బాపూఘాట్ అభివృద్ధి, క్రైమ్–డ్రగ్స్ నియంత్రణపై ప్రభుత్వ నిర్లక్ష్యం -కవిత విమర్శ
కార్వాన్ నియోజకవర్గంలో జాగృతి జనం బాట
హైదరాబాద్ డిసెంబర్ 13 (ప్రజా మంటలు):
జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ జిల్లాలో నాలుగో రోజు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు. శనివారం కార్వాన్ నియోజకవర్గ పరిధిలోని బాపూఘాట్ను సందర్శించి, మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం బాపూఘాట్ నుంచి లంగర్ హౌస్ దర్గాకు ఆటోలో ప్రయాణించి దర్గా వద్ద చాదర్ సమర్పించారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బాపూఘాట్ ప్రాంతం డ్రగ్స్, అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారిందని, దీనిపై ప్రభుత్వం, పోలీసులు వెంటనే దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తామని గతంలో ఇచ్చిన హామీలు ఇప్పటివరకు నెరవేరలేదని గుర్తు చేశారు. కనీసం ఈ ప్రభుత్వమైనా బాపూఘాట్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీ ఏది?
ఫ్రీ బస్ పథకం అమలులోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి హామీ ఇచ్చిన రూ.12 వేల ఆర్థిక సహాయం వెంటనే అందించాలని, ఆటో డ్రైవర్ల కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నారు. నగరంలో ఆటోలు కీలకమని, కానీ ఆటో స్టాండ్లు లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.
హైదరాబాద్లో నీటి సమస్య, డ్రైనేజీ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, కనీస సౌకర్యాలు లేకుండా గ్లోబల్ సిటీ ఎలా అవుతుందని ప్రశ్నించారు. మహిళలకు ఇచ్చిన రూ.2,500 హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై దురాగతాలు, హత్యలు పెరిగాయని విమర్శించారు. క్రైమ్, గంజాయి, డ్రగ్స్ సమస్యలు నియంత్రించకపోతే ప్రభుత్వం ఉన్నా లేనట్లేనని వ్యాఖ్యానించారు.
జియాగూడ మేకల మండి
జియాగుడ మేకల మండిని సందర్శించిన కవిత, అక్కడ రోడ్లపై మేకల విక్రయంతో ట్రాఫిక్కు తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని తెలిపారు. 100 ఫీట్ల రోడ్డును తవ్వి వదిలేయడంతో కనీస సౌకర్యాలు లేకుండా పోయాయని, న్యాయమూర్తులు, న్యాయవాదులు వెళ్లే రోడ్లకే ఈ పరిస్థితి ఉంటే పేద ప్రాంతాల పరిస్థితి అర్థమవుతుందని అన్నారు.
మాంసాహారం మన సంస్కృతిలో భాగమని, అనేక కులాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయని చెప్పారు. జియాగుడ ప్రాంతంలో మోడ్రన్ స్లాటర్ హౌస్లు తప్పనిసరిగా నిర్మించాల్సిన అవసరం ఉందని, ఇందుకు రూ.56 కోట్లు సాంక్షన్ అయ్యాయని పేర్కొన్నారు. వానాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని, స్లాటర్ హౌస్లు నిర్మిస్తే వ్యాపారం క్రమబద్ధమవుతుందని తెలిపారు.
మూసీ నది సుందరీకరణకన్నా ముందు మౌలిక వసతులు
మూసీ రివర్ ఫ్రంట్ బ్యూటిఫికేషన్ కోసం ప్రపంచ బ్యాంక్ నిధులు తీసుకొస్తున్న ప్రభుత్వం, ముందుగా మోడ్రన్ స్లాటర్ హౌస్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం జియాగుడ గోశాలను సందర్శించి గోవులకు ఆహారం అందజేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని ఆయన నివాసం లో కలిసిన నూతనంగా ఎన్నికైన తపస్ రాష్ట్ర అధ్యక్షులు.
జగిత్యాల జనవరి 15 (ప్రజా మంటలు)తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ రాష్ట్ర అధ్యక్షుడిగా వొడ్నాల రాజశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయిన సందర్భంలో జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని వారి నివాసం లో మర్యాద పూర్వకంగా కలిసిన వోడ్నా ల రాజశేఖర్ .ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి శాలువా తో సత్కరించారు జగిత్యాల... ధనుర్మాస కొఠారి ఉత్సవాలలో భాగంగా ఘనంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రథోత్సవము
నిజామాబాద్ జనవరి 15 (ప్రజా మంటలు) నిజామాబాద్ లోని బ్రహ్మపురిలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ రథోత్సవం గురువారం మధ్యాహ్నం నిర్వహించారు. .ప్రతి ఏట సంక్రాంతి పర్వదినం నాడు స్వామివారి రథోత్సవం నిర్వహిస్తారు . రథము చక్రం గుడి నుండి బయలుదేరి గాజులపేట, పెద్ద బజారు, మీదుగా ఆలయం చేరుకుంది .... జగిత్యాల కురుమ సంఘం ఆధ్వర్యంలో బీరయ్య, అక్క మహంకాళికి బోనాల సమర్పణ
జగిత్యాల జనవరి 15 (ప్రజా మంటలు) జగిత్యాల కురుమ సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా బీరయ్య ,అక్క మహంకాళి మాతకు కుల బాంధవులు గురువారం బోనాల సమర్పించారు .కొత్తగా వచ్చిన ధాన్యంతో స్వామివారికి బోనాలను నివేదించారు.
