సమాజాన్ని మార్చే శక్తి ఫొటోగ్రఫీకి ఉంది. * డాక్టర్ కోట నీలిమా
సమాజాన్ని మార్చే శక్తి ఫొటోగ్రఫీకి ఉంది.
* డాక్టర్ కోట నీలిమా
సికింద్రాబాద్ ఫిబ్రవరి 10 (ప్రజామంటలు) :
ఒక్కో ఫోటో వెనుక ఓ కథ ఉంటుందని. కొన్ని ఛాయ చిత్రాల దృశ్యాలకు మనసును కదిలించే శక్తి కలిగి ఉంటాయి. ఫోటోగ్రఫీ కేవలం కళ మాత్రమే కాదు, కొన్ని సార్లు అది సమాజాన్ని మార్చే ఓ గొప్ప శక్తిగా మారుతుందని ప్రముఖ రాజకీయవేత్త, రచయిత్రి,కళాకారిణి డా. కోటా నీలిమ అన్నారు. ఆమె హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో జరిగిన ‘గాలేరియా 2025’ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ ఫోటోగ్రఫీ సొసైటీ ( టీపీఎస్) నిర్వహించిన ఈ ఐదు రోజుల వార్షిక ప్రదర్శన ఫిబ్రవరి 7 నుండి 11 వరకు కొనసాగనుంది. డా. కోటా నీలిమకు వీవీఎస్ శర్మ, కార్యదర్శి ప్రశాంత్ మంచికంటి , సత్యప్రసాద్, హరీష్, కృష్ణన్ కల్పత్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డా. నీలిమ మాట్లాడుతూ, ఫోటోగ్రఫీ ద్వారా సంస్కృతి పరిరక్షణ, చరిత్ర డాక్యుమెంటేషన్, సామాజిక మార్పుకు నాంది పలికే విధంగా ఉంటుంది అని తెలిపారు. ఫోటోగ్రఫీ కళను ప్రోత్సహిస్తూ టీపీఎస్ అందిస్తున్న వేదికను ఆమె ప్రశంసించారు. ఈ ప్రదర్శనలో భాగస్వామ్యమైన ప్రతి ఫోటోగ్రాఫర్కు నా అభినందనలు,” అని ఆమె అన్నారు. ఈ ప్రదర్శనలో ఆచార సంప్రదాయాలు, ప్రకృతి, సమకాలీన సామాజిక సమస్యలు వంటి విభిన్న అంశాలను ప్రదర్శించే అద్భుత చిత్రాలు ప్రదర్శించబడుతున్నాయి. హైదరాబాద్ కళా ప్రేమికులు, విద్యార్థులు, ఫోటోగ్రఫీ అభిమానం కలిగిన ప్రతి ఒక్కరూ ఈ ప్రదర్శనను సందర్శించి ఆస్వాదించాలని కోరారు. ప్రదర్శన ఫిబ్రవరి 11, 2025 సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఫొటోగ్రఫీ ప్రేమికులు, కళాభిమానులు, యువ ప్రతిభావంతులు తప్పకుండా సందర్శించి వీక్షించవచ్చని ఆర్గనైజర్లు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

పెద్దపూర్ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్

మేడిపల్లి భీమారం , మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

పద్మశాలి కిట్టి పార్టీ ఆధ్వర్యంలో మెహందీ ఉత్సవం

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

గ్రీవెన్స్ డే సందర్భంగా పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
