విజయమే లక్ష్యంగా శ్రమే ఆయుధంగా.... ముందుకు సాగుతున్న  వర్ధమాన యువ నటుడు జయదేవ్

On
విజయమే లక్ష్యంగా శ్రమే ఆయుధంగా.... ముందుకు సాగుతున్న  వర్ధమాన యువ నటుడు జయదేవ్

విజయమే లక్ష్యంగా శ్రమే ఆయుధంగా.... ముందుకు సాగుతున్న  వర్ధమాన యువ నటుడు జయదేవ్

నెపం ఒకరిపై వెయ్యను
ప్రయత్నం ఎన్నడూ వీడను!!

విజయమే లక్ష్యంగా
శ్రమే ఆయుధంగా....
ముందుకు సాగుతున్న 
వర్ధమాన యువ నటుడు జయదేవ్

"స్వీయలోపంబెరుగుట పెద్ద విద్య" అన్న ఆర్యోక్తికి బ్రతికున్నంత కాలం అక్కినేని నాగేశ్వరావు 'బ్రాండ్ అంబాసడర్'గా ఉండేవారు. ఎన్ఠీఆర్, ఎస్వీఆర్ వంటి ధీశాలులను ఢీకొని నెగ్గుకురావడం కోసం తన బలాలు, బలహీనతలను బేరీజు వేసుకుని ముందుకు సాగేవాడినని ఆయన తరచూ గుర్తు చేసుకునేవారు. వర్ధమాన యువ నటుడు జయదేవ్ కూడా తన లోపాలు తానే సరి చేసుకుంటూ... తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక చిన్న ప్రత్యేక స్థానం సంపాదించుకోవడం కోసం అహరహం శ్రమిస్తున్నానని అంటున్నాడు. "ఆ లోపం... ఆడిషన్ పరమైనది, లేదా ప్రయత్నం పరమైనది కావొచ్చు... లేదా అప్రోచ్ పరమైనది కావొచ్చు. నాకంటే తర్వాత వచ్చినవాళ్ళు రేసులో దూసుకుపోతుంటే... నేను ఇంకా "స్టగులర్"గానే ఉండదానికి కచ్చితంగా నాదే లోపంగా భావిస్తాను" అంటున్నాడు!!

సంచలన దర్శకుడు తేజ కొత్తవాళ్ళతో ఒక సినిమా తలపెట్టి చేసిన "స్టార్ హంట్"లో విజేతగా నిలిచాడు జయదేవ్. అప్పటికి అతడు నూనూగు మీసాల నవ యువకుడు. జస్ట్ 17.. అతడి వయసు. కొన్ని రోజులు వర్క్ షాప్ కూడా చేశారు. కానీ.. కారణాంతరాల వల్ల సదరు ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అయినా జయదేవ్ కుంగిపోలేదు. "చావో రేవో" తేల్చుకోవాల్సిందేనని ఫిక్స్ అయిపోయి... ప్రయివేటుగా చదువును కొనసాగిస్తూనే... పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు ప్రారంభించాడు.
ప్రభాస్ "మిర్చి", రామ్ "ఎందుకంటే ప్రేమంట" తదితర చిత్రాల్లో నటించే అవకాశాలు దక్కించుకుని... తన తల్లిదండ్రులు, తన సోదరుడు తన మీద ఉంచిన నమ్మకాన్ని నిజం చేశాడు!!

"యుద్ధం శరణం" చిత్రంలో నాగ చైతన్య స్నేహితునిగా నటించే ఛాన్స్ సొంతం చేసుకున్న ఈ యువతేజం... ఆ చిత్రంతో మొదటిసారిగా "పోస్టర్" ఎక్కాడు. "ప్రేమిక" అనే షార్ట్ ఫిల్మ్ కోసం సైమా అవార్డ్ కు నామినేట్ అయ్యాడు. "ఆహా"లో స్ట్రీమింగ్ అవుతున్న అర్ధమైందా "అరుణ్ కుమార్"లో విలన్ గా నటించి మెప్పించిన జయదేవ్... మెల్లగా అందరి దృష్టిని ఆకర్షించడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం "వార్ మెన్" వెబ్ సిరీస్ లో లీడ్ రోల్ చేస్తున్న జయదేవ్... కృష్ణ మామిడి దర్శకత్వంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న "ఆద్య"లో విలన్ గా నటిస్తున్నాడు!!

