తెలుగు పత్రికా రంగానికి మార్గ నిర్దేశకుడు నార్ల.

- ఫిబ్రవరి 16 - నార్ల వెంకటేశ్వరరావు వర్ధంతి.

On
తెలుగు పత్రికా రంగానికి మార్గ నిర్దేశకుడు నార్ల.

( రామ కిష్టయ్య సంగన భట్ల - 9440595494 ).

నార్ల వెంకటేశ్వరరావు... పరిచయం అక్కర్లేని పేరు.

నిర్భయానికి, నిక్క చ్చితత్వానికి, నిబద్ధతకు మారు పేరు. వృత్తి నిబద్దతతో నిర్వహించారు. వృత్తి నిర్వహణ సామాజిక బాధ్యతగా భావించారు. పత్రికా రంగానికి మార్గదర్శకులు, జర్నలిస్టు లకు దిశానిర్దేశకులు. ఆయనొక విజ్ఞాన సర్వస్వం. అయన జీవితం సంస్కరణల మయం. రచన ఏది చేసినా, ప్రక్రియ ఎదైనా, ప్రజా చైతన్యమే ఆయన లక్ష్యం. లక్ష్య సిద్ది కోసం ఎన్ని అడ్డంకులు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ముందుకే సాగిన వైనం. 

 రచయితగా, నాటకకర్తగా, విమర్శ కుడిగా, అనువాదకుడిగా బహు ముఖ పాత్రలు పోషించిన ఆయన జీవిత పర్యంతం హేతుబద్ధమైన ఆలోచనల ద్వారా సామాజిక స్పృహ కల్పించే ప్రయత్నం చేశారు. ఆంగ్ల భాషలోనూ నిష్ణాతులైనా, తెలుగు ప్రజలకు తన రచనలు చేరువ కావాలనే తలంపుతో, తెలుగు పత్రికా రంగాన్ని కావాలనే ఎంచుకున్నారు. 

మధ్య ప్రదేశ్ లోని జబల్‌పూర్‌లో డిసెంబర్ 1, 1908 జన్మించిన నార్ల, విద్యాభ్యాసం కృష్ణా జిల్లాలో జరిగిం ది. వెంకటేశ్వరరావు ఏప్రిల్ 3, 1958 నుండి ఏప్రిల్ 2, 1970 వరకు రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యునిగా పని చేశారు.

స్వరాజ్య, జన వాణి, ప్రజా మిత్ర పత్రికలో పని చేసి, ఆంధ్ర ప్రభ, చివరకు ఆంధ్ర జ్యోతి పత్రికలకు ఎడిటర్ గా విధులు నిర్వర్తించారు. విధి నిర్వహణలో ఎన్నడూ అయన రాజీ పడలేదు. ఆయన సంపాద కీయ రచనలు సూటిదనం, గడుసు దనం, వ్యంగ్యం, చమత్కారం, లోక జ్ఞత, సమయజ్ఞత కల గలిపి ఉండే వి. పండితునికి, పామరునికి తెలు గు భాష అర్థమయ్యే రీతిలో నార్ల సంపాదకీయాలు, రచనలు చేశారు.

 ''వాస్తవమ్ము నార్లవారి మాట'’ మకుటంతో ఆటవెలదులు రచించారు. ‘'నవయుగాల బాట నార్ల మాట'’ మకుటంతో 700కు పైగా సందేశాత్మక పద్యాలు రాశారు. 16 ఏకాంకికల సంపుటి వెలువరించారు. నార్ల సొంత గ్రంథాలయంలో 20,000 పుస్తకాలు ఉండేవట అంటే మాటలు కాదు.

సంపాదకుడు అనే మాటను అయన అంగీకరించ లేదు. ఆమోదించ లేదు. ఎడిటర్ అనే పదాన్నే వాడే వారు. 

నార్ల... టంగుటూరి ప్రకాశం, నీలం సంజీవరెడ్డి, , కాసు బ్రహ్మానంద రెడ్డి, ఎన్.జి. రంగా ఎవరినీ వదల లేదు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ చాందసాన్ని విమర్శించక మాన లేదు. ఇందిరా గాంధి, ఆమె కుటుంబ వారసత్వ రాజకీయాల్ని ద్వేషించారు. 

