అర్హులకు 4లక్షల రేషన్ కార్డులు అందిస్తాం - జైన గ్రామ సభలో రాష్ర్ట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
అర్హులకు 4లక్షల రేషన్ కార్డులు అందిస్తాం - జైన గ్రామ సభలో రాష్ర్ట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
(రామ కిష్టయ్య సంగన భట్ల)
తమ ప్రభుత్వం 4లక్షల కార్డులు ఇవ్వబోతున్నామని, దరఖాస్తు చేసుకోవడానికి గడువు అనేది లేదని, ఇది నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రభుత్వ పథకాల అమలులో లబ్ధిదారుల ఎంపికలో ప్రజామోదం పొందే గ్రామ సభలో భాగంగా బుధవారం ధర్మపురి మండలం జైనా గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో మరో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తం కుమార్ రెడ్డి ప్రసంగిస్తూ... రేషన్ కార్డులు గత ప్రభుత్వము ఉప ఎన్నికలు వస్తే తప్ప ఇవ్వలేదని.. గత పదేళ్లలో ఆ ప్రభుత్వము కేవలం 40000 రేషన్ కార్డులు ఇచ్చారని గుర్తు చేశారు.
ఇవాళ లబ్ధిదారుల పేర్లు లేని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోండి.. అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు ఇస్తామని ప్రకటించారు. జగిత్యాల జిల్లాలో గోదావరి నది జలాల ఎండిపోవడం వల్ల రైతులకు కలిగే ఇబ్బందులను నివారిస్తు, నీటిపారుదల అధికారులతో మాట్లాడి తప్పకుండా శాశ్వత పరిష్కారం చేస్తామన్నారు. ప్రస్తుతం గోదావరి ఎండిపోవడం వల్ల ఈ ప్రాంత రైతుల కోరిక మేరకు జీవన్ రెడ్డి, లక్ష్మణ్ కుమార్ తమ దృష్టికి తెగా, శ్రీరాంసాగర్ నుంచి నీరు విడుదల చేసామన్నారు. ఎమ్మేల్యే లక్ష్మణ్ అంటే తనకు చాలా అభిమానమని, ఆయన ఎంతో కష్టపడి ఎమ్మేల్యే గా గెలుపొందారన్నారు. అడ్లూరి లక్ష్మణ్ ఏ ప్రతిపాదన తీసుకొచ్చిన మంజూరు చేయిస్తానన్నారు..
రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం చేయలేని కార్యక్రమాలు తమ ప్రభుత్వం అమలు చేసి తీరుతుందన్నారు.
ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ కామెంట్స్
గోదావరి తీరప్రాంత రైతాంగానికి కష్టకాలంలో నీటిని విడుదల చేయించిన జల ప్రదాత ఉత్తంకుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే అర టిఎంసి నీటిని గోదావరిలోకి వదిలారని, మరో అర టీఎంసీ నీటిని విడుదల చేస్తారన్నారు. తలాపున గోదావరి ఉన్న తీర ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. బుగ్గారం మండలంలోని యశ్వంత్ రావు పేట చెరువుతో పాటు జంగల్ నాల ప్రాజెక్టులను పునరుద్ధరిస్తే నియోజకవర్గంలోని అత్యధిక శాతం సాగుకు లబ్ధి చేకూరుతుందన్నారు.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు కవ్వంపెల్లి, మేడిపెల్లి, కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, నాయకులు సంగణభట్ల దినేష్ నరసింగరావు, అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి, అధికారులు, నాయకులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బీసీలకు 42% రిజర్వేషన్ అమలుకి 9వ షెడ్యూల్ లో చేర్చాలి: జీవన్ రెడ్డి
జగిత్యాల, డిసెంబర్ 11 (ప్రజా మంటలు):బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలంటే, రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చడం తప్పనిసరి అని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల ఇందిరా భవన్లో విలేకరులతో మాట్లాడిన ఆయన, 50% రిజర్వేషన్ పరిమితిని అధిగమించడానికి ఇదే మార్గమని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ ఆలోచనలతో బలహీన... ముత్తారం సర్పంచ్ గా ఉరడి భారతి జైపాల్ రెడ్డి విజయం
అందరి సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తా - ఊరడి భారతి కొత్తగూడెం జాగృతి ఇన్చార్జీగా జగదీశ్ నియామకం
హైదరాబాద్ డిసెంబర్ 11 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జీగా నమ్మి జగదీశ్ను నియమిస్తూ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి అధికారిక ప్రకటనలో వెల్లడించారు.
అదే విధంగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన సముద్రాల క్రాంతి కుమార్ను ... నేను ప్రస్తుతం బీఆర్ఎస్లో లేను. అయినా ప్రజల కోసం పోరాటం ఆగదు” : కవిత
మలక్పేట్–యాకుత్పురా "జనం బాట" పర్యటనలో కల్వకుంట్ల కవిత: విద్యార్థులు, వ్యాపారులు, వృత్తిదారుల సమస్యలపై ప్రభుత్వంపై మండిపాటు
హైదరాబాద్ డిసెంబర్ 11 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మలక్పేట్, సైదాబాద్, యాకుత్పురా ప్రాంతాల్లో పర్యటిస్తూ విద్యార్థులు, వ్యాపారులు, కుమ్మరి వృత్తిదారులు, స్థానిక ప్రజల సమస్యలను సమీక్షించారు.
