ప్రపంచంలోనే అద్భుతమైన విశ్వవిద్యాలయంగా ఉస్మానియా ను తీర్చిదిద్దాలి - డీమ్ రేవంత్ రెడ్డి 

On
ప్రపంచంలోనే అద్భుతమైన విశ్వవిద్యాలయంగా ఉస్మానియా ను తీర్చిదిద్దాలి - డీమ్ రేవంత్ రెడ్డి 

చదువు ఒక్కటే ఈ సమాజాన్ని మార్చగలదు
విద్యా రంగానికి ఈ ఏడాది 40 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం

హైదరాబాద్ ఆగస్ట్ 25 (ప్రజా మంటలు);

తెలంగాణ చరిత్రకు సజీవ సాక్ష్యమైన ఉస్మానియా యూనివర్సిటీని ప్రపంచంలోనే ఒక అద్భుతమైన విద్యాలయంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి  చెప్పారు. తెలంగాణ చరిత్రను నిక్షిప్తం చేసిన, తెలంగాణ పదానికే ప్రత్యామ్నాయంగా నిలిచిన ఉస్మానియా విశ్వవిద్యాలయ అభివృద్ధికి ఎంత చేసినా తక్కువే అవుతుందని అన్నారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థినీ విద్యార్థుల కోసం నూతన హాస్టల్ భవనాలు, లైబ్రరీ రీడిండ్ రూమ్ నిర్మాణాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే, కొత్తగా నిర్మించిన దుందుభి, భీమ హాస్టల్ భవనాలకు ప్రారంభోత్సవం చేశారు.

ఈ సందర్భంగా ఆర్ట్స్ కాలేజీ ఠాగూర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఉస్మానియాను ఒక అద్బుతమైన వర్సిటీగా తీర్చిదిద్దడానికి ఇంజనీరింగ్ నిపుణులు, విద్యా శాఖ నిపుణలతో ఒక కమిటీని నియమించి సమగ్రమైన అంచనాలు రూపొందించాలని విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా గారిని ఆదేశించారు. స్టాన్‌ఫోర్డ్, ఆక్స్‌ఫర్డ్ వర్సిటీల ప్రమాణాలను మించి ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దడానికి ఎన్ని నిధులైనప్పటికీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. 

“విద్యా రంగానికి ఈ ఏడాది 40 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఉస్మానియా కోసం వెయ్యి కోట్లు ఖర్చు చేయడానికి ఇబ్బందేమీ లేదు. రాష్ట్రంలో వంద నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల కోసం 20 వేల కోట్లు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి 500 కోట్లు, స్పోర్ట్స్ యూనివర్సిటీ, పోలీస్ స్కూల్ కోసం వందల  కోట్లు ఖర్చు పెడుతున్నాం. IMG-20250825-WA0006
 
 ఉస్మానియా యూనివర్సిటీ కాలగర్భంలో కలవొద్దు. ఈ వర్సిటీ చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలవాలి. ప్రపంచ ప్రమాణాలతో అద్బుతమైన వర్సిటీగా రూపొందించడానికి ఏం కావాలో అడగండి. రాష్ట్ర సాధనలో ముందు భాగంలో నిలబడిన ఈ యూనివర్సిటీని గాలికొదిలేయడం సరికాదు. ఈ యూనివర్సిటీకి మరోసారి వస్తా. ఈసారి ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా సభ పెట్టుకుందాం. యూనివర్సిటీని అభివృద్ధి చేయడంలో నాకు చిత్తశుద్ధి ఉంది. అంచనాలు రూపొందించండి. 

 తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక భాగస్వామ్యం తీసుకున్న ఎంతో మంది విద్యార్థులు, నాయకులు ఇక్కడి నుంచి వచ్చిన వారే. తెలంగాణ సమాజానికి సమస్యలున్నా, సంక్షోభం వచ్చినా మొదట చర్చ జరిగేది ఉస్మానియా నుంచే ఆ సమస్య మాది అని భావించేదే ఈ నిలయం. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఉస్మానియాను కాలగర్భంలో కలిపేయాలన్న కుట్ర జరుగుతున్న సందర్భంలో ఈ వర్సిటీకి పూర్వ వైభవం కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం ఆలోచనలు చేశాం. రాష్ట్రంలోని యూనివర్సిటీలు అన్నింటినీ చదువులకే కాకుండా సామాజిక చైతన్య వేదికలుగా మార్చాలన్న ఆలోచనతో నిర్ణయాలు తీసుకున్నాం. 

ఉస్మానియా వర్సిటీ 108 ఏళ్ల చరిత్రలో దళితుడు వైస్ చాన్సెలర్ కాలేదు. ప్రస్తుతం వీసీ మొలుగరం గారి నైపుణ్యాన్ని గుర్తించి వీసీగా నియమించాం. అలాగే మిగతా యూనివర్సిటీలు, విద్యా కమిషన్‌కు అలాగే నియమించాం. 