ఆయన వ్యాసాలను నిరక్షరాస్యులు గ్రామాల్లోని రచ్చబండల దగ్గర చదివి వినిపించుకునే వారంటే ఆయనలోని రచనా వ్యాసంగ శక్తి ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు.

ఆంధ్రప్రభ నుంచి వైదొలిగిన సందర్భంలో, నార్ల కోసం కొందరు ముఖ్యులు కలిసి ఆంధ్ర జ్యోతి పత్రిక ప్రారంభించారంటే ఆయన గొప్పతనం స్పష్టం అవుతున్నది. గోరాశాస్త్రి మాటల్లో చెప్పాలంటే 'కేవలం సత్వగుణ ప్రధానంగా, అచ్చ తెలుగులో చప్పచప్పగా ఉన్న పత్రికా రచనలో వాడినీ, వేడినీ సృష్టించి, తెలుగు నుడికారంలో ఎంత 'కారం' ఉందో తెలియజెప్పిన వాడు' నార్ల. 

"యొక్కలతో తెలుగుభాష డొక్క పొడవొద్దు...ఎంత గొప్ప వాడైనా వస్తాడే కాని విచ్చేయడు...

సంపాదకుడు అనొద్దు ఎడిటర్ అనండి...బడు వాడేవాడు బడుద్ధాయి. అంటూ పత్రికా భాష ఎలా ఉండాలో దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఫిబ్రవరి 16, 1985న ఈ లోకాన్ని వీడి వెళ్లిన నార్ల తెలుగు సాహిత్య, పత్రికా రంగాలలో చెరగని ముద్ర వేసి వెళ్లారు.

 "ఎడిటరైన వాడు బిడియము చూపుచో ధాటి తగ్గు వృత్తి ధర్మమందు, కడుపుకూటి రాత కక్కుర్తి రాతరా''

"నిజము కప్పిపుచ్చి నీతిని విడనాడి స్వామి సేవ సేయు జర్నలిస్టు తార్చువాని కంటే తక్కువ వాడురా" అంటూ విలువలు వీడ వలదని హితవు పలికారు. ప్రస్తుత పరిస్థితులలో ఆయన చేసిన మార్గ నిర్దేశం నేటి జర్నలిస్టులకు నిజంగానే శిరోధార్యం.

Tags

More News...

Local News 

బీజేపీ సంవిధాన్ గౌరవ అభియాన్ కార్యశాల

బీజేపీ సంవిధాన్ గౌరవ అభియాన్ కార్యశాల జగిత్యాల  జనవరి 20 (  ప్రజా మంటలు     )భారతీయ జనతా పార్టీ "సంవిధాన్ గౌరవ అభియాన్" కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా కార్యశాల కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా. బోగ శ్రావణి ఈ సందర్భంగా డాక్టర్ బోగ శ్రావణి మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి  నరేంద్ర...
Read More...
National  International   State News 

మ్యూనిచ్ లో రేవంత్ రెడ్డి బృందానికి ఘన స్వాగతం

మ్యూనిచ్ లో రేవంత్ రెడ్డి బృందానికి ఘన స్వాగతం మ్యూనిచ్ లో రేవంత్ రెడ్డి బృందానికి ఘన స్వాగతం మ్యూనిచ్ జనవరి 20: దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం (World Economic Forum) సదస్సులో పాల్గొనడానికి జ్యూరిచ్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందానికి విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది.  ముఖ్యమంత్రి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారుల ప్రతినిధి బృందం జ్యూరిచ్ విమానాశ్రయం చేరుకోగానే అక్కడ...
Read More...
Local News 

