తెలుగు పత్రికా రంగానికి మార్గ నిర్దేశకుడు నార్ల.

- ఫిబ్రవరి 16 - నార్ల వెంకటేశ్వరరావు వర్ధంతి.

On
తెలుగు పత్రికా రంగానికి మార్గ నిర్దేశకుడు నార్ల.

( రామ కిష్టయ్య సంగన భట్ల - 9440595494 ).

నార్ల వెంకటేశ్వరరావు... పరిచయం అక్కర్లేని పేరు.

నిర్భయానికి, నిక్క చ్చితత్వానికి, నిబద్ధతకు మారు పేరు. వృత్తి నిబద్దతతో నిర్వహించారు. వృత్తి నిర్వహణ సామాజిక బాధ్యతగా భావించారు. పత్రికా రంగానికి మార్గదర్శకులు, జర్నలిస్టు లకు దిశానిర్దేశకులు. ఆయనొక విజ్ఞాన సర్వస్వం. అయన జీవితం సంస్కరణల మయం. రచన ఏది చేసినా, ప్రక్రియ ఎదైనా, ప్రజా చైతన్యమే ఆయన లక్ష్యం. లక్ష్య సిద్ది కోసం ఎన్ని అడ్డంకులు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ముందుకే సాగిన వైనం. 

 రచయితగా, నాటకకర్తగా, విమర్శ కుడిగా, అనువాదకుడిగా బహు ముఖ పాత్రలు పోషించిన ఆయన జీవిత పర్యంతం హేతుబద్ధమైన ఆలోచనల ద్వారా సామాజిక స్పృహ కల్పించే ప్రయత్నం చేశారు. ఆంగ్ల భాషలోనూ నిష్ణాతులైనా, తెలుగు ప్రజలకు తన రచనలు చేరువ కావాలనే తలంపుతో, తెలుగు పత్రికా రంగాన్ని కావాలనే ఎంచుకున్నారు. 

మధ్య ప్రదేశ్ లోని జబల్‌పూర్‌లో డిసెంబర్ 1, 1908 జన్మించిన నార్ల, విద్యాభ్యాసం కృష్ణా జిల్లాలో జరిగిం ది. వెంకటేశ్వరరావు ఏప్రిల్ 3, 1958 నుండి ఏప్రిల్ 2, 1970 వరకు రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యునిగా పని చేశారు.

స్వరాజ్య, జన వాణి, ప్రజా మిత్ర పత్రికలో పని చేసి, ఆంధ్ర ప్రభ, చివరకు ఆంధ్ర జ్యోతి పత్రికలకు ఎడిటర్ గా విధులు నిర్వర్తించారు. విధి నిర్వహణలో ఎన్నడూ అయన రాజీ పడలేదు. ఆయన సంపాద కీయ రచనలు సూటిదనం, గడుసు దనం, వ్యంగ్యం, చమత్కారం, లోక జ్ఞత, సమయజ్ఞత కల గలిపి ఉండే వి. పండితునికి, పామరునికి తెలు గు భాష అర్థమయ్యే రీతిలో నార్ల సంపాదకీయాలు, రచనలు చేశారు.

 ''వాస్తవమ్ము నార్లవారి మాట'’ మకుటంతో ఆటవెలదులు రచించారు. ‘'నవయుగాల బాట నార్ల మాట'’ మకుటంతో 700కు పైగా సందేశాత్మక పద్యాలు రాశారు. 16 ఏకాంకికల సంపుటి వెలువరించారు. నార్ల సొంత గ్రంథాలయంలో 20,000 పుస్తకాలు ఉండేవట అంటే మాటలు కాదు.

సంపాదకుడు అనే మాటను అయన అంగీకరించ లేదు. ఆమోదించ లేదు. ఎడిటర్ అనే పదాన్నే వాడే వారు. 

నార్ల... టంగుటూరి ప్రకాశం, నీలం సంజీవరెడ్డి, , కాసు బ్రహ్మానంద రెడ్డి, ఎన్.జి. రంగా ఎవరినీ వదల లేదు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ చాందసాన్ని విమర్శించక మాన లేదు. ఇందిరా గాంధి, ఆమె కుటుంబ వారసత్వ రాజకీయాల్ని ద్వేషించారు. 

ఆయన వ్యాసాలను నిరక్షరాస్యులు గ్రామాల్లోని రచ్చబండల దగ్గర చదివి వినిపించుకునే వారంటే ఆయనలోని రచనా వ్యాసంగ శక్తి ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు.

