నేరం చేస్తే శిక్ష తప్పదు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేసిన పిపి లను అభినందించి ప్రశంసా పత్రాలు అందజేసిన ఎస్పీ
జగిత్యాల అక్టోబర్ 31 ( ప్రజా మంటలు)

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ....నిందితులకు శిక్షపడుటలో పోలీసులతో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల కీలకపాత్రని , పోలీసు అధికారులు,పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సమన్వయo తో నేరస్థులకు ఖచ్చితంగా శిక్ష పడేవిధంగా కృషి చేయాలని సూచించారు. ప్రధాన కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు పడేలా కృషి చేసి శిక్షల శాతం పెరిగేలా పని చేయటం అభినందనీయమని అన్నారు.
పోలీస్ అదికారులు న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ నేరస్థులకు ఖచ్చితంగా శిక్ష పడే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని సూచించారు. పోక్సో, హత్య కేసులను ప్రధానమైనవిగా భావించి ముందుకు సాగాలని సూచించారు. ప్రస్తుత రోజుల్లో సాంకేతికత కీలకంగా మారిందని అన్ని కేసుల్లో సైంటిఫిక్ ఆధారాలు కచ్చితంగా జమ చేయాలన్నారు.గడిచిన పది నెలల్లో 103 కేసుల్లో నిందితులుగా ఉన్న 124 మందికి జైలు శిక్షలు కోర్ట్ ద్వారా విదించడం జరిగిందని తెలిపారు. ఇందులో 21 మంది నిoదితులకు జీవిత జీవిత ఖైదు, 6గురు నిoదితులకు 20 సంవత్సరాల జైలు శిక్ష, 6గురు నిoదితులకు 10 సంవత్సరాల జైలు శిక్ష లు విధించడం జరిగింది.
*పై కేసుల్లో నిOదితులకు శిక్ష పడేవిధంగా కృషి చేసిన పీపీలు*
1 జె మల్లికార్జున్ పిపి పి డిజె కోర్ట్ జగిత్యాల
2 కే మల్లేశం అడిషనల్ పి పి l ఏ డి జె కోర్ట్ జగిత్యాల
3 చీటీ రామకృష్ణారావు స్పెషల్ పీపీ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ జగిత్యాల
4 బి రాజేష్ ఏపీపీ lఏటీఎం కోర్ట్ జగిత్యాల
5 జి ప్రణయ్ ఏపీపీ, జె ఎఫ్ సి ఎం కోర్ట్ మెట్పల్లి
ఈ యొక్క సమావేశంలో SB డిఎస్పీ వెంకటరమణ ,సైబర్ క్రైమ్ డిఎస్పి వెంకటరమణ , రఘు చందర్, రాములు, రంగారెడ్డి, పిపీలు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వరద ప్రభావిత ప్రాంతాల సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
– బాధితులకు భరోసా, జిల్లాల వారీగా నష్టం నివేదికలు సమర్పించాలన్న ఆదేశాలు
హనుమకొండ నవంబర్ 01 (ప్రజా మంటలు):భారీ వర్షాలు, వరదలతో తీవ్ర నష్టం జరిగిన ప్రాంతాలను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఏరియల్ సర్వే చేసిన అనంతరం, సమ్మయ్యనగర్, కాపువాడ, పోతననగర్ ప్రాంతాల్లో బాధితులను... జగిత్యాల వ్యాపారవేత్త బట్టు సుధాకర్ మృతి
– కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
జగిత్యాల (రూరల్): నవంబర్ 01 (ప్రజా మంటలు):
పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బట్టు సుధాకర్ మరణించడంతో స్థానికంగా విషాదం నెలకొంది. ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ... బీసీ రెసిడెన్షియల్ హాస్టల్ లో వర్షిత మృతి – ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని కవిత డిమాండ్
వర్షిత మృతి అనుమానాస్పదం – కవిత
110 మంది పిల్లలు ఏడాదిన్నరలో చనిపోయారని ఆవేదన
స్పెషల్ ఎంక్వైరీ, సిట్ వేయాలని డిమాండ్
ప్రభుత్వం మానవత్వంతో స్పందించాలని విజ్ఞప్తి
రాంపూర్,హుజురాబాద్ నవంబర్ 01 (ప్రజా మంటలు)::
బీసీ రెసిడెన్షియల్ హాస్టల్ లో అనుమానాస్పదంగా మృతిచెందిన శ్రీ వర్షిత కుటుంబాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు.... ఇంకెన్నాళ్లీ అంతర్యుద్ధం? కాంగ్రెస్ vs కాంగ్రెస్ — జగిత్యాల వేడెక్కుతున్న రాజకీయ సమీకరణాలు
45 ఏళ్ళ రాజకీయ జీవితం అర్ధంతరంగా ముగిసినా?
పార్టీలో పట్టుకోల్పోతున్నారా?
పదేళ్ల నాయకుడు సంజయ్ తో పోటీ పడలేకపోతున్నారా?
