జీహెచ్ఎంసీ అసిస్టెంట్ సీటీ ప్లానర్ పై ఏసీబీ దాడులు.
బిల్డింగు ఎన్ఓసీ ఇచ్చేందుకు రూ.8లక్షల డిమాండ్
ఆఫీసు, ఇంటిపై ఏక కాలంలో దాడులు.. భారీగా అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తింపు...
సికింద్రాబాద్ మే23 (ప్రజామంటలు):
జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. సికింద్రాబాద్ ప్రాంతంలో నిర్మిస్తున్న రెండు భవనాలకు ఎన్ఓసీ ఇచ్చేందుకు రూ.8లక్షలు డిమాండ్ చేయడంతో బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు శుక్రవారం ఆయన కార్యాలయం, ఇంటిపై ఒక కాలంలో దాడులు నిర్వహించారు.
ఏసీబీ డీఎస్సీ శ్రీధర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన వెంకట్ రావు అనే వ్యక్తి జీహెచ్ఎంసీ అనుమతి పొంది రెండు బిల్డింగుల నిర్మాణం చేశాడు. అయితే ఈ బిల్డింగులకు ఎన్ఓసీ కోసం సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ సిటీ ప్లానర్ విఠల్ రావు కు దరఖాస్తు పెట్టకున్నాడు. దీనిపై విఠల్ రావు ఈ రెండు భవనాలు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి బిల్డింగు నిర్మాణంలో చిన్న చిన్న డీవియేషన్లు ఉన్నాయి... వాటిని సరిచేసుకుని వస్తే ఎన్ఓసీ ఇస్తానని చెప్పి వెళ్లిపోయాడు. ఒక్కో బిల్డింగుకు రూ.4లక్షల చొప్పున రూ.8లక్షలు ఇస్తే ఎన్ఓసీ ఇస్తానని చెప్పాడు. దీంతో అంత డబ్బు తాను ఇచ్చుకోలేనని, రూ.4 లక్షలు ఇస్తానని వెంకట్ రావు చెప్పాడు.

అదేమీ కుదరదు రూ.8లక్షలు ఇవ్వాల్సిందే లేకుంటే ఎన్ఓసీ ఇవ్వడం కుదరదని విఠల్ రావు తేగేసి చెప్పాడు. దీంతో వెంకట్రావు డబ్బులు ఇచ్చేందుకు అంగీకరించాడు. మల్కాజిగిరి సఫిల్ గూడ చెరువు వద్దకు ప్రభుత్వ వాహనంలో వచ్చిన విఠల్ రావు అందులోనే కూర్చుని రూ.4లక్షలు తీసుకున్నాడు. తరువాత ఎన్ఓసీ ఇవ్వకుండా తిప్పుకోవడం మొదలు పెట్టాడు. మిగిలిన రూ.4 లక్షల కోసం వెంకటరావు పై ఒత్తిడి తీసుకువచ్చాడు.అయితే మిగతా డబ్బులు ఇవ్వకపోవడంతో వెంకటరావు భవన నిర్మాణ అనుమతుల ఎన్ఓసీ ఫైళ్లను తిరస్కరించాడు. దీంతో వెంకట్ రావు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు అసిస్టెంట్ ప్లానర్ విఠల్ రావును అదుపులోకి తీసుకున్నారు.
సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో విఠల్ రావు చాంబర్ లో సోదాలు నిర్వహించారు. మేడిపల్లిలోని ఆయన నివాసంతో పాటు కోఠి సుల్తాన్ బజారులో విఠల్ రావు ప్రైవేట్ కార్యాలయం నిర్వహిస్తున్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు ఏక కాలంలో ఈ మూడు ప్రాంతాలల్లో సోదాలు చేపట్టారు.రెండు భవన నిర్మాణాల అనుమతుల కోసం రూ. 8 లక్షలు డిమాండ్ చేసి రూ.4క్షలు తీసుకున్నట్లు నిర్దారణ అయిందని ఏసీబీ డీఎస్సీ శ్రీధర్ తెలిపారు. విఠల్ రావు సంపాదనకు మించి అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. విఠల్ రావు సంపాదించిన అక్రమ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి..? వాటి విలువ ఎంత .? తదితర విషయాలను త్వరలో వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలలో అధికారులు లంచం అడిగితే తమను సంప్రదించాలని ఆయన సూచించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎస్ఎస్ఎస్సి లో578/600 మార్కులు సాధించిన పాలెపు హాసిని శర్మను అభినందించిన పాఠశాల యాజమాన్యం
జగిత్యాల ఏప్రిల్ 29 ( ప్రజా మంటలు) పొలాస గ్రామానికి చెందిన పాలెపు రాజు కూతురు పాలెపు హాసిని శర్మ జిల్లా కేంద్రంలోని శ్రీనిధి ఒలంపియాడ్ పాఠశాలలో చదువుచున్నది. బుధవారం విడుదలైన ఎస్ఎస్ఎస్సి ఫలితాలలో 578/600 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా శ్రీనిధి ఒలంపియాడ్ పాఠశాల కరస్పాండెంట్ ఎం రాజేందర్ ప్రిన్సిపల్ మేఘమాల డైరెక్టర్ SSC ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం
జగిత్యాల ఏప్రిల్ 29 ( ప్రజా మంటలు)
పట్టణంలోని సిద్ధార్థ విద్యా సంస్థలు మరోసారి తమ ప్రతిభను చాటుకుంటూ SSC ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో అద్భుత విజయాన్ని సాధించాయి.
