమంలో భాగంగా వాహనం నడిపేటప్పుడు సురక్షితంగా గమ్యస్థానానికి... అవల్కొప్పం… న్యాయం కోసం 3,215 రోజుల నిరీక్షణ! దిలీప్ కేసు తీర్పుతో మళ్లీ ట్రెండ్లో హ్యాష్ట్యాగ్
కొచ్చి, డిసెంబర్ 08:2017లో ప్రముఖ మలయాళ నటిపై జరిగిన లైంగిక వేధింపుల కేసులో నటుడు దిలీప్ నిర్దోషి అని ఎర్నాకుళం ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు ప్రకటించడంతో, సోషల్ మీడియాలో ‘అవల్కొప్పం’ (We stand with her) హ్యాష్ట్యాగ్ మళ్లీ పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.
మలయాళ సినీ పరిశ్రమలో 2017లో మహిళా భద్రత కోసం... తెలంగాణను దేశంలో ముందంజలో నిలపడం లక్ష్యం : రేవంత్ రెడ్డి
హైదరాబాద్ డిసెంబర్ 08 (ప్రజా మంటలు):
తెలంగాణను దేశంలో ముందంజలో నిలపడం లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన **‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్’**పై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం, రాష్ట్ర భవిష్యత్తు లక్ష్యాలను వివరించారు.
సీఎం మాట్లాడుతూ,2047 నాటికి తెలంగాణను 3... వీరాపూర్ ఏకగ్రీవ ఎంపికలపై జీవన్ రెడ్డి అభినందనలు
జగిత్యాల (రూరల్) డిసెంబర్ 08 (ప్రజా మంటలు):
జగిత్యాల ఇందిరాభవన్లో వీరాపూర్ గ్రామం కొత్తగా ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ దిండిగాల గంగు రామస్వామి గౌడ్, ఉపసర్పంచ్ దుంపల నర్సిరెడ్డి సహా వార్డ్ సభ్యులను మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి సన్మానించారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ—గతంలో సర్పంచ్గా ఉన్న రామస్వామి... మేడ్చల్–మల్కాజ్గిరి సమస్యలు భయంకర స్థాయిలో ఉన్నాయి: కవిత
ఇది తెలంగాణ రైజింగ్ కాదు, Telangana Sinking,”
తెలంగాణ జాగృతి జనంబాట – కూకట్పల్లి ప్రెస్ మీట్
కూకట్ పల్లి డిసెంబర్ 08 (ప్రజా మంటలు):
మేడ్చల్–మల్కాజ్గిరి పర్యటనలో ప్రజల సమస్యలను స్వయంగా చూశానని, పరిస్థితులు ఊహించని స్థాయిలో దారుణంగా ఉన్నాయని జాగృతి నాయకురాలు కవిత తెలిపారు. ఉప్పల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, కూకట్పల్లిలో జరిగిన... “ఏం సాధించారని సంబరాలు" – తెలంగాణ జాగృతి అధికార ప్రతినిధి డా.నలమాస శ్రీకాంత్ గౌడ్
“స్థానిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారు”
హైదరాబాద్, డిసెంబర్ 8 (ప్రజా మంటలు):
ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు అని తెలంగాణ జాగృతి అధికార ప్రతినిధి డా. నలమాస శ్రీకాంత్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు. బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, రెండేళ్ల... న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా — బార్ కౌన్సిల్ అభ్యర్థి పోలు వెంకట రాజ్ కుమార్
మెట్టుపల్లి డిసెంబర్ 08 (ప్రజా మంటలు – దగ్గుల అశోక్):
రాబోయే తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే న్యాయవాదుల సంక్షేమం కోసం మరింత బలోపేత చర్యలు తీసుకుంటానని కరీంనగర్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పోలు వెంకట రాజ్ కుమార్ తెలిపారు.
సోమవారం మెట్టుపల్లి బార్ అసోసియేషన్ న్యాయవాదులతో జరిగిన సమావేశంలో ఆయన... ఇబ్రహీంపట్నంలో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన
ఇబ్రహీంపట్నం డిసెంబర్ 8 (ప్రజా మంటలు – దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం మండలంలోని మోడల్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ ఎన్నికల రిసెప్షన్ & డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను అధికారులు పరిశీలించారు.
రాబోయే పంచాయతీ ఎన్నికల నిర్వహణపై మొత్తం ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయా అన్న దానిపై మెట్టుపల్లి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, ... 