జగిత్యాల, అక్టోబర్ 31 (ప్రజా మంటలు):జగిత్యాల నియోజకవర్గం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే అంతర్యుద్ధానికి వేదికగా మారింది. అధికారపక్షంలో ఇలాంటి అంతర్గత యుద్ధం జరగడం కార్యకర్తలలో, నాయకులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఒకదశలో రాష్ట్ర... చారిత్రక బొమ్మలమ్మ గుట్టను గ్రానైట్ మాఫియా బారి నుంచి రక్షించుకుందాం — కల్వకుంట్ల కవిత
కరీంనగర్, అక్టోబర్ 31 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కరీంనగర్ పర్యటనలో పాల్గొన్న సందర్భంగా జాగృతి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. బతుకమ్మలు, బోనాలు, ఒగ్గుడోలు, డప్పువాయిద్యాలతో ఊరేగింపుగా ఆమెను ఆహ్వానించారు.
అల్గునూరు చౌరస్తాలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం, భారీ ర్యాలీగా తెలంగాణ అమరవీరుల... కొత్త గుడిలో భక్తులకు దర్శనమిచ్చిన వెంకన్న స్వామి
శ్రీగిరి వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని పున:ప్రారంభించిన పీఠాధిపతులు
పలువురు మంత్రులు, ఉన్నతాధికారుల రాక
సికింద్రాబాద్, అక్టోబర్ 31 (ప్రజామంటలు) :
సీతాఫల్మండి డివిజన్ శ్రీనివాస్ నగర్ లో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం జీర్ణోద్దరణ పూర్వక మహా సంప్రోక్షణ, అష్ట బంధన మహా కుంభాభిషేకం ఘనంగా నిర్వహించి, ఆలయాన్ని పున ప్రారంభించారు. కంచి... నేటి నుంచి సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ 150వ వార్షికోత్సవాలు
సికింద్రాబాద్, అక్టోబర్ 31 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ క్లాక్ టవర్ ప్రాంతంలోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చి 150వ వార్షికోత్సవాలను నవంబర్ 1వ తేదీ నుంచి ఘనంగా నిర్వహిస్తున్నట్లు స్టాండింగ్ కమిటీ, జూబ్లీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ రాబర్ట్ సూర్య ప్రకాష్ తెలిపారు. శుక్రవారం చర్చి ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చర్చి సీనియర్ పాస్టర్ డాక్టర్... కోర్టు ఆదేశాలతో గాంధీ ఆసుపత్రి క్యాంటీన్ ను సీజ్ చేసిన అధికారులు
సికింద్రాబాద్, అక్టోబర్ 31 (ప్రజామంటలు) :
గాంధీ ఆస్పత్రి ఆవరణలోని పెషీ కేఫ్ను కోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం ఆస్పత్రి అధికారులు సీజ్చేశారు. నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో గాంధీ హాస్పిటల్డెవలప్మెంట్సొసైటీ (హెచ్డీఎస్) తరఫున అధికారులు కేఫ్ లోని సామాన్లు బయటకు తీయించి తాళం వేశారు. ఓపీ బ్లాక్ఎదురుగా ఉన్న ఈ కేఫ్కాంట్రాక్టు గడువు 2018లో ముగిసినప్పటికీ,... స్కందగిరిలో స్వర్ణరథాన్ని ఆవిష్కరించిన కంచి పీఠాధిపతి
సికింద్రాబాద్, అక్టోబర్ 31 (ప్రజామంటలు) :
పద్మారావు నగర్ లోని శ్రీ స్కందగిరి సుబ్రహ్మణ్యస్వామి దేవాలయంలో భక్తుల విరాళాలతో రూపొందించిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి స్వర్ణ రథాన్ని శుక్రవారం రాత్రి కంచి కామకోటి పీఠాధిపతి శంకరా చార్య శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ప్రారంభించారు. వేద పండితుల సమక్షంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.
స్వర్ణ... గొల్లపల్లి మండలం పోలీసు శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ
(అంకం భూమయ్య)
గొల్లపల్లి అక్టోబర్ 31 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యత దినోత్సవం పురస్కరించుకొని రన్ ఫర్ యూనిటీ ఐక్యత కార్యక్రమం ఎస్ఐ కృష్ణా సాగర్ రెడ్డి ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు పోలీస్ సిబ్బంది,ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, క్రీడాకారులు, , యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.
మండల... బుగ్గారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ
(అంకం భూమయ్య)
గొల్లపల్లి అక్టోబర్ 31 (ప్రజా మంటలు):
బుగ్గారం మండలంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యత దినోత్సవం పురస్కరించుకొని రన్ ఫర్ యూనిటీ (ఐక్యత పరుగు) కార్యక్రమం ఎస్ఐ ,జి సతీష్ , ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, క్రీడాకారులు, ప్రజా ప్రతినిధులు, మరియు యువత ఉత్సాహంగా... ఇబ్రహీంపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా " ఫ్రెషర్స్ డే " వేడుకలు
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 31 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం రోజున " ప్రెషర్స్ డే" వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇబ్రహీంపట్నం మండల తహసిల్దార్ వరప్రసాద్ హాజరై,మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ విద్య అనేది చాలా కీలకమైనదని ఈ దశలో విద్యార్థులు ఒక పద్ధతి ప్రకారం... 