ఆదివాసీ ప్రాంతాలు, ఆదివాసీల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఆదివాసీ ప్రాంతాలు, ఆదివాసీల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్ జనవరి 10:
రాష్ట్రంలోని ఆదివాసీ ప్రాంతాలు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఆదివాసీ సంఘాలు, ప్రజా ప్రతినిధులతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆదివాసీ సంఘాల ప్రతినిధులు విద్య, ఉద్యోగావకాశాలు, రోడ్లు, రవాణా, సాగు, తాగునీటి వంటి పలు అంశాలు, సమస్యలను ముఖ్యమంత్రికి విన్నవించారు. ఆదివాసీల కోసం ఇప్పటికే చేపట్టిన పలు విషయాలను ప్రస్తావిస్తూ వారు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.
✅ కొమురం భీమ్ జయంతి, వర్ధంతిలను అధికారిక ఉత్సవంగా నిర్వహించాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే పలు అంశాలపై అధికారులకు సూచనలిచ్చారు. ఐటీడీఏ ప్రాంతాలకు జనాభా ప్రాతిపదికన ప్రత్యేక కోటాలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపునకు చర్యలు తీసుకోవాలి.
✅ స్పెషల్ డ్రైవ్ కింద ఇందిర జలప్రభ ద్వారా ఉచితంగా బోర్లు వేసేందుకు చర్యలు చేపట్టాలి. ఆదివాసీ రైతుల వ్యవసాయ బోర్లకు సోలార్ పంపుసెట్లు ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకోవాలి. ఆదివాసీ గూడాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి.
✅ ఇంద్రవెల్లి అమరుల స్తూపాన్ని స్మృతి వనంగా మార్చాలని, అమరుల కుటుంబాలకు ఇండ్లు మంజూరు చేయడం వంటి చర్యలు ఇప్పటికే తీసుకున్నాం. రాజకీయంగానూ ఆదివాసీలకు న్యాయం చేస్తూ ముందుకు వెళుతున్నాం. అలాగే ఆదివాసీలు విద్య, ఉద్యోగ, ఆర్ధిక అభివృద్ధికి చర్యలు చేపడుతున్నాం.
✅ ఆదివాసీల మాతృ భాషలో విద్యను అందించడం, గోండు భాషలో ప్రాథమిక విద్యను అందించే అంశంపై అధ్యయనం చేసి నివేదిక అందించాలి. ఆదివాసీల కోసం ప్రత్యేకంగా స్టడీ సర్కిల్, మౌలిక సదుపాయాలను వెంటనే మంజూరు చేస్తున్నాం.
✅ విదేశాల్లో చదువుకునే ఆదివాసీ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్ షిప్పులకు సంబంధించి పెండింగ్ బిల్స్ క్లియర్ చేయాలి. ఇప్పటికే మంజూరైన బీఈడీ కళాశాలకు టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలి.
✅ ఆదివాసీ రాయి సెంటర్లకు భవనాలు నిర్మించేందుకు అధ్యయనం చేసి నివేదిక తయారు అందించాలి. కేస్లాపూర్ జాతరకు నిధులు మంజూరుకు చర్యలు తీసుకోవాలి. ఉద్యమాల్లో ఆదివాసీలపై పెట్టిన కేసులు తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి.
✅ ఈ సమావేశంలో మంత్రి ధనసరి సీతక్క గారు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
✅ ఆదివాసీ సంఘాల నేతలు ఆత్రం సక్కు గారు, గోడం గణేష్, మేస్రం మనోహర్, మర్స్ కోల తిరుపతి, టేకం భాస్కర్, జుగున్క దేవు సర్మేది, కొడప హన్నుపటేల్, ఆద అమృతరావు గారు, మేస్రం మోతీరాం గారు, ఆత్రం సుగుణ గారు, ప్రొ. గుమ్మడి అనురాధ గారు, ప్రొ. అప్క నాగేశ్వర రావు, ప్రొ. రేగ రాజేందర్, ప్రొ. సిదం కిశోర్, సిదం జగ్ను గారు, ఆత్రం లక్ష్మణ్, సోయం భీంరావు, సిదం అర్జు, బుర్సా పోచయ్య, మేస్రం గంగారాంతో పాటు పలువురు ప్రతినిధులు హాజరయ్యారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు
నంద్యాల డిసెంబర్ 26:
ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల–బత్తలూరు మధ్య శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుపతి నుంచి హైదరాబాద్కు వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి... ధర్మపురి అక్కపెల్లి రాజారాజేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ..
.
ధర్మపురి డిసెంబర్ 25(ప్రజా మంటలు)
శివారులోని కమలాపూర్ రోడ్డుకు గల అక్కపెల్లి రాజారాజేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం అర్థరాత్రి సమయంలో దొంగతనం జరిగింది.
