వాయుసేన అధికారి నుండి లక్షల మందికి లైఫ్ కోచ్ గా డా.యలమంచి రామకృష్ణ.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
నల్లగొండ 25 జూలై (ప్రజా మంటలు) :
జీవితాన్ని ఒక లక్ష్యంగా మలచుకుని, అందరిలో స్ఫూర్తి నింపడం కొద్దిమందికే సాధ్యమవుతుంది. అలాంటి అరుదైన వ్యక్తిత్వం కలిగినవారు డాక్టర్ యలమంచి రామకృష్ణ.
- ఆయన ప్రస్థానాన్ని పరిశీలిస్తే ఆయన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నల్లగొండ జిల్లా బీబీనగర్ మండలం ఒక మారుమూల గ్రామం వెనికిరాలలో జన్మించి ఎంతో మందికి మార్గం చూపిన జీవతగాథ.
- ఆయన భారత వాయుసేనలో 23 సంవత్సరాలు సేవ చేసిన ఈ అధికారి, పదవీ విరమణ తరువాత తన జీవితాన్ని వ్యక్తిత్వ వికాసానికి మరియు విద్యాభివృద్ధికి అంకితం చేశారు.
వాయుసేనలో నిస్వార్థ సేవ :
- రామకృష్ణ 1994 నుండి 2017 వరకు భారత వాయుసేనలో వారెంట్ ఆఫీసర్గా వాయుసేన ప్రధాన కార్యాలయం, న్యూఢిల్లీలో బాధ్యతలు నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న 130 కి పైగా ఎయిర్ ఫోర్స్ పాఠశాలలు మరియు 98 కేంద్రీయ విద్యాలయాల విద్యా పరిపాలనాధికారిగా సమర్థవంతంగా తన భాద్యతలను నిర్వర్తించారు.
- సుమారు 52,000 మంది విద్యార్థులకు, 5000 మంది ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం చేసి, విద్యా రంగంలో కొత్త శకానికి నాంది పలికారు.

పదవీ విరమణ తర్వాత విద్యా రంగంలో వెలుగులు నింపే ప్రయత్నం :
- 2017లో వాయుసేన నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత, డాక్టర్ రామకృష్ణ సామాన్య ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు.
- హైదరాబాద్లోని నాచారంలో నివసిస్తూ, ప్రస్తుతం రెండు శిక్షణ సంస్థలను నెలకొల్పి వ్యవస్థాపకుడిగా, నిర్దేశకుడిగా వ్యవహరిస్తున్నారు.
- దేశవ్యాప్తంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులకు లైఫ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ శిక్షణలతో 150000 లక్షల మందికి పైగా జీవితాల్లో మార్పు తీసుకువచ్చారు.
అధ్యయనం, రచన, ప్రేరణ: త్రివేణి సంగమం
- ఇప్పటివరకు 5 పుస్తకాలను రచించిన రామకృష్ణ, వ్యక్తిత్వ వికాసంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
- ఆయన వ్యాసాలు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ మ్యాగజైన్లలో ప్రచురితమై, పలు అవార్డులను అందుకున్నారు.

శిక్షణా ప్రస్థానానికి ప్రతిబింబం :
- డాక్టర్ రామకృష్ణ అనేక ప్రఖ్యాత సంస్థల్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు.
- ఐఐటీ గాంధీనగర్, లారస్ ల్యాబ్స్, ఎంఆర్ఎఫ్, సాండ్విక్, హెరిటేజ్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, నిర్మాణ జాతీయ అకాడమీ, లోయోలా అకాడమీ, TSRTC, వ్యవసాయ శాఖ, ఎయిర్ ఫోర్స్ పాఠశాలలు వంటి పలు సంస్థల్లో కార్పొరేట్ శిక్షణలు అందిస్తూ, జీవిత నైపుణ్యాల పరంగా ఎంతో మందికి మార్గదర్శకుడిగా నిలిచారు.
- కొన్ని జాతీయ, అంతర్జాతీయ ప్రచురణ సంస్థలతో భాగస్వామ్యంగా, దేశవ్యాప్తంగా ఉన్న 1,00,000 మందికి పైగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు.
- దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలల్లో శిక్షణలు అందిస్తూ, వేలాది విద్యార్థులలో ఆత్మవిశ్వాసం నింపుతూ వారి భవిష్యత్తును ప్రభావితం చేస్తున్నారు.
ప్రామాణికతలు :
డాక్టర్ రామకృష్ణ నాబెట్ నుండి సర్టిఫైడ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్గా, అమెరికా సంస్థల ద్వారా ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ ట్రైనర్ మరియు ఎగ్జిక్యూటివ్ లైఫ్ కోచ్గా గుర్తింపు పొందారు.
సమాజ సేవ :
- వృత్తిపరమైన విజయాలతో పాటు, డాక్టర్ రామకృష్ణ సామాజ సేవలోనూ ముందున్నారు.
