అర్హులకు 4లక్షల రేషన్ కార్డులు అందిస్తాం - జైన గ్రామ సభలో రాష్ర్ట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

On
అర్హులకు 4లక్షల రేషన్ కార్డులు అందిస్తాం - జైన గ్రామ సభలో రాష్ర్ట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

అర్హులకు 4లక్షల రేషన్ కార్డులు అందిస్తాం - జైన గ్రామ సభలో రాష్ర్ట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి


 (రామ కిష్టయ్య సంగన భట్ల)

తమ ప్రభుత్వం 4లక్షల కార్డులు ఇవ్వబోతున్నామని, దరఖాస్తు చేసుకోవడానికి గడువు అనేది లేదని, ఇది నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రభుత్వ పథకాల అమలులో లబ్ధిదారుల ఎంపికలో  ప్రజామోదం పొందే గ్రామ సభలో భాగంగా బుధవారం ధర్మపురి మండలం జైనా గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో మరో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తం కుమార్ రెడ్డి ప్రసంగిస్తూ... రేషన్ కార్డులు గత ప్రభుత్వము ఉప ఎన్నికలు వస్తే తప్ప ఇవ్వలేదని.. గత పదేళ్లలో ఆ ప్రభుత్వము కేవలం 40000 రేషన్ కార్డులు ఇచ్చారని గుర్తు చేశారు.

ఇవాళ లబ్ధిదారుల పేర్లు లేని వారు మళ్లీ  దరఖాస్తు చేసుకోండి.. అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు ఇస్తామని ప్రకటించారు. జగిత్యాల జిల్లాలో గోదావరి నది జలాల ఎండిపోవడం వల్ల రైతులకు కలిగే ఇబ్బందులను నివారిస్తు, నీటిపారుదల అధికారులతో మాట్లాడి తప్పకుండా శాశ్వత పరిష్కారం చేస్తామన్నారు. ప్రస్తుతం  గోదావరి ఎండిపోవడం వల్ల ఈ ప్రాంత రైతుల కోరిక మేరకు జీవన్ రెడ్డి, లక్ష్మణ్ కుమార్ తమ దృష్టికి తెగా, శ్రీరాంసాగర్ నుంచి నీరు విడుదల చేసామన్నారు.  ఎమ్మేల్యే లక్ష్మణ్ అంటే తనకు చాలా అభిమానమని, ఆయన ఎంతో కష్టపడి ఎమ్మేల్యే గా గెలుపొందారన్నారు. అడ్లూరి లక్ష్మణ్ ఏ ప్రతిపాదన తీసుకొచ్చిన మంజూరు చేయిస్తానన్నారు..

రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం చేయలేని కార్యక్రమాలు తమ ప్రభుత్వం అమలు చేసి తీరుతుందన్నారు. 

 ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ కామెంట్స్
 గోదావరి తీరప్రాంత రైతాంగానికి కష్టకాలంలో నీటిని విడుదల చేయించిన  జల ప్రదాత ఉత్తంకుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే అర టిఎంసి నీటిని గోదావరిలోకి వదిలారని, మరో అర టీఎంసీ నీటిని విడుదల చేస్తారన్నారు. తలాపున గోదావరి ఉన్న తీర ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. బుగ్గారం  మండలంలోని యశ్వంత్ రావు పేట చెరువుతో పాటు జంగల్ నాల ప్రాజెక్టులను పునరుద్ధరిస్తే నియోజకవర్గంలోని అత్యధిక శాతం సాగుకు లబ్ధి చేకూరుతుందన్నారు.

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు కవ్వంపెల్లి, మేడిపెల్లి, కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, నాయకులు సంగణభట్ల దినేష్ నరసింగరావు, అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి, అధికారులు, నాయకులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Crime  State News 

యాదాద్రి లో ఏసీబీ వలలో ఆలయ ఇంజనీరు

యాదాద్రి లో ఏసీబీ వలలో ఆలయ ఇంజనీరు – రూ.1.90 లక్షల లంచం స్వీకరిస్తుండగా పట్టుబాటు   యాదాద్రి అక్టోబర్ 30 (ప్రజా మంటలు): యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (యాదగిరిగుట్ట)లో అవినీతి కలకలం రేపుతోంది. ఆలయ ఇంజినీర్ (S.E) ఉడేపు రామారావు ఏసీబీ వలలో చిక్కుకున్నారు. ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్‌ నుంచి రూ.1.90 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 📍 ...
Read More...
State News 

తెలంగాణలో ఎరుపు హెచ్చరిక – 8 జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం

తెలంగాణలో ఎరుపు హెచ్చరిక – 8 జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం అక్టోబర్ 30, (ప్రజా మంటలు): తెలంగాణలో అతివృష్టి బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాలతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు జలమయమవుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. 📍 రికార్డు స్థాయి వర్షపాతం తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్రకారం, హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో అత్యధికంగా ...
Read More...

