బాపూఘాట్ అభివృద్ధి, క్రైమ్–డ్రగ్స్ నియంత్రణపై ప్రభుత్వ నిర్లక్ష్యం -కవిత విమర్శ
కార్వాన్ నియోజకవర్గంలో జాగృతి జనం బాట
హైదరాబాద్ డిసెంబర్ 13 (ప్రజా మంటలు):
జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ జిల్లాలో నాలుగో రోజు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు. శనివారం కార్వాన్ నియోజకవర్గ పరిధిలోని బాపూఘాట్ను సందర్శించి, మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం బాపూఘాట్ నుంచి లంగర్ హౌస్ దర్గాకు ఆటోలో ప్రయాణించి దర్గా వద్ద చాదర్ సమర్పించారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బాపూఘాట్ ప్రాంతం డ్రగ్స్, అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారిందని, దీనిపై ప్రభుత్వం, పోలీసులు వెంటనే దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తామని గతంలో ఇచ్చిన హామీలు ఇప్పటివరకు నెరవేరలేదని గుర్తు చేశారు. కనీసం ఈ ప్రభుత్వమైనా బాపూఘాట్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీ ఏది?
ఫ్రీ బస్ పథకం అమలులోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి హామీ ఇచ్చిన రూ.12 వేల ఆర్థిక సహాయం వెంటనే అందించాలని, ఆటో డ్రైవర్ల కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నారు. నగరంలో ఆటోలు కీలకమని, కానీ ఆటో స్టాండ్లు లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.
హైదరాబాద్లో నీటి సమస్య, డ్రైనేజీ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, కనీస సౌకర్యాలు లేకుండా గ్లోబల్ సిటీ ఎలా అవుతుందని ప్రశ్నించారు. మహిళలకు ఇచ్చిన రూ.2,500 హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై దురాగతాలు, హత్యలు పెరిగాయని విమర్శించారు. క్రైమ్, గంజాయి, డ్రగ్స్ సమస్యలు నియంత్రించకపోతే ప్రభుత్వం ఉన్నా లేనట్లేనని వ్యాఖ్యానించారు.
జియాగూడ మేకల మండి
జియాగుడ మేకల మండిని సందర్శించిన కవిత, అక్కడ రోడ్లపై మేకల విక్రయంతో ట్రాఫిక్కు తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని తెలిపారు. 100 ఫీట్ల రోడ్డును తవ్వి వదిలేయడంతో కనీస సౌకర్యాలు లేకుండా పోయాయని, న్యాయమూర్తులు, న్యాయవాదులు వెళ్లే రోడ్లకే ఈ పరిస్థితి ఉంటే పేద ప్రాంతాల పరిస్థితి అర్థమవుతుందని అన్నారు.
మాంసాహారం మన సంస్కృతిలో భాగమని, అనేక కులాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయని చెప్పారు. జియాగుడ ప్రాంతంలో మోడ్రన్ స్లాటర్ హౌస్లు తప్పనిసరిగా నిర్మించాల్సిన అవసరం ఉందని, ఇందుకు రూ.56 కోట్లు సాంక్షన్ అయ్యాయని పేర్కొన్నారు. వానాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని, స్లాటర్ హౌస్లు నిర్మిస్తే వ్యాపారం క్రమబద్ధమవుతుందని తెలిపారు.
మూసీ నది సుందరీకరణకన్నా ముందు మౌలిక వసతులు
మూసీ రివర్ ఫ్రంట్ బ్యూటిఫికేషన్ కోసం ప్రపంచ బ్యాంక్ నిధులు తీసుకొస్తున్న ప్రభుత్వం, ముందుగా మోడ్రన్ స్లాటర్ హౌస్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం జియాగుడ గోశాలను సందర్శించి గోవులకు ఆహారం అందజేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి నిలిచిపోయింది: జగిత్యాలలో బీఆర్ఎస్ నేతల తీవ్ర విమర్శలు
జగిత్యాల (రూరల్) డిసెంబర్ 13 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్,మాజీ మంత్రి రాజేశం గౌడ్జి,తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ పాల్గొన్నారు. ఈ... నన్ను ఆదరించి గెలిపిస్తే.... గ్రామ అభివృద్ధి చేస్తా :
గొల్లపల్లి డిసెంబర్ 13 (ప్రజా మంటలు,అంకం భూమయ్య):
గొల్లపల్లి మండల గ్రామ సర్పంచ్గా తనను గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని సర్పంచ్ అభ్యర్థి, బీసీ బిడ్డ ఆవుల జమున సత్యం యాదవ్ ప్రకటించారు.శనివారం గ్రామంలో ఆమె ఇంటింటా ప్రచారం నిర్వహించి,ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని ప్రచారానికి వెళ్ళినప్పుడు గ్రామ ప్రజలందరూ సానుకూలంగా స్పందిస్తున్నారని,అధిక మెజారిటీతో... బాపూఘాట్ అభివృద్ధి, క్రైమ్–డ్రగ్స్ నియంత్రణపై ప్రభుత్వ నిర్లక్ష్యం -కవిత విమర్శ
హైదరాబాద్ డిసెంబర్ 13 (ప్రజా మంటలు):
జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ జిల్లాలో నాలుగో రోజు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు. శనివారం కార్వాన్ నియోజకవర్గ పరిధిలోని బాపూఘాట్ను సందర్శించి, మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం బాపూఘాట్ నుంచి లంగర్ హౌస్ దర్గాకు ఆటోలో ప్రయాణించి దర్గా వద్ద... రాజస్థాన్ గ్రామాల నుంచి ప్రపంచ వేదిక వరకు ..