నేను ప్రస్తుతం బీఆర్ఎస్లో లేను. అయినా... జగిత్యాల జిల్లా, గ్రామపంచాయతీ ఎన్నికల మొదటిదశలో పోలింగ్ మొత్తం 73.68% ఓటింగ్
జగిత్యాల డిసెంబర్ 11 (ప్రజా మంటలు):
2025 గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా జగిత్యాల జిల్లాలో పోలింగ్ మధ్యాహ్నం 1 గంటకు ముగిసింది. అధికారిక ప్రొఫార్మా–II ప్రకారం, జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,18,194 మంది నమోదైన ఓటర్లలో 1,60,761 మంది తమ ఓటు హక్కును వినియోగించారు. దీంతో జిల్లాలో మొత్తం పోలింగ్ శాతం 73.68% వద్ద... సీఎం సహాయనిధి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల రూరల్ డిసెంబర్ 11(ప్రజా మంటలు)రూరల్ మండలం అంతర్గం గ్రామానికి చెందిన ఏ.సుగుణ కు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 1లక్ష 20 వేల రూపాయల విలువగల చెక్కులను జగిత్యాల క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ వెంట నాయకులు నక్కల రవీందర్ రెడ్డి రౌతు గంగాధర్ తదితరులు... జిల్లా పరిధిలో ప్రశాంతంగా జరుగుతున్నమొదటి విడత సర్పంచ్ ఎన్నికలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 11 (ప్రజా మంటలు)మొదటి విడత సర్పంచి ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు.ఎన్నికలు జరుగుతున్న పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.
జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పెట్రోలింగ్ వాహనాలు మరియు ప్రత్యేక పోలీసు... పవిత్ర హత్య కేసులో నిందితుడు ఉమాశంకర్ అరెస్ట్
సికింద్రాబాద్, డిసెంబర్ 10 (ప్రజామంటలు) :
వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపూజీనగర్లో 18ఏళ్ల యువతి పవిత్రపై జరిగిన క్రూరహత్య కేసులో నిందితుడు దుక్కా ఉమాశంకర్ను వారాసిగూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి బుధవారం వారాసిగూడ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
డిసెంబర్ 8న జరిగిన... మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు భద్రత ఏర్పాట్లు పూర్తి : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
ఎన్నికలు నిర్వహణకు 843 మంది పోలీస్ లతో పటిష్ట బందోబస్తు.జగిత్యాల/కోరుట్ల మెట్పల్లి,డిసెంబర్ 10(ప్రజా మంటలు)
జిల్లాలో జరుగుతున్న మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు.
బుధవారం బీమారం ,కోరుట్ల,మెట్ పల్లి లో ఏర్పాటు చేసిన... శ్రీ మల్లికార్జున స్వామి దర్శించుకున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ ఎన్. సుప్రియ
(అంకం భూమయ్య)
గొల్లపల్లి, డిసెంబర్ 10 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం మల్లన్నపేటలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం (దొంగ మల్లన్న) జాతర కార్యక్రమంలో భాగంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ ఎన్. సుప్రియ బుధవారం ఆలయాన్ని సందర్శించారు. ఆమెతో పాటు జగిత్యాల డివిజన్ ఇన్స్పెక్టర్ రాజమొగిలి కూడా స్వామి వారిని దర్శించుకుని... మైతాపూర్ గ్రామంలో బిజెపి బలపరిచిన అభ్యర్థి కి మద్దతు గా ప్రచారము నిర్వహించిన డా భోగ శ్రావణి
రాయికల్ డిసెంబర్ 10 ( ప్రజా మంటలు)మండలములోని మహితాపూర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలలో భాగంగా బిజెపి పార్టీ బలపరిచిన అభ్యర్థి రాజనాల సుందరి-జయానందం గారికి మద్దతుగా ఇంటింటి ప్రచారంలో పాల్గొని బ్యాట్ గుర్తుపై ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా.బోగ శ్రావణి
ఈ కార్యక్రమంలో రాయికల్... కొండగట్టులో అగ్ని ప్రమాద బాధితులకు జగిత్యాల లేడీస్ ఎంపోరియం సంఘం సభ్యుల చేయూత
కొండగట్టు డిసెంబర్ 10 –(ప్రజా మంటలు):
కొండగట్టుకు రోజు వారీ జీవనోపాధి కోసం వచ్చి చిన్న దుకాణాల ద్వారా బొమ్మలు, గాజులు, పిల్లల ఆట వస్తువులు అమ్ముకునే కుటుంబాలు కొన్ని రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యాయి. ఈ బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తూ జగిత్యాల లేడీస్ ఎంపోరియం సంఘం సభ్యులు... 