- ఆర్థికంగా బలహీన వర్గాల జీవితాన్ని మెరుగుపరిచేందుకు ఆయన పలు కార్యక్రమాలు చేపట్టారు.
- నిత్యావసర వస్తువుల విరాళం, ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు విద్యా సహాయం, ఆహార పంపిణీ వంటి కార్యక్రమాల ద్వారా ఆయన అనేక మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
అవార్డులు,పురస్కారాలు :
- హానరరీ డాక్టరేట్ (డాక్టర్ ఆఫ్ హ్యూమానిటీ), 2019
- సేవా రత్న అవార్డు – 2019
- ఇండియన్ గ్లోరీ అవార్డు, 2019
- ఉగాది నంది అవార్డు (2023)
- ప్రైడ్ ఆఫ్ ఇండియా అవార్డు (2025)
- వాయుసేన నుండి లాంగ్ సర్వీస్ మెడల్, సైన్య సేవా మెడల్.

మాటల ద్వారా మార్పు :
- " మాటల్లో మార్పు ఉంది. మార్పుతో ఎదుగుదల ఉంది" అనే నినాదంతో, ఆయన ప్రసంగాలు విన్న ప్రతివారు ఒక మెట్టు పైకి ఎక్కుతున్నారు.
- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఒడిషా, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఆయన వాణి మార్గదర్శకంగా నిలుస్తోంది.
వ్యక్తిగత వివరాలు :
- తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలపై డాక్టర్ రామకృష్ణకు పూర్తి పట్టు ఉంది.
- హైదరాబాద్లో నివసిస్తూ దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్నారు.
- ఎప్పటికీ నేర్చుకుంటూ, నేర్పిస్తూ, మార్పుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు.
సంక్షిప్తంగా :
- డాక్టర్ యెలమంచి రామకృష్ణ — ఒక సైనికుడిగా ప్రారంభమై, లక్షల మందికి జీవిత మార్గదర్శిగా మారిన శిక్షకుడు, రచయిత, ప్రేరణాత్మక నిర్దేశకుడు.
యూట్యూబ్ ఛానల్ – Redefine Life with Dr RK
ఫోన్ నంబర్: 9958361110
ఇమెయిల్: drramakrishna02@gmail.com.

More News...
<%- node_title %>
<%- node_title %>
ప్రైవేట్ కాలేజీలకు సీఎం రేవంత్ హెచ్చరిక – “తమాషాలు చేస్తే తాటతీస్తా” అని స్పష్టం
ప్రైవేట్ విద్యాసంస్థల ఆడంబరాలకు సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర హెచ్చరిక – విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడితే చర్యలు తప్పవని స్పష్టం
హైదరాబాద్, నవంబర్ 7 (ప్రజా మంటలు):
ప్రైవేట్ కాలేజీల నిర్వాహకుల ప్రవర్తనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.“తమాషాలు చేస్తే తాటతీస్తా” అంటూ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. కాలేజీలు... ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఆందోళన
– రాష్ట్రవ్యాప్తంగా సంతకాల సేకరణ ప్రారంభం
కూటమి ప్రభుత్వ నిర్ణయంపై వైఎస్సార్సీపీ తీవ్ర అభ్యంతరం – నవంబర్ 12న 175 నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు
తాడేపల్లి, నవంబర్ 7 (ప్రజా మంటలు):
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకించింది.ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సంతకాల సేకరణ... సామూహిక వందేమాతరం గీతాలాపన లో పాల్గొన్న..... జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత
జగిత్యాల నవంబర్ 7 ( ప్రజా మంటలు)సామూహిక వందేమాతర గీతాలపన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత తెలిపారు.
శుక్రవారం వందేమాతరం గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సమీకృత జిల్లా కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్... మూలరాంపూర్ సదర్ మట్ ప్రాజెక్టులో విషాదం – చేపలు పడుతూ యువకుడు మృతి
నిర్మల్ జిల్లా పోన్కల్ గ్రామానికి చెందిన 18 ఏళ్ల సిద్ధార్థ దుర్మరణం – ఇబ్రహీంపట్నం పోలీసులు దర్యాప్తు ప్రారంభం
ఇబ్రహీంపట్నం, నవంబర్ 7 (ప్రజా మంటలు – దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని మూలరాంపూర్ గ్రామ శివారులో విషాదకర సంఘటన చోటుచేసుకుంది.సదర్ మట్ ప్రాజెక్టు వద్ద చేపలు పడుతూ ఒక యువకుడు ప్రమాదవశాత్తు... తాసిల్దార్ కార్యాలయంలో జాతీయ గీతం వందేమాతరం 150 వ వార్షికోత్సవం.