తెలంగాణలో మొంథా బీభత్సం కొనసాగుతుంది –ములుగు, వరంగల్ జలదిగ్భంధం, రైతులు ఆందోళనలో

తెలంగాణలో మొంథా బీభత్సం కొనసాగుతుంది –ములుగు, వరంగల్ జలదిగ్భంధం, రైతులు ఆందోళనలో ప్రతి కుటుంబానికి ₹3,000 ప్రత్యేక సాయం ప్రతి వ్యక్తికి ₹1,000 చొప్పున, గరిష్టంగా కుటుంబానికి ₹3,000 వరకు చెల్లింపు జిల్లా కలెక్టర్లకు తక్షణ చెల్లింపుల అనుమతి హైదరాబాద్ అక్టోబర్ 30 (ప్రజా మంటలు): తెలంగాణపై మొంథా తుఫాన్ తన ప్రభావాన్ని కొనసాగిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేసిన ఈ తుఫాన్ బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారినప్పటికీ...
Read More...
National  Opinion  International  

ఆమె ధరించేది ఎవరు నిర్ణయించాలి? ఇరాన్‌లో హిజాబ్ చట్టాలపై మహిళల తిరుగుబాటు

ఆమె ధరించేది ఎవరు నిర్ణయించాలి? ఇరాన్‌లో హిజాబ్ చట్టాలపై మహిళల తిరుగుబాటు ఇరాన్‌లో మహిళల తిరుగుబాటు యూరప్‌లో విరుద్ధ పరిస్థితి అక్టోబర్ 30, (ప్రజా మంటలు): ఇరాన్‌లో మహిళలు హిజాబ్ తప్పనిసరి చట్టాలకు వ్యతిరేకంగా స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారు. మరోవైపు యూరప్‌లో మాత్రం కొత్త చట్టాలు హిజాబ్‌పై నిషేధాలు విధిస్తున్నాయి. దీంతో ఒక్క ప్రశ్న ముందుకు వస్తోంది — మహిళ ఏం ధరించాలో నిర్ణయించేది ఎవర ఇరాన్‌లో మహిళల...
Read More...

అమెరికా–చైనా నేతల భేటీ: ఆరేళ్ల తర్వాత ట్రంప్–జిన్ పింగ్ ముఖాముఖి | సానుకూల సందేశాలు

అమెరికా–చైనా నేతల భేటీ: ఆరేళ్ల తర్వాత ట్రంప్–జిన్ పింగ్ ముఖాముఖి | సానుకూల సందేశాలు 6 ఏళ్ల తర్వాత ట్రంప్–జిన్ పింగ్ భేటీ బుసాన్‌లో స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు అమెరికా–చైనా సంబంధాల మెరుగుదలకు సంకేతాలు భూసాన్ (దక్షిణ కొరియా) అక్టోబర్ 30:ప్రజా మంటలు దాదాపు ఆరేళ్ల తర్వాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరియు చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ (Xi Jinping) ముఖాముఖీ భేటీ...
Read More...
Local News  Crime 

గుర్రంపోడు: పెళ్లైన 14 రోజులు కూడా గడవక ముందే మృత్యువు ముంచుకొచ్చింది

గుర్రంపోడు: పెళ్లైన 14 రోజులు కూడా గడవక ముందే మృత్యువు ముంచుకొచ్చింది నల్గొండ అక్టోబర్ 30 (ప్రజా మంటలు):  ప్రేమించి వివాహం చేసుకున్న నవదంపతుల కలలు కళ్లముందే చిద్రమయ్యాయి. నాంపల్లి మండలం దామెర గ్రామానికి చెందిన అనూష (22), చాంలేడు గ్రామానికి చెందిన చిలువేరు నవీన్ ఇటీవలే ప్రేమవివాహం చేసుకున్నారు. పెద్దల అంగీకారంతో కేవలం 14 రోజుల క్రితం గుడిలో దండలు మార్చుకున్నారు. బుధవారం సాయంత్రం దంపతులు ద్విచక్ర...
Read More...

జగిత్యాలలో ₹100 కోట్ల ప్రభుత్వ భూమి వివాదం – బాధ్యత గల పౌరుడిగా భూ ఆక్రమణను వెలుగులోకి తెచ్చిన - మాజీ మంత్రి జీవన్ రెడ్డి

జగిత్యాలలో ₹100 కోట్ల ప్రభుత్వ భూమి వివాదం – బాధ్యత గల పౌరుడిగా భూ ఆక్రమణను వెలుగులోకి తెచ్చిన - మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో కాంగ్రెసు నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి తాటి పర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని స్పష్టం చేశారు. ₹100 కోట్ల విలువ గల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని ఆరోపణల నేపథ్యంలో, జీవన్...
Read More...
Local News  Spiritual   State News 

