తెలుగు పత్రికా రంగానికి మార్గ నిర్దేశకుడు నార్ల.
- ఫిబ్రవరి 16 - నార్ల వెంకటేశ్వరరావు వర్ధంతి.
( రామ కిష్టయ్య సంగన భట్ల - 9440595494 ).
నార్ల వెంకటేశ్వరరావు... పరిచయం అక్కర్లేని పేరు.
నిర్భయానికి, నిక్క చ్చితత్వానికి, నిబద్ధతకు మారు పేరు. వృత్తి నిబద్దతతో నిర్వహించారు. వృత్తి నిర్వహణ సామాజిక బాధ్యతగా భావించారు. పత్రికా రంగానికి మార్గదర్శకులు, జర్నలిస్టు లకు దిశానిర్దేశకులు. ఆయనొక విజ్ఞాన సర్వస్వం. అయన జీవితం సంస్కరణల మయం. రచన ఏది చేసినా, ప్రక్రియ ఎదైనా, ప్రజా చైతన్యమే ఆయన లక్ష్యం. లక్ష్య సిద్ది కోసం ఎన్ని అడ్డంకులు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ముందుకే సాగిన వైనం.
రచయితగా, నాటకకర్తగా, విమర్శ కుడిగా, అనువాదకుడిగా బహు ముఖ పాత్రలు పోషించిన ఆయన జీవిత పర్యంతం హేతుబద్ధమైన ఆలోచనల ద్వారా సామాజిక స్పృహ కల్పించే ప్రయత్నం చేశారు. ఆంగ్ల భాషలోనూ నిష్ణాతులైనా, తెలుగు ప్రజలకు తన రచనలు చేరువ కావాలనే తలంపుతో, తెలుగు పత్రికా రంగాన్ని కావాలనే ఎంచుకున్నారు.
మధ్య ప్రదేశ్ లోని జబల్పూర్లో డిసెంబర్ 1, 1908 జన్మించిన నార్ల, విద్యాభ్యాసం కృష్ణా జిల్లాలో జరిగిం ది. వెంకటేశ్వరరావు ఏప్రిల్ 3, 1958 నుండి ఏప్రిల్ 2, 1970 వరకు రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యునిగా పని చేశారు.
స్వరాజ్య, జన వాణి, ప్రజా మిత్ర పత్రికలో పని చేసి, ఆంధ్ర ప్రభ, చివరకు ఆంధ్ర జ్యోతి పత్రికలకు ఎడిటర్ గా విధులు నిర్వర్తించారు. విధి నిర్వహణలో ఎన్నడూ అయన రాజీ పడలేదు. ఆయన సంపాద కీయ రచనలు సూటిదనం, గడుసు దనం, వ్యంగ్యం, చమత్కారం, లోక జ్ఞత, సమయజ్ఞత కల గలిపి ఉండే వి. పండితునికి, పామరునికి తెలు గు భాష అర్థమయ్యే రీతిలో నార్ల సంపాదకీయాలు, రచనలు చేశారు.
''వాస్తవమ్ము నార్లవారి మాట'’ మకుటంతో ఆటవెలదులు రచించారు. ‘'నవయుగాల బాట నార్ల మాట'’ మకుటంతో 700కు పైగా సందేశాత్మక పద్యాలు రాశారు. 16 ఏకాంకికల సంపుటి వెలువరించారు. నార్ల సొంత గ్రంథాలయంలో 20,000 పుస్తకాలు ఉండేవట అంటే మాటలు కాదు.
సంపాదకుడు అనే మాటను అయన అంగీకరించ లేదు. ఆమోదించ లేదు. ఎడిటర్ అనే పదాన్నే వాడే వారు.
నార్ల... టంగుటూరి ప్రకాశం, నీలం సంజీవరెడ్డి, , కాసు బ్రహ్మానంద రెడ్డి, ఎన్.జి. రంగా ఎవరినీ వదల లేదు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ చాందసాన్ని విమర్శించక మాన లేదు. ఇందిరా గాంధి, ఆమె కుటుంబ వారసత్వ రాజకీయాల్ని ద్వేషించారు.
ఆయన వ్యాసాలను నిరక్షరాస్యులు గ్రామాల్లోని రచ్చబండల దగ్గర చదివి వినిపించుకునే వారంటే ఆయనలోని రచనా వ్యాసంగ శక్తి ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు.
ఆంధ్రప్రభ నుంచి వైదొలిగిన సందర్భంలో, నార్ల కోసం కొందరు ముఖ్యులు కలిసి ఆంధ్ర జ్యోతి పత్రిక ప్రారంభించారంటే ఆయన గొప్పతనం స్పష్టం అవుతున్నది. గోరాశాస్త్రి మాటల్లో చెప్పాలంటే 'కేవలం సత్వగుణ ప్రధానంగా, అచ్చ తెలుగులో చప్పచప్పగా ఉన్న పత్రికా రచనలో వాడినీ, వేడినీ సృష్టించి, తెలుగు నుడికారంలో ఎంత 'కారం' ఉందో తెలియజెప్పిన వాడు' నార్ల.
