ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు... ఏఐ అంటె అనుముల ఇంటెలిజెన్స్ - బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

On
ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు... ఏఐ అంటె అనుముల ఇంటెలిజెన్స్ - బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

 అనుముల ఇంటెలిజెన్స్ తో రాష్ట్రానికి చాలా ప్రమాదం. అనుముల ఇంటెలిజెన్స్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తోంది. ప్రజలను మోసం చేయడమే అనుముల ఇంటెలిజెన్స్.
బీసీ బిల్లుల ఆమోదానికి కేంద్రంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి తేవాలి. బీజేపీ డీఎన్ఏలోనే బీసీ, దళిత వ్యతిరేకత

బీజేపీ ప్రభుత్వం గిరిజన మహిళ అయిన రాష్ట్రపతిని ఆహ్వానించలేదని, గిరిజన బిడ్డ రాష్ట్రపతి అయినా గౌరవం దక్కకపోతే పోరాటం తప్ప మనకు ఇతర మార్గమేముంది ?

దళిత నేత, రాజస్థాన్ ప్రతిపక్ష నేత టికారాం జుల్లి  శ్రీరామనవమి నాడు రాముడి గుడికి వెళ్తే గుడి మైలపడిందని సంప్రోక్షణ చేశారని, అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి దేశంలో ఉండడం దురదృష్టకరం
 
ఏప్రిల్ 11లోగా పూలే విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం ప్రకటన చేయాలి
అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటుకై ఇందిరా పార్కు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దీక్ష

హైదరాబాద్  ఏప్రిల్ 08:

కంచా గచ్చిబౌలి భూముల విషయంలో చాలా ప్రమాదకరమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఫోటోలు రూపొందించారని ఆరోపిస్తూ కేసులు పెట్టడానికి ఉపక్రమిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చాలా ప్రమాదముందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు... ఏఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్ అని విమర్శించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కాదు.. అనుముల ఇంటెలిజెన్స్ తో రాష్ట్రానికి ప్రమాదం ఉందని ధ్వజమెత్తారు. అనుముల ఇంటెలిజెన్స్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తోందని, అనుముల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితే తప్పా రాష్ట్రం బాగుపడే పరిస్థితి కనిపించడం లేదని స్పష్టం చేశారు. ప్రజలను మోసం చేయడమే అనుముల ఇంటెలిజెన్స్ అని,  అనుముల ఇంటెలిజెన్స్ ను వాడి కులగణనను తప్పదోవ పట్టించి బీసీకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.

అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం నాడు ఇందిరా పార్కు వద్ద దీక్ష చేశారు. తెలంగాణ జాగృతి, యూనైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తంగా ఈ దీక్షా కార్యక్రమానికి వేలాది మంది బీసీలు, ప్రజలు తరలివచ్చారు.