ఇబ్రహీంపట్నం నవంబర్ 7( ప్రజా మంటలు దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయంలో జాతీయ గీతం వందేమాతరం 150 వ వార్షికోత్సవం సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించారు, ఈ కార్యక్రమంలో తాసిల్దార్ వరప్రసాద్, డిప్యూటీ తాసిల్దార్ ప్రసాద్, ఆర్. ఐ. లు రేవంత్ రెడ్డి, రమేష్, జి పి ఓ లు, పెట్రోల్ పంపు భూ కబ్జా విషయం మాట్లాడడమే నేరమా? నా రాజీనామాకు అసలు కారణం ఇదే బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి
జగిత్యాల నవంబర్ 7 (ప్రజా మంటలు)ఎమ్మెల్యే తెర వెనుక రాజకీయం చేస్తున్నాడు
కిబాల అందరి సమక్షంలో ట్రాన్స్లేట్ చేయించాలి
మున్సిపల్ భూమి రక్షణకై జేఏసీ ఏర్పాటు చేయాలి.
- బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి
జగిత్యాల జిల్లా కేంద్రంలోని బిజెపి పార్టీ ఆఫీసులో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి ప్రెస్... యువతే దేశ భవిష్యత్తు – చట్టాన్ని గౌరవించే పౌరులుగా ఎదగాలి: జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్
జేఎన్టీయూ కొండగట్టు ఇంజనీరింగ్ కళాశాల ఫ్రెషర్స్ డేలో ఎస్పీ అశోక్ కుమార్ సందేశం – ర్యాగింగ్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండమన్న పిలుపు
జగిత్యాల, నవంబర్ 7 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కొండగట్టు జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని విద్యార్థులు ఉత్సాహంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీ అశోక్... జగిత్యాలలో “వందేమాతరం” సామూహిక గానం :: దేశభక్తి స్ఫూర్తికి నిదర్శనం : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
వందేమాతర గేయానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో జగిత్యాల పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం
జగిత్యాల (రూరల్ ) నవంబర్ 7 (ప్రజా మంటలు):
అఖండ భారతావనికి స్వాతంత్ర్య కాంక్షను కలిగించిన జాతీయ గేయం “వందేమాతరం” నేటితో 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సామూహిక గేయ ఆలాపన కార్యక్రమం ఘనంగా... క్రికెటర్ ధవన్, రైనా ఆస్తులు ఈడీ జప్తు :: రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్
న్యూ ఢిల్లీ నవంబర్ 07:
అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ సైట్ 1xBet కేసులో మనీ లాండరింగ్ విచారణలో భాగంగా మాజీ క్రికెటర్లు శిఖర్ ధవన్, సురేశ్ రైనాల ఆస్తులను అమలు దళం (ED) గురువారం జప్తు చేసింది.మొత్తం రూ. 11.14 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ ఆదేశాలు జారీ చేసింది.
ఈడీ... బీహార్ తొలి దశ ఎన్నికల్లో 64.66% పోలింగ్ — గత 25 ఏళ్లలో రికార్డు స్థాయి ఓటింగ్
పాట్నా, నవంబర్ 6 (ప్రజామంటలు):
2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో 18 జిల్లాల్లోని 121 స్థానాలకు ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుండే ఓటర్లు ఉత్సాహంగా ఉన్నారు, యువత, మహిళలు, వృద్ధులు మరియు వలస కార్మికులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో ఉత్సాహభరితంగా ఓటింగ్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా... జగిత్యాల పెట్రోల్ బంకు భూమి ఆక్రమణపై ముఖ్యమంత్రి కార్యాలయంలో పిర్యాదు – మాజీ కౌన్సిలర్ జయశ్రీ
జగిత్యాల, నవంబర్ 06 (ప్రజామంటలు):జగిత్యాల పట్టణంలో ప్రభుత్వ భూములపై జరుగుతున్న అక్రమ ఆక్రమణలపై మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ ముఖ్యమంత్రి కార్యాలయానికి పిర్యాదు చేశారు.
జగిత్యాల కొత్త బస్టాండ్ కూడలిలో ఉన్న పెట్రోల్ బంక్ (సర్వే నంబర్ 138) పరిధిలోని 20 గుంటల స్థలం అక్రమంగా ఆక్రమించబడిందని ఆమె పిర్యాదులో పేర్కొన్నారు. మున్సిపాలిటీ నిర్లక్ష్య... కొల్లూరు 2BHK జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం:: పాల్గొన్న మంత్రి ఉత్తం కుమార్, అడువాల జ్యోతి లక్ష్మణ్
కొల్లూరు కాలనీలో కాంగ్రెస్ ఆత్మీయ సమ్మేళనం – ఉత్తం కుమార్ రెడ్డి, నిర్మల జగ్గారెడ్డి
హైదరాబాద్ నవంబర్ 06 (ప్రజామంటలు):
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. ఈ క్రమంలో కొల్లూరు 2-BHK కాలనీ ఫేజ్-2 లో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల... 