 వర్సిటీలు ఉద్యోగులు, అధికారులను ఉత్పత్తి చేయడానికి మాత్రమే కాకుండా తెలంగాణ పునర్నిర్మాణానికి అవసరమైన మేధాసంపత్తిని అందిస్తుందని ఆశిస్తున్నాం. దేశ జనాభాలో 35 ఏళ్ల లోపు వయసున్న యువత 65 శాతం ఉంది. యువత శాసనసభకు పోటీ చేయాలంటే 25 ఏళ్ల వయ పరిమితిని 21 సంవత్సరాలకు ఎందుకు తగ్గించకూడదో ఆలోచన చేయాలి. 

 యూనివర్సిటీలు చదువులకు మాత్రమే పరిమితం కాకుండా పరిశోధనలకు వేదిక కావాలి. సైద్ధాంతికపరమైన భిన్నాభిప్రాయాలపై చర్చలు జరగాలి. సాంకేతిక పరమైన చర్చలు జరగాలి. వర్సిటీలు, విద్యాలయాల్లో సిద్ధాంతపరమైన పోరాటాలు, సామాజిక చైతన్య ఉద్యమాలు లేని కారణంగా చిన్న చిన్న కాలేజీల్లో కూడా విద్యార్థులు గంజాయి సేవించడం లాంటి వ్యసనాల బారిన పడటానికి దారితీస్తోంది. 

 ప్రస్తుత పరిస్థితుల్లో పంచడానికి భూములు లేవు. ఖజానాలో ఖాళీగా ఉంది. దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలకు నా సూచన ఒక్కటే నాణ్యమైన విద్య ఒక్కటే మన తలరాతలను మార్చగలుగుతుంది. చదువుకునే వయసులో ఇతర వ్యాపకాలకు లోనైతే దారితప్పుతాం. 

 విద్యార్థినీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికే ఇక్కడికి వచ్చాను. సమస్యలు పరిష్కరించడానికి వచ్చినప్పుడు వ్యతిరేకించడం ద్వారా అభివృద్ధిని అడ్డుకున్న వారవుతారు. 

అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం. ఉపాధ్యాయ నియామకాల కోసం కేవలం 55 రోజుల్లో 11 వేల మంది టీచర్లను నియమించాం. వచ్చే ఆరు నెలల్లో ఇంకో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. అధికారం చేపట్టి రెండున్నరేళ్ల కాలం నాటికి లక్ష ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ప్రైవేటు రంగంలో వేల కోట్ల పెట్టుబడులను తేవడమే కాకుండా 1.5 లక్షల ఉద్యోగాలు ప్రైవేటు రంగంలో కల్పించాం. 

అపోహలకు లోను కావద్దు. అనుమానాలు ఉంటే నివృతి చేస్తాం. అబద్దాలను నమ్మకండి. కొందరు జీర్ణించుకోలేక ప్రతిదానికి అడ్డుపడుతున్నారు. అలాంటి వారు తెలంగాణ సమాజానికి ముసుగేసుకున్న చెదల్లాంటి వారు. ఉస్మానియా వర్సిటీని ఉంచకూడదని, ఎవరూ చదువుకోవద్దని కోరుకునే వారు. 2034 నాటికి తెలంగాణ 1 ట్రిలియన్ డాలర్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగాలంటే మీరంతా చదువుకోవాలి. చదువు ఒక్కటే ఈ సమాజాన్ని మార్చగలదు..” అని ముఖ్యమంత్రి సవివరంగా మాట్లాడారు.

 ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్, పలువురు ప్రజాప్రతినిధులు, యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం, వివిధ విశ్వవిద్యాలయాల వైస్ చాన్సెలర్లు, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం, ఉన్నతాధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags

More News...

National  International  

కామన్వెల్త్ గేమ్స్మీ లో మీరాబాయి చానుకు స్వర్ణం !

కామన్వెల్త్ గేమ్స్మీ లో మీరాబాయి చానుకు స్వర్ణం ! న్యూ ఢిల్లీ ఆగస్ట్ 25: భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను ఈరోజు కామన్వెల్త్ ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించడం ద్వారా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఈరోజు (ఆగస్టు 25) జరిగిన కామన్వెల్త్ ఛాంపియన్షిప్లో భారత వెయిట్రిఫ్టర్ మీరాబాయి చాను స్వర్ణం సాధించడం ద్వారా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. కామన్వెల్త్ ఛాంపియన్షిప్లు గుజరాత్లోని అహ్మదాబాద్లో జరుగుతున్నాయి. భారత అథ్లెట్, టోక్యో...
Read More...
National 

రాజస్థాన్లో డైనోసార్ శిలాజం బయటపడింది! 

