విజయమే లక్ష్యంగా శ్రమే ఆయుధంగా.... ముందుకు సాగుతున్న వర్ధమాన యువ నటుడు జయదేవ్
విజయమే లక్ష్యంగా శ్రమే ఆయుధంగా.... ముందుకు సాగుతున్న వర్ధమాన యువ నటుడు జయదేవ్
నెపం ఒకరిపై వెయ్యను
ప్రయత్నం ఎన్నడూ వీడను!!
విజయమే లక్ష్యంగా
శ్రమే ఆయుధంగా....
ముందుకు సాగుతున్న
వర్ధమాన యువ నటుడు జయదేవ్
"స్వీయలోపంబెరుగుట పెద్ద విద్య" అన్న ఆర్యోక్తికి బ్రతికున్నంత కాలం అక్కినేని నాగేశ్వరావు 'బ్రాండ్ అంబాసడర్'గా ఉండేవారు. ఎన్ఠీఆర్, ఎస్వీఆర్ వంటి ధీశాలులను ఢీకొని నెగ్గుకురావడం కోసం తన బలాలు, బలహీనతలను బేరీజు వేసుకుని ముందుకు సాగేవాడినని ఆయన తరచూ గుర్తు చేసుకునేవారు. వర్ధమాన యువ నటుడు జయదేవ్ కూడా తన లోపాలు తానే సరి చేసుకుంటూ... తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక చిన్న ప్రత్యేక స్థానం సంపాదించుకోవడం కోసం అహరహం శ్రమిస్తున్నానని అంటున్నాడు. "ఆ లోపం... ఆడిషన్ పరమైనది, లేదా ప్రయత్నం పరమైనది కావొచ్చు... లేదా అప్రోచ్ పరమైనది కావొచ్చు. నాకంటే తర్వాత వచ్చినవాళ్ళు రేసులో దూసుకుపోతుంటే... నేను ఇంకా "స్టగులర్"గానే ఉండదానికి కచ్చితంగా నాదే లోపంగా భావిస్తాను" అంటున్నాడు!!
సంచలన దర్శకుడు తేజ కొత్తవాళ్ళతో ఒక సినిమా తలపెట్టి చేసిన "స్టార్ హంట్"లో విజేతగా నిలిచాడు జయదేవ్. అప్పటికి అతడు నూనూగు మీసాల నవ యువకుడు. జస్ట్ 17.. అతడి వయసు. కొన్ని రోజులు వర్క్ షాప్ కూడా చేశారు. కానీ.. కారణాంతరాల వల్ల సదరు ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అయినా జయదేవ్ కుంగిపోలేదు. "చావో రేవో" తేల్చుకోవాల్సిందేనని ఫిక్స్ అయిపోయి... ప్రయివేటుగా చదువును కొనసాగిస్తూనే... పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు ప్రారంభించాడు.
ప్రభాస్ "మిర్చి", రామ్ "ఎందుకంటే ప్రేమంట" తదితర చిత్రాల్లో నటించే అవకాశాలు దక్కించుకుని... తన తల్లిదండ్రులు, తన సోదరుడు తన మీద ఉంచిన నమ్మకాన్ని నిజం చేశాడు!!
"యుద్ధం శరణం" చిత్రంలో నాగ చైతన్య స్నేహితునిగా నటించే ఛాన్స్ సొంతం చేసుకున్న ఈ యువతేజం... ఆ చిత్రంతో మొదటిసారిగా "పోస్టర్" ఎక్కాడు. "ప్రేమిక" అనే షార్ట్ ఫిల్మ్ కోసం సైమా అవార్డ్ కు నామినేట్ అయ్యాడు. "ఆహా"లో స్ట్రీమింగ్ అవుతున్న అర్ధమైందా "అరుణ్ కుమార్"లో విలన్ గా నటించి మెప్పించిన జయదేవ్... మెల్లగా అందరి దృష్టిని ఆకర్షించడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం "వార్ మెన్" వెబ్ సిరీస్ లో లీడ్ రోల్ చేస్తున్న జయదేవ్... కృష్ణ మామిడి దర్శకత్వంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న "ఆద్య"లో విలన్ గా నటిస్తున్నాడు!!
