విజయమే లక్ష్యంగా శ్రమే ఆయుధంగా.... ముందుకు సాగుతున్న  వర్ధమాన యువ నటుడు జయదేవ్

On
విజయమే లక్ష్యంగా శ్రమే ఆయుధంగా.... ముందుకు సాగుతున్న  వర్ధమాన యువ నటుడు జయదేవ్

విజయమే లక్ష్యంగా శ్రమే ఆయుధంగా.... ముందుకు సాగుతున్న  వర్ధమాన యువ నటుడు జయదేవ్

నెపం ఒకరిపై వెయ్యను
ప్రయత్నం ఎన్నడూ వీడను!!

విజయమే లక్ష్యంగా
శ్రమే ఆయుధంగా....
ముందుకు సాగుతున్న 
వర్ధమాన యువ నటుడు జయదేవ్

"స్వీయలోపంబెరుగుట పెద్ద విద్య" అన్న ఆర్యోక్తికి బ్రతికున్నంత కాలం అక్కినేని నాగేశ్వరావు 'బ్రాండ్ అంబాసడర్'గా ఉండేవారు. ఎన్ఠీఆర్, ఎస్వీఆర్ వంటి ధీశాలులను ఢీకొని నెగ్గుకురావడం కోసం తన బలాలు, బలహీనతలను బేరీజు వేసుకుని ముందుకు సాగేవాడినని ఆయన తరచూ గుర్తు చేసుకునేవారు. వర్ధమాన యువ నటుడు జయదేవ్ కూడా తన లోపాలు తానే సరి చేసుకుంటూ... తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక చిన్న ప్రత్యేక స్థానం సంపాదించుకోవడం కోసం అహరహం శ్రమిస్తున్నానని అంటున్నాడు. "ఆ లోపం... ఆడిషన్ పరమైనది, లేదా ప్రయత్నం పరమైనది కావొచ్చు... లేదా అప్రోచ్ పరమైనది కావొచ్చు. నాకంటే తర్వాత వచ్చినవాళ్ళు రేసులో దూసుకుపోతుంటే... నేను ఇంకా "స్టగులర్"గానే ఉండదానికి కచ్చితంగా నాదే లోపంగా భావిస్తాను" అంటున్నాడు!!

సంచలన దర్శకుడు తేజ కొత్తవాళ్ళతో ఒక సినిమా తలపెట్టి చేసిన "స్టార్ హంట్"లో విజేతగా నిలిచాడు జయదేవ్. అప్పటికి అతడు నూనూగు మీసాల నవ యువకుడు. జస్ట్ 17.. అతడి వయసు. కొన్ని రోజులు వర్క్ షాప్ కూడా చేశారు. కానీ.. కారణాంతరాల వల్ల సదరు ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అయినా జయదేవ్ కుంగిపోలేదు. "చావో రేవో" తేల్చుకోవాల్సిందేనని ఫిక్స్ అయిపోయి... ప్రయివేటుగా చదువును కొనసాగిస్తూనే... పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు ప్రారంభించాడు.
ప్రభాస్ "మిర్చి", రామ్ "ఎందుకంటే ప్రేమంట" తదితర చిత్రాల్లో నటించే అవకాశాలు దక్కించుకుని... తన తల్లిదండ్రులు, తన సోదరుడు తన మీద ఉంచిన నమ్మకాన్ని నిజం చేశాడు!!

"యుద్ధం శరణం" చిత్రంలో నాగ చైతన్య స్నేహితునిగా నటించే ఛాన్స్ సొంతం చేసుకున్న ఈ యువతేజం... ఆ చిత్రంతో మొదటిసారిగా "పోస్టర్" ఎక్కాడు. "ప్రేమిక" అనే షార్ట్ ఫిల్మ్ కోసం సైమా అవార్డ్ కు నామినేట్ అయ్యాడు. "ఆహా"లో స్ట్రీమింగ్ అవుతున్న అర్ధమైందా "అరుణ్ కుమార్"లో విలన్ గా నటించి మెప్పించిన జయదేవ్... మెల్లగా అందరి దృష్టిని ఆకర్షించడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం "వార్ మెన్" వెబ్ సిరీస్ లో లీడ్ రోల్ చేస్తున్న జయదేవ్... కృష్ణ మామిడి దర్శకత్వంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న "ఆద్య"లో విలన్ గా నటిస్తున్నాడు!!