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.... దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల పట్ల వివక్ష సాగుతుండడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. దళిత నేత, రాజస్థాన్ ప్రతిపక్ష నేత టికారాం జుల్లి  శ్రీరామనవమి నాడు రాముడి గుడికి వెళ్తే గుడి మైలపడిందని సంప్రోక్షణ చేశారని, అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి దేశంలో ఉండడం దురదృష్టకరమన్నారు. బీజేపీపాలిత రాష్ట్రంలో ఈ ఘటన జరిగిందని, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అనేవి కేవలం మాటల్లోనే ఉన్నాయి చేతల్లో చూపించాలని సూచించారు. అయోధ్య రాముడి గుడి కడితే బీజేపీ ప్రభుత్వం గిరిజన మహిళ అయిన రాష్ట్రపతిని ఆహ్వానించలేదని, గిరిజన బిడ్డ రాష్ట్రపతి అయినా గౌరవం దక్కకపోతే పోరాటం తప్ప మనకు ఇతర మార్గమేముంది ? అని ప్రశ్నించారు. బాన్సువాడ ప్రాంతంలో ఒక చాయ్ దుకాణంలో రెండు గ్లాసుల పద్ధతి ఇంకా ఉండడం దారుణమని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకే కాదు బీసీలకు కూడా అనేక సందర్భాల్లో ఇప్పటికీ అవమానాలు జరుగుతున్నాయని, ఇవి సమాజానికి మంచిది కాదని, వీటిని రూపుమాపడానికి నడుంబిగించాలని పిలుపునిచ్చారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్ర చట్టసభలు ఆమోదించిన రెండు బిల్లుల స్థితి ఏమిటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. చట్టసభలు బిల్లులు ఆమోదించి నాలుగు వారాలైందని, ఆ బిల్లులు గవర్నర్ వద్దనే పెండింగ్ లో ఉన్నాయా... లేదా రాష్ట్రపతికి పంపించారా ? అని అడిగారు. ఆ బిల్లులను ఆమోదించడానికి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. బిల్లులు ఆమోదం పొందిన తర్వాత అన్ని పార్టీలను ప్రధాని వద్దకు తీసుకెళ్తామని సీఎం అన్నారని, కానీ ఇప్పటి వరకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లలేదని చెప్పారు. బీజేపీతో సీఎం రేవంత్ రెడ్డికి లాలూచి లేకుంటే ప్రధాని అపాయింట్ మెంట్ లభించేదని, బీజేపీని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లడం లేదని విమర్శించారు. దానికి బదులు ఢిల్లీలో తుఫేల్ ధర్నా చేశారని, ధర్నాకు రాహుల్ గాంధఈ వస్తారని ఊదరగొట్టారు కానీ చివరికి ఆయన రాలేదని చెప్పారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంతో తాము కూడా కలిసి వస్తామని, కానీ కాంగ్రెస్ లాగా ఢిల్లీలో దొంగ దీక్షలు చేయమని, అవసరమైతే ఢిల్లీకి వెళ్లి నిరవధికంగా దీక్షలు కూర్చుందామని స్పష్టం చేశారు.

IMG-20250408-WA0023

దేశంలో ఈబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుతో 50 శాతం రిజర్వేషన్ పరిమితి తొలగిపోయిందని, కాబట్టి  50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించినా కోర్టులు అడ్డుకోలేవని,  ఈ రీత్యా బీసీ బిల్లుల ఆమోదానికి చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ బీజేపీపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. బీసీలను మభ్యపెట్టవద్దు...రెండు బిల్లులను ఆమోదించేలా ప్రయత్నం చేయాలని సూచించారు. బీజేపీ డీఎన్ఏ నే బీసీలకు, దళితులకు వ్యతిరేకమని ధ్వజమెత్తారు. అటువంటి కేంద్ర ప్రభుత్వ మెడలు వంచాలంటే ప్రజా ఉద్యమాలే మనకు మార్గమని అన్నారు.

 

కులగణన నివేదికను అసెంబ్లీలో పెట్టకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించి అధ్యయనం చేసిన తర్వాత రిజర్వేషన్ ఇస్తారంటా అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సమగ్ర కుటుంబ సర్వే వివరాలు వెబ్ సైట్ లో పెట్టామని, మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఆ ధైర్యం లేదు ? అని ప్రశ్నించారు. 2011లో యూపీఏ హయాంలో దేశంలో కులగణన చేసినా ఇప్పటికీ వివరాలు వెల్లడించలేదని, తెలంగాణలో చేసిన కులగణన వివరాలను వెల్లడించలేదని ప్రస్తావించారు. బీసీ కులగణన చేయబోమని బీజేపీ స్పష్టం చేసింది కాబట్టి ఆ పార్టీపై ఒత్తిడి చేయాలని అన్నారు. కులగణనపై అధ్యయనం పూర్తి చేసే వరకు మనం మాట్లాడవద్దని స్వతంత్ర అధ్యయన కమిటి హెచ్చరించిందని, మీరెవరు మాకు హెచ్చరిక చేయడానికి అని నిలదీశారు. చిత్తశద్ధి ఉంటే కులగణన నివేదికను అసెంబ్లీలో పెట్టాలని డిమాండ్ చేశారు.

