ఆదివాసీ ప్రాంతాలు, ఆదివాసీల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

On
ఆదివాసీ ప్రాంతాలు, ఆదివాసీల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఆదివాసీ ప్రాంతాలు, ఆదివాసీల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్ జనవరి 10:

రాష్ట్రంలోని ఆదివాసీ ప్రాంతాలు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 

ఆదివాసీ సంఘాలు, ప్రజా ప్రతినిధులతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి  ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆదివాసీ సంఘాల ప్రతినిధులు విద్య, ఉద్యోగావకాశాలు, రోడ్లు, రవాణా, సాగు, తాగునీటి వంటి పలు అంశాలు, సమస్యలను ముఖ్యమంత్రికి విన్నవించారు. ఆదివాసీల కోసం ఇప్పటికే చేపట్టిన పలు విషయాలను ప్రస్తావిస్తూ వారు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. 

✅ కొమురం భీమ్ జయంతి, వర్ధంతిలను అధికారిక ఉత్సవంగా నిర్వహించాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే పలు అంశాలపై అధికారులకు సూచనలిచ్చారు. ఐటీడీఏ ప్రాంతాలకు జనాభా ప్రాతిపదికన ప్రత్యేక కోటాలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపునకు చర్యలు తీసుకోవాలి.

✅ స్పెషల్ డ్రైవ్ కింద ఇందిర జలప్రభ ద్వారా ఉచితంగా బోర్లు వేసేందుకు చర్యలు చేపట్టాలి. ఆదివాసీ రైతుల వ్యవసాయ బోర్లకు సోలార్ పంపుసెట్లు ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకోవాలి. ఆదివాసీ గూడాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి.

✅ ఇంద్రవెల్లి అమరుల స్తూపాన్ని స్మృతి వనంగా మార్చాలని, అమరుల కుటుంబాలకు ఇండ్లు మంజూరు చేయడం వంటి చర్యలు ఇప్పటికే తీసుకున్నాం. రాజకీయంగానూ ఆదివాసీలకు న్యాయం చేస్తూ ముందుకు వెళుతున్నాం. అలాగే ఆదివాసీలు విద్య, ఉద్యోగ, ఆర్ధిక అభివృద్ధికి చర్యలు చేపడుతున్నాం. 

✅ ఆదివాసీల మాతృ భాషలో విద్యను అందించడం, గోండు భాషలో ప్రాథమిక విద్యను అందించే అంశంపై అధ్యయనం చేసి నివేదిక అందించాలి. ఆదివాసీల కోసం ప్రత్యేకంగా స్టడీ సర్కిల్, మౌలిక సదుపాయాలను వెంటనే మంజూరు చేస్తున్నాం.

✅ విదేశాల్లో చదువుకునే ఆదివాసీ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్ షిప్పులకు సంబంధించి పెండింగ్ బిల్స్ క్లియర్ చేయాలి. ఇప్పటికే మంజూరైన బీఈడీ కళాశాలకు టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలి.

✅ ఆదివాసీ రాయి సెంటర్లకు భవనాలు నిర్మించేందుకు అధ్యయనం చేసి నివేదిక తయారు అందించాలి. కేస్లాపూర్ జాతరకు నిధులు మంజూరుకు చర్యలు తీసుకోవాలి. ఉద్యమాల్లో ఆదివాసీలపై పెట్టిన కేసులు తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి.

✅ ఈ సమావేశంలో మంత్రి ధనసరి సీతక్క గారు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

✅ ఆదివాసీ సంఘాల నేతలు ఆత్రం సక్కు గారు, గోడం గణేష్, మేస్రం మనోహర్, మర్స్ కోల తిరుపతి, టేకం భాస్కర్, జుగున్క దేవు సర్మేది, కొడప హన్నుపటేల్, ఆద అమృతరావు గారు, మేస్రం మోతీరాం గారు, ఆత్రం సుగుణ గారు, ప్రొ. గుమ్మడి అనురాధ గారు, ప్రొ. అప్క నాగేశ్వర రావు, ప్రొ. రేగ రాజేందర్, ప్రొ. సిదం కిశోర్, సిదం జగ్ను గారు, ఆత్రం లక్ష్మణ్, సోయం భీంరావు, సిదం అర్జు, బుర్సా పోచయ్య, మేస్రం గంగారాంతో పాటు పలువురు ప్రతినిధులు హాజరయ్యారు.