ఆంధ్రప్రభ నుంచి వైదొలిగిన సందర్భంలో, నార్ల కోసం కొందరు ముఖ్యులు కలిసి ఆంధ్ర జ్యోతి పత్రిక ప్రారంభించారంటే ఆయన గొప్పతనం స్పష్టం అవుతున్నది. గోరాశాస్త్రి మాటల్లో చెప్పాలంటే 'కేవలం సత్వగుణ ప్రధానంగా, అచ్చ తెలుగులో చప్పచప్పగా ఉన్న పత్రికా రచనలో వాడినీ, వేడినీ సృష్టించి, తెలుగు నుడికారంలో ఎంత 'కారం' ఉందో తెలియజెప్పిన వాడు' నార్ల. 

"యొక్కలతో తెలుగుభాష డొక్క పొడవొద్దు...ఎంత గొప్ప వాడైనా వస్తాడే కాని విచ్చేయడు...

సంపాదకుడు అనొద్దు ఎడిటర్ అనండి...బడు వాడేవాడు బడుద్ధాయి. అంటూ పత్రికా భాష ఎలా ఉండాలో దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఫిబ్రవరి 16, 1985న ఈ లోకాన్ని వీడి వెళ్లిన నార్ల తెలుగు సాహిత్య, పత్రికా రంగాలలో చెరగని ముద్ర వేసి వెళ్లారు.

 "ఎడిటరైన వాడు బిడియము చూపుచో ధాటి తగ్గు వృత్తి ధర్మమందు, కడుపుకూటి రాత కక్కుర్తి రాతరా''

"నిజము కప్పిపుచ్చి నీతిని విడనాడి స్వామి సేవ సేయు జర్నలిస్టు తార్చువాని కంటే తక్కువ వాడురా" అంటూ విలువలు వీడ వలదని హితవు పలికారు. ప్రస్తుత పరిస్థితులలో ఆయన చేసిన మార్గ నిర్దేశం నేటి జర్నలిస్టులకు నిజంగానే శిరోధార్యం.

Tags

More News...

Local News 

భూటాన్‌ దేశంలో ముల్కనూర్ వాసి ధనశ్రీకు భరతనాట్య అవార్డు

భూటాన్‌ దేశంలో ముల్కనూర్ వాసి ధనశ్రీకు భరతనాట్య అవార్డు మండల వ్యాప్తంగా అభినందనల వెల్లువ
Read More...
National  Local News  State News  Spiritual  

అపర ఏకాదశి.- వైశాఖ బహుళ ఏకాదశి

అపర ఏకాదశి.- వైశాఖ బహుళ ఏకాదశి   (రామ కిష్టయ్య సంగన భట్ల...      9440595494) వైశాఖ బహుళ ఏకాదశిని అపర ఏకాదశి, సిద్ధ ఏకాదశి, జలకృత ఏకాదశి, అజల ఏకాదశి, భద్రకాళి ఏకాదశి అని వివిధ పేర్లతో పిలుస్తారు. ఏడాదిలో పదిహేను రోజులకు ఓసారి వచ్చే ఏకాదశి తిథికి ప్రత్యేకతను కల్పిస్తూ... ఏడాది పొడవునా ఉండే ఒకో ఏకాదశికి ఒకో పేరు పెట్టడం జరిగింది....
Read More...
Local News 

తాట్లవాయి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు

తాట్లవాయి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు రాయికల్ మే 22 :   తాట్లవాయి గ్రామంలో నూతనంగా ప్రతిష్ఠించిన పంచముఖ హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా, మండల పూజ కార్యక్రమం నిర్వహించారు.రాయికల్ మండల తాజా మాజీ ఎంపీపీ లావుడ్యా సంధ్యారాణి సురేంధర్ నాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈరోజుతో పంచముఖ హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్టించి 41 వ రోజు అయినందున హనుమాన్...
Read More...
Local News 

భూకబ్జాదారులపై గాంధీనగర్  పీఎస్ లో కాంగ్రెస్ నేత ఫిర్యాదు

భూకబ్జాదారులపై గాంధీనగర్  పీఎస్ లో కాంగ్రెస్ నేత ఫిర్యాదు సికింద్రాబాద్ మే 22 (ప్రజామంటలు): బన్సీలాల్ పేట డివిజన్ లోని పలు ప్రభుత్వ భూములను కొందరు కబ్జాకు ప్రయత్నం చేస్తున్నారని, దీనిపై రెవిన్యూ అధికారులకు ఫిర్యాదుచేస్తే, తనపై దాడికి ప్రయత్నించారని డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఐత చిరంజీవి ఆరోపించారు. ఐడీహెచ్ కాలనీలోని ప్రభుత్వానికి చెందిన ఆలయ భూమిని కొందరు కబ్జాకు యత్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అలాగే...
Read More...
Local News 

తార్నాక లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

తార్నాక లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ మే22 (ప్రజామంటలు):   హనుమాన్ జయంతి వేడుకలను తార్నాక లోని గణపతి దేవాలయంలో గురువారం  బండ శివారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆంజనేయుని ప్రత్యేక పూజ లో ముఖ్యఅతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , మాజీ మేయర్ బండ కార్తీక చంద్రారెడ్డి భగవంతుడు...
Read More...
Local News 

జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో  గెలుపే లక్ష్యంగా నేతలు కార్యకర్తలు పని చేయాలి.

జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో  గెలుపే లక్ష్యంగా నేతలు కార్యకర్తలు పని చేయాలి. త్వరలో డివిజన్ల వారిగా పాదయాత్రలు  *ఎంపీ అనిల్ కుమార్, ఆదం సంతోష్ వెల్లడి.. సికింద్రాబాద్ మే 22 (ప్రజామంటలు) : రాబోవు జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ నేతలు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇంచార్జీ అదం సంతోష్ కుమార్ లు పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ ఇంచార్జ్...
Read More...
Local News 

శ్రీ భక్తాంజనేయ స్వామి హనుమాన్ జయంతి వేడుకలు 

శ్రీ భక్తాంజనేయ స్వామి హనుమాన్ జయంతి వేడుకలు  గొల్లపల్లి మే 22 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం లోని దమ్మన్నపేట గ్రామంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన 16 వ వార్షికోత్సవ మహోత్సవంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకొని, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి వర్యులు జీవన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కీ.శే పాదం...
Read More...
Local News 

చిలకలగూడ ఏసీపీగా శశాంక్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

చిలకలగూడ ఏసీపీగా శశాంక్ రెడ్డి బాధ్యతల స్వీకరణ సికింద్రాబాద్ మే 22(ప్రజా మంటలు):: సికింద్రాబాద్ ఈస్ట్ జోన్ చిలకలగూడ డివిజన్ ఏసిపిగా సి సి ఎస్  నుంచి బదిలీ పై వచ్చిన కె శశాంక్ రెడ్డి గురువారం ఉద్యోగ బాధ్యతలు తీసుకున్నారు.  1995 బ్యాచ్ కు చెందిన శశాంక్ రెడ్డి గతంలో మారేడుపల్లి స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా, పంజాగుట్ట డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గా...
Read More...
Local News 

భాగ్య రెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం. కలెక్టర్ బి. సత్య ప్రసాద్

భాగ్య రెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం. కలెక్టర్ బి. సత్య ప్రసాద్                                                                                                   సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల, మే-22(ప్రజా మంటలు)    మ్యాదరి భాగ్య రెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శమని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు.  గురువారం జిల్లాకలెక్టర్ బి. సత్య ప్రసాద్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన మ్యాదరి భాగ్యరెడ్డి వర్మ 137వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా...
Read More...
Local News 

త్వరితగతంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

త్వరితగతంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జగిత్యాల మే 22 (ప్రజా మంటలు)    ఎమ్మెల్యే క్వార్టర్లో మున్సిపల్ అధికారులతో జగిత్యాల అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్   జగిత్యాల పట్టణంలో వార్డులలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.  అభివృద్ధి పనుల పురోగతి పై చర్చించారు, వివిధ కారణాలతో ఆగిపోయిన అభివృద్ధి పనులకు తిరిగి...
Read More...
Local News 

హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలలో అర్ధరాత్రి సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులను, సిబ్బందిని సమన్వయ పరుస్తూ సూచనలు చేస్తున్న జిల్లా ఎస్పీ

హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలలో అర్ధరాత్రి సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులను, సిబ్బందిని సమన్వయ పరుస్తూ సూచనలు చేస్తున్న జిల్లా ఎస్పీ                                           సిరిసిల్ల . రాజేంద్ర శర్మ  మల్యాల మే 22 ( ప్రజా మంటలు)    కొండగట్టు  హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. బుధవారం అర్థరాత్రి సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులకు...
Read More...
Local News 

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా భాగ్యరెడ్డి వర్మ  జయంతి వేడుకలు

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా భాగ్యరెడ్డి వర్మ  జయంతి వేడుకలు                                                   సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 22( ప్రజా మంటలు)    భాగ్యరెడ్డి వర్మ  జయంతిని పురస్కరించుకోని జిల్లా పోలీస్ ప్రధాన  కార్యాలయములో ఏర్పాటు చేసిన కార్యాక్రమములో అడిషనల్ ఎస్పీ భీమ్ రావు  భాగ్యరెడ్డివర్మ  చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.  ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ  మాట్లాడుతూ... దళిత ఉద్యమానికి పునాదులు వేసిన ప్రముఖ...
Read More...