అర్హులకు 4లక్షల రేషన్ కార్డులు అందిస్తాం - జైన గ్రామ సభలో రాష్ర్ట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
అర్హులకు 4లక్షల రేషన్ కార్డులు అందిస్తాం - జైన గ్రామ సభలో రాష్ర్ట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
(రామ కిష్టయ్య సంగన భట్ల)
తమ ప్రభుత్వం 4లక్షల కార్డులు ఇవ్వబోతున్నామని, దరఖాస్తు చేసుకోవడానికి గడువు అనేది లేదని, ఇది నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రభుత్వ పథకాల అమలులో లబ్ధిదారుల ఎంపికలో ప్రజామోదం పొందే గ్రామ సభలో భాగంగా బుధవారం ధర్మపురి మండలం జైనా గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో మరో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తం కుమార్ రెడ్డి ప్రసంగిస్తూ... రేషన్ కార్డులు గత ప్రభుత్వము ఉప ఎన్నికలు వస్తే తప్ప ఇవ్వలేదని.. గత పదేళ్లలో ఆ ప్రభుత్వము కేవలం 40000 రేషన్ కార్డులు ఇచ్చారని గుర్తు చేశారు.
ఇవాళ లబ్ధిదారుల పేర్లు లేని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోండి.. అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు ఇస్తామని ప్రకటించారు. జగిత్యాల జిల్లాలో గోదావరి నది జలాల ఎండిపోవడం వల్ల రైతులకు కలిగే ఇబ్బందులను నివారిస్తు, నీటిపారుదల అధికారులతో మాట్లాడి తప్పకుండా శాశ్వత పరిష్కారం చేస్తామన్నారు. ప్రస్తుతం గోదావరి ఎండిపోవడం వల్ల ఈ ప్రాంత రైతుల కోరిక మేరకు జీవన్ రెడ్డి, లక్ష్మణ్ కుమార్ తమ దృష్టికి తెగా, శ్రీరాంసాగర్ నుంచి నీరు విడుదల చేసామన్నారు. ఎమ్మేల్యే లక్ష్మణ్ అంటే తనకు చాలా అభిమానమని, ఆయన ఎంతో కష్టపడి ఎమ్మేల్యే గా గెలుపొందారన్నారు. అడ్లూరి లక్ష్మణ్ ఏ ప్రతిపాదన తీసుకొచ్చిన మంజూరు చేయిస్తానన్నారు..
రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం చేయలేని కార్యక్రమాలు తమ ప్రభుత్వం అమలు చేసి తీరుతుందన్నారు.
ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ కామెంట్స్
గోదావరి తీరప్రాంత రైతాంగానికి కష్టకాలంలో నీటిని విడుదల చేయించిన జల ప్రదాత ఉత్తంకుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే అర టిఎంసి నీటిని గోదావరిలోకి వదిలారని, మరో అర టీఎంసీ నీటిని విడుదల చేస్తారన్నారు. తలాపున గోదావరి ఉన్న తీర ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. బుగ్గారం మండలంలోని యశ్వంత్ రావు పేట చెరువుతో పాటు జంగల్ నాల ప్రాజెక్టులను పునరుద్ధరిస్తే నియోజకవర్గంలోని అత్యధిక శాతం సాగుకు లబ్ధి చేకూరుతుందన్నారు.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు కవ్వంపెల్లి, మేడిపెల్లి, కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, నాయకులు సంగణభట్ల దినేష్ నరసింగరావు, అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి, అధికారులు, నాయకులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎల్కతుర్తి గ్రామ అంగన్వాడి కేంద్రం–2 లో అక్షరాభ్యాస కార్యక్రమం
ఎల్కతుర్తి జనవరి 08 (ప్రజా మంటలు):
ఎల్కతుర్తి గ్రామంలోని అంగన్వాడి కేంద్రం–2లో గురువారం అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మునిగడప లావణ్య, ఉప సర్పంచ్ గొడిశాల రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా చిన్నారులకు విద్య ప్రాముఖ్యతను వివరించి,తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్న వయసు నుంచే చదువుపై దృష్టి... ఎల్కతుర్తి మండల కేంద్రంలో డెవిల్ ట్రీ లపై విమర్శలు
ఎల్కతుర్తి జనవరి 08 (ప్రజా మంటలు):
ఎల్కతుర్తి మండలం కేంద్రంలో డెవిల్ ట్రీగా పిలవబడే చెట్ల శాస్త్రీయ నామం ఆల్టోనియా స్కోలారిస్ వీటిని స్థానికంగా ఏడు ఆకుల చెట్టుగా కూడా పిలుస్తారు. అతి తక్కువ సమయంలోనే విస్తారంగా పెరిగే ఈ చెట్లు నిత్యం పచ్చగా కనిపిస్తాయి. భూమి నుంచి తక్కువ నీటిని మాత్రమే తీసుకుంటాయి.ప్రతి సంవత్సరం... అంబేద్కర్ చౌరస్తా నుంచి కార్మెల్ స్కూల్ వరకు ర్యాలీ
ఎల్కతుర్తి జనవరి 08 (ప్రజా మంటలు):
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నేషనల్ రోడ్డు సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామును గురువారం ఘనంగా నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలను నివారించి, ప్రజల్లో రవాణా నియమాలపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐ పులి... ఏసీబీకి చిక్కిన కాకతీయ యూనివర్సిటీ పీఎస్ ఎస్ఐ శ్రీకాంత్
హన్మకొండ జనవరి 08 (ప్రజా మంటలు):
కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ శ్రీకాంత్ ఏసీబీ అధికారుల వలకు చిక్కాడు. పేకాట కేసులో నిందితుడికి అనుకూలంగా వ్యవహరించేందుకు రూ.15 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తున్న సమయంలో హన్మకొండ ఏసీబీ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
పేకాట కేసును తేలిక చేయాలని... జేఎన్టీయూహెచ్ ఇంజినీరింగ్ కళాశాలలో 10000 Coders క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ విజయవంతం
జగిత్యాల | జనవరి 08 (ప్రజా మంటలు):
జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, జగిత్యాలలో బి.టెక్ విద్యార్థుల కోసం 10000 Coders ఆధ్వర్యంలో క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ను విజయవంతంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. జి. నరసింహ తెలిపారు.