కాగా, ఏప్రిల్ 11లోగా పూలే విగ్రహం ఏర్పాటుపై ప్రకటన చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశంలో తరతరాలుగా వెనుకబడ్డ జాతులకు న్యాయం జరగాలని కాంక్షించిన వ్యక్తి పూలే అని కొనియాడారు. పూలే తనకు గురువు అని అంబేద్కర్ చెప్పారని, మహిళల కోసం పాఠశాలలను ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి పూలేని కీర్తించారు. కులవివక్షకు వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాటం చేశారని చెప్పారు. అసెంబ్లీలో పూలే విగ్రహం పెడితే సమాజం స్పూర్తి పొందుతుందని అన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా విగ్రహం కోసం పోరాటం చేస్తామని తేల్చిచెప్పారు.

ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, సాహిత్య అకాడెమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, బిఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ , మాజీ బీసీ కమిషన్ మెంబెర్ కిషోర్ గౌడ్ , టీఎస్పీఎస్సీ మాజీ మెంబెర్ సుమిత్ర తనోబా, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ముఠా జై సింహ , నివేదిత సాయన్న, ఆశిష్ యాదవ్ , బిఆర్యస్ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్లు సామాల హేమ , సునీత , సరస్వతి ఆలకుంట హరి, లలిత యాదవ్ , బిఆర్యస్ గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ రవీ యాదవ్ , సీనియర్ నాయకులు రోషన్ బాలు పాల్గొన్నారు

ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఫులే ఫ్రంట్ కన్వీనర్ గట్టు రామ్ చందర్ రావు , కో కన్వీనర్ బొల్ల శివ శంకర్, అలకుంటల హరి , హమాలీ శ్రీను ,కొట్టాల యాదగిరి ,ఎత్తరి మారయ్య,  గోపు సదనందు, విజేందర్ సాగర్ ,రాచమల్ల బాలకృష్ణ , సురేందర్, డి కుమారస్వామి , కోల శ్రీనివాస్ , నిమ్మల వీరన్న , మురళి , సాల్వాచారి, శ్రీహరి, డి నరేష్ కుమార్ , జంగమ పరమేశ్వరి, గురం శ్రవణ్, ఏల్చాల దత్తాత్రేయ, రామ్ కోటి, గొరిగే నర్సింహ , అశోక్ యాదవ్ ,లింగం శాలివాహన  , పుష్ప చారి , మధు ,విజయ్ జితేంద్ర , కృష్ణమ చారి, గోవర్ధన్ యాదవ్ , నాగరాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ జాగృతి నాయకులు నవీన్ ఆచారి , శ్రీధర్ రావు, ప్రశాంత్ అనంతుల, మారేపల్లి మాధవి , అర్చన సేనాపతి , భాస్కర్ యాదవ్ , సంపత్ గౌడ్, అప్పల నరేంద్ర యాదవ్ , పసుల చరణ్, ఈగ సంతోష్ , పెంట రాజేష్ , నవీన్ గౌడ్ , రాము యాదవ్ , మనోజ్ గౌడ్ , ప్రవీణ్ ముదిరాజ్ , అభిలాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Tags
Join WhatsApp

More News...

National  Sports  State News 

ఉప్పల్ స్టేడియంలో మెస్సీ–రేవంత్ ఫుట్‌బాల్ మ్యాచ్.. అభిమానుల్లో ఉత్సాహం

ఉప్పల్ స్టేడియంలో మెస్సీ–రేవంత్ ఫుట్‌బాల్ మ్యాచ్.. అభిమానుల్లో ఉత్సాహం హైదరాబాద్‌ డిసెంబర్ 13 (ప్రజా మంటలు): ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ప్రత్యేక ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డి, ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మైదానంలోకి దిగారు. ఈ మ్యాచ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. మ్యాచ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఒక గోల్‌ సాధించగా, మెస్సీ రెండు గోల్స్‌తో తన ప్రతిభను చాటుకున్నారు. గోల్స్‌తో పాటు...
Read More...
Local News 

నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే జగిత్యాలకు మెడికల్ కాలేజీ: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే జగిత్యాలకు మెడికల్ కాలేజీ: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జగిత్యాల (రూరల్) డిసెంబర్ 13 (ప్రజా మంటలు): రాజకీయాల్లోకి తాను వచ్చిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రిని కోరడంతోనే జగిత్యాలకు మెడికల్ కాలేజీ మంజూరైందని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఆరు మెడికల్ కాలేజీలు మంజూరైన సమయంలో జగిత్యాల పేరు జాబితాలో ఉండేలా కృషి చేశానని చెప్పారు. రాష్ట్రంలో మొదట అనుమతి పొందిన మెడికల్...
Read More...
Local News 

వయోవృద్ధులకు టాస్కా ఆసరా.                                -అల్ సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో 9వ టాస్క ఆవిర్భావ  దినోత్సవం  వేడుకలు.

వయోవృద్ధులకు టాస్కా ఆసరా.                                -అల్ సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో 9వ టాస్క ఆవిర్భావ  దినోత్సవం  వేడుకలు. జగిత్యాల డిసెంబర్ 13 (ప్రజా మంటలు):     వయో వృద్ధులకు తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ ఆసరాగా ఉందని,వయోవృద్ధుల సంరక్షణ చట్టాన్ని పకడ్బందీగా అమలుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం పట్ల సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. శనివారం  ఆల్ సీనియర్ సిటీజేన్స్...
Read More...
Local News  State News 

సర్పంచ్ ఎన్నికల్లో తమ్ముడు ఓటమి: గుండెపోటుతో అక్క మృతి

సర్పంచ్ ఎన్నికల్లో తమ్ముడు ఓటమి: గుండెపోటుతో అక్క మృతి కోరుట్ల డిసెంబర్ 13 (ప్రజా మంటలు) : సర్పంచ్ ఎన్నికల్లో తమ్ముడు ఓడిపోవడాన్ని తట్టుకోలేక అక్క గుండెపోటుతో మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం, పోతు రాజశేఖర్ సర్పంచ్ పదవికి పోటీ చేయగా గురువారం ఎన్నికలు జరిగాయి. ఫలితాల సమయంలో రాజశేఖర్ అక్క కొక్కుల...
Read More...
State News 

రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం

రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం హైదరాబాద్ డిసెంబర్ 13: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
Read More...
Local News 

ఎల్కతుర్తి  గ్రామ సర్పంచిగా మునిగడప లావణ్య శేషగిరి ఘన విజయం 

ఎల్కతుర్తి  గ్రామ సర్పంచిగా మునిగడప లావణ్య శేషగిరి ఘన విజయం  ఎల్కతుర్తి డిసెంబర్ 13 (ప్రజా మంటలు) ఎల్కతుర్తి మండలం  గ్రామంలో బి. ఆర్.ఎస్. పార్టీ బలపరిచిన అభ్యర్థి మునిగడప లావణ్య శేషగిరి  ఘన విజయం సాధించిన సందర్భంగా ఎల్కాతుర్తి  మండలానికి చెందిన తెలంగాణ రైతు రక్షణ సమితి హన్మకొండ ఉమ్మడి కరీంనగర్ జిల్లాల అధ్యక్షుడు హింగే భాస్కర్ ఆధ్వర్యంలో గ్రామంలో  ప్రజలతో మమేకమై పండుగ వాతావరణముగా...
Read More...
Local News 

కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి నిలిచిపోయింది: జగిత్యాలలో బీఆర్ఎస్ నేతల తీవ్ర విమర్శలు

కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి నిలిచిపోయింది: జగిత్యాలలో బీఆర్ఎస్ నేతల తీవ్ర విమర్శలు జగిత్యాల (రూరల్) డిసెంబర్ 13 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్,మాజీ మంత్రి రాజేశం గౌడ్జి,తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ పాల్గొన్నారు. ఈ...
Read More...
Local News 

నన్ను ఆదరించి గెలిపిస్తే.... గ్రామ అభివృద్ధి చేస్తా :

నన్ను ఆదరించి గెలిపిస్తే.... గ్రామ అభివృద్ధి చేస్తా : గొల్లపల్లి డిసెంబర్ 13 (ప్రజా మంటలు,అంకం భూమయ్య): గొల్లపల్లి మండల గ్రామ సర్పంచ్‌గా తనను గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని సర్పంచ్ అభ్యర్థి, బీసీ బిడ్డ ఆవుల జమున సత్యం యాదవ్ ప్రకటించారు.శనివారం గ్రామంలో ఆమె ఇంటింటా ప్రచారం నిర్వహించి,ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని ప్రచారానికి వెళ్ళినప్పుడు  గ్రామ ప్రజలందరూ సానుకూలంగా స్పందిస్తున్నారని,అధిక మెజారిటీతో...
Read More...