దేవస్థానంలో స్వామివారికి అలంకరించిన 2 కిలోల వెండి పాన పట్ట (లింగం చుట్టూ బిగించబడినది) మరియు అమ్మవారికి అలంకరించిన 8 గ్రాముల వెండి ముఖ కవచము కలిపి మొత్తం 2... దేశ సేవకు జీవితాన్ని అంకితం చేసిన జాతీయవాది వాజపేయి -బిజెపి పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్
జగిత్యాల డిసెంబర్ 25 (ప్రజా మంటలు) భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి శతజయంతి సందర్భంగా జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేసిన బిజెపి పట్టణ శాఖ నాయకులు
ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ సుపరిపాలనకు స్ఫూర్తి అటల్ బిహారీ వాజపేయి..భారత దేశంలో నీతికి నిజాయితీకి నైతిక... ఘోర రోడ్డు ప్రమాదం : కొప్పూర్ యువకుడు మృతి
భీమదేవరపల్లి, డిసెంబర్ 25 (ప్రజామంటలు) :
మండలం కొప్పూరు గ్రామానికి చెందిన కొమ్ముల అంజి (20) శుక్రవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం, ఇందిరానగర్ దాటాక మోడల్ స్కూల్ ఎదుట బైక్పై వెళ్తున్న అంజిని ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. అంజి సంఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. ప్రమాదం జరిగిన... జీహెచ్ఎంసీ డీలిమిటేషన్కు బ్రేక్ : చెదిరిన రేవంత్ కల
హైదరాబాద్, డిసెంబర్ 25 (ప్రజా మంటలు):
వచ్చే ఏడాది జరగనున్న ఎస్ఐఆర్, జనగణనలను దృష్టిలో ఉంచుకొని వేగంగా పూర్తి చేయాలని భావించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) డీలిమిటేషన్ ప్రక్రియకు ప్రభుత్వమే బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది. డివిజన్ల పునర్విభజనపై ప్రజల నుంచి వెల్లువెత్తిన అభ్యంతరాలు, రాజకీయ వర్గాల నుంచి వచ్చిన నిరసనల నేపథ్యంలో తుది... స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
సికింద్రాబాద్, డిసెంబర్ 25 (ప్రజా మంటలు):
నగర పరిధిలో రోడ్ల పక్కన జీవనం సాగిస్తున్న సంచార జాతులు, నిరాశ్రయ కుటుంబాల చిన్నారులతో స్కై ఫౌండేషన్ గురువారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా చిన్నారులకు బహుమతులు, ఆటవస్తువులు, వివిధ రకాల తినుబండారాలు అందజేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆటవస్తువులు, బహుమతులు అందుకోవడంతో చిన్నారులు అపారమైన... కర్ణాటక బస్సు ప్రమాదంలో 17 మంది సజీవదహనం
బెంగళూరు డిసెంబర్ 25:
కర్ణాటకలో ప్రమాదవశాత్తు ప్రైవేట్ బస్సు అగ్నిప్రమాదం జరిగింది. రాత్రి 1:30–2:00 గంటల మధ్య చామరాజనగర్ జిల్లా హనూర్ తాలూకాలో ప్రయాణికులతో ఉన్న బస్సు మంటల్లో చిక్కడంతో 17 మంది సజీవదహనం అయ్యారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు నిర్వహిస్తున్నారు. అధికారులు కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. భర్త అడ్డుగా ఉన్నాడని హత్య..అక్రమ సంబంధంతో భార్య దారుణం
అచ్చంపేట డిసెంబర్ 25 (ప్రజా మంటలు):
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో కలకలం రేపింది. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న మహిళే ఈ హత్యకు ప్రధాన సూత్రధారిగా తేలడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది.
అచ్చంపేట పట్టణంలోని మారుతి నగర్ కాలనీలో నివాసం... క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న దావ వసంత్ సురేష్ –
క్రైస్తవులకు శుభాకాంక్షలు
జగిత్యాల డిసెంబర్ 25 (ప్రజా మంటలు):
క్రిస్మస్ పండుగ సందర్భంగా జగిత్యాల పట్టణంలోని ధరూర్ క్యాంప్ చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత్ సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చిలో కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.... కాంగ్రెస్ పార్టీలో చేరిన శేఖల్ల సర్పంచ్, ఉపసర్పంచ్తో పాటు 50 మంది నాయకులు
బుగ్గారం డిసెంబర్ 25 (ప్రజా మంటలు):శేఖల్ల గ్రామానికి చెందిన సర్పంచ్ పర్సా రమేష్, ఉపసర్పంచ్ నార్ల బుచ్చయ్యతో పాటు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన సుమారు 50 మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు వారందరికీ కాంగ్రెస్... శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా – పలువురు విద్యార్థులకు గాయాలు
రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ డిసెంబర్ 25:శంషాబాద్ నుంచి హైదరాబాద్లోని జలవిహార్కు విద్యార్థులను తీసుకెళ్తున్న స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు బస్సును ఢీకొనడంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 50 మందికి... తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వ బస్సు ఢీకొని 8 మంది మృతి
కడలూరు, డిసెంబర్ 24:
తమిళనాడులోని కడలూరు జిల్లా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుచ్చి నుంచి చెన్నైకి వెళ్తున్న ప్రభుత్వ ఎక్స్ప్రెస్ బస్సు టైరు పేలడంతో నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
తిట్టకుడి ప్రాంతం సమీపంలోని తిరుచ్చి హైవేపై రాత్రి సుమారు... 