"యొక్కలతో తెలుగుభాష డొక్క పొడవొద్దు...ఎంత గొప్ప వాడైనా వస్తాడే కాని విచ్చేయడు...
సంపాదకుడు అనొద్దు ఎడిటర్ అనండి...బడు వాడేవాడు బడుద్ధాయి. అంటూ పత్రికా భాష ఎలా ఉండాలో దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఫిబ్రవరి 16, 1985న ఈ లోకాన్ని వీడి వెళ్లిన నార్ల తెలుగు సాహిత్య, పత్రికా రంగాలలో చెరగని ముద్ర వేసి వెళ్లారు.
"ఎడిటరైన వాడు బిడియము చూపుచో ధాటి తగ్గు వృత్తి ధర్మమందు, కడుపుకూటి రాత కక్కుర్తి రాతరా''
"నిజము కప్పిపుచ్చి నీతిని విడనాడి స్వామి సేవ సేయు జర్నలిస్టు తార్చువాని కంటే తక్కువ వాడురా" అంటూ విలువలు వీడ వలదని హితవు పలికారు. ప్రస్తుత పరిస్థితులలో ఆయన చేసిన మార్గ నిర్దేశం నేటి జర్నలిస్టులకు నిజంగానే శిరోధార్యం.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఝార్ఖండ్ BJP నేత ఫూల్ జోషి సెక్స్ రాకెట్ కంట్రోవర్సీ
బీహార్ ఎన్నికలలో కలకలం రేపుతున్న BJP నేత ఫూల్ జోషి సెక్స్ రాకెట్ కంట్రోవర్సీ
జూన్ లో HAM పార్టీ నాయకుని అరెస్ట్ తో వెలుగులోకి వచి సెక్స్ రాకెట్
పట్నా / రాంచీ నవంబర్ 06:
భారతీయ జనతా పార్టీ (BJP) మహిళా నాయకురాలు ఫూల్ జోషి పేరుతో వెలుగుచూసిన హై ప్రొఫైల్ సెక్స్... Gorak poor మహిళా కానిస్టేబుల్ శిక్షణ కేంద్రంలో బాత్ రూమ్ ల దగ్గర సీసీ కెమెరాలు - ట్రైనీల నిరసన
గోరఖ్పూర్ (ఉత్తరప్రదేశ్), నవంబర్ 05:గోరఖ్పూర్ జిల్లాలోని 26వ బెటాలియన్ PAC (Provincial Armed Constabulary) మహిళా శిక్షణా కేంద్రంలో భారీ కలకలం రేగింది. సుమారు 600 మంది మహిళా ట్రైనీ సిపాయిలు ఒకే సారి బయటకు వచ్చి రోదిస్తూ, నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. బాత్రూమ్ దగ్గర కెమెరాలు అమర్చారనే ఆరోపణతో పాటు, వసతి... పొలస శ్రీ పౌలస్తేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పూజలు
జగిత్యాల, నవంబర్ 05 (ప్రజా మంటలు):కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని జగిత్యాల రూరల్ మండలం పోలాస గ్రామంలోని శ్రీ పౌలస్తేశ్వర స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధల మధ్య ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.
జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ స్వయంగా ఆలయానికి విచ్చేసి స్వామివారికి ప్రత్యేక అర్చనలు చేశారు. అనంతరం... లక్ష వర్తిక వెలుగు లతో దీపోత్సవం
సికింద్రాబాద్, నవంబర్ 05 ( ప్రజామంటలు) :
పద్మారావునగర్ లోని శ్రీ సాయి బాబా ఆలయంలో కార్తీక పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా జరిపారు. బుధవారం రాత్రి వేళ ఆలయ ఆవరణలో లక్ష వర్తిక దీపాలతో కార్తీక దీపోత్సవం నిర్వహించారు.వందలాది మంది హాజరై లక్ష వర్తిక దీపాలను వెలిగించారు. దీపాల వెలుగులో ఆలయం కొత్త శోభను సంతరించుకుంది.... 10లక్షల 25వేల రూపాయల LOC ప్రొసీడింగ్స్ అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
జగిత్యాల నవంబర్ 5 ( ప్రజా మంటలు) రూరల్ మండల అంతర్గం గ్రామానికి చెందిన పల్లపు సాత్విక్ హార్మోన్ డెఫిషియన్సీ తో బాధపడుతూ ఉండగా గ్రామ నాయకులు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ గారి దృష్టికి విషయాన్ని తీసుకురాగా స్పందించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం *2లక్షల 75* వేల
*ఈ... మార్షల్ ఆర్ట్స్ తో ఆత్మ రక్షణ,ఏకాగ్రత,ఆరోగ్యం పెంపొందుతాయి....ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
.జగిత్యాల నవంబర్ 5(ప్రజా మంటలు)
మార్షల్ ఆర్ట్స్ తో ఆత్మ రక్షణ,ఏకాగ్రత,ఆరోగ్యం పెంపొందుతాయి అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల పవన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో డిసెంబర్ 7న సెకండ్ స్టేట్ లెవెల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2025 పోస్టర్ ను జగిత్యాలలో పావని కంటి ఆసుపత్రి వద్ద పోస్టర్ ను... న్యూయార్క్ మేయర్ ఎన్నికాంలో రిపబ్లికన్లకు షాక్ - జోహార్ మందాని గెలుపు
న్యూయార్క్ నవంబర్ 05:
న్యూయార్క్ నగరంలో నిన్న, నవంబర్ 4న జరిగిన 2025-ఎలక్షన్లో యువ డెమోక్రాటిక్ సోషలిస్ట్ (34) ఘన విజయాన్ని సాధించి మేయర్గా ఎన్నికయ్యారు. మొట్టమొదటి ముస్లిం, దక్షిణాసియన్ మరియు సరికొత్త తరం నాయకుడిగా, ఈ విజయం రిపబ్లికన్లకు పెద్ద షాక్గా మారింది.
