బక్రీద్ను పురస్కరించుకుని అక్రమ రవాణా – లేగ దూడలు, వాహనం స్వాధీనం*
ముగ్గురు అరెస్ట్
భీమదేవరపల్లి, మే 16 ప్రజామంటలు:
మండలంలో శుక్రవారం రాంనగర్ తండా వద్ద అక్రమంగా తరలిస్తున్న మూడు లేగ దూడలను వంగర పోలీసులు పట్టుకున్నారు. జూన్ 7న జరగనున్న బక్రీద్ పండుగను పురస్కరించుకుని అధిక ధరలకు అమ్మేందుకు అక్రమంగా తరలిస్తున్న సమయంలో వంగర పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం, వంగర ట్రైనీ ఎస్సై హేమలత నేతృత్వంలో కానిస్టేబుళ్లు రాజు, రమేష్ వంగర పోలీస్ స్టేషన్ పరిధిలో రొటీన్ పట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సిద్దిపేట – హనుమకొండ ప్రధాన రహదారిపై ఒక బొలెరో వాహనంలో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గుర్తించారు. వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా, అందులో మూడు లేగ దూడలు కనిపించాయి. అరెస్ట్ చేసిన వ్యక్తుల వివరాలు ఇలా ఉన్నాయి: జాఫర్ (వయసు 35, జమ్మికుంట కరీంనగర్ జిల్లా), ఇబ్రహీం (వయసు 48, జమ్మికుంట), కనకం సదానందం (వయసు 48, జమ్మికుంట) వీరు పశువులను వివిధ ప్రాంతాల నుంచి సేకరించి బక్రీద్ సందర్భంగా అధిక లాభం పొందే ఉద్దేశంతో ఇతర జిల్లాలకు అక్రమంగా తరలిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సాక్షులు భూక్య రవి, బడావత్ బాలు సమక్షంలో లేగ దూడలు మరియు బొలెరో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పశుసంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. దూడలను ధర్మసాగర్ (ముప్పారం) గోశాలకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదే -మాతా శిశు కేంద్ర సూపరింటెండెంట్ సుమన్ రావు

సిగాచి పరిశ్రమలో గాయపడిమావారిని ఆస్పత్రిలో పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

ఎంపీ రఘునందన్ రావును పరామర్శించిన బీజేపీ స్టేట్ చీఫ్
.jpg)
కన్నులపండువగా మహాకాళి అమ్మవారి ఘటము ఊరేగింపు

పాశమైలారం ప్రమాద ఘటనపై ఎన్హెచ్ఆర్సీ లో పిటీషన్

ఆపదలో ఉన్న వారిని కాపాడే గొప్ప వృత్తి - గాంధీలో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్..

పవర్ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా దోమన్ యాదవ్

చుట్టాల బస్తీ యూపీహెచ్సీలో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్

శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులు అందరిపై ఉండాలి మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత

ఈ ఏడాది ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం హపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ

తల్లిదండ్రులు జన్మనిస్తే... వైద్యులు పునర్జన్మ నిస్తారు...!

ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తి, శాంతి, సమన్వయ భావాలను పెంపొందిస్తాయి - ఎమ్మెల్యే డా.సంజయ్ కుమా