శేఖర్ మాస్టర్ దగ్గర డాన్స్ సాధన చేసిన జయదేవ్... మార్షల్ ఆర్ట్స్ లోనూ తగిన తర్ఫీదు పొందాడు. కెరీర్ బిగినింగ్ లో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో చేరి శిక్షణ తీసుకున్న ఈ కుర్రాడు... "అద్దం" తన అసలు సిసలు గురువంటాడు. నటనను అర్ధం చేసుకోవడానికి అద్దం తనకు ఎంతగానో దోహదపడుతుందని చెబుతాడు. "నన్ను నాకంటే మిన్నగా నమ్మిన మా నాన్న, అమ్మ, నాన్నల నుంచి ఇప్పటివరకు తీసుకోవడం తప్ప... వాళ్లకు ఇచ్చిందన్నదే లేదు" అంటూ ఒకింత భావోద్వేగానికి లోనయ్యే ఈ వాస్తవవాది... తన "అమ్మానాన్న, అన్న" తనను చూసి గర్వపడేలా చేయడమే తన ముందున్న ధ్యేయంగా ప్రకటించుకుంటాడు.

"జయదేవ్"ను 
సంప్రదించాలనుకునేవారు 
*99 66 51 55 33*
నంబర్ కి కాల్ చేయవచ్చు!!

Tags
Join WhatsApp

More News...

National  Filmi News  State News 

సినీనటి సమంత–రాజ్ నిడిమోరు వివాహం

 సినీనటి  సమంత–రాజ్ నిడిమోరు వివాహం కోయంబత్తూరులో  హైదరాబాద్ డిసెంబర్ 01 (ప్రజా మంటలు): టాలీవుడ్ స్టార్ సమంత రూత్ ప్రభు దర్శకుడు రాజ్ నిడిమోరుతో డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్ – లింగభైరవి ఆలయంలో వివాహం చేసుకున్నారు. గత కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్న ఇద్దరూ, కుటుంబ సభ్యులు–సన్నిహితుల సమక్షంలో సాంప్రదాయ భూతశుద్ధి వివాహం విధానం ద్వారా...
Read More...

ఎయిడ్స్ కు చికిత్స కంటే నివారణే మేలు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి రాజా గౌడ్

ఎయిడ్స్ కు చికిత్స కంటే నివారణే మేలు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి రాజా గౌడ్ జగిత్యాల డిసెంబర్ 1 ( ప్రజా మంటలు)ఎయిడ్స్ కు చికిత్స కంటే .. నివారణే మేలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి రాజ గౌడ్ అన్నారు యువత ఎట్టి పరిస్థితుల్లోని ఎయిడ్స్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలనీ    సోమవారం రోజున ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి నివారణ...
Read More...

గీతా భవన్ లో ఘనంగా గీత జయంతి వేడుకలు

గీతా భవన్ లో ఘనంగా గీత జయంతి వేడుకలు   జగిత్యాల డిసెంబర్ 1 ( ప్రజా మంటలు)జిల్లా కేంద్రం గంజ్ రోడ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక  కేంద్రం గీత భవన్ లో గీతా జయంతి పురస్కరించుకొని గీతా సత్సంగం 31వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. ఉదయం  సంపూర్ణ సామూహిక శ్రీలక్ష్మి అష్టోత్తర సహిత శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, మరియు శ్రీమద్భవద్గీత 18...
Read More...

బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం  జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం  జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల డిసెంబర్ 1 ( ప్రజా మంటలు)బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారుప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా   జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 5 మంది  అర్జీదారులతో నేరుగా  మాట్లాడి వారి  సమస్యలను తెలుసుకొని...
Read More...

పట్టణ అభివ్రుద్ది కి నిరంతరం కృషి చేస్తా_ రోగం వచ్చిన తర్వాత చికిత్స  కన్నా ముందస్తు జాగ్రత్తలు ముఖ్యం  ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

పట్టణ అభివ్రుద్ది కి నిరంతరం కృషి చేస్తా_ రోగం వచ్చిన తర్వాత చికిత్స  కన్నా ముందస్తు జాగ్రత్తలు ముఖ్యం  ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్    జగిత్యాల డిసెంబర్ 1(ప్రజా మంటలు)పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్పట్టణ 11 వ వార్డులో 11 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల పట్టణ 11వ వార్డులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గాంధీనగర్ ను సందర్శించి...
Read More...

సీఎం కు, మంత్రులకు ఎన్నికల కోడ్ వర్తించదా?  ఎలక్షన్ కమిషన్ స్పందించి సీఎం పర్యటనను నిలిపివెయ్యాలి జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్

సీఎం కు, మంత్రులకు ఎన్నికల కోడ్ వర్తించదా?   ఎలక్షన్ కమిషన్ స్పందించి సీఎం పర్యటనను నిలిపివెయ్యాలి  జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్    జగిత్యాల డిసెంబర్ 1(ప్రజా మంటలు)  రాష్ట్ర ముఖ్యమంత్రి కి, రాష్ట్రంలోని మంత్రులకు ఎన్నికల కమిషన్ నియమావలి వర్తించద అని జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ ఎలక్షన్ కమిషన్ ను ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసంలో వసంత  మాట్లాడుతూ నవంబర్ 26 సాయంత్రం కోడ్ అమలుపై ఎలక్షన్ కమిషన్...
Read More...

