తెలుగు పత్రికా రంగానికి మార్గ నిర్దేశకుడు నార్ల.
- ఫిబ్రవరి 16 - నార్ల వెంకటేశ్వరరావు వర్ధంతి.
( రామ కిష్టయ్య సంగన భట్ల - 9440595494 ).
నార్ల వెంకటేశ్వరరావు... పరిచయం అక్కర్లేని పేరు.
నిర్భయానికి, నిక్క చ్చితత్వానికి, నిబద్ధతకు మారు పేరు. వృత్తి నిబద్దతతో నిర్వహించారు. వృత్తి నిర్వహణ సామాజిక బాధ్యతగా భావించారు. పత్రికా రంగానికి మార్గదర్శకులు, జర్నలిస్టు లకు దిశానిర్దేశకులు. ఆయనొక విజ్ఞాన సర్వస్వం. అయన జీవితం సంస్కరణల మయం. రచన ఏది చేసినా, ప్రక్రియ ఎదైనా, ప్రజా చైతన్యమే ఆయన లక్ష్యం. లక్ష్య సిద్ది కోసం ఎన్ని అడ్డంకులు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ముందుకే సాగిన వైనం.
రచయితగా, నాటకకర్తగా, విమర్శ కుడిగా, అనువాదకుడిగా బహు ముఖ పాత్రలు పోషించిన ఆయన జీవిత పర్యంతం హేతుబద్ధమైన ఆలోచనల ద్వారా సామాజిక స్పృహ కల్పించే ప్రయత్నం చేశారు. ఆంగ్ల భాషలోనూ నిష్ణాతులైనా, తెలుగు ప్రజలకు తన రచనలు చేరువ కావాలనే తలంపుతో, తెలుగు పత్రికా రంగాన్ని కావాలనే ఎంచుకున్నారు.
మధ్య ప్రదేశ్ లోని జబల్పూర్లో డిసెంబర్ 1, 1908 జన్మించిన నార్ల, విద్యాభ్యాసం కృష్ణా జిల్లాలో జరిగిం ది. వెంకటేశ్వరరావు ఏప్రిల్ 3, 1958 నుండి ఏప్రిల్ 2, 1970 వరకు రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యునిగా పని చేశారు.
స్వరాజ్య, జన వాణి, ప్రజా మిత్ర పత్రికలో పని చేసి, ఆంధ్ర ప్రభ, చివరకు ఆంధ్ర జ్యోతి పత్రికలకు ఎడిటర్ గా విధులు నిర్వర్తించారు. విధి నిర్వహణలో ఎన్నడూ అయన రాజీ పడలేదు. ఆయన సంపాద కీయ రచనలు సూటిదనం, గడుసు దనం, వ్యంగ్యం, చమత్కారం, లోక జ్ఞత, సమయజ్ఞత కల గలిపి ఉండే వి. పండితునికి, పామరునికి తెలు గు భాష అర్థమయ్యే రీతిలో నార్ల సంపాదకీయాలు, రచనలు చేశారు.
''వాస్తవమ్ము నార్లవారి మాట'’ మకుటంతో ఆటవెలదులు రచించారు. ‘'నవయుగాల బాట నార్ల మాట'’ మకుటంతో 700కు పైగా సందేశాత్మక పద్యాలు రాశారు. 16 ఏకాంకికల సంపుటి వెలువరించారు. నార్ల సొంత గ్రంథాలయంలో 20,000 పుస్తకాలు ఉండేవట అంటే మాటలు కాదు.
సంపాదకుడు అనే మాటను అయన అంగీకరించ లేదు. ఆమోదించ లేదు. ఎడిటర్ అనే పదాన్నే వాడే వారు.
నార్ల... టంగుటూరి ప్రకాశం, నీలం సంజీవరెడ్డి, , కాసు బ్రహ్మానంద రెడ్డి, ఎన్.జి. రంగా ఎవరినీ వదల లేదు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ చాందసాన్ని విమర్శించక మాన లేదు. ఇందిరా గాంధి, ఆమె కుటుంబ వారసత్వ రాజకీయాల్ని ద్వేషించారు.
ఆయన వ్యాసాలను నిరక్షరాస్యులు గ్రామాల్లోని రచ్చబండల దగ్గర చదివి వినిపించుకునే వారంటే ఆయనలోని రచనా వ్యాసంగ శక్తి ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు.