శేఖర్ మాస్టర్ దగ్గర డాన్స్ సాధన చేసిన జయదేవ్... మార్షల్ ఆర్ట్స్ లోనూ తగిన తర్ఫీదు పొందాడు. కెరీర్ బిగినింగ్ లో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో చేరి శిక్షణ తీసుకున్న ఈ కుర్రాడు... "అద్దం" తన అసలు సిసలు గురువంటాడు. నటనను అర్ధం చేసుకోవడానికి అద్దం తనకు ఎంతగానో దోహదపడుతుందని చెబుతాడు. "నన్ను నాకంటే మిన్నగా నమ్మిన మా నాన్న, అమ్మ, నాన్నల నుంచి ఇప్పటివరకు తీసుకోవడం తప్ప... వాళ్లకు ఇచ్చిందన్నదే లేదు" అంటూ ఒకింత భావోద్వేగానికి లోనయ్యే ఈ వాస్తవవాది... తన "అమ్మానాన్న, అన్న" తనను చూసి గర్వపడేలా చేయడమే తన ముందున్న ధ్యేయంగా ప్రకటించుకుంటాడు.

"జయదేవ్"ను 
సంప్రదించాలనుకునేవారు 
*99 66 51 55 33*
నంబర్ కి కాల్ చేయవచ్చు!!

Tags
Join WhatsApp

More News...

Local News 

విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలి ఐసిడిఎస్ సిడిపిఓ మమత

విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలి  ఐసిడిఎస్ సిడిపిఓ మమత    జగిత్యాల, మార్చి 23: (ప్రజా మంటలు)విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచే దిశగా అంగన్వాడి టీచర్లు కృషి చేయాలని ఐ సి డి ఎస్ సిడిపిఓ మమత అన్నారు. సోమవారం జగిత్యాల అర్బన్ మండలంలోని మోతె గ్రామంలో గల అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాలు సజావుగా...
Read More...
Local News 

ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి  పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్    జగిత్యాల మార్చి 23 (ప్రజా మంటలు) ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను అదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను  ఆర్డీఓలతో కలిసి స్వీకరించారు.   జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ పలు...
Read More...
Local News 

ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి  పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్    జగిత్యాల మార్చి 23 (ప్రజా మంటలు) ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను అదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను  ఆర్డీఓలతో కలిసి స్వీకరించారు.   జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ పలు...
Read More...
Local News 

పోలీస్ శాఖను ప్రజలకు మరింత చేరువ చేయడమే గ్రీవెన్స్ డే లక్ష్యం   జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

పోలీస్ శాఖను ప్రజలకు మరింత చేరువ చేయడమే గ్రీవెన్స్ డే లక్ష్యం    జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్     జగిత్యాల మార్చి 23 ( ప్రజా మంటలు)   ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 12 మంది  అర్జీదారులతో నేరుగా  మాట్లాడి వారి  సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని  బాధితులకు న్యాయం...
Read More...
State News 

సిద్ధిపేటలో భారీ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం – నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం

సిద్ధిపేటలో భారీ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం – నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం సిద్ధిపేట, మార్చి 22 (ప్రజా మంటలు): ప్రజా పాలనలో భాగంగా నిర్వహిస్తున్న రైతు ఉత్సవాల కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం సిద్ధిపేట జిల్లాలో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. . ఈ సందర్భంగా నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని...
Read More...
State News 

కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పనున్న  జీవన్ రెడ్డి - 25న కీలక సమావేశం - రాజీనామా ప్రకటనకు సిద్ధం

కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పనున్న  జీవన్ రెడ్డి - 25న కీలక సమావేశం - రాజీనామా ప్రకటనకు సిద్ధం జగిత్యాల, మార్చ్ 22 (ప్రజా మంటలు): మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి  రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. ఈనెల 25న అభిమానులు, శ్రేయోభిలాషులతో సమావేశం నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలిపారు. అదే రోజు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు స్పష్టం చేశారు.జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో జరిగిన...
Read More...
International  

ఇరాన్ అధికారులపై సౌదీ అరేబియా కఠిన నిర్ణయం – 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని నిష్క్రమణ ఉత్తర్వులు

ఇరాన్ అధికారులపై సౌదీ అరేబియా కఠిన నిర్ణయం – 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని నిష్క్రమణ ఉత్తర్వులు రియాద్ మార్చ్ 22: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ మరియు సౌదీ అరేబియా మధ్య దౌత్య సంబంధాలు మరింత దిగజారుతున్నాయి. ఈ పరిణామాల్లో భాగంగా, సౌదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సౌదీ అధికారులు ఒక ఇరాన్ సైనిక అధికారిని, అలాగే రాయబార కార్యాలయానికి చెందిన నలుగురు సిబ్బందిని “అనవసర వ్యక్తులు” (persona...
Read More...
Local News 

రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్     జగిత్యాల మార్చి 21 (ప్రజా మంటలు)ఈద్గా ల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పర్వదినాన్ని శాంతి, సామరస్య వాతావరణంలో ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు ఈద్గాల వద్ద ఏర్పాటు...
Read More...
Local News 

ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత

ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత      జగిత్యాల మార్చి 21 (ప్రజా మంటలు)పట్టణం లో పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా మంచినీళ్ల బావి ఈద్గా మరియు కిల్ల జగిత్యాల జమ మసీద్ దగ్గర  బి  ఆర్ ఎస్ నాయకులతో కలిసి మైనార్టీ సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఈ సందర్భంగా...
Read More...
Local News 

జనాకర్షక పథకాల కి తప్ప విద్యారంగానికి కేటాయింపులు లేవు_ )ఎస్ టి యు

జనాకర్షక పథకాల కి తప్ప విద్యారంగానికి కేటాయింపులు లేవు_ )ఎస్ టి యు    జగిత్యాల మార్చి 20(ప్రజా మంటలు)జనాకర్షక పథకాలకే తప్ప ప్రస్తుత విద్యా వ్యవస్థను బాగు చేసే విధంగా విద్యారంగానికి కేటాయింపులు లేవని స్టేట్ టీచర్స్ యూనియన్  జగిత్యాల జిల్లా శాఖ అభిప్రాయపడింది.  శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై ఎస్టీయూ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష,  ప్రధాన కార్యదర్శి లు బైరం హరికిరణ్,...
Read More...
National  State News 

అన్నాడీఎంకే కూటమిలో సీట్ల పంపకం ఎప్పుడు? ఏమిటి సమస్య? ఎవరికెంత?

అన్నాడీఎంకే కూటమిలో సీట్ల పంపకం ఎప్పుడు? ఏమిటి సమస్య? ఎవరికెంత? చెన్నై మార్చ్ 19: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (అన్నాడీఎంకే) నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో సీట్ల పంపకం చర్చలు తుది దశకు చేరుకున్నాయని సమాచారం.. ఇప్పటి వరకు లభ్యమైన వివరాల ప్రకారం:భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి – 27 స్థానాలుపట్టాళి మక్కల్ కచ్చి (పామక)కు...
Read More...
State News 

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా ఉగాది వేడుకలు.. ప్రజా బడ్జెట్ విడుదల

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా ఉగాది వేడుకలు.. ప్రజా బడ్జెట్ విడుదల హైదరాబాద్, మార్చ్ 19 (ప్రజా మంటలు):శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా తెలంగాణ జాగృతి కార్యాలయంలో సంప్రదాయబద్ధంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచాంగ శ్రవణం చేయగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఆమెతో పాటు అనిల్ దంపతులు, జాగృతి ముఖ్య నాయకులు హాజరయ్యారు. రూ.2,15,200...
Read More...