బ్రెయిన్ ట్యూమర్ పేషంట్లకు ఎండోస్కోపిక్ విధానం ఓ వరం
రాష్ర్ట ఆరోగ్య శాఖ కార్యదర్శి డా.క్రిస్టినా జెడ్ చోంగ్తు
యశోదా హాస్పిటల్ లో స్కల్ బేస్ ఎండోస్కోపి సమ్మిట్
సికింద్రాబాద్ ఏప్రిల్ 26 (ప్రజామంటలు) :
తెలుగు రాష్ర్టాలలో బ్రెయిన్ ట్యూమర్ రోగులకు న్యూరో ఎండోస్కోపిక్ , ఎండోస్కోపీ ద్వారా నిర్వహించబడే నాడీ సంబందిత బ్రెయిన్ సర్జరీలకు యశోద హాస్పిటల్స్ భారతదేశంలోనే మొటమొదటి రోబోటిక్ న్యూరో సర్జరీ ఆండ్ న్యూరో ఎండోస్కోపిక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఒక చక్కని వేధిక అవుందని తెలంగాణ రాష్ర్ట ఆరోగ్య శాఖ కార్యదర్శి డా.క్రిస్టినా జెడ్ చోంగ్తు అన్నారు. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ లో నిర్వహిస్తున్న రెండు రోజుల స్కల్ బేస్ ఎండోస్కోపీ సమ్మిట్–2025 ను శనివారం ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మెదడు, వెన్నముక శస్ర్త చికిత్సలలో న్యూరో ఎండోస్కోప్ గత రెండు దశాబ్దాలలో గణనీయమైన పురోగతిని సాధించిందని, దాని మినిమల్లీ ఇన్యాసివ్ (అతి తక్కువ కోత) విధానం, హై రిజల్యూషన్, వ్యాధిని పూర్తిగా తగ్గించే సామర్ద్యం, రోగి త్వరగా కోలుకోవడం వంటివి ఈ అత్యాధునిక రోబోటిక్ న్యూరో సర్జరీ ఆండ్ న్యూరో ఎండోస్కోపీ సర్జరీల యొక్క ప్రత్యేకతలు అవని ఆమె పేర్కొన్నారు.
యశోద హాస్పిటల్స్ సీనియర్ న్యూరో సర్జన్ ఆండ్ స్కల్ బేస్ ఎండోస్కోపి సమ్మిట్ కన్వీనర్, డాక్టర్ ఆర్.అయ్యదురై మాట్లాడుతూ..ఈ సమ్మిట్ భారతదేశంలోనే న్యూరో సర్జరీ రంగంలో నిర్వహించబడిన మొట్టమొదటి అంతర్జాతీయ స్కల్ బేస్ ఎండోస్కోపి సమ్మిట్ లైవ్ వర్క్ షాప్ అని అన్నారు. వైద్య రంగంలో రోబోటిక్ సహాయం ఒక గొప్ప వరంలా మిగిలిపోతుందన్నారు.
ముఖ్యంగా మెదడు సర్జరీల కోసం ఉద్దేశించిన రోబోటిక్ వ్యవస్థ చాలా సున్నితమైనదని, ఇది శస్ర్తచికిత్స యొక్క భద్రతను అసమానమైన స్థాయికి పెంచుతుదన్నారు.యశోద హాస్పిటల్స్ గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి, యూనిట్ హెడ్ డాక్టర్ విజయ్ కుమార్ తదితరులు మాట్లాడారు. ఈ సమ్మిట్ లో పలువురు డాక్టర్లు, ఆయా విభాగాల వైద్య నిపుణులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

పశువైద్యశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్

గోధుర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడికి ₹2 లక్షల నిదుల ప్రొసీడింగ్

గాంధీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన పి.వై.ఎల్ నాయకులు

పాత గొడవల నేపధ్యంలో హత్య, ఇద్దరికి జీవిత ఖైదు
.jpeg)
గొల్లపల్లిలో సామూహిక శ్రీ విశ్వకర్మ వ్రతం

బాధితుల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే_ జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

పాక్ జట్టుతో భారత జట్టు కరచాలనం చేయకపోవడంపై పాక్ నిరసన

వక్ఫ్ చట్టంపై స్టే నిరాకరణ - కొన్ని సెక్షన్ల నిలుపుదల - సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు

పేదింటి ఆడబిడ్డ సానియా బేగం వివాహానికి ఎమ్మెల్యే సహాయం

ఎంబిబిఎస్ సీటు సాధించిన అమన్ కాణం కు ₹10, వేలు అందించిన సూరజ్ శివ శంకర్