ట్రంప్ బెదిరింపులకు లొంగని న్యూయార్క్ పౌరులు, స్వేచ్చా ప్రియులు, మాందానిని... భారత్ సురక్ష సమితి అధ్వర్యంలో ఘనంగా గురునానక్ జయంతి వేడుకలు...
జగిత్యాల నవంబర్ 5 ( ప్రజా మంటలు)
గురునానక్ జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణంలోని తహసిల్ చేరస్తా వద్ద భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఐదు గంటలకు. గురునానక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు భారత్ సురక్ష సమితి నాయకులు....
ఈ సందర్భంగా ఏ సిఎస్ రాజు, సామాజిక వేత్త చిట్ల గంగాధర్... బెంగాల్ లో SIR భయం.. ఎనిమిది మంది ఆత్మహత్యలు: TMC ఆరోపణ
కోల్కతా, నవంబర్ 05:
పశ్చిమ బెంగాల్లో ఓటర్ జాబితా ప్రత్యేక పునర్విమర్శ (SIR) నేపథ్యంలో ఆందోళన పెరుగుతోంది. ఈ భయంతో ఇప్పటివరకు రాష్ట్రంలో ఎనిమిది మంది ఆత్మహత్యలు చేసుకున్నారని టీమ్సీ (TMC) ఆరోపించింది.
తాజాగా దక్షిణ 24 పరగణాల జిల్లాలోని భాంగర్ ప్రాంతానికి చెందిన సఫికుల్ గాజీ (57) అనే వ్యక్తి తన అత్తింటి వద్ద... “హర్యానా ఎన్నికల్లో లక్షల ఫేక్ ఓట్లు”: రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
నవంబర్ 05, న్యూఢిల్లీ (ప్రజా మంటలు):
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృత స్థాయిలో ఓటర్ల మోసం జరిగిందని కాంగ్రెస్ పార్టీ నేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. బ్రెజిల్ ఫోటోగ్రాఫర్ తీసిన ఒక మహిళా ఫోటోను వాడి, అదే చిత్రం 22 మంది ఓటర్లుగా ఎన్నికల జాబితాలో కనిపించిందని ఆయన వెల్లడించారు.
రాహుల్ గాంధీ... కడుపుతో ఉన్న కూతురిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన తల్లిదండ్రులు – ప్రేమ వివాహం నేపథ్యంగా ఉద్రిక్తత
జగిత్యాల నవంబర్ 05 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజరాంపల్లిలో తల్లిదండ్రులే కూతుర్ని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన సంఘటన కలకలం రేపింది.
ప్రియాంక తన తల్లిదండ్రులు, అక్క భర్త గుంజే కుమార్ మీద కిడ్నాప్ ప్రయత్నం మరియు మరణ బెదిరింపులపై ఫిర్యాదు చేసింది. తానూ తన భర్త రాకేష్ కూడా ప్రాణభయంతో ఉన్నామని,... ఆలూరు గ్రామ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఏర్పాటు కోసం జీవన్ రెడ్డి కి వినతి
ముదిరాజ్ వృత్తి కుటుంబాలకు న్యాయం చేయాలంటూ మాజీ మంత్రి కలెక్టర్ కు లేఖ
జగిత్యాల (రూరల్) నవంబర్ 05 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో రాయికల్ మండలం, ఆలూరు రెవెన్యూ గ్రామ పరిధిలో మత్స్య పారిశ్రామిక (ముదిరాజ్) సహకార సంఘం ఏర్పాటు కోసం మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డికి... 