ఆదివాసీ ప్రాంతాలు, ఆదివాసీల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఆదివాసీ ప్రాంతాలు, ఆదివాసీల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్ జనవరి 10:
రాష్ట్రంలోని ఆదివాసీ ప్రాంతాలు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఆదివాసీ సంఘాలు, ప్రజా ప్రతినిధులతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆదివాసీ సంఘాల ప్రతినిధులు విద్య, ఉద్యోగావకాశాలు, రోడ్లు, రవాణా, సాగు, తాగునీటి వంటి పలు అంశాలు, సమస్యలను ముఖ్యమంత్రికి విన్నవించారు. ఆదివాసీల కోసం ఇప్పటికే చేపట్టిన పలు విషయాలను ప్రస్తావిస్తూ వారు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.
✅ కొమురం భీమ్ జయంతి, వర్ధంతిలను అధికారిక ఉత్సవంగా నిర్వహించాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే పలు అంశాలపై అధికారులకు సూచనలిచ్చారు. ఐటీడీఏ ప్రాంతాలకు జనాభా ప్రాతిపదికన ప్రత్యేక కోటాలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపునకు చర్యలు తీసుకోవాలి.
✅ స్పెషల్ డ్రైవ్ కింద ఇందిర జలప్రభ ద్వారా ఉచితంగా బోర్లు వేసేందుకు చర్యలు చేపట్టాలి. ఆదివాసీ రైతుల వ్యవసాయ బోర్లకు సోలార్ పంపుసెట్లు ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకోవాలి. ఆదివాసీ గూడాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి.
✅ ఇంద్రవెల్లి అమరుల స్తూపాన్ని స్మృతి వనంగా మార్చాలని, అమరుల కుటుంబాలకు ఇండ్లు మంజూరు చేయడం వంటి చర్యలు ఇప్పటికే తీసుకున్నాం. రాజకీయంగానూ ఆదివాసీలకు న్యాయం చేస్తూ ముందుకు వెళుతున్నాం. అలాగే ఆదివాసీలు విద్య, ఉద్యోగ, ఆర్ధిక అభివృద్ధికి చర్యలు చేపడుతున్నాం.
✅ ఆదివాసీల మాతృ భాషలో విద్యను అందించడం, గోండు భాషలో ప్రాథమిక విద్యను అందించే అంశంపై అధ్యయనం చేసి నివేదిక అందించాలి. ఆదివాసీల కోసం ప్రత్యేకంగా స్టడీ సర్కిల్, మౌలిక సదుపాయాలను వెంటనే మంజూరు చేస్తున్నాం.
✅ విదేశాల్లో చదువుకునే ఆదివాసీ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్ షిప్పులకు సంబంధించి పెండింగ్ బిల్స్ క్లియర్ చేయాలి. ఇప్పటికే మంజూరైన బీఈడీ కళాశాలకు టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలి.
✅ ఆదివాసీ రాయి సెంటర్లకు భవనాలు నిర్మించేందుకు అధ్యయనం చేసి నివేదిక తయారు అందించాలి. కేస్లాపూర్ జాతరకు నిధులు మంజూరుకు చర్యలు తీసుకోవాలి. ఉద్యమాల్లో ఆదివాసీలపై పెట్టిన కేసులు తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి.