పిల్లాపాపలతో పాటు పశుసంపద ,గొర్రెలు, మేకలు,పాడిపంటలతో చల్లంగా ఉండాలని మొక్కుకున్నారు .ఒగ్గు కళాకారుల డోలు చప్పులతో ఆలయానికి... తెలంగాణ ప్రభుత్వం–భారత ఆర్మీ మధ్య సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారం: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, జనవరి 15 (ప్రజా మంటలు):
తెలంగాణ ప్రభుత్వం, భారత ఆర్మీకి మధ్య ఉన్న వివిధ సమస్యలు నిరంతర చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పెండింగ్లో ఉన్న భూ సమస్యలు, ఇతర పరిపాలనా అంశాల సత్వర పరిష్కారానికి ఆర్మీ తరఫున ప్రత్యేక అధికారులను నియమించాలని ఆయన సూచించారు.
హైదరాబాద్... “ఒక్క క్లిక్… మీ కష్టార్జీతం మాయం!”
సికింద్రాబాద్, జనవరి 15 (ప్రజా మంటలు):
వాట్సాప్ గ్రూపులలో ఫోన్ పే పొంగల్ గిఫ్ట్ “5000 రూపాయలు నిజంగా వచ్చాయి” అనే ఆశ చూపించే తప్పుడు సందేశాలతో పాటు లింకులు పంపిస్తూ సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజల పొదుపును దోచుకుంటున్నారని స్కై ఫౌండేషన్ ప్రెసిడెంట్ & ఫౌండర్ డాక్టర్ వై. సంజీవ కుమార్ అన్నారు. డబ్బులు... మకర సంక్రాంతి వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్, జనవరి 15 (ప్రజా మంటలు):
మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం ఉదయం కరీంనగర్ నగరంలోని కోతిరాంపూర్ ప్రాంతంలో గల గిద్దె పెరుమాండ్ల దేవస్థానాన్ని సందర్శించారు.
ఉదయం 8:30 గంటలకు దేవస్థానానికి చేరుకున్న మంత్రి స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.... మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు: బీసీలకు 3 నగరాలు, 38 పురపాలికలు
హైదరాబాద్, జనవరి 15 (ప్రజా మంటలు):
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ దిశగా కీలక అడుగు పడింది. రాష్ట్ర పురపాలక శాఖ 10 నగరపాలక సంస్థలు, 121 పురపాలక సంఘాలకు సంబంధించి మేయర్లు, ఛైర్పర్సన్ల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా రిజర్వేషన్ల అమలులో పాటించాల్సిన మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది.... ధర్మపురిలో కాంగ్రెస్లో చేరికలు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సమక్షంలో బీఆర్ఎస్ నేతల పార్టీలో చేరిక
ధర్మపురి, జనవరి 15 (ప్రజా మంటలు):
ధర్మపురి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ధర్మపురి పట్టణ మున్సిపాలిటీ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్నతో పాటు మాజీ కౌన్సిలర్లు మయూరి వేణు, యూనుస్, సాంబు, స్తంభంకాడి రమేష్ సహా బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు మంత్రి... ఫిరాయింపు కేసుల్లో కీలక మలుపు: పోచారం, కాలే యాదయ్యకు స్పీకర్ క్లీన్ చిట్
హైదరాబాద్, జనవరి 15 (ప్రజా మంటలు):
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యలపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం తుది తీర్పు వెలువరించారు.
ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్... ‘జన నాయగన్’ కు ఎదురుదెబ్బ: నిర్మాత పిటిషన్ను స్వీకరించని సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, జనవరి 15 (ప్రజా మంటలు):
విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘జన నాయగన్’ సినిమా సర్టిఫికేషన్ అంశానికి సంబంధించి మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన స్టే ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది.
ఈ సినిమా నిర్మాతలు తమపై ఆర్థికంగా తీవ్ర ప్రభావం పడిందని, “తాము పూర్తిగా నష్టపోయాం... సంక్రాంతి సెలవుల్లో కర్ణాటక రాష్ట్ర పర్యటన చేసిన విద్యార్థులు
మెట్టుపల్లి, జనవరి 15 (ప్రజా మంటలు – దగ్గుల అశోక్)
సంక్రాంతి సెలవుల సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్లుల్ల విద్యార్థులు విద్యా, వైజ్ఞానిక, విహార యాత్రలో భాగంగా ఈ నెల 10 నుంచి ఆరు రోజుల పాటు కర్ణాటక రాష్ట్ర పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ చారిత్రక, సాంస్కృతిక వారసత్వ... జగిత్యాల శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఘనంగా శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణ వేడుకలు
జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత మధన వేణుగోపాలస్వామి ఆలయంలో బుధవారం సాయంత్రం అంగరంగ వైభవంగా శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణ వేడుకలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రత్యేక వేదికను అలంకరింపజేసి ఉత్సవ మూర్తులను వేదికపై ఉంచి కళ్యాణాన్ని... 