శేఖర్ మాస్టర్ దగ్గర డాన్స్ సాధన చేసిన జయదేవ్... మార్షల్ ఆర్ట్స్ లోనూ తగిన తర్ఫీదు పొందాడు. కెరీర్ బిగినింగ్ లో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో చేరి శిక్షణ తీసుకున్న ఈ కుర్రాడు... "అద్దం" తన అసలు సిసలు గురువంటాడు. నటనను అర్ధం చేసుకోవడానికి అద్దం తనకు ఎంతగానో దోహదపడుతుందని చెబుతాడు. "నన్ను నాకంటే మిన్నగా నమ్మిన మా నాన్న, అమ్మ, నాన్నల నుంచి ఇప్పటివరకు తీసుకోవడం తప్ప... వాళ్లకు ఇచ్చిందన్నదే లేదు" అంటూ ఒకింత భావోద్వేగానికి లోనయ్యే ఈ వాస్తవవాది... తన "అమ్మానాన్న, అన్న" తనను చూసి గర్వపడేలా చేయడమే తన ముందున్న ధ్యేయంగా ప్రకటించుకుంటాడు.
"జయదేవ్"ను
సంప్రదించాలనుకునేవారు
*99 66 51 55 33*
నంబర్ కి కాల్ చేయవచ్చు!!
More News...
<%- node_title %>
<%- node_title %>
అటుకుల్లో బొద్దింక..
కొత్తకొండ వైన్స్ సిట్టింగ్ రూమ్లో ఘోరం.. సాహితీవేత్త ఎం.వి. నరసింహారెడ్డి కన్నుమూత
జగిత్యాల, జూన్ 08 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త, రచయిత, విద్యావేత్త, ఎస్కేఎల్ఎన్ రావు బీఈడీ కళాశాల కరెస్పాండెంట్ ఎం.వి. నరసింహారెడ్డి సోమవారం రాత్రి, తన నివాసంలో కన్నుమూశారు. ఆయన మృతి సాహితీ, విద్యా రంగాలకు తీరని లోటుగా భావిస్తున్నారు.ఎం.వి. నరసింహారెడ్డి తెలుగు సాహిత్యానికి విశేష సేవలందించారు. నాలుగు వేదాలను... వరి కొయ్యలు కాల్చి పలువురి ప్రమాదానికి కారణమైన వారిపై ప్రజావాణిలో ఫిర్యాదు
జగిత్యాల జూన్ 8 (ప్రజా మంటలు)
జగిత్యాల రూరల్ మండలం తక్కలపల్లి గ్రామ శివారులో తుమ్మచెట్టు కు నిప్పంటుకొని అదే మార్గంలో వస్తున్న బైరి వేణు ,కడారి భరత్ లు గాయాలపాలు అయినారు. ఇట్టి విషయంపై జిల్లా కేంద్రం విజయపురి కాలనీకి చెందిన సంబుమహేష్( 29) తండ్రి మల్లయ్య సోమవారం తుమ్మచెట్టు కాలడానికి కారకులైన
మిట్టపల్లి... ఎంవి నరసింహారెడ్డి అస్తమయం
జగిత్యాల జూన్ 8 (ప్రజా మంటలు)జగిత్యాల ఎస్ కె ఎల్ ఎన్ రావు బిఈడి కళాశాల కరెస్పాండెంట్, రచయిత ఎం.వి నరసింహారెడ్డి ఈరోజు సోమవారం సాయంత్రం 7 గంటలకు జగిత్యాలలో ఆయన నివాసంలో మృతి చెందారు. ఆయన నాలుగు వేదాలు మరియు ఉపనిషత్తులు జోక్స్ బ్యాంక్ జోక్స్ టానిక్ లాంటి హాస్య రచనల పుస్తకాలు,... మమతా కాంగ్రెస్ గూటికి చేరితే... బీజేపీ వ్యూహానికి అతిపెద్ద ఎదురుదెబ్బ?