రాజస్థాన్లో డైనోసార్ శిలాజం బయటపడింది!  ఇంగ్లాండ్ తర్వాత భారతదేశం... జైపూర్ (రాజస్తాన్) ఆగస్టు 25: ఇంగ్లాండ్ తర్వాత, అటువంటి పురాతన శిలాజం భారతదేశంలో కనుగొనబడింది. రాజస్థాన్లో ఒక డైనోసార్ శిలాజం కనుగొనబడింది. ఇంగ్లాండ్ తర్వాత భారతదేశంలో కనుగొనబడిన మొట్టమొదటి పురాతన శిలాజం ఇదేనని పరిశోధకులు తెలిపారు. రాజస్థాన్లోని జైసల్మేర్లో భూగర్భంలో కనుగొనబడిన ఈ శిలాజం దాదాపు 201 మిలియన్ సంవత్సరాల...
Read More...
National  State News 

పోలీసులు స్టేషన్ నుండే సాక్ష్యం ఇవ్వచ్చు ననే ఢిల్లీ LG నోటిఫికేషన్‌ను వ్యతిరేకించిన బార్ కౌన్సిల్ 

పోలీసులు స్టేషన్ నుండే సాక్ష్యం ఇవ్వచ్చు ననే ఢిల్లీ LG నోటిఫికేషన్‌ను వ్యతిరేకించిన బార్ కౌన్సిల్  న్యూ డిల్లీ ఆగస్ట్ 25: పోలీసులు పోలీస్ స్టేషన్ల నుండి వర్చువల్‌గా డిపోజ్ చేయడానికి అనుమతిస్తూ ఢిల్లీ LG నోటిఫికేషన్‌ను BCI వ్యతిరేకిస్తోంది, కోర్టులో సాక్ష్యాలను నమోదు చేయాలని చెబుతోంది. పోలీసు అధికారులు తమ నియమించబడిన పోలీస్ స్టేషన్ల నుండి ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా సాక్ష్యం ఇవ్వడానికి అనుమతిస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఇటీవల జారీ...
Read More...
Local News 

ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి  జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్    జగిత్యాల ఆగస్ట్ 25 (ప్రజా మంటలు     )         ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు. సోమవారం కలెక్టరెట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను  అదనపు కలెక్టర్, ఆర్డీఓలతో తో కలిసి స్వీకరించారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా...
Read More...
Local News 

సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కళాశాల ను సందర్శించిన ఎమ్మెల్యే డా సంజయ్

సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కళాశాల ను సందర్శించిన ఎమ్మెల్యే డా సంజయ్ జగిత్యాల ఆగస్టు 25 ( ప్రజా మంటలు)పట్టణంలోని భవానీ నగర్ లోని తెలంగాణా సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజ్ ను నాయకులతో కలసి సందర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్  హాస్టల్ లోని స్టోర్ రూమ్, వంట గదిని, పరిశీలించి అనంతరం మధ్యాహ్న సమయంలో విద్యార్థులతో కలిసి...
Read More...
Local News 

పెరిగిన బాధ్యతతో క్రమశిక్షణగా విధులు నిర్వహించాలి పదోన్నతి శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్పీ 

పెరిగిన బాధ్యతతో క్రమశిక్షణగా విధులు నిర్వహించాలి  పదోన్నతి శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్పీ  జగిత్యాల ఆగస్ట్ 25 (ప్రజా మంటలు)జిల్లా ఆర్మ్ రిజర్వ్  విభాగం లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహించి హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందిన వెంకట్ రావు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ  హెడ్ కానిస్టేబుల్ పదోన్నతి చిహ్నాన్ని అలంకరించి పదోన్నతి శుభాకాంక్షలు తెలియజేశారు. పెరిగిన...
Read More...
Local News 

గణేశ్ ఏర్పాట్లు, జాగ్రత్తలపై చిలకలగూడ ఏసీపీ సమీక్షా

గణేశ్ ఏర్పాట్లు, జాగ్రత్తలపై చిలకలగూడ ఏసీపీ సమీక్షా సికింద్రాబాద్, ఆగస్ట్ 25 (ప్రజామంటలు): రాబోవు గణేశ్ నవరాత్రోత్సవాల సందర్బంగా తీసుకొను జాగ్రత్తలు, నియమ నిబంధనాలు తదితర అంశాలపై చిలకలగూడ ఏసీపీ కె.శశాంక్రెడ్డి సోమవారం వారాసిగూడ పీఎస్ లోని ఏసీపీ కార్యాలయంలో అధికారులు,మండపాల నిర్వహకులతో కో ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనాలను ప్రతి ఒక్కరు పాటించాలన్నారు. వినాయకుడి ఉత్సవాలను సంబురంగా జరుపుకోవాలని, ఎలాంటి ఇబ్బందులు...
Read More...
Local News 