ఈరోజు విడుదలైన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో రాష్ట్ర స్థాయి లో 591, 590 మార్కులతో జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచారు. అదే విధంగా... పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేయాలి-రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ధర్మపురి ఏప్రిల్ 28 (ప్రజా మంటలు)
రానున్న 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్షపుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.2027లో జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్ల నేపథ్యంలో చేపట్టాల్సిన భూసేకరణ (ల్యాండ్ అక్విజిషన్) మరియు దేవాలయ అభివృద్ధి పనులపై టెంపుల్ మాస్టర్... రాష్ట్ర ప్రభుత్వం వాసవి మాత జయంతి ప్రభుత్వ పరంగా నిర్వహించడం హర్షణీయం... - ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల ఏప్రిల్ 26 (ప్రజా మంటలు)
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతా జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణం లో ఆర్య వైశ్య సంఘం ఆద్వర్యం లో జయంతి వేడుకల్లో పాల్గొని పోచమ్మ ఆలయం నుండి వాసవి మాత ఆలయానికి వాసవి కన్యకా పరమేశ్వరి మాతని పల్లకిలో తీసుకొచ్చే కార్యక్రమంలో పాల్గొని పల్లకి మోసి ప్రత్యేక... ఘనంగా వాసవీ మాత జయంతి వేడుకలు
జగిత్యాల ఏప్రిల్ 26 ( ప్రజా మంటలు) జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో వాసవీ మాత జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బి. ఎస్.లత పాల్గొన్నారు.*ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బి.ఎస్.లత మాట్లాడుతూ* వాసవీ మాత
ఈత సరదాకు వెళ్ళి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు
బుగ్గారం ఏప్రిల్ 26 ( ప్రజా మంటలు) సర్పంచ్ లు గ్రామాలలో టామ్ - టామ్ చేయించాలి
బుగ్గారం ఎస్సై జి.సతీష్
వేసవి కాలం కదా అని ఈత సరదాతో బావుల్లోకి, చెరువుళ్ళోకి వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని జగిత్యాల జిల్లా బుగ్గారం ఎస్సై జి.సతీష్ అన్నారు. ఆదివారం ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక... పెళ్లి వేడుకలో విషాదం – సరదా ఈత ప్రాణం తీసింది… 13 ఏళ్ల బాలుడు మృతి
గొల్లపల్లి, ఏప్రిల్ 26 (ప్రజా మంటలు):
పెళ్లి వేడుకలో పాల్గొన్న అనంతరం సరదాగా ఈతకు వెళ్లిన బాలుడు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఘటన జగిత్యాల జిల్లాలో విషాదాన్ని నింపింది.బుగ్గారం మండలం బీర్సాని గ్రామానికి చెందిన కాంపెళ్లి రితేష్ (13) గొల్లపల్లి మండలం లోతునూరు గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యాడు. మధ్యాహ్న సమయంలో స్నేహితులతో... ఘనంగా సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు
.
జగిత్యాల ఏప్రిల్ 26( ప్రజా మంటలు)వాల్మీకి ఆవాసం సేవాభారతి అధ్వర్యంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆదివారం ఉదయం 11 గంటలకు ఘనంగా నిర్వహించారు.
జగిత్యాల పట్టణం ధరూర్ క్యాంపులో గ్రామీణ నిరుపేద విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న వాల్మీకి ఆవాసంలో ప్రతి సంవత్సరం వేసవి సెలవుల అనంతరం సామూహిక సత్యనారాయణ స్వామి... “తెలంగాణ వాదాన్ని ఎవరు చంపారు? ఎవరు కాపాడుతున్నారు?”
హైదరాబాద్, ఏప్రిల్ 26 (ప్రజా మంటలు):
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపుతూ టీఆర్ఎస్ నేత నవీన్ ఆచారి బీఆర్ఎస్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కవిత ప్రకటించిన “తెలంగాణ రాష్ట్ర సేన” నేపథ్యంలో బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా మారిందని తెలంగాణ రాష్ట్ర సేన నాయకులు రూప్ సింగ్, నవీనాచరి, ఇస్మాయిల్, వరలక్ష్మి, తదితరులు విమర్శించారు.... ఉద్యమ స్ఫూర్తికి గౌరవం – ఎమ్మెల్సీగా కోదండరాం నియామకంపై శుభాకాంక్షల వెల్లువ
జగిత్యాల, ఏప్రిల్ 25 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్. కోదండరాం ఎమ్మెల్సీగా నియామకం కావడం పట్ల తెలంగాణ జన సమితి నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యమ రథసారధిగా ప్రజల ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లిన ఆయనకు ఈ పదవి లభించడం సముచిత గౌరవమని... మన కేసీఆర్ కాదు… మారిన మనిషి!” – బీఆర్ఎస్పై తీవ్ర దాడి, కొత్త పార్టీతో అధికారమే లక్ష్యం
హైదరాబాద్ ఏప్రిల్ 25 (ప్రజా మంటలు);
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపేలా జాగృతి నేత కేసీఆర్పై నేరుగా, నిర్భయంగా విరుచుకుపడ్డారు. “ఇవ్వాళ ఉన్నది మన కేసీఆర్ కాదు… మారిన మనిషి” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ సమయంలో ప్రజల కోసం పోరాడిన నాయకుడు, ఇప్పుడు ప్రజలను పట్టించుకోని పాలకుడిగా మారిపోయాడని విమర్శించారు.నీళ్లు, నిధులు,... ఘనంగా సత్య సాయి ఆరాధన మహోత్సవ వేడుకలు
జగిత్యాల ఏప్రిల్ 24 (ప్రజా మంటలు)భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆరాధన ఉత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో పలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయము నగర సంకీర్తన అల్పాహార వితరణ రుద్ర పారాయణము రుద్రాభిషేకము మధ్యాహ్నం అర్హులైన వారికి వీల్ చైర్ ల పంపిణీ దుస్తుల... 