ఆదివాసీ ప్రాంతాలు, ఆదివాసీల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఆదివాసీ ప్రాంతాలు, ఆదివాసీల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్ జనవరి 10:
రాష్ట్రంలోని ఆదివాసీ ప్రాంతాలు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఆదివాసీ సంఘాలు, ప్రజా ప్రతినిధులతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆదివాసీ సంఘాల ప్రతినిధులు విద్య, ఉద్యోగావకాశాలు, రోడ్లు, రవాణా, సాగు, తాగునీటి వంటి పలు అంశాలు, సమస్యలను ముఖ్యమంత్రికి విన్నవించారు. ఆదివాసీల కోసం ఇప్పటికే చేపట్టిన పలు విషయాలను ప్రస్తావిస్తూ వారు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.
✅ కొమురం భీమ్ జయంతి, వర్ధంతిలను అధికారిక ఉత్సవంగా నిర్వహించాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే పలు అంశాలపై అధికారులకు సూచనలిచ్చారు. ఐటీడీఏ ప్రాంతాలకు జనాభా ప్రాతిపదికన ప్రత్యేక కోటాలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపునకు చర్యలు తీసుకోవాలి.
✅ స్పెషల్ డ్రైవ్ కింద ఇందిర జలప్రభ ద్వారా ఉచితంగా బోర్లు వేసేందుకు చర్యలు చేపట్టాలి. ఆదివాసీ రైతుల వ్యవసాయ బోర్లకు సోలార్ పంపుసెట్లు ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకోవాలి. ఆదివాసీ గూడాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి.
✅ ఇంద్రవెల్లి అమరుల స్తూపాన్ని స్మృతి వనంగా మార్చాలని, అమరుల కుటుంబాలకు ఇండ్లు మంజూరు చేయడం వంటి చర్యలు ఇప్పటికే తీసుకున్నాం. రాజకీయంగానూ ఆదివాసీలకు న్యాయం చేస్తూ ముందుకు వెళుతున్నాం. అలాగే ఆదివాసీలు విద్య, ఉద్యోగ, ఆర్ధిక అభివృద్ధికి చర్యలు చేపడుతున్నాం.
✅ ఆదివాసీల మాతృ భాషలో విద్యను అందించడం, గోండు భాషలో ప్రాథమిక విద్యను అందించే అంశంపై అధ్యయనం చేసి నివేదిక అందించాలి. ఆదివాసీల కోసం ప్రత్యేకంగా స్టడీ సర్కిల్, మౌలిక సదుపాయాలను వెంటనే మంజూరు చేస్తున్నాం.
✅ విదేశాల్లో చదువుకునే ఆదివాసీ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్ షిప్పులకు సంబంధించి పెండింగ్ బిల్స్ క్లియర్ చేయాలి. ఇప్పటికే మంజూరైన బీఈడీ కళాశాలకు టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలి.
✅ ఆదివాసీ రాయి సెంటర్లకు భవనాలు నిర్మించేందుకు అధ్యయనం చేసి నివేదిక తయారు అందించాలి. కేస్లాపూర్ జాతరకు నిధులు మంజూరుకు చర్యలు తీసుకోవాలి. ఉద్యమాల్లో ఆదివాసీలపై పెట్టిన కేసులు తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి.
✅ ఈ సమావేశంలో మంత్రి ధనసరి సీతక్క గారు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
✅ ఆదివాసీ సంఘాల నేతలు ఆత్రం సక్కు గారు, గోడం గణేష్, మేస్రం మనోహర్, మర్స్ కోల తిరుపతి, టేకం భాస్కర్, జుగున్క దేవు సర్మేది, కొడప హన్నుపటేల్, ఆద అమృతరావు గారు, మేస్రం మోతీరాం గారు, ఆత్రం సుగుణ గారు, ప్రొ. గుమ్మడి అనురాధ గారు, ప్రొ. అప్క నాగేశ్వర రావు, ప్రొ. రేగ రాజేందర్, ప్రొ. సిదం కిశోర్, సిదం జగ్ను గారు, ఆత్రం లక్ష్మణ్, సోయం భీంరావు, సిదం అర్జు, బుర్సా పోచయ్య, మేస్రం గంగారాంతో పాటు పలువురు ప్రతినిధులు హాజరయ్యారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మహిళపై లైంగిక దాడి, బెదిరింపులు.. నలుగురు నిందితుల అరెస్ట్
జగిత్యాల ga, ఆగస్టు 08 (ప్రజా మంటలు):
మహిళపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు, వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరింపులకు పాల్పడిన నలుగురు నిందితులను మల్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 3న నూకపల్లి డబుల్ బెడ్రూమ్ కాలనీలో బాధితురాలు తనకు... హర్ ఘర్ తిరంగా – తిరంగా యాత్రలో భాగంగా మాజీ సైనికుడు దూరిశెట్టి కిరణ్ కుమార్ను సన్మానించిన డా. బోగ శ్రావణి
జగిత్యాల ఆగస్ట్ 7(ప్రజా మంటలు)భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం పిలుపు మేరకు నిర్వహిస్తున్న "హర్ ఘర్ తిరంగా – తిరంగా యాత్ర" కార్యక్రమంలో భాగంగా, భారత త్రివిధ దళాల్లో సేవలందించి పదవీ విరమణ పొందిన మాజీ సైనికుడు దూరిశెట్టి కిరణ్ కుమార్ ని బీజేపీ జగిత్యాల నియోజకవర్గ... బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్ డా. బోగ శ్రావణి కి పోచమ్మ తల్లి బోనాల జాతర ఆహ్వాన పత్రిక అందజేత
జగిత్యాల ఆగస్ట్ 7(ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలో మొట్టమొదటిసారిగా జగిత్యాల జిల్లా యూట్యూబర్స్ కళాకారుల ఆధ్వర్యంలో నిర్వహించనున్న పోచమ్మ తల్లి బోనాల జాతర మహోత్సవం సందర్భంగా ఆహ్వాన పత్రికను బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్ డా. బోగ శ్రావణికి బోనాల జాతర వర్కింగ్ కమిటీ సభ్యులు, జగిత్యాల జిల్లా కళాకారులు మర్యాదపూర్వకంగా అందజేశారు.