Tags
Join WhatsApp

More News...

మున్సిపల్ ఎన్నికల్లో తొలిసారి ఓటు  హక్కు వినియోగించుకున్న యువత ఉత్సాహం 

మున్సిపల్ ఎన్నికల్లో తొలిసారి ఓటు  హక్కు వినియోగించుకున్న యువత ఉత్సాహం  జగిత్యాల ఫిబ్రవరి 11 ( ప్రజా మంటలు)  (శ్రీధర గణపతి జగిత్యాల)జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో బుధవారం యువత పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొలిసారి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న యువత సంతోషం వ్యక్తం చేస్తూ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు మీడియా ముందు సంకేతాన్ని ప్రదర్శించారు. 39వ వార్డుకు చెందిన గోలి...
Read More...
National  Comment  International  

డాలర్ బలహీనమైనా రూపాయి ఎందుకు మరింత పడిపోయింది?

డాలర్ బలహీనమైనా రూపాయి ఎందుకు మరింత పడిపోయింది? న్యూఢిల్లీ ఫిబ్రవరి 12: జనవరి నెలలో అమెరికా డాలర్ విలువ కొంత బలహీనపడింది. అయితే సాధారణంగా ఒక కరెన్సీ బలహీనపడితే, దాని ఎదురు కరెన్సీలు బలపడటం సహజం. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. డాలర్ బలహీనత కనిపించిన సమయంలోనే భారత రూపాయి మరింత క్షీణించింది. దీని వెనుక పలు కీలక కారణాలు ఉన్నాయి. 1️⃣ ...
Read More...

RBI నివేదిక: తెలంగాణ అప్పుల భారం పెరుగుతోంది

RBI నివేదిక: తెలంగాణ అప్పుల భారం పెరుగుతోంది హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు): రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా విడుదల చేసిన State Finances నివేదికలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై గంభీరమైన సూచనలు ఉన్నాయి. నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ రుణాలు పెరుగుతున్నాయి మరియు దీనికి గత బడ్జెట్ డేటా కూడా అద్దం పడుతుంది. 1. RBI తెలిపిన...
Read More...
National 

మధ్యప్రదేశ్‌పై రూ.5.31 లక్షల కోట్ల ప్రజా రుణం – కమల్నాథ్ విమర్శలతో రాజకీయ వేడి

మధ్యప్రదేశ్‌పై రూ.5.31 లక్షల కోట్ల ప్రజా రుణం – కమల్నాథ్ విమర్శలతో రాజకీయ వేడి భోపాల్, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు):రిజర్వ్ బ్యాంక్ తాజా నివేదిక ప్రకారం మధ్యప్రదేశ్ రాష్ట్రంపై ప్రజా రుణ భారం రూ.5,31,012.8 కోట్లకు చేరింది. గత ఏడాదితో పోలిస్తే ఈ రుణం మరింత పెరిగినట్లు నివేదిక వెల్లడించింది.ఈ అంశంపై మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భారీ రుణభారం...
Read More...
National  State News 

234 నియోజకవర్గాల్లోనూ స్టాలిన్ అభ్యర్థి అన్న భావనతో పని చేయాలి: సీఎం స్టాలిన్ పిలుపు

234 నియోజకవర్గాల్లోనూ స్టాలిన్ అభ్యర్థి అన్న భావనతో పని చేయాలి: సీఎం స్టాలిన్ పిలుపు చెంగల్పట్టు (తమిళనాడు), ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు):డీఎంకే పోలింగ్ ఏజెంట్ల సమావేశంలో ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చెంగల్పట్టు జిల్లా తిరువిదంతైలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 234 నియోజకవర్గాలన్నింటిలోనూ “ఈ స్టాలిన్ అభ్యర్థి” అన్న భావనతో పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.గత ఐదేళ్లలో అమలు చేసిన...
Read More...
National 

44 ఏళ్ల తర్వాత ముంబైకు బీజేపీ మేయర్ – రితు తావ్డే ఎన్నిక

44 ఏళ్ల తర్వాత ముంబైకు బీజేపీ మేయర్ – రితు తావ్డే ఎన్నిక ముంబై, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు): ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) 78వ మేయర్‌గా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్పొరేటర్ రితు తావ్డే ఫిబ్రవరి 11న ఎన్నికయ్యారు. 44 ఏళ్ల తర్వాత ముంబైకు బీజేపీ మేయర్ రావడం విశేషంగా మారింది. శివసేనకు చెందిన సంజయ్ ఘాడి ఉపమేయర్‌గా ఎన్నికయ్యారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్...
Read More...

