గల్ఫ్ ఎక్స్ గ్రేషియా నిధులు విడుదల చేయండి సీఎంకు కాంగ్రెస్ ఎన్నారై సెల్ నాయకుల విజ్ఞప్తి
గల్ఫ్ ఎక్స్ గ్రేషియా నిధులు విడుదల చేయండి
సీఎంకు కాంగ్రెస్ ఎన్నారై సెల్ నాయకుల విజ్ఞప్తి
సింగపూర్ పర్యటనలో సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు
(రామ కిష్టయ్య సంగన భట్ల)
తెలంగాణ ప్రభుత్వం 94 మంది గల్ఫ్ మృతులకు ఇచ్చిన రూ.5 లక్షల చెక్కులకు రూ.4 కోట్ల 70 లక్షల నిధులను త్వరగా విడుదల చేయాలని సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, మంత్రి డి. శ్రీధర్ బాబు లను కాంగ్రెస్ ఎన్నారై సెల్ నాయకులు మంద భీంరెడ్డి, నంగి దేవేందర్ రెడ్డి లు సింగపూర్ లోని హోటల్ లో కలిసి విజ్ఞప్తి చేశారు.
ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె. రామక్రిష్ణా రావు వద్ద ఉన్న పెండింగ్ ఫైల్ ను ఆమోదింప చేయాలని భీంరెడ్డి, దేవేందర్ రెడ్డి చేసిన విజ్ఞప్తికి వారు సానుకూలంగా స్పందించారు. గల్ఫ్, ఇరాక్ లతో పాటు సింగపూర్, మలేసియా తదితర 18 ఈసీఆర్ దేశాలలో మృతి చెందిన కార్మికులకు కూడా ఎక్స్ గ్రేషియా వర్తింపజేయాలని వారు కోరారు.
రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా మంజూరి పత్రాలు జారీ చేసి నిధుల విడుదల కొరకు ఎదిరి చూస్తున్నవారి వివరాలు జిల్లా వారీగా. జగిత్యాల (31), నిజామాబాద్ (28), రాజన్న సిరిసిల్ల (8), నిర్మల్ (5), కామారెడ్డి, సిద్దిపేట నాలుగు చొప్పున, కరీంనగర్, మంచిర్యాల మూడు చొప్పున, మెదక్ (2), వరంగల్, హన్మకొండ, పెద్దపల్లి, నల్గొండ, సంగారెడ్డి, రంగారెడ్డి ఒకటి చొప్పున మొత్తం 94 కుటుంబాలకు చెక్కులు ఇచ్చారు.కానీ ఇంకా నిధులు విడుదల చేయకపోవడం వల్ల బాధితులకు డబ్బులు అందలేదని తెలిపారు.
అంతకు ముందు శనివారం సాయంత్రం ప్రవాసులతో సింగపూర్ లోని తెలంగాణ కల్చరల్ సొసైటీ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం (మీట్ అండ్ గ్రీట్) కార్యక్రమంలో సీఎం ఏ. రేవంత్ రెడ్డి, మంత్రి డి. శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస రెడ్డి, కుందూరు జైవీర్ రెడ్డి, హైదరాబాద్ డీసీసీ అధ్యక్షులు డా. సి. రోహిన్ రెడ్డి, సింగపూర్ తెలంగాణ సంఘం అధ్యక్షులు గడప రమేష్, మాజీ అధ్యక్షులు నీలం మహేందర్, వ్యవస్థాపక అధ్యక్షులు బండ మాధవ రెడ్డి, సునీతా రెడ్డి, కాసర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బీరయ్య గుడి 12 లక్షల ప్రొసీడింగ్స్ కురుమ సంఘ సభ్యులకు ఎమ్మెల్యే చే అందజేత

పేద బాలుడి వైద్య ఖర్చులకు 1.13 లక్షలు సాయం.

కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

మండల విద్యాధికారి భూస జమునా దేవి పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా విద్యాధికారి రాము,

సమయస్ఫూర్తితో వ్యక్తి ప్రాణాలను కాపాడిన ధర్మపురి సిఐ, రామ్ నరసింహారెడ్డి

ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించాలి ఇండ్ల స్థలాలు, పెన్షన్ లు ఇవ్వాలి
.jpg)
వెల్గటూర్ మండలంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి సతీమణి పర్యటన

35వ వార్డులో సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
.jpg)
ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం లో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్