న్యాయవాదులపై అనుచిత ప్రవర్తన కేసు - మానవహక్కుల కమీషన్ కు ఫిర్యాదు

న్యాయవాదులపై అనుచిత ప్రవర్తన కేసు - మానవహక్కుల కమీషన్ కు ఫిర్యాదు మానవ హక్కుల కమిషన్ లో అడ్వకేట్ రామారావు ఫిర్యాదు    జనగాం పోలీసులపై ఎఫ్‌ఐఆర్ సికింద్రాబాద్, అక్టోబర్ 29 (ప్రజామంటలు) : గతంలో జనగాం సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తించిన రఘుపతి, ఎస్‌ఐ తిరుపతి లపై న్యాయవాద దంపతులు గద్దల అమృత్‌రావు, కవితలతో అనుచిత ప్రవర్తన చేసిన ఘటనకు సంబంధించి జనగాం పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు...
Read More...
Local News  State News 

గాంధీ రోగి సహాయకుల విశ్రాంతి భవన నిర్వాహణకు చేయూత

గాంధీ రోగి సహాయకుల విశ్రాంతి భవన నిర్వాహణకు చేయూత నిత్యవసరాలు, బ్లాంకెట్లు అందచేసిన ఎస్‌బీఐ లేడీస్ క్లబ్ సికింద్రాబాద్, అక్టోబర్ 29 ( ప్రజామంటలు): గాంధీ ఆస్పత్రిలోని జనహిత సేవా ట్రస్ట్ నిర్వహిస్తున్న రోగి సహాయకుల విశ్రాంతి భవనాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేడీస్ క్లబ్, హైదరాబాద్ సభ్యులు బుధవారం సందర్శించారు. షెల్టర్ హోమ్‌లో ఉన్న లబ్ధిదారులతో మాట్లాడి వారి అవసరాలను తెలుసుకున్నారు.లబ్ధిదారులు మాట్లాడుతూ...
Read More...
National  Crime  State News 

ఎన్‌కౌంటర్ భయం వ్యక్తం చేసిన గ్యాంగ్‌స్టర్ జగ్గు భగవాన్‌పురియా — హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలు

ఎన్‌కౌంటర్ భయం వ్యక్తం చేసిన గ్యాంగ్‌స్టర్ జగ్గు భగవాన్‌పురియా — హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలు చండీగఢ్ అక్టోబర్ 39: పంజాబ్‌కు తరలించే ముందు కస్టడీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ జగ్గు భగవాన్‌పురియా తన ప్రాణ భయాన్ని వ్యక్తం చేస్తూ పంజాబ్-హర్యానా హైకోర్టును ఆశ్రయించాడు. తనను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చే అవకాశం ఉందని భగవాన్‌పురియా తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో హైకోర్టు, పంజాబ్ ప్రభుత్వాన్ని నోటీసు జారీ చేస్తూ, రాష్ట్రం నుండి వివరణ...
Read More...
National  State News 

చాచల్‌లో జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల ఆందోళన — వేతన సమానత్వం సహా డిమాండ్లు

చాచల్‌లో జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల ఆందోళన — వేతన సమానత్వం సహా డిమాండ్లు గౌహతి అక్టోబర్ 29: గువహటి నగరంలోని చాచల్ ప్రాంతంలో జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) ఉద్యోగుల సంఘం మరియు అఖిల అసోం హెల్త్ అండ్ టెక్నికల్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. ఉద్యోగులు సమాన వేతనాలు, సేవా భద్రత, అలాగే ముఖ్యమంత్రి డా. హిమంత బిశ్వ శర్మ ఇచ్చిన హామీలను...
Read More...
National  Opinion  International   State News 

“భారత్‌తో యుద్ధం చేస్తే నష్టపోయేది పాకిస్తానే” -పాకిస్తాన్‌కు అమెరికా మాజీ సీఐఏ అధికారి హెచ్చరిక

“భారత్‌తో యుద్ధం చేస్తే నష్టపోయేది పాకిస్తానే” -పాకిస్తాన్‌కు అమెరికా మాజీ సీఐఏ అధికారి హెచ్చరిక వాషింగ్టన్/న్యూ ఢిల్లీ, అక్టోబర్ 29:భారత్‌తో యుద్ధానికి ప్రయత్నిస్తే పాకిస్తాన్‌ ఘోర పరాజయాన్ని చవిచూసే అవకాశం ఉందని అమెరికా సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (CIA) మాజీ అధికారి జాన్ కిరియాకో (John Kiriakou) హెచ్చరించారు. తన 15 ఏళ్ల కౌంటర్‌టెరరిజం సేవా కాలంలో సగం కాలాన్ని పాకిస్తాన్‌లో గడిపిన ఆయన, పాకిస్తాన్‌ నిరంతరం భారతదేశాన్ని ప్రేరేపించడం...
Read More...