ఆంధ్రప్రభ నుంచి వైదొలిగిన సందర్భంలో, నార్ల కోసం కొందరు ముఖ్యులు కలిసి ఆంధ్ర జ్యోతి పత్రిక ప్రారంభించారంటే ఆయన గొప్పతనం స్పష్టం అవుతున్నది. గోరాశాస్త్రి మాటల్లో చెప్పాలంటే 'కేవలం సత్వగుణ ప్రధానంగా, అచ్చ తెలుగులో చప్పచప్పగా ఉన్న పత్రికా రచనలో వాడినీ, వేడినీ సృష్టించి, తెలుగు నుడికారంలో ఎంత 'కారం' ఉందో తెలియజెప్పిన వాడు' నార్ల.
"యొక్కలతో తెలుగుభాష డొక్క పొడవొద్దు...ఎంత గొప్ప వాడైనా వస్తాడే కాని విచ్చేయడు...
సంపాదకుడు అనొద్దు ఎడిటర్ అనండి...బడు వాడేవాడు బడుద్ధాయి. అంటూ పత్రికా భాష ఎలా ఉండాలో దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఫిబ్రవరి 16, 1985న ఈ లోకాన్ని వీడి వెళ్లిన నార్ల తెలుగు సాహిత్య, పత్రికా రంగాలలో చెరగని ముద్ర వేసి వెళ్లారు.
"ఎడిటరైన వాడు బిడియము చూపుచో ధాటి తగ్గు వృత్తి ధర్మమందు, కడుపుకూటి రాత కక్కుర్తి రాతరా''
"నిజము కప్పిపుచ్చి నీతిని విడనాడి స్వామి సేవ సేయు జర్నలిస్టు తార్చువాని కంటే తక్కువ వాడురా" అంటూ విలువలు వీడ వలదని హితవు పలికారు. ప్రస్తుత పరిస్థితులలో ఆయన చేసిన మార్గ నిర్దేశం నేటి జర్నలిస్టులకు నిజంగానే శిరోధార్యం.
More News...
<%- node_title %>
<%- node_title %>
పోలీసుల నిర్బంధం నుంచి ఉద్యమకారులను విడిపించిన కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, ఏప్రిల్ 18 (ప్రజా మంటలు):
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం “చలో సెక్రటేరియట్”కు వెళ్లిన తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. 600 మందికి పైగా కార్యకర్తలను మెహదీపట్నం, నాంపల్లి, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు.
ఈ సమాచారం తెలుసుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మెహదీపట్నం పోలీస్ స్టేషన్కు... స్వయంకృత అపరాధమే మన దుఃఖాలకు మూలం నంబి వేణుగోపాల ఆచార్య
జగిత్యాల ఏప్రిల్ 17 (ప్రజా మంటలు) స్వయంకృత అపరాధమే మన దుఃఖాలకు మూలమని నంబి వేణుగోపాలఆచార్య కౌశిక అన్నారు .శుక్రవారం పోచమ్మ బస్తీలోని గీతా భవన్ లో సాయంత్రం హిందూ సమ్మేళన సమితి వారి ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న నంబి వేణుగోపాల ఆచార్య అనుగ్రహ భాషణం చేస్తూ మానవులు ప్రకృతిని ధ్వంసం... అన్నపూర్ణ మాత సేవ వారి అన్న ప్రసాద వితరణ లో పాల్గొన్న చైర్ పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్
జగిత్యాల ఏప్రిల్ 17(ప్రజా మంటలు)బీట్ చౌరస్తా లో నిర్వహించిన అమావాస్య అన్నపూర్ణ మాత సేవ ఆధ్వర్యములో ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ హాజరై భక్తులకు స్వయంగా వడ్డించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో సేవాభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
కార్యక్రమములో... ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి
జగిత్యాల ఏప్రిల్ 17(ప్రజా మంటలు)టీజీఈజెఏసి జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జిలతో నిరసన
తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయుల, కార్మిక , పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కమిటీ విస్తృతస్థాయి కార్యనిర్వాహక సమావేశం (తేది: 07-04-2026) లో తీసుకున్న తీర్మానాల మేరకు జెఏసి రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ మరియు సెక్రటరీ... సురభి గోషాలలో గో గ్రాసం పంపిణీ