✅ ఈ సమావేశంలో మంత్రి ధనసరి సీతక్క గారు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
✅ ఆదివాసీ సంఘాల నేతలు ఆత్రం సక్కు గారు, గోడం గణేష్, మేస్రం మనోహర్, మర్స్ కోల తిరుపతి, టేకం భాస్కర్, జుగున్క దేవు సర్మేది, కొడప హన్నుపటేల్, ఆద అమృతరావు గారు, మేస్రం మోతీరాం గారు, ఆత్రం సుగుణ గారు, ప్రొ. గుమ్మడి అనురాధ గారు, ప్రొ. అప్క నాగేశ్వర రావు, ప్రొ. రేగ రాజేందర్, ప్రొ. సిదం కిశోర్, సిదం జగ్ను గారు, ఆత్రం లక్ష్మణ్, సోయం భీంరావు, సిదం అర్జు, బుర్సా పోచయ్య, మేస్రం గంగారాంతో పాటు పలువురు ప్రతినిధులు హాజరయ్యారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భాగ్యనగరం ఎల్లాపి సంఘం నూతన కార్యవర్గం
— అధ్యక్షుడిగా రాచకొండ సత్యనారాయణ రావు ఘన విజయం
సికింద్రాబాద్, అక్టోబర్ 29 (ప్రజా మంటలు):
భాగ్యనగరం ఎల్లాపి సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు ఉత్సాహభరిత వాతావరణంలో శాంతియుతంగా పూర్తయ్యాయి. సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రజాస్వామ్య స్పూర్తిని ప్రతిబింబించారు. సుమారు 78 శాతం మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా, సంఘం... సాయుధ రైతాంగ పోరాట యోధులకు నివాళులర్పించిన కవిత
అప్పంపల్లి, (దేవరకద్ర) అక్టోబర్ 28 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దేవరకద్ర మండలం అప్పంపల్లి గ్రామంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు నివాళులర్పించారు. గ్రామంలో ఉన్న పోరాట యోధుల స్థూపం వద్ద పూలమాల వేసి, అమరవీరుల కుటుంబ సభ్యులను కలుసుకున్నారు.
కవిత మాట్లాడుతూ –“ఉద్యమ సమయంలో ఇక్కడికి వచ్చిన... తీవ్ర తుఫాన్ ‘మొంథా’ దాడి అంచున ఆంధ్రప్రదేశ్ — రాత్రికి తీరం దాటే అవకాశం
కాకినాడ / విశాఖపట్నం / అక్టోబర్ 28 (ప్రజా మంటలు): బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుఫాన్ ప్రస్తుతం తీవ్ర తుఫానుగా మారి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని బెదిరిస్తోంది. కాకినాడకు సుమారు 150 కి.మీ తూర్పు-దక్షిణ దిశలో ఈ తుఫాన్ కేంద్రీకృతమై ఉండగా, రాత్రి మధ్యరాత్రి నుంచి తెల్లవారుజామున మధ్య ఏదైనా సమయంలో తీరం దాటే అవకాశం ఉందని... రాష్ట్రంలోని అన్ని నీటి పారుదల ప్రాజెక్టులపై సమగ్ర అధ్యయనం – నివేదికల తయారీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు
హైదరాబాద్, అక్టోబర్ 28 (ప్రజా మంటలు):రాష్ట్రంలోని అన్ని నీటి పారుదల ప్రాజెక్టులపై సమగ్రమైన విశ్లేషణ జరపాలని, ప్రతి ప్రాజెక్టుకు ప్రత్యేక నివేదికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
తాజాగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ (C.R. Paatil) కు పంపిన లేఖలో పేర్కొన్న ‘కాంప్రహెన్సివ్... కరీంనగర్లో విషాదం: క్రిప్టో కరెన్సీ మోసానికి బలైన ప్రభుత్వ వైద్యుడు ఆత్మహత్య
క్రిప్టో కరెన్సీ మోసాలు మరోసారి హెచ్చరికగా నిలుస్తున్నాయి
కరీంనగర్, అక్టోబర్ 28 (ప్రజా మంటలు):
కరీంనగర్ నగరంలో మరోసారి క్రిప్టో కరెన్సీ మోసం ప్రాణాలను బలి తీసుకుంది. ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ ఎంపీ. శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ప్రతిమ ఆసుపత్రిలో అనస్తీషియా (మత్తు) వైద్యుడిగా పనిచేస్తున్న శ్రీనివాస్ మత్తు ఇంజక్షన్ తీసుకుని జీవితాన్ని... శ్రీగిరి వెంకటేశ్వర ఆలయంలో భక్తుల విశేష పూజలు
సికింద్రాబాద్, అక్టోబర్ 28 (ప్రజా మంటలు):
