ధర్మపురి మం నేరెళ్ల లోనే జవహర్ నవోదయ నెలకొల్పాలని కేంద్రమంత్రికి ప్రభుత్వ విప్, ఎంపి వినతి
ఢిల్లీ ఫిబ్రవరి 11 ( ప్రజా మంటలు)
తెలంగాణ రాష్ట్రంలోని ధర్మపురి మండలం నేరెళ్లలో జవహర్ నవోదయ విద్యాలయాన్ని సకాలంలో అమలు చేయాలని కేంద్ర విద్య శాఖ మంత్రివర్యులు ధర్మేంద్ర ప్రధాన్ కలిసిన ప్రభుత్వ విప్పు లక్ష్మణ్ కుమార్
*కేంద్ర ప్రభుత్వం జవహర్ నవోదయ విద్యాలయన్ని ధర్మపురి మండలం నేరెళ్లలో మంజూరు చేయగా దాన్ని తరలించకుండ నెరెల్లలోనే యధావిధిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం కొనసాగించాలని కోరుతూ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు డిల్లీ లోని కేంద్ర విద్య శాఖ మంత్రివర్యులు ధర్మేంద్ర ప్రధాన్ ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపి వంశి క్రిష్ణ మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రాలను అందజేశారు*
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..తెలంగాణలోని జగిత్యాల జిల్లా ధర్మపురిలో జవహర్ నవోదయ విద్యాలయ స్థాపనలో భాగంగా నవోదయ విద్యాలయ సమితి నిబంధనల ప్రకారం అన్ని విధివిధానాలను పూర్తి చేయడం జరిగిందని, రాష్ట్ర స్థాయిలో అధికారులకు అనేక అభ్యర్థనలు సమర్పించి, మార్గదర్శకాల ప్రకారం జగిత్యాల జిల్లా ధర్మపురిలోని నేరేళ్ల గ్రామం వద్ద 30 ఎకరాల ప్రభుత్వ భూమిని, రోడ్డు కనెక్టివిటీని గుర్తించి ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపడం జరిగిందని,
తెలంగాణ ప్రభుత్వం ధర్మపురికి చెందిన నేరెళ్లతో పాటు (18) జవహర్ నవోదయ విద్యాలయల ఏర్పాటుకు ప్రతిపాదనలను కేంద్రానికి పంపడం జరిగిందని, NVS నోటిఫికేషన్ తేదీ 10.01.2025 ప్రకారం,ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA) నేరెళ్లతో సహా తెలంగాణలోని 7 జిల్లాల్లో నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయడానికి ఆమోదించడం జరిగిందని,
తదనుగుణంగా 2025 విద్యా సంవత్సరంలో పాఠశాల కార్యకలాపాలు ప్రారంభించాలనే లక్ష్యంతో జగిత్యాల జిల్లా కలెక్టర్ నవోదయ విద్యాలయ సమితి నిబంధనల ప్రకారం తాత్కాలిక ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, పై విషయాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్రంలోని ధర్మపురి మండలం నేరెళ్లలో జవహర్ నవోదయ విద్యాలయాన్ని సకాలంలో అమలు చేసేలా సంబంధిత అధికార యంత్రాంగాన్ని ఆదేశించవలసిందిగా కేంద్ర మంత్రి ని కలిసి వారిని కోరడం జరిగిందని, దానిపైన వారు కూడా సానుకూలంగా స్పందించి ఇట్టి విషయాన్ని పరిశీలిస్తామని ఈ సంధర్బంగా తెలిపారు
More News...
<%- node_title %>
<%- node_title %>
కరీఫ్ వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రణాళికలు సిద్ధం చేయాలి _రైస్ మిల్లర్ల సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

పెండింగ్ ఓటర్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి... రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

హర్యానా కేడర్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ కుమార్ కు నివాళులు అర్పించిన మాజీ కౌన్సిలర్ భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసిఎస్ రాజు "

పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం_ఏఐసిసి పరిశీలకుడు డాక్టర్ నరేష్ కుమార్, టిపిసిసి ఆర్గనైజర్ అబ్జర్వర్ జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి

వాల్మీకి ఆవాసంలో జిల్లాస్థాయి గోవిజ్ఞాన పరీక్షలు

పెన్షనర్ల బకాయిలు చెల్లింపునకు రాజీలేని పోరాటం.-టీ పెన్షనర్ల రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్

అధికారుల అలసత్వం ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుంది -జీవన్ రెడ్డి

సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ కోట నీలిమ

గాంధీలో ప్రపంచ అనస్థీషియా దినోత్సవం

ఐసీసీ అవార్డులు గెలుచుకున్న అభిషేక్ శర్మ, స్మృతి మంధాన!

చెక్ బౌన్స్ కేసులో గంటా రామ్మోహన్ కు 6 నెలల జైలుశిక్ష
.jpeg)
బిసి బంద్ ను విజయవంతం కొరకు ముందుకు రండి...