జగిత్యాల రూరల్ ఏప్రిల్ 17 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రానికి సమీపంలోని తాటిపల్లి సురభి గోశాలలో గోవుల గ్రాసం గడ్డి, తవుడు, మేత కోసం ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. జగిత్యాల వాస్తవ్యులైన ఊటూరి అశోక్ కుమార్, తాటికొండ శ్రీనివాస్, బాసెట్టి లవ కుమార్, ప్రతినెల అమావాస్య రోజు ఒక్కొక్కరివద్ద 100 చొప్పున, వసూలు చేసి... ప్రత్యేక తెలంగాణ అస్తిత్వాల పరిరక్షణకు ‘తెలంగాణ అస్తిత్వ వేదిక’ ఆవిర్భావం
ఆవిర్భావ సభ వివరాలు:*
📅 తేదీ: ఏప్రిల్ 19, 2026 (ఆదివారం)* 🕙 సమయం: ఉదయం 10 గంటలకు* 📌 వేదిక: రవీంద్రభారతి
హైదరాబాద్, ఏప్రిల్ 17 (ప్రజా మంటలు):
తెలంగాణ భూమి కేవలం భౌగోళిక పరిమితి మాత్రమే కాకుండా వేల సంవత్సరాల సాంస్కృతిక, చారిత్రక, ఆధ్యాత్మిక అస్తిత్వాలకు ప్రతీకగా నిలిచిందని... మారోజు వీరన్న అనుచరుల మద్దతుతో జాగృతి పార్టీకి బలమైన ఊపు: కవిత
హైదరాబాద్, ఏప్రిల్ 17 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పడబోయే కొత్త రాజకీయ పార్టీకి మారోజు వీరన్న అనుచరులు, సీపీయూఎస్ఐ (CPUSI), దళిత బహుజన రాజ్యాధికార సంస్థ మద్దతు ప్రకటించాయి. జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను కలిసి సీపీయూఎస్ఐ కేంద్ర కమిటీ కార్యదర్శి కోదండం, రాష్ట్ర కార్యదర్శి వెంకన్న, దళిత... జాతీయ వాగ్దేవి పురస్కారం అందుకున్న మహేశ్వర శర్మ
రాయికల్ ఏప్రిల్ 16 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు కు చెందిన తెలుగు పండితులు చెరుకు మహేశ్వర శర్మ కు కందుకూరి వీరేశలింగం పంతులు స్మారక జాతీయ వాగ్దేవి పురస్కారాన్ని గురువారం ఆచార్య పద్మశ్రీ కొలకనూరి ఇనాక్ , జాతీయ తెలుగు సారస్వత పరిషత్ కార్యనిర్వహక... ఈ పుణ్య భూమిలో పుట్టడం మన పూర్వజన్మ సుకృతం_ శ్రీశ్రీశ్రీ విశ్వకతీర్థ స్వామీజీ
జగిత్యాల ఏప్రిల్ 16 (ప్రజా మంటలు)ఈ పుణ్య భూమిలో పుట్టడం మన పూర్వజన్మ సుకృతమని శ్రీ శ్రీ శ్రీ విశ్వక తీర్థ స్వామీజీ అన్నారు.ఈ భూమిపై పుట్టిన వారికి ఇద్దరు తల్లులు ఒకరు కన్నతల్లి ఆమెకు పుట్టిన వారిని పోషిస్తుంది మరొకరు భూమాత ఆమె భారత మాత పుట్టిన నుండి గిట్టిన తర్వాత... అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరం కార్యక్రమం
జగిత్యాల ఏప్రిల్ 16 ( ప్రజా మంటలు) ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుండి 20 వరకు వారం రోజులపాటు అగ్నిమాపక అమరవీరుల స్మారక వారోత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కేంద్రం ఆవరణలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సైదులు ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ
ఈ... కెసిఆర్ బహిరంగ సభ వేదిక నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఇన్చార్జి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
జగిత్యాల ఏప్రిల్ 16 ( ప్రజా మంటలు
ఈ నెల 20 తేదీన కెసిఆర్ బహిరంగ సభలో సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని మిని స్టేడియం లో నిర్వహించనున్న బహిరంగ సభకు స్టేజి నిర్మాణ పనులను జగిత్యాల జిల్లా ఇంఛార్జి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి , ధర్మపురి ఇంచార్జ్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు... ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను పకడ్బందీగా అమలుచేయాలి _జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
మేడిపల్లి ఏప్రిల్ 16 ( ప్రజా మంటలు)అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలి
జిల్లాలో నిర్వహించనున్న ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక మండల స్థాయి సమావేశాలను అత్యంత పకడ్బందీగా, ప్రజా పాలన ప్రతిబింబించేలా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశాలు చారిత్రాత్మకంగా... 