సికింద్రాబాద్ శ్రీనివాస్ నగర్ లోని శ్రీగిరి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జీర్ణోద్ధరణపూర్వక మహా సంప్రోక్షణ, అష్టబంధన మహా కుంభభిషేకంలో భాగంగా మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. యాగశాల ద్వారతోరణ ధ్వజ కుంభారాధన, ప్రాతరారాధన, అర్చన, సాయంకాలం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేశారు. ఈవో... పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు
స్టూడెంట్స్ కు వ్యాసరచన పోటీలు
సికింద్రాబాద్, అక్టోబర్ 28 (ప్రజా మంటలు ):
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మంగళవారం తిరుమలగిరి పోలీసులు విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. పల్లవి మోడల్ స్కూల్, యూఎన్ అకాడమీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తిరుమలగిరి ఏసీపీ జి.రమేష్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ నాగరాజు, ఎస్ఐ ఆంటోనియమ్మ, మహేష్, కరుణాకర్,మనోజ్,... సికింద్రాబాద్ మానేపల్లి జ్యువెలర్స్ లో ఐటీ అధికారుల సోదాలు
సికింద్రాబాద్, అక్టోబర్ 28 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ మానేపల్లి జ్యువెలర్స్ లో ఐటీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ఉదయం 6 గంటల నుండి సోదాలు నిర్వహిస్తున్న ఆదాయపు పన్ను శాఖ అధికారులు దుకాణంలోని పలు డాక్యుమెంట్లు పరిశీలించారు.మానేపల్లి జ్యువెలర్స్ లో ఓ బృందంతో ఉదయం నుండి సోదాలు కొనసాగించారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నా యన్న... జగిత్యాల పట్టణ అభివృద్ధికి రూ.140 కోట్లతో పనులు వేగంగా కొనసాగుతున్నాయి – ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
రూ. 62.50 కోట్ల నిధులు మంజూరు – సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు
జగిత్యాల (రూరల్) అక్టోబర్ 28 (ప్రజా మంటలు):
జగిత్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి చరిత్రలో ఎప్పుడూ లేనంతగా రూ. 62.50 కోట్ల నిధులు ప్రభుత్వం మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తెలిపారు. పట్టణ అభివృద్ధి పనుల పురోగతిపై ఆయన మంగళవారం... మెడికవర్ ఆసుపత్రుల హృదయ సంరక్షణలో కొత్త మైలురాయి
ప్రతి గుండెకు చికిత్స– ప్రతి జీవితానికి భరోసా
డా.ప్రమోద్ కుమార్ కుచ్చులకంటి 3000+ హృద్రోగుల విజయవంతమైన చికిత్సలు
సికింద్రాబాద్, అక్టోబర్ 28 (ప్రజా మంటలు):
సికింద్రాబాద్లోని మెడికవర్ ఆసుపత్రి సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు డా.ప్రమోద్ కుమార్ కుచ్చులకంటి మరో విశిష్ట మైలురాయిని నమోదు చేశారు. గత రెండు దశాబ్దాల్లో 20,000కుపైగా పీటీసీఏ (స్టెంట్) శస్త్రచికిత్సలు విజయవంతంగా... సికింద్రాబాద్లో పవర్గ్రిడ్ సైక్లోథాన్
విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2025లో భాగంగా కార్యక్రమం
సికింద్రాబాద్, అక్టోబర్ 28 (ప్రజామంటలు):
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, సదర్న్ రీజియన్–I ఆధ్వర్యంలో విజిలెన్స్ అవేర్నెస్ వీక్-2025 భాగంగా మంగళవారం నెక్లెస్ రోడ్లో సైక్లోథాన్ నిర్వహించారు. “విజిలెన్స్: అవర్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ” అనే థీమ్తో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 28... కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ స్మార్ట్ వార్డుతో రోగులకు ఏఐ సేవలు
డోజీ హెల్త్ టెక్నాలజీతో నూతన వైద్య సంరక్షణ
సికింద్రాబాద్, అక్టోబర్ 28 (ప్రజామంటలు):
కిమ్స్ సన్షైన్ హాస్పిటల్, బేగంపేటలో రోగి భద్రత, సేవా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు డోజీ గ్లోబల్ సంస్థతో కలిసి ఆధునిక స్మార్ట్ వార్డ్స్ ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని మంగళవారం హాస్పిటల్ సీఓఓ సుధాకర్ జాదవ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..“ఐసియు స్థాయి పర్యవేక్షణను... 