ముదిరాజ్​లను బీసీ 'డీ' నుంచి బీసీ 'ఏ' లోకి మార్చాలి

ముదిరాజ్​లను బీసీ 'డీ' నుంచి బీసీ 'ఏ' లోకి మార్చాలి ముదిరాజ్​లను బీసీ 'డీ' నుంచి బీసీ 'ఏ' లోకి మార్చాలి- అఖిల భారతీయ కోలి ముదిరాజ్ జాతీయ కార్యవర్గ తీర్మానం సికింద్రాబాద్​, జనవరి 20 ( ప్రజామంటలు): దీర్ఘకాలికంగా పెండింగ్​ లో ఉన్న ముదిరాజ్​ కమ్యూనిటీని బీసీ డీ నుంచి బీసీ ఏ లోకి మార్చే ప్రతిపాదనను వెంటనే అమలు చేయాలని పలువురు వక్తలు...
Read More...
Local News 

పిల్లల భద్రతే  మాకు ముఖ్యం, రోడ్డు ప్రమాద నివారణలో అందరూ భాగస్వాములు కావాలి: జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్

పిల్లల భద్రతే  మాకు ముఖ్యం, రోడ్డు ప్రమాద నివారణలో అందరూ భాగస్వాములు కావాలి: జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్ పిల్లల భద్రతే  మాకు ముఖ్యం, రోడ్డు ప్రమాద నివారణలో అందరూ భాగస్వాములు కావాలి: జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్    జగిత్యాల జనవరి 20  (ప్రజా మంటలు):స్కూల్ వాహనాలకు ఎలాంటి చిన్న ప్రమాదం జరిగిన సంబంధిత డ్రైవరు, యాజమాన్యం పై  కఠినంగా వ్యవహరిస్తాం.విద్యాసంస్థల ప్రతి వాహనానికి తప్పనిసరిగా రోడ్  ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారి చే...
Read More...
Local News 

ప్రవేట్ స్కూల్ బస్సులను తనిఖీ చేసిన ఎస్ఐ సిహెచ్.సతీష్ 

ప్రవేట్ స్కూల్ బస్సులను తనిఖీ చేసిన ఎస్ఐ సిహెచ్.సతీష్  ప్రవేట్ స్కూల్ బస్సులను తనిఖీ చేసిన ఎస్ఐ సిహెచ్.సతీష్  గొల్లపల్లి జనవరి 20 (ప్రజా మంటలు): జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకురోడ్డు మరియు రహదారి భద్రత  మాసవోత్సవం   సందర్భంగా  గొల్లపల్లి మండల లోని ప్రైవేట్ స్కూల్ బస్సులను  ఎస్ఐ,సతీష్ తనిఖీలు చేశారు. ఆయన మాట్లాడుతూ, మాట్లాడుతూ పిల్లల్ని స్కూలుకు ఇంటికి వరకు...
Read More...
Local News 

భార్య చనిపోగా భర్త మానసిక వేదనతో  ఆత్మహత్య

భార్య చనిపోగా భర్త మానసిక వేదనతో  ఆత్మహత్య భార్య చనిపోగా భర్త మానసిక వేదనతో ఆత్మహత్య ఇబ్రహీంపట్నం జనవరి 20( ప్రజా మంటలు): ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని  గోదురు గ్రామానికి చెందిన రెబ్బసి శాంత మూడు నెలల క్రితం మరణించగా తన భర్త రెబ్బసి ఆశన్న, భార్య గురించి తలుచుకుంటూ మానసిక వేదనకు గురవుతూ ప్రతిరోజు బాధపడుతుండెవాడని  సోమవారం  ఇటలీ ఎవరు లేని సమయంలో...
Read More...
Local News 

మధ్యాహ్న భోజన పథకం లో పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు ఇవ్వాలి - వర్కర్స్ యూనియన్ వినతి పత్రం

మధ్యాహ్న భోజన పథకం లో పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు ఇవ్వాలి - వర్కర్స్ యూనియన్ వినతి పత్రం   మధ్యాహ్న భోజన పథకం లో పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు ఇవ్వాలి - వర్కర్స్ యూనియన్ వినతి పత్రం మెట్టుపల్లి జనవరి 20( ప్రజా మంటలు) తెలంగాణ రాష్ట్ర ఏఐటీయూసీ అనుబంధ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో  పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు ఇవ్వాలని మెట్పల్లిలోని మండల విద్యాశాఖ అధికారికి మధ్యాహ్న భోజన...
Read More...
Local News 

