యూ పి ఎస్ పై యుద్ధభేరిని విజయవంతం చెయ్యాలి
యూ పి ఎస్ పై యుద్ధభేరిని విజయవంతం చెయ్యాలి
ఓ పీ ఎస్ ను పునరుద్ధరించాలి -టి ఎస్ సి పి ఎస్ ఈ యు
ధర్మపురి ఫిబ్రవరి 10:
ఏప్రిల్ ఒకటి నుంచి అమలు చేయబోతున్న ఏకీకృత పెన్షన్ పథకం (యూపీఎస్) విధానం కు వ్యతిరేకంగా మార్చ్ 2 వ తేదీన ధర్నా చౌక్ ,హైదరాబాద్ లో జరిగే యూ పి ఎస్ పై యుద్ధభేరి ని విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మ్యాన పవన్ కుమార్ కోరారు.
ధర్మపురి పట్టణం లో గోడ పత్రిక ఆవిష్కరించారు ఈ సందర్భంగా మ్యాన పవన్ కుమార్ మాట్లాడుతూ
సీపీఎస్ వద్దంటూ పాత పెన్షన్ కొరకు రాష్ట్రవ్యాప్తంగా దశాబ్ద కాలంగా ఉద్యోగ ఉపాధ్యాయులు పోరాటం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం కొత్తగా యూపీఎస్ పేరుతో ఉద్యోగుల భవిష్యత్తును కార్పొరేట్లకు తాకట్టు పెడుతుందని దీనివల్ల ఉద్యోగుల జీవితాలు మరింత దుర్భరం అవుతాయనీ ఆందోళన వ్యక్తం చేశారు యూపీఎస్ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలనీ ఇది యూనిపైడ్ పెన్షన్ స్కీం కాదని యూస్ లెస్ పెన్షన్ స్కీం అని విమర్శించారు.
ఉద్యోగి దాచుకున్న డబ్బుల నుండే పెన్షన్ ఇవ్వడం అంటే ఉద్యోగి తనకు హక్కుగా రావాల్సిన పెన్షన్ ను డబ్బులతో కొనుకోలు చేసినట్లు అవుతుందని వెంటనే ఏలాంటి చందా చెల్లించకుండానే సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగికి 50% పెన్షన్ ఇచ్చే పాత పెన్షన్ పునరుద్ధరణ చేయాలని కోరారు తెలంగాణలో వచ్చేనెల రెండున హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ లో యూ పి ఎస్ పై యుద్ధభేరికి రాష్ట్రంలోని రెండు లక్షల యాభై వేల సి పి ఎస్ ఉద్యోగ ఉపాద్యాయులు హాజరై విజయవంతం చేయాలని కోరారు
More News...
<%- node_title %>
<%- node_title %>
ఉద్యమకారులకు న్యాయం చేయని కేసీఆర్ ప్రభుత్వం

ప్లాస్టిక్ బ్యాగ్ లు వద్దు..క్లాత్ బ్యాగులు ముద్దు

మెటుపల్లి లో దొడ్డి కొమురయ్య 79 వ వర్ధంతి

6 లక్షల మంది భక్తులు బల్కంపేట అమ్మవారిని దర్శించుకున్నారు - పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ

బహుముఖ ప్రజ్ఞాశాలి, వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శి పట్టాభిరామ్

ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే 2025 వేడుకలు

బన్సీలాల్ పేట లో వెలుగు చూసిన బోనాల చెక్కుల గోల్ మాల్

డెంగ్యూ పాజిటివ్ కేసు..అప్రమత్తమైన అధికారులు

రేపటి నుంచి వారం పాటు శ్రీసాయి సప్తాహ ఉత్సవాలు

ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయి చదువుకి శ్రీ సత్యసాయి సేవా సమితి ఆర్థిక చేయూత

రాయికల్ మండల కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

సేవా భారతి ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలు.
