ధర్మపురి మం నేరెళ్ల లోనే జవహర్ నవోదయ నెలకొల్పాలని కేంద్రమంత్రికి ప్రభుత్వ విప్, ఎంపి వినతి
ఢిల్లీ ఫిబ్రవరి 11 ( ప్రజా మంటలు)
తెలంగాణ రాష్ట్రంలోని ధర్మపురి మండలం నేరెళ్లలో జవహర్ నవోదయ విద్యాలయాన్ని సకాలంలో అమలు చేయాలని కేంద్ర విద్య శాఖ మంత్రివర్యులు ధర్మేంద్ర ప్రధాన్ కలిసిన ప్రభుత్వ విప్పు లక్ష్మణ్ కుమార్
*కేంద్ర ప్రభుత్వం జవహర్ నవోదయ విద్యాలయన్ని ధర్మపురి మండలం నేరెళ్లలో మంజూరు చేయగా దాన్ని తరలించకుండ నెరెల్లలోనే యధావిధిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం కొనసాగించాలని కోరుతూ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు డిల్లీ లోని కేంద్ర విద్య శాఖ మంత్రివర్యులు ధర్మేంద్ర ప్రధాన్ ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపి వంశి క్రిష్ణ మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రాలను అందజేశారు*
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..తెలంగాణలోని జగిత్యాల జిల్లా ధర్మపురిలో జవహర్ నవోదయ విద్యాలయ స్థాపనలో భాగంగా నవోదయ విద్యాలయ సమితి నిబంధనల ప్రకారం అన్ని విధివిధానాలను పూర్తి చేయడం జరిగిందని, రాష్ట్ర స్థాయిలో అధికారులకు అనేక అభ్యర్థనలు సమర్పించి, మార్గదర్శకాల ప్రకారం జగిత్యాల జిల్లా ధర్మపురిలోని నేరేళ్ల గ్రామం వద్ద 30 ఎకరాల ప్రభుత్వ భూమిని, రోడ్డు కనెక్టివిటీని గుర్తించి ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపడం జరిగిందని,
తెలంగాణ ప్రభుత్వం ధర్మపురికి చెందిన నేరెళ్లతో పాటు (18) జవహర్ నవోదయ విద్యాలయల ఏర్పాటుకు ప్రతిపాదనలను కేంద్రానికి పంపడం జరిగిందని, NVS నోటిఫికేషన్ తేదీ 10.01.2025 ప్రకారం,ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA) నేరెళ్లతో సహా తెలంగాణలోని 7 జిల్లాల్లో నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయడానికి ఆమోదించడం జరిగిందని,
తదనుగుణంగా 2025 విద్యా సంవత్సరంలో పాఠశాల కార్యకలాపాలు ప్రారంభించాలనే లక్ష్యంతో జగిత్యాల జిల్లా కలెక్టర్ నవోదయ విద్యాలయ సమితి నిబంధనల ప్రకారం తాత్కాలిక ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, పై విషయాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్రంలోని ధర్మపురి మండలం నేరెళ్లలో జవహర్ నవోదయ విద్యాలయాన్ని సకాలంలో అమలు చేసేలా సంబంధిత అధికార యంత్రాంగాన్ని ఆదేశించవలసిందిగా కేంద్ర మంత్రి ని కలిసి వారిని కోరడం జరిగిందని, దానిపైన వారు కూడా సానుకూలంగా స్పందించి ఇట్టి విషయాన్ని పరిశీలిస్తామని ఈ సంధర్బంగా తెలిపారు
More News...
<%- node_title %>
<%- node_title %>
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న దావ వసంత్ సురేష్ –
క్రైస్తవులకు శుభాకాంక్షలు
జగిత్యాల డిసెంబర్ 25 (ప్రజా మంటలు):
క్రిస్మస్ పండుగ సందర్భంగా జగిత్యాల పట్టణంలోని ధరూర్ క్యాంప్ చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత్ సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చిలో కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.... కాంగ్రెస్ పార్టీలో చేరిన శేఖల్ల సర్పంచ్, ఉపసర్పంచ్తో పాటు 50 మంది నాయకులు
బుగ్గారం డిసెంబర్ 25 (ప్రజా మంటలు):శేఖల్ల గ్రామానికి చెందిన సర్పంచ్ పర్సా రమేష్, ఉపసర్పంచ్ నార్ల బుచ్చయ్యతో పాటు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన సుమారు 50 మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు వారందరికీ కాంగ్రెస్... శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా – పలువురు విద్యార్థులకు గాయాలు
రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ డిసెంబర్ 25:శంషాబాద్ నుంచి హైదరాబాద్లోని జలవిహార్కు విద్యార్థులను తీసుకెళ్తున్న స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు బస్సును ఢీకొనడంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 50 మందికి... తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వ బస్సు ఢీకొని 8 మంది మృతి
కడలూరు, డిసెంబర్ 24:
తమిళనాడులోని కడలూరు జిల్లా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుచ్చి నుంచి చెన్నైకి వెళ్తున్న ప్రభుత్వ ఎక్స్ప్రెస్ బస్సు టైరు పేలడంతో నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
తిట్టకుడి ప్రాంతం సమీపంలోని తిరుచ్చి హైవేపై రాత్రి సుమారు... కిసాన్ గ్రామీణ మేళలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయకు జిల్లా కురుమ సంఘం ఘన సన్మానం
కరీంనగర్, డిసెంబర్ 24 (ప్రజా మంటలు):
కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో బుధవారం నిర్వహించిన కిసాన్ గ్రామీణ మేళ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను జిల్లా కురుమ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు.
జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు కడారి ఆయిలన్న కురుమ ఆధ్వర్యంలో దత్తాత్రేయకు మెమొంటో... ప్రజాపాలనలో రిటైర్డ్ ఉద్యోగుల దుస్థితి దుర్భరం రిటైర్డ్ బెనిఫిట్స్ ని ఏక కాలంలో చెల్లించాలి. జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్
జగిత్యాల డిసెంబర్ 24 (ప్రజా మంటలు)ప్రజాపాలన అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి అత్యంత దుర్భరంగా మారిందని జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ విమర్శించారు.
రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫెర్ అసోసియేషన్, జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో 2024 ఏప్రిల్ నుండి రిటైర్డ్ అయినా ఉద్యోగుల... విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి దిష్టిబొమ్మ దగ్ధం....
జగిత్యాల డిసెంబర్ 24 (ప్రజా మంటలు)
జిల్లా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు చేసి మారణ హోమం సృష్టిస్తున్నారని దాని నిరసిస్తూ బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు. స్థానిక తహశీల్ చౌరస్తాలోనిరసన ధర్నా చేపట్టిబంగ్లాదేశ్ ప్రధాని దిష్టిబొమ్మ దహనం చేశారు
ఈసందర్భంగా విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు... నవ్య బాలికల జూనియర్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు వేడుకలు
జగిత్యాల డిసెంబర్ 24 (ప్రజా మంటలు)నవ్య బాలికల జూనియర్ కళాశాల జూనియర్ విద్యార్థులు సీనియర్ విద్యార్థులకు ఏర్పాటుచేసిన వీడ్కోలు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ ఎం.సంజయ్ కుమార్ హాజరై ఎలాంటి లాభాపేక్ష లేకుండా అమ్మాయిల కోసం ప్రత్యేక కళాశాల నెలకొల్పి అతికొద్ది కాలంలోనే రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధిస్తూ,... అమృత్ 2.O పథకం లోని పనులను వేగవంతం చేయాలి _అదనపు కలెక్టర్ బి రాజా గౌడ్
కోరుట్ల డిసెంబర్ 24 (ప్రజా మంటలు)
మున్సిపాలిటీల్లో జనాభా పెరుగుతున్న దృష్ట్యా తాగునీటికి ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమృత్ 2.0 పథకం క్రింద నిధులు మంజూరు చేయగా ఈ పథకం కింద వాటర్ ట్యాంక్లు, వాటర్ సంప్, పైప్ లైన్లు నిర్మిస్తున్నారు.
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో పనులు కొనసాగుతున్న నేపథ్యంలో బుధవారం... తాడిచెల్లి నూతన సర్పంచ్ రామిడి రాజిరెడ్డికి ఘన సత్కారం
రం
కరీంనగర్, డిసెంబర్ 24 (ప్రజా మంటలు):చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం తాడిచెల్లి గ్రామానికి నూతన సర్పంచ్గా ఎన్నికైన సీనియర్ కాంగ్రెస్ నేత, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి రామిడి రాజిరెడ్డిని కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్... ట్రిపుల్ ఆర్, భూసేకరణ, రైతు–చేనేత సమస్యలపై జాగృతి పోరాటం – భువనగిరిలో కవిత సంచలన వ్యాఖ్యలు
భువనగిరి డిసెంబర్ 24 (ప్రజా మంటలు):
జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా భువనగిరి జిల్లాలో పర్యటించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రెస్మీట్లో విస్తృత అంశాలపై స్పందించారు. తాను తెలంగాణ ప్రజల బాణమని, ఎవరో ఆపరేట్ చేసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. 2029 ఎన్నికల్లో బరిలో ఉంటామని తెలిపారు. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్కు... పంచాయతీలకు నెలలో నిధులు విడుదల చేయాలి – లేదంటే హైదరాబాద్లో సర్పంచుల పరేడ్: బండి సంజయ్
కరీంనగర్, డిసెంబర్ 24 (ప్రజా మంటలు):
తెలంగాణ గ్రామ పంచాయతీలకు నిధుల విడుదల విషయంలో కేంద్రమంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నెల రోజుల్లోగా పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని డెడ్లైన్ విధిస్తూ, లేకపోతే హైదరాబాద్ నడిబొడ్డున రాష్ట్రవ్యాప్త సర్పంచులు, ఉప సర్పంచులతో భారీ “పరేడ్” నిర్వహిస్తామని హెచ్చరించారు. గ్రామాలకు నిధులు... 