తనకు సైన్స్ పాఠాలు చెప్పిన టీచర్కు ఎమ్మెల్యే సన్మానం

తనకు సైన్స్ పాఠాలు చెప్పిన టీచర్కు ఎమ్మెల్యే సన్మానం తమ శిష్యుడు ఎమ్మెల్యేగా రావడంతో  టీచర్ హ్యాపీ  సికింద్రాబాద్, ఆగస్ట్ 25 (ప్రజామంటలు) : తనకు టెన్త్ లో సైన్స్ పాఠాలు చెప్పిన టీచర్  సడెన్ గా కనిపించడంతో సంతోషం చెందిన ఎమ్మెల్యే ఆమెను సత్కరించి, ఆశీర్వాదం తీసుకున్నారు. వివరాలు ఇవి..కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ సోమవారం ఉదయం మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్ ప్రభుత్వ ఉన్నత...
Read More...
Local News 

పండుగను సంబురంగా, శాంతియుతంగా జరుపుకోవాలి. - నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్

పండుగను సంబురంగా, శాంతియుతంగా జరుపుకోవాలి. - నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ గణేష్ వేడుకలు–2025 ఏర్పాట్లపై శాంతి కమిటీతో సమన్వయ సమావేశం సికింద్రాబాద్, ఆగస్ట్ 25 (ప్రజామంటలు) :   రాబోయే గణేష్ ఉత్సవం–2025 ను ప్రజలు సంబరంగా, శాంతియుతంగా జరుపుకోవాలని, వేడుకలు సాఫీగా నిర్వహణకు పోలీస్ అధికారులతో సహకరించాలని నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ కోరారు. సోమవారం ఉత్తర మండల డీసీపీ కార్యాలయంలో సమన్వయ సమావేశం ఉత్సవాల...
Read More...
Local News 

గణేష్ నవరాత్రుల నిర్వాహకులతో సిఐ, రామసింహారెడ్డి సమావేశంల

గణేష్ నవరాత్రుల నిర్వాహకులతో సిఐ, రామసింహారెడ్డి సమావేశంల (అంకం భూమయ్య) గొల్లపల్లి ఆగస్టు 25 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం కేంద్రంలో వినాయక నవరాత్రుల నిర్వాహకులతో ఏర్పాటు చేసిన సమావేశం లో  సి.ఐ రామ నరసింహారెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 27 వ తేదీన ప్రారంభంకానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన వేడుకలను ప్రజలు శాంతియుతంగా,జరుపుకోవాలని, సూచించారు. ఎక్కడ శాంతిభద్రతల సమస్య రానివ్వవద్దని, ఈ...
Read More...
Local News  State News 

ప్రపంచంలోనే అద్భుతమైన విశ్వవిద్యాలయంగా ఉస్మానియా ను తీర్చిదిద్దాలి - డీమ్ రేవంత్ రెడ్డి 

ప్రపంచంలోనే అద్భుతమైన విశ్వవిద్యాలయంగా ఉస్మానియా ను తీర్చిదిద్దాలి - డీమ్ రేవంత్ రెడ్డి  చదువు ఒక్కటే ఈ సమాజాన్ని మార్చగలదు విద్యా రంగానికి ఈ ఏడాది 40 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం హైదరాబాద్ ఆగస్ట్ 25 (ప్రజా మంటలు); తెలంగాణ చరిత్రకు సజీవ సాక్ష్యమైన ఉస్మానియా యూనివర్సిటీని ప్రపంచంలోనే ఒక అద్భుతమైన విద్యాలయంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి  చెప్పారు. తెలంగాణ చరిత్రను నిక్షిప్తం చేసిన,...
Read More...
Local News  State News 

ఎన్నారై అడ్వైజరీ బోర్డు పునర్నిర్మాణం చేయాలి - చాంద్ పాషా 

ఎన్నారై అడ్వైజరీ బోర్డు పునర్నిర్మాణం చేయాలి - చాంద్ పాషా  కరీంనగర్ ఆగస్టు 25 (ప్రజా మంటలు): తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఎం ఆర్ ఐ సలసంఘం ఏర్పాటులో జరిగిన లోపాలను సవరించాలని  కాంగ్రెస్ పార్టీ ఎన్ ఆర్ ఐ కన్వీనర్ చాంద్ పాషా కోరుతూ, చొప్పదండిలో పర్యటిస్తున్న ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కు వినతి పత్రం ఇచ్చారు.   గత రెండు దశాబ్దాలుగా అంటే 2005వివిధ...
Read More...