ఆడపిల్లలకు ఆరాధ్యదైవం
భారతదేశానికి చెందిన సామాజిక ఉద్యమకారిణి సఫీనా హుసేన్ మరోసారి దేశానికి గర్వకారణంగా నిలిచారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యకు దూరమైన బాలికల కోసం చేసిన అసాధారణ కృషికి ఆమెకు ప్రతిష్టాత్మక ‘వైజ్ (WISE – World Innovation Summit for Education) అవార్డు’ లభించింది. ఈ అవార్డు అందుకున్న మొదటి భారతీయ మహిళగా... దేశమే ప్రథమం – విభజన భాషకు చోటు లేదు: అండమాన్లో మోహన్ భాగవత్ కీలక సందేశం
పోర్ట్ బ్లెయిర్ డిసెంబర్ 13:
జాతీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్సంఘచాలక్ మోహన్ భాగవత్ దేశభక్తి, జాతీయ ఏకత్వంపై గట్టి సందేశం ఇచ్చారు. దేశాన్ని అన్ని విషయాల కంటే ముందుగా ఉంచాలని, ఇది భారత్ కోసం జీవించే సమయం కానీ చనిపోయే సమయం కాదని స్పష్టం చేశారు. “మన దేశంలో మన దేశ భక్తి... యూపీ ఎన్నికలు – యోగి నాయకత్వానికే ఆర్ఎస్ఎస్ ముద్ర: వ్యతిరేక ప్రచారానికి చెక్, బీజేపీలో స్పష్టత
లక్నో డిసెంబర్ 13:
ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ–ఆర్ఎస్ఎస్ మధ్య జరిగిన కీలక భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ మోహన్ భగవత్తో సమావేశం అనంతరం బీజేపీలో స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. యూపీ ఎన్నికలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోనే వెళ్లాలన్నది ఆర్ఎస్ఎస్ స్పష్టమైన సందేశంగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ... “యోధుల్లా నిలబడాలి… అమెరికా దౌడ పళ్లను పగలగొట్టాలి”
కార్కోస్ (వెనిజులా) డిసెంబర్ 13:
అమెరికా నౌకాదళం వెనిజుయేలా తీరంలో ఒక చమురు ట్యాంకర్ను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో, వెనిజుయేలా అధ్యక్షుడు నికోలాస్ మడురో అమెరికాపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఒక సభలో సైమన్ బొలివార్ ఖడ్గాన్ని పట్టుకుని ప్రసంగించిన మడురో—“యోధుల్లా నిలబడి, అవసరమైతే ఉత్తర అమెరికా సామ్రాజ్యానికి పళ్ళను పగలగొట్టడానికి సిద్ధంగా ఉండాలి”... ఎప్స్టైన్ ఫోటోల కొత్త కలెక్షన్ విడుదల… వూడీ అలెన్, గేట్స్, క్లింటన్, ట్రంప్ వంటి ప్రముఖుల హాజరు
వాషింగ్టన్ డిసెంబర్ 12:
అమెరికాలో హౌస్ ఓవర్సైట్ కమిటీకి లభించిన జెఫ్రీ ఎప్స్టైన్ ఫోటోల కొత్త ట్రోవ్ దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. డెమోక్రాట్లు విడుదల చేసిన ఈ ۱۹ చిత్రాల్లో సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు కనిపించడం మరింత వివాదాస్పదంగా మారింది.
🔻 ఎవరు ఉన్నారు ఈ ఫోటోలలో?
మొత్తం దాదాపు తొంభై... మహిళా రిజర్వేషన్ అమలు చేయాలి :బార్ కౌన్సిల్పై మహిళా న్యాయవాదుల నిరసన
సికింద్రాబాద్, డిసెంబర్ 12 (ప్రజామంటలు):
తెలంగాణ బార్ కౌన్సిల్లో మహిళలకు రిజర్వేషన్ లేకపోవడం తీవ్ర అన్యాయమని మహిళా న్యాయవాదులు శుక్రవారం హైకోర్టు వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. హైకోర్టు అడ్వకేట్ డా. జీ. సుభాషిణి మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్ అమలు చేయాలంటూ సుప్రీంకోర్టులో తాను ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలిపారు.
బార్ కౌన్సిల్ ఏర్పాటైన... సర్పంచ్ ప్రమోద్ రెడ్డి, వార్డు సభ్యులకు మంత్రి పొన్నం ఘన సత్కారం
భీమదేవరపల్లి, డిసెంబర్ 12 (ప్రజామంటలు) :
గ్రామీణ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న ములుకనూరు గ్రామ పంచాయతీ కొత్త సర్పంచ్గా విజయం సాధించిన జాలి ప్రమోద్ రెడ్డితో పాటు ఎన్నికైన వార్డు సభ్యులను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు.
గ్రామ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి... సైబర్ మోసాలకు ఫుల్స్టాప్ : వంగరలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం
భీమదేవరపల్లి, డిసెంబర్ 12 (ప్రజామంటలు) :
సైబర్ మోసాలకు పూర్తిగా చెక్ పెట్టే లక్ష్యంతో భీమదేవరపల్లి మండలంలోని వంగర పోలీస్స్టేషన్ అధ్వర్యంలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వంగర ఎంసీఆర్బి గోదాం ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు హాజరై ఆసక్తిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్ఐ జి. దివ్య మాట్లాడుతూ, ఇటీవలి... ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
*ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్ష*జగిత్యాల డిసెంబర్ 12 (ప్రజా మంటలు)రెండవ విడత జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు మూడవ ర్యాండమైజేషన్ విధానంలో ఎన్నికల సిబ్బంది కేటాయింవు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు.
శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఈ ప్రక్రియ నిర్వహించారు.
అనంతరం ఎన్నికల నిర్వహణ... 