గల్ఫ్ ఎక్స్ గ్రేషియా నిధులు విడుదల చేయండి సీఎంకు కాంగ్రెస్ ఎన్నారై సెల్ నాయకుల విజ్ఞప్తి
గల్ఫ్ ఎక్స్ గ్రేషియా నిధులు విడుదల చేయండి
సీఎంకు కాంగ్రెస్ ఎన్నారై సెల్ నాయకుల విజ్ఞప్తి
సింగపూర్ పర్యటనలో సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు
(రామ కిష్టయ్య సంగన భట్ల)
తెలంగాణ ప్రభుత్వం 94 మంది గల్ఫ్ మృతులకు ఇచ్చిన రూ.5 లక్షల చెక్కులకు రూ.4 కోట్ల 70 లక్షల నిధులను త్వరగా విడుదల చేయాలని సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, మంత్రి డి. శ్రీధర్ బాబు లను కాంగ్రెస్ ఎన్నారై సెల్ నాయకులు మంద భీంరెడ్డి, నంగి దేవేందర్ రెడ్డి లు సింగపూర్ లోని హోటల్ లో కలిసి విజ్ఞప్తి చేశారు.
ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె. రామక్రిష్ణా రావు వద్ద ఉన్న పెండింగ్ ఫైల్ ను ఆమోదింప చేయాలని భీంరెడ్డి, దేవేందర్ రెడ్డి చేసిన విజ్ఞప్తికి వారు సానుకూలంగా స్పందించారు. గల్ఫ్, ఇరాక్ లతో పాటు సింగపూర్, మలేసియా తదితర 18 ఈసీఆర్ దేశాలలో మృతి చెందిన కార్మికులకు కూడా ఎక్స్ గ్రేషియా వర్తింపజేయాలని వారు కోరారు.
రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా మంజూరి పత్రాలు జారీ చేసి నిధుల విడుదల కొరకు ఎదిరి చూస్తున్నవారి వివరాలు జిల్లా వారీగా. జగిత్యాల (31), నిజామాబాద్ (28), రాజన్న సిరిసిల్ల (8), నిర్మల్ (5), కామారెడ్డి, సిద్దిపేట నాలుగు చొప్పున, కరీంనగర్, మంచిర్యాల మూడు చొప్పున, మెదక్ (2), వరంగల్, హన్మకొండ, పెద్దపల్లి, నల్గొండ, సంగారెడ్డి, రంగారెడ్డి ఒకటి చొప్పున మొత్తం 94 కుటుంబాలకు చెక్కులు ఇచ్చారు.కానీ ఇంకా నిధులు విడుదల చేయకపోవడం వల్ల బాధితులకు డబ్బులు అందలేదని తెలిపారు.
అంతకు ముందు శనివారం సాయంత్రం ప్రవాసులతో సింగపూర్ లోని తెలంగాణ కల్చరల్ సొసైటీ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం (మీట్ అండ్ గ్రీట్) కార్యక్రమంలో సీఎం ఏ. రేవంత్ రెడ్డి, మంత్రి డి. శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస రెడ్డి, కుందూరు జైవీర్ రెడ్డి, హైదరాబాద్ డీసీసీ అధ్యక్షులు డా. సి. రోహిన్ రెడ్డి, సింగపూర్ తెలంగాణ సంఘం అధ్యక్షులు గడప రమేష్, మాజీ అధ్యక్షులు నీలం మహేందర్, వ్యవస్థాపక అధ్యక్షులు బండ మాధవ రెడ్డి, సునీతా రెడ్డి, కాసర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వికసించిన భారతీయ నాగరిక విద్యా సమితి
జగిత్యాల జనవరి 26 ( ప్రజా మంటలు) భారతీయ నాగరిక విద్యా సమితి సంస్థ శ్రీ సరస్వతి శిశు మందిర్ ,భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా విద్యతో పాటు వివిధ రంగాల్లో విద్యార్థులను ఎప్పటికప్పుడు మారుతున్న సామాజిక అవసరాల దృష్ట్యా నూతన పోకడలకు అనుగుణంగా విద్యాసంస్థ భారతీయ నాగరిక విద్యాసంస్థ వ్యవస్థాపకులు కీర్తిశేషులు కాసు... గణతంత్ర దినోత్సవ వేడుకలలో కలెక్టర్ చేతుల మీదుగా బెస్ట్ మెడికల్ ఆఫీసర్ గా ప్రశంస పత్రం అందుకున్న డాక్టర్ ఎం. మౌనిక
మల్యాల జనవరి 26 (ప్రజా మంటలు) మల్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యురాలుగా పనిచేస్తున్న ఎం మౌనిక గణతంత్ర దినోత్సవం సందర్భంగా జగిత్యాలలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ చేతుల మీదుగా "బెస్ట్ మెడికల్ ఆఫీసర్ గా " ప్రశంస పత్రం అందుకున్నది .
ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి సుజాత,... పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాల గ్రహీతలకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
హైదరాబాద్, జనవరి 25 (ప్రజా మంటలు):
2026 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎంపికైన ప్రముఖులకు ముఖ్యమంత్రి . రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
సేవ, శాస్త్ర–సాంకేతికం, వైద్యం, విద్య, సాహిత్యం, కళల రంగాల్లో వారు అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ... 2026 పద్మ అవార్డ్స్ ప్రకటన: దక్షిణ భారతానికి ప్రత్యేక గుర్తింపు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు వచ్చిన అవార్డుల వివరాలు
న్యూఢిల్లీ, జనవరి 25 (ప్రజా మంటలు):
మొత్తం 131 పద్మ అవార్డులు – 2026
ప్రముఖ వైద్యులు నోరి దత్తాత్రేయకు పద్మభూషణ్
తెలంగాణకు 8, ఆంధ్రప్రదేశ్కు 4 పద్మశ్రీ అవార్డులు
దక్షిణ భారత రాష్ట్రాలకు ఈ ఏడాది విశేష గుర్తింపు
భారత ప్రభుత్వం 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ... జింఖానా గ్రౌండ్లో ప్రధానమంత్రి ఖేలో ఇండియా క్రికెట్ పోటీలు
సికింద్రాబాద్, జనవరి 25 ( ప్రజామంటలు):
ప్రధానమంత్రి ఖేలో ఇండియా పోటీల్లో భాగంగా ఆదివారం సికింద్రాబాద్ జింఖానా మైదానంలో సనత్నగర్ టైగర్స్, గోల్డెన్ టైమ్స్ జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్లో సనత్నగర్ టైగర్స్ జట్టు ఘన విజయం సాధించింది.మొదట బ్యాటింగ్ చేసిన గోల్డెన్ టైమ్స్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్ల... వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్, జనవరి 25 (ప్రజా మంటలు):
కరీంనగర్ పాత మార్కెట్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి 9వ వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథసప్తమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, సూర్యప్రభ వాహనసేవలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మున్సిపల్... కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక Medal for Meritorious Service (MSM)" మెడల్ కు ASI ఆనందం ఎంపిక అభినందించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల జనవరి 25 ( ప్రజా మంటలు) జిల్లా పోలీస్ శాఖకు చెందిన స్పెషల్ బ్రాంచ్ ఏ ఎస్ ఐ ఆనందం కేంద్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మెడల్ ఫర్ మెడిటోరియస్ సర్వీస్ (ఎం ఎస్ ఎం) మెడల్ కు ఎంపిక కావడం గర్వకారణమని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.
విధి నిర్వహణలో... అర్చకుల పట్ల అమర్యాద సరికాదు – ఈవోపై చర్యలు తీసుకోవాలి
జగిత్యాల, జనవరి 25 (ప్రజా మంటలు):
హిందూ మతానికి మూల స్తంభాలుగా, భక్తునికి భగవంతునికి మధ్య వారధులుగా అర్చకులు ఉంటారని భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ ఏసీఎస్ రాజు అన్నారు.
జగిత్యాలలోని భారత్ సురక్ష సమితి కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో సామాజిక సమరసతా వేదిక... జింబాబ్వేలో భూస్వాధీనాల బాధిత తెల్లజాతి రైతులు: పరిహారం కోసం అమెరికా జోక్యం కోరుతున్నారా?
జింబాబ్వేలో 2000వ దశకంలో అప్పటి ప్రభుత్వం చేపట్టిన హింసాత్మక భూస్వాధీన విధానాల వల్ల వేలాది మంది తెల్లజాతి రైతులు తమ భూములు, ఉపాధి కోల్పోయారు. ఈ రైతులకు పరిహారం చెల్లిస్తామని జింబాబ్వే ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటికీ పూర్తి స్థాయిలో చెల్లింపులు జరగలేదు.
ఈ నేపథ్యంలో, బాధిత రైతులు ఇప్పుడు అమెరికా ప్రభుత్వ జోక్యాన్ని కోరుతున్నారు.... ట్రంప్ ఆస్తులపై న్యూయార్క్ కోర్టు జప్తు చర్యలు
న్యూయార్క్ జనవరి 25:
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చెందిన ఆస్తులను న్యూయార్క్ కోర్టు జప్తు చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. ట్రంప్ సంస్థలపై నమోదైన భారీ ఆర్థిక మోసం కేసులో కోర్టు పెద్ద మొత్తంలో జరిమానా విధించింది. అధికారంలో ఉన్న దేశాధ్యక్షుని ఆస్తులు జప్తు చేయాలని కోర్ట్ ప్రకటించడం అమెరికా చరిత్రలోనే... మామల్లపురంలో విజయ్ పార్టీ కార్యకర్తల సమావేశం
చెన్నై / మామల్లపురం జనవరి 25:
తమిళనాడులోని మామల్లపురం (మహాబలిపురం)లో నిర్వహిస్తున్న తన పార్టీ కార్యకర్తల సమావేశంలో సినీ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ పాల్గొంటున్నారు. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణతో పాటు రాబోయే ఎన్నికల వ్యూహాలపై విస్తృతంగా చర్చ జరగనుంది.
తాజాగా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన విజయ్, పార్టీని రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేయడంపై... జాగ్రత్త! వందేమాతరం గౌరవంలో చిన్న తప్పుకు కూడా భారీ మూల్యం చెల్లించాలి
న్యూఢిల్లీ జనవరి 25 (ప్రజా మంటలు):
భారతదేశంలో త్వరలోనే **జాతీయ గీతం ‘వందేమాతరం’**కు సంబంధించిన నియమాలు మారే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు జన గణ మన (జాతీయ గీతం) సమయంలో మాత్రమే కఠిన ప్రోటోకాల్, చట్టపరమైన బాధ్యతలు ఉండేవి. అయితే ఇకపై కేంద్ర ప్రభుత్వం వందేమాతరానికి కూడా అదే స్థాయి గౌరవం, చట్టబద్ధత కల్పించేందుకు సిద్ధమవుతున్నట్లు... 