పటిష్ట బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్‌కు బ్యాలెట్ బాక్స్‌ల తరలింపు.

పటిష్ట బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్‌కు బ్యాలెట్ బాక్స్‌ల తరలింపు. *  జగిత్యాల ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు)జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పూర్తిగా ప్రశాంత వాతావరణంలో ముగిసిందని జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల నుండి బ్యాలెట్ బాక్స్‌లను పటిష్టమైన పోలీస్ బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్‌కు తరలించినట్లు తెలిపారు.స్ట్రాంగ్...
Read More...

కృష్ణానగర్ 41 వ వార్డులో ఓటు హక్కు వినియోగించుకున్న డా బోగ శ్రావణి 

కృష్ణానగర్ 41 వ వార్డులో ఓటు హక్కు వినియోగించుకున్న డా బోగ శ్రావణి  జగిత్యాల ఫిబ్రవరి 11 ( ప్రజా మంటలు) జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా భోగ శ్రావణి ప్రవీణ్ తమ ఓటు హక్కును 41వ వార్డులోని ఆల్ ఫోర్స్ స్కూల్లో వినియోగించుకున్నారు. అనంతరం పలు వార్డులలో ఎన్నికల సరళిని పరిశీలించారు.
Read More...

పలు ఎన్నికల కేంద్రాల ఎన్నికల సరళని పరిశీలించిన దావ వసంత

పలు ఎన్నికల కేంద్రాల ఎన్నికల సరళని పరిశీలించిన దావ వసంత జగిత్యాల ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు)మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జగిత్యాల, రాయికల్ పట్టణం లోని బి ఆర్ ఎస్ పార్టీ  తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థులను కలిసి ఎన్నికల సరళి తెలుసుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ . బి ఆర్ ఎస్ తో నే జగిత్యాల, రాయికల్ పట్టణ...
Read More...

విద్యార్థి అపహరణ తర్వాత బలవంతపు పెళ్లి

విద్యార్థి అపహరణ తర్వాత బలవంతపు పెళ్లి  సమస్తిపూర్ (బిహార్), ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు): బిహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్ జిల్లాలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ విద్యార్థిని అపహరించి మత్తు మందు ఇచ్చి బలవంతంగా వివాహం జరిపించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల సమాచారం ప్రకారం, బాధిత విద్యార్థి లైబ్రరీకి వెళ్తున్న సమయంలో కొందరు వ్యక్తులు...
Read More...
National 

Epstein Files వివాదం: పార్లమెంట్‌లో రాహుల్ ఆరోపణలు – మంత్రి హర్దీప్ సింగ్ స్పందన

Epstein Files వివాదం: పార్లమెంట్‌లో రాహుల్ ఆరోపణలు – మంత్రి హర్దీప్ సింగ్ స్పందన న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు): పార్లమెంట్‌లో బడ్జెట్‌పై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ “Epstein files” అంశాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్, వ్యాపారవేత్త అనిల్ అంబానీ మరియు ప్రధాని నరేంద్ర మోదీ పేర్లు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర మంత్రి...
Read More...
National  Spiritual   State News 

మహాశివరాత్రి కోసం శ్రీశైలం, వేములవాడకు ఆర్టీసీ 2,243 ప్రత్యేక బస్సులు

మహాశివరాత్రి కోసం శ్రీశైలం, వేములవాడకు ఆర్టీసీ 2,243 ప్రత్యేక బస్సులు హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు): మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ నెల 14 నుంచి 16 వరకు మొత్తం 2,243 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు సంస్థ ప్రకటించింది. ప్రధాన పుణ్యక్షేత్రాలకు భారీగా బస్సులు కేటాయించారు....
Read More...