ఇక కరోనా కథ కంచికి చేరినట్టేనా...?
ఎండమిక్ దశకు చేరుకున్నట్లు నిపుణుల అభిప్రాయం
* ప్రస్తుతం ఒక్కో దేశంలో ఒక్కో వేరియంట్
*గతంలో మాదిరిగా గ్లోబల్ గా ఒకే వేరియంట్ విస్తరించని వైనం
సికింద్రాబాద్ మే25 (ప్రజామంటలు)::
గత ఐదు ఏండ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించి, లక్షలాది మంది ప్రాణాలను హరించిన కరోనా భూతం ఇక అంతిమ దశకు చేరుకుందని వైద్య నిపుణులు భావిస్తున్నారు. 2019 లో ఆల్ఫా వేరియంట్ తో ప్రపంచానికి భయం రుచి చూపించిన కోవిడ్ వైరస్ 2025 వరకు ఎన్నో వేరియంట్ లతో ఆయా దేశాల్లో వ్యాప్తి చెందుతునే ఉంది. ప్రస్తుతం జేఎన్ 1 వేరియంట్ చాలా తక్కువ వ్యాప్తిలో ఉందని, బహుశా గ్లోబల్ గా ఇదే కోవిడ్ వేరియంట్ చివరి దశ అవుతుందని గాంధీ ఆసుపత్రి క్రిటికల్ కేర్ మెడిసన్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ కిరన్ మాదాల అభిప్రాయ పడ్డారు. ఆయన ఆదివారం వెలుగుతో మాట్లాడుతూ...గత ఐదేండ్లలో కోవిడ్ మొదట్లో పాండమిక్ దశలో ప్రపంచ వ్యాప్తంగా ఒకే వేరియంట్ తీవ్ర స్థాయిలో వ్యాప్తిస్తూ, కోట్లాది మంది ఆరోగ్యాలపై ప్రభావం చూపిందన్నారు. ఆ తర్వాత వైరస్ ప్రభావం సగం వరకు తగ్గి, కొన్ని దేశాలకే పరిమితమవుతూ, దాని ప్రభావం మద్యస్థ స్థాయి (ఎపిడమిక్) కి పడిపోయిందన్నారు. ఇప్పడు ప్రపంచంలోని ఒక దేశంలో వెలుగు చూసిన వేరియంట్ మరో దేశంలో కనిపించడం లేదన్నారు. దీనిని బట్టి కరోనా ఎండమిక్ దశకు చేరుకుందని భావిస్తున్నామన్నారు. ఏదేని వైరస్ వ్యాప్తికి సాధారణంగా మూడు దశలు 1. పాండమిక్, 2. ఎపిడమిక్,3.ఎండమిక్ దశలు ఉంటాయన్నారు.
ప్రస్తుతం సింగపూర్ దేశంలో వెలుగు చూసిన ఎన్బీ1.8.1 వేరియంట్ మరే దేశంలో లేదని, మనదేశంలో ప్రస్తుతం ఉన్న ఎక్స్ ఎఫ్ జీ వేరియంట్ మరే దేశంలో లేదన్నారు. దీనిని బట్టి చూస్తే కరోనా వైరస్ బాగా బలహీనపడిపోయి, ఆయా దేశాలు, ప్రాంతాలలోని ప్రజల ఇమ్యూనిటీ పవర్ కు అనుగుణంగా అక్కడి వరకే పరిమితమవుతుందనే విషయం అర్థం అవుతుందన్నారు. ఒకవేళ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్నట్లయితే ఒకే మాదిరి వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా పాకేదన్నారు. ప్రతి వైరస్ కు ముగింపు దశలో ఎండమిక్ దశ ఉంటుందని, ప్రస్తుతం వేరియంట్ల వ్యాప్తి, వాటి తక్కువ తీవ్రతను లెక్కలోకి తీసుకుంటే ఇక కరోనా ముగింపు దశకు వచ్చిందని భావించవచ్చాన్నారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోదనలు చేస్తుందని, త్వరలో కరోన ఎండమిక్ పై ప్రకటన రావచ్చని పేర్కొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గల్లీకి అడ్డంగా రాళ్లు... తీయండి సార్లు.

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం

శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ హుండీ లెక్కింపు

విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలి బీర్పూర్ మండలం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

హెచ్ టి సర్వీసుల మంజూరుకు సింగిల్ విండో వ్యవస్థ

ఎస్ కె ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల 60 వసంతాల ఉత్సవానికి ముఖ్యమంత్రి ఆహ్వానించిన ఎమ్మెల్యే సంజయ్ ,ఎమ్మెల్సీ రమణ
.jpg)
రాయపట్నం గ్రామంలో గంజాయి పట్టివేత
.jpeg)
ఎర్ర పోచమ్మ దేవాలయంలో నాగుల పంచమి ప్రత్యేక పూజలు

మైనర్ బాలికపై అత్యాచారం కేసులలో నిందితునికి 10 సంవత్సరాల జైలు శిక్ష

ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం

విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ విద్యాబోధన అందించాలి

లబ్ధిదారుల గ్రామలకు వెళ్లి కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్