ఈ క్యాంపస్ డ్రైవ్లో భాగంగా ముందుగా 10000 Coders సంస్థ హెచ్ఆర్ ప్రతినిధి పి.... ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కొత్త విద్యా విధానం : సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, జనవరి 08 (ప్రజా మంటలు):
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక విద్యా విధానాన్ని త్వరలో అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి రోహిత్ ఠాకూర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో... రోడ్డు భద్రత నియమాలు పాటించడం మనందరి భాద్యత * జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల జనవరి 8 ( ప్రజా మంటలు)
జిల్లాలో రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆధ్వర్యంలో“జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం – 2026” బైక్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు.
గురువారం జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం – 2026 బైక్ ర్యాలీని జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్... విద్యుత్ సమస్య ఎదురైన వెంటనే సంస్థ టోల్ ఫ్రీ నెంబర్ 1912 ను సంప్రదిస్తే త్వరతగతిన సమస్యని పరిష్కరిస్తాం ఏఈ. సంతోష్
జగిత్యాల జనవరి 8 ( ప్రజా మంటలు) విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో గురువారం స్థానిక తైసిల్ చౌరస్తాలో 'ప్రజా బాట' కార్యక్రమంలో భాగంగా విద్యుత్ వినియోగ దారులకు అవగాహన కల్పించారు. విద్యుత్ ప్రమాదాల నివారణపై ఏఈ సంతోష్, రాంజీ నాయక్ మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులు భద్రత నియమాలు పాటిస్తూ జాగ్రత్త వహించాలని, నాణ్యమైన విద్యుత్
వినియోగదారులకు... జర్నలిస్టులకు, న్యాయవాదులకు రక్షణ కరువు హై కోర్ట్ న్యాయవాది వి.రఘునాథ్
జగిత్యాల జనవరి 8 ( ప్రజా మంటలు)నేడు మన దేశంలో న్యాయం కోసం ఆరాటపడే జర్నలిస్టులకు, న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయిందని సీనియర్ హై కోర్టు న్యాయవాది వి.రఘునాథ్ అన్నారు. జగిత్యాలలో ఆయన గురువారం విలేఖరులతో మాట్లాడారు.
దేశంలో నాలుగవ స్తంభం జర్నలిస్ట్ లని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా న్యాయవాదులను, జర్నలిస్టులను... జాతీయ సదస్సులో పాల్గొన్న వెనుగుమట్ల ఉపాధ్యాయుడు
గొల్లపల్లి జనవరి 8 (ప్రజా మంటలు) నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇండియా భాగస్వామ్యంతో అకాడమీ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ (ఏఎస్టీసీ) అనే సంస్థ ‘ఈనాడు’తో కలిసి గురువారం హైదరాబాద్లో ‘శాస్త్ర విజ్ఞానాన్ని ప్రయోగశాల నుంచి సమాజంలోకి తీసుకెళ్లడంలో సమాచార పాత్ర - వికసిత్ భారత్-2047 నిర్మాణం’ అనే ఇతివృత్తంతో,మాజీ ఉపరాష్ట్రపతి
సైన్స్... మేడారం జాతరకు కేసీఆర్కు ఆహ్వానం
సిద్ధిపేట, జనవరి 08 (ప్రజా మంటలు):మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావును జాతరకు హాజరుకావాల్సిందిగా రాష్ట్ర మహిళా మంత్రులు ఆహ్వానించారు.
రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ మరియు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీ రాజ్, మహిళా మరియు శిశు సంక్షేమ... బ్రాహ్మణులపై దాడికి నిరసనగా డిజిపి కి బ్రాహ్మణ సంఘాల నాయకుల ఫిర్యాదు.
హైదరాబాద్ జనవరి 8 ( ప్రజా మంటలు)బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో గోదావరి హారతి అర్చకులుగా పనిచేస్తున్న బ్రహ్మశ్రీ దీక్షిత్ సాయి కళాధర్ శర్మ పై మూడు రోజుల క్రితం కొందరు దుండగులు పథకం ప్రకారం దారుణంగా దాడి చేశారు పరుష పదజాలంతో దూషిస్తూ చాలా ఘోరంగా పిడిగుద్దులతో దాడి చేశారు.
ఇటీవల... 