న్యూ డిల్లీ జూన్ 08 :
భారత రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఒక కొత్త రాజకీయ పునర్వ్యవస్థీకరణకు సంకేతాలిస్తున్నాయా? ఢిల్లీలో జరిగిన INDIA కూటమి సమావేశం తర్వాత రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న చర్చలను పరిశీలిస్తే ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది.
దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రత్యామ్నాయంగా నిలవాలంటే ప్రతిపక్ష శక్తుల ఐక్యత తప్పనిసరి అనే... మారుతి స్నేహ మండలి వారిచే ప్రతిభా పురస్కారాల వితరణ
జగిత్యాల జూన్ 7( ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలో మారుతి స్నేహ మండలి వారిచే ప్రతిభా పురస్కారాలు అందజేయబడినవి. 2025 26 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ యందు 1000 మార్కులకు గాను 982 ఎంపీసీ విభాగం నందు సాధించిన జి సుప్రీత్, ఎస్ ఎస్ సి నందు పి . హాసినిశర్మ 600/578 మార్కులు సాధించగా... హనుమాన్ చాలీసా భక్త బృందం వారిచే విద్యార్థులకు పురస్కారాల ప్రధానం
జగిత్యాల జూన్ 7(ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో గత తొమ్మిది సంవత్సరాలుగా హనుమాన్ చాలీసా భక్త బృందం వారిచే సామూహిక పారాయణం నిర్వహించబడుచున్నది. కాగా ఈ సంవత్సరము నుండి నూతనంగా ఎస్ ఎస్ఎస్సి ,ఇంటర్మీడియట్, డిగ్రీ నందు 90% పైబడి మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయడానికి శ్రీకారం చుట్టారు.... ₹80 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
జగిత్యాల, జూన్ 04 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మొయినుద్దీన్ ₹80 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ నేతృత్వంలో గురువారం ఈ దాడి నిర్వహించారు.... నందికొండ మున్సిపల్ అధికారుల తీరుపై టీఆర్ఎస్ ఆగ్రహం
నాగార్జునసాగర్, జూన్ 4 (ప్రజా మంటలు):
నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నందికొండ మున్సిపల్ అధికారులు పైలాన్ క్రాస్రోడ్డు వద్ద ఉన్న తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) జెండా గద్దెను కూల్చివేయడంపై ఆ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర పార్టీల జెండా గద్దెలను వదిలి టీఆర్ఎస్ గద్దెను మాత్రమే తొలగించడం వివక్షపూరిత చర్య అని... కన్నాపూర్ లో కాలిన ఈత - తాటి వనం సందర్శించిన మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్
జగిత్యాల జూన్2- ( ప్రజా మంటలు)జగిత్యాల రూరల్ మండలం కన్నాపూర్ గ్రామంలో గత 5 రోజుల క్రితం ప్రమాదవశాత్తు కాలిపోయిన 500 ఈత - తాటి చెట్లను జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ మంగళ వారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...కన్నాపూర్ గ్రామంలోని దాదాపు 27... మల్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రవేశాల పెంపు కోసం ప్రచారo
మల్యాల జూన్ 2 (ప్రజా మంటలు)
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలను పెంచడం మరియు ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలతో పోటీని ఎదుర్కొనే దృష్టితో, మల్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం శివరామకృష్ణ మరియు అధ్యాపకులు ఇంటింటికీ ప్రచారం చేపట్టారు.
ఈ ప్రచారంలో ఎస్.ఎస్.సి. పాసైన ప్రతి విద్యార్థిని మరియు వారి తల్లిదండ్రులను కలిసి, కళాశాల... ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
జగిత్యాల జూన్ 2 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో మంగళవారం తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టౌన్ సిఐ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రారంభించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ ,ట్రాఫిక్ కానిస్టేబుళ్ళు ,టౌన్ ఎస్సై తదితరులు పాల్గొన్నారు. 