బాపూఘాట్ అభివృద్ధి, క్రైమ్–డ్రగ్స్ నియంత్రణపై ప్రభుత్వ నిర్లక్ష్యం -కవిత విమర్శ

బాపూఘాట్ అభివృద్ధి, క్రైమ్–డ్రగ్స్ నియంత్రణపై ప్రభుత్వ నిర్లక్ష్యం -కవిత విమర్శ హైదరాబాద్ డిసెంబర్ 13 (ప్రజా మంటలు): జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ జిల్లాలో నాలుగో రోజు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు. శనివారం కార్వాన్ నియోజకవర్గ పరిధిలోని బాపూఘాట్‌ను సందర్శించి, మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం బాపూఘాట్ నుంచి లంగర్ హౌస్ దర్గాకు ఆటోలో ప్రయాణించి దర్గా వద్ద...
Read More...
National  Comment  International  

రాజస్థాన్ గ్రామాల నుంచి ప్రపంచ వేదిక వరకు ..

 రాజస్థాన్ గ్రామాల నుంచి ప్రపంచ వేదిక వరకు .. ఆడపిల్లలకు ఆరాధ్యదైవం     భారతదేశానికి చెందిన సామాజిక ఉద్యమకారిణి సఫీనా హుసేన్ మరోసారి దేశానికి గర్వకారణంగా నిలిచారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యకు దూరమైన బాలికల కోసం చేసిన అసాధారణ కృషికి ఆమెకు ప్రతిష్టాత్మక ‘వైజ్ (WISE – World Innovation Summit for Education) అవార్డు’ లభించింది. ఈ అవార్డు అందుకున్న మొదటి భారతీయ మహిళగా...
Read More...
National  State News 

దేశమే ప్రథమం – విభజన భాషకు చోటు లేదు: అండమాన్‌లో మోహన్ భాగవత్ కీలక సందేశం

దేశమే ప్రథమం – విభజన భాషకు చోటు లేదు: అండమాన్‌లో మోహన్ భాగవత్ కీలక సందేశం పోర్ట్ బ్లెయిర్ డిసెంబర్ 13: జాతీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్‌సంఘచాలక్ మోహన్ భాగవత్ దేశభక్తి, జాతీయ ఏకత్వంపై గట్టి సందేశం ఇచ్చారు. దేశాన్ని అన్ని విషయాల కంటే ముందుగా ఉంచాలని, ఇది భారత్ కోసం జీవించే సమయం కానీ చనిపోయే సమయం కాదని స్పష్టం చేశారు. “మన దేశంలో మన దేశ భక్తి...
Read More...
National  Comment 

యూపీ ఎన్నికలు – యోగి నాయకత్వానికే ఆర్ఎస్ఎస్ ముద్ర: వ్యతిరేక ప్రచారానికి చెక్, బీజేపీలో స్పష్టత

యూపీ ఎన్నికలు – యోగి నాయకత్వానికే ఆర్ఎస్ఎస్ ముద్ర: వ్యతిరేక ప్రచారానికి చెక్, బీజేపీలో స్పష్టత లక్నో డిసెంబర్ 13: ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ–ఆర్ఎస్ఎస్ మధ్య జరిగిన కీలక భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆర్ఎస్ఎస్ సర్‌సంఘచాలక్ మోహన్ భగవత్‌తో సమావేశం అనంతరం బీజేపీలో స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. యూపీ ఎన్నికలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోనే వెళ్లాలన్నది ఆర్ఎస్ఎస్ స్పష్టమైన సందేశంగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ...
Read More...