24 గంటల్లో దారిదోపిడికి పాల్పడ్డ ముగ్గురు దొంగలు అరెస్ట్ రిమాండ్ కు తరలింపు

24 గంటల్లో దారిదోపిడికి పాల్పడ్డ ముగ్గురు దొంగలు అరెస్ట్ రిమాండ్ కు తరలింపు జగిత్యాల నవంబర్ 30 (ప్రజా మంటలు)దారి దోపిడికి పాల్పడ్డ ముగ్గురు దొంగలను అరెస్ట్‌ చేసినట్లు    డీఎస్పీ రఘు చందర్‌ తెలిపారు.. శనివారం అర్ధరాత్రి జగిత్యాల పట్టణ శివారులోని గాంధీ నగర్ వద్ద  ... మంచిర్యాల జిల్లాకు చెందిన డీసీఎం వ్యాన్ డ్రైవర్ శనివారం అర్ధరాత్రి  జగిత్యాల శివారులో గాంధీనగర్ వద్ద డీసీఎం వ్యాన్‌ పార్క్...
Read More...

కొండగట్టు షార్ట్ సర్క్యూట్ అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

కొండగట్టు షార్ట్ సర్క్యూట్ అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్    కొండగట్టు నవంబర్ 30 (ప్రజా మంటలు)శనివారం రాత్రి 11.30 ప్రాంతంలో మల్యాల మండలం కొండగట్టులోని సుమారు 30 దుకాణాలు షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరగగా ఆదివారం జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఘటన స్థలాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రమాదానికి జరిగిన కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన వారికి తక్షణ సహాయం కటుంబానికి...
Read More...
Local News  Crime 

దొంగ మల్లన్న జాతరలో అందరు బహార్ బెట్టింగ్ గ్యాబ్లింగ్ ఆట 

దొంగ మల్లన్న జాతరలో అందరు బహార్ బెట్టింగ్ గ్యాబ్లింగ్ ఆట  (అంకం భూమయ్య) గొల్లపల్లి నవంబర్ 30 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండలం లోని శ్రీ మల్లికార్జున మల్లన్న పేట  దొంగ మల్లన్న జాతర బెట్టింగ్ టోకెన్స్ ద్వారా గ్యాంబ్లింగ్ (అందర్ బహార్) ఆట నిర్వహిస్తున్న వ్యక్తిని అదుపులోకి  అతని వద్దనుండి నుండి 4000 నగదు తొ పాటు మూడు బెట్టింగ్ టోకన్ స్వాధీనం చేసుకుని కేసు...
Read More...
National  State News  International  

కేలిఫోర్నియాలో బ్యాంక్వెట్ హాల్‌లో కాల్పులు: 4 గురు మృతి, 10 మందికి గాయాలు

 కేలిఫోర్నియాలో బ్యాంక్వెట్ హాల్‌లో కాల్పులు: 4 గురు మృతి, 10 మందికి గాయాలు స్టాక్‌టన్ (కేలిఫోర్నియా), నవంబర్ 30: అమెరికా కేలిఫోర్నియా రాష్ట్రంలోని స్టాక్‌టన్ నగరంలో ఉన్న ఒక బ్యాంక్వెట్ హాల్‌లో, శనివారం రాత్రి జరిగిన కాల్పుల్లో నాలుగు మంది మృతి, పది మంది గాయపడిన ఘటన కలకలం రేపింది. శనివారం రాత్రి జరిగిన ఈ కాల్పుల ఘటనపై సాన్ జోక్విన్ కౌంటీ శెరీఫ్ కార్యాలయం అత్యవసర ప్రకటన...
Read More...
Local News 

కరీంనగర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్‌కు వివిధ కుల సంఘాల నాయకుల అభినందనలు

కరీంనగర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్‌కు వివిధ కుల సంఘాల నాయకుల అభినందనలు కరీంనగర్, నవంబర్ 30 (ప్రజా మంటలు): కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ నేడు నగరంలోని పలువురు ప్రముఖులను, వివిధ కుల సంఘాల అధ్యక్షులు మరియు రాజకీయ నేతలను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు. అంజన్ కుమార్‌ను కలిసిన వారిలో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్,...
Read More...
State News 

జాగృతి జనంబాట యాత్ర డిసెంబర్ 4 నుంచి తిరిగి ప్రారంభం

జాగృతి జనంబాట యాత్ర డిసెంబర్ 4 నుంచి తిరిగి ప్రారంభం హైదరాబాద్ నవంబర్ 30 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన జాగృతి జనంబాట యాత్ర డిసెంబర్ 4వ తేదీ నుంచి మళ్లీ ప్రారంభం కానుంది. అక్టోబర్ 25న నిజామాబాద్‌లో ప్రారంభమైన ఈ యాత్ర ఇప్పటికే 11 జిల్లాల్లో పూర్తి చేశారు — మహబూబ్ నగర్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్–హన్మకొండ, నల్గొండ, మెదక్,...
Read More...