మీత అయ్య వార్ల అధ్యక్షునిగా తిరు కోవేల నరసయ్య, 

మీత అయ్య వార్ల అధ్యక్షునిగా తిరు కోవేల నరసయ్య,  మీత అయ్య వార్ల అధ్యక్షునిగా తిరు కోవేల నరసయ్య,  మెట్టుపల్లి జనవరి 26 (ప్రజా మంటలు) మెట్టుపల్లి  డివిజన్ మిత అయ్యవారు అధ్యక్షుని గా తిరు కోవెల  నరసయ్య, ఉపాధ్యక్షులుగా సాత్పడిఅశోక్, ప్రధాన కార్యదర్శిగా గడ్డల కాంతయ్య, కోశాధికారి గా ధర్మపురి పురుషోత్తం ను ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు మెట్టుపల్లి లో సోమవారం జరిగిన మిత అయ్యవార్ల...
Read More...
Local News 

ధర్మపురి క్షేత్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి  ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ 

ధర్మపురి క్షేత్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి  ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్  ధర్మపురి క్షేత్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి  ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్  ధర్మపురి జనవరి 20:   దక్షిణ కాశీగా, హరిహర క్షేత్రంగా, గోదావరి తీరాన వెలసి, మున్సిపాలిటీ, మండల, నియోజక వర్గ కేంద్రంగా, నిత్య భక్త జన సందడితో అలరారే ధర్మపురి క్షేత్రం సమగ్రాభివృద్ధికి కృషి సల్పగనని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరిలక్ష్మణ్ కుమార్...
Read More...
Local News 

కాంగ్రెస్​ నేతలు కంటి పరీక్షలు  చేయించుకోవాలి  * బీఆర్​ఎస్​ హాయంలో చేసిన పనులు కనిపించడం లేదా..?

కాంగ్రెస్​ నేతలు కంటి పరీక్షలు  చేయించుకోవాలి  * బీఆర్​ఎస్​ హాయంలో చేసిన పనులు కనిపించడం లేదా..? కాంగ్రెస్​ నేతలు కంటి పరీక్షలు  చేయించుకోవాలి  * బీఆర్​ఎస్​ హాయంలో చేసిన పనులు కనిపించడం లేదా..? సికింద్రాబాద్, జనవరి 20 (ప్రజామంటలు): బీఆర్​ఎస్​ ప్రభుత్వం చేసిన అభివృద్ది పనులు కాంగ్రెస్​ నాయకులకు కనింపించకపోతే, కంటి పరీక్షలు చేయించుకోవాలని బన్సీలాల్​ పేట డివిజన్​ బీఆర్​ఎస్​ ప్రెసిడెంట్​ ఎల్​.వెంకటేశన్​ రాజు పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...మాజీ మంత్రి,...
Read More...
Local News 

ప్రతి బ్యాంక్ ఏటీఎం వద్ద తప్పనిసరిగా  సెక్యూరిటీ గార్డు, సిసి కెమెరాలు, అలారం సిస్టం ఏర్పాటు చేయాలి

ప్రతి బ్యాంక్ ఏటీఎం వద్ద తప్పనిసరిగా  సెక్యూరిటీ గార్డు, సిసి కెమెరాలు, అలారం సిస్టం ఏర్పాటు చేయాలి ఎస్పీ అశోక్   జగిత్యాల జనవరి 20(  ప్రజా మంటలు  )జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా  వ్యాప్తంగా  ఉన్న  వివిధ బ్యాంకుల్లో పని చేస్తున్న బ్యాంకు అధికారులతో  బ్యాంకుల, ఏటీఎంల  వద్ద భద్రతా ప్రమాణాలు, సిసి కెమెరాల ఏర్పాటు, ఆర్థిక నేరాలు, గతంలో   జరిగిన బ్యాంకు మరియు ఏటీఎం సంబందించిన నేరాల గురించి, భవిష్యత్తు లో...
Read More...