ఈ సందర్భంగా... తల్లిపాలే శిశువుకు తొలి వరం – మున్సిపల్ చైర్పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్
జగిత్యాల ఆగస్ట్ 7(ప్రజా మంటలు )పట్టణంలోని స్థానిక 43వ వార్డు వాణీనగర్ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు సంప్రదాయబద్ధంగా శ్రీమంతం, చిన్నారులకు అన్నప్రాశన, అక్షరాభ్యాసం కార్యక్రమాలను నిర్వహించి ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా చైర్పర్సన్ సమీండ్ల... విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి – మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్
జగిత్యాల ఆగస్ట్ 7(ప్రజా మంటలు)పట్టణంలోని నవ్య గర్ల్స్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన "పరిచయ్–2K26" ఫ్రెషర్స్ పార్టీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ విద్యార్థినులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ విద్య జీవితానికి బలమైన పునాది అని, ఈ దశలో విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలను... సామాజిక న్యాయ తెలంగాణ కోసం టీఆర్ఎస్ సంకల్పం
హైదరాబాద్, ఆగస్టు 06 (ప్రజా మంటలు):
సామాజిక న్యాయ తెలంగాణ సాధన లక్ష్యంగా టీఆర్ఎస్ నిర్వహించిన **"సామాజిక న్యాయ సంకల్ప సభ"**లో పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత కీలక ప్రసంగం చేశారు. ఈ సభ దేశంలోని కోట్లాది మంది వెనుకబడిన వర్గాల జీవితాలను మార్చే ఉద్యమానికి నాంది అవుతుందని ఆమె పేర్కొన్నారు.
తాను బీసీల కోసం... ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయ సాధనే ఆయనకు నిజమైన నివాళి – మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్
జగిత్యాల ఆగస్ట్ 6(ప్రజా మంటలు)
మున్సిపాలిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా కరీంనగర్ రోడ్లోని జయశంకర్ విగ్రహం వద్ద, గొల్లపల్లి రోడ్లోని విగ్రహం వద్ద, అలాగే మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా జయంతి కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర... ధనం ఉంటే దాన స్వభావము ఉండాలి బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేష్ శర్మ
కోరుట్ల ఆగస్టు 5 ( ప్రజా మంటలు)
సిరిసిల్ల రాజేంద్ర శర్మ 9348422113
ధనమున్న వ్యక్తికి దాన స్వభావం ఉండాలని అదేవిధంగా శక్తి ఉంటే క్షమాగుణం ఉండాలని శృంగేరి శారదా పీఠ ఆస్థాన పౌరాణికులు, మల్లాది చంద్రశేఖర శాస్త్రి శిష్యులు గర్రెపల్లి మహేష్ శర్మ అన్నారు. కోరుట్ల పట్టణములో సనాతన ధర్మ ప్రచార సమితి కోరుట్ల... తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపునకు మహారాష్ట్ర అనుమతులు ఇప్పించాలి: సీఎం రేవంత్ రెడ్డి
న్యూఢిల్లీ, ఆగస్టు 5 (ప్రజా మంటలు):ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు 150–152 మీటర్లకు పెంచేందుకు మహారాష్ట్ర అనుమతులు ఇప్పించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ను కోరారు. ఢిల్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన కేంద్ర మంత్రిని కలిశారు.148 మీటర్లతో పోలిస్తే 152... నల్లమల్లలో చెంచు గిరిజనుల జీవన పరిస్థితులపై మానవ హక్కుల కమిషన్ చైర్మన్ క్షేత్రస్థాయి పరిశీలన
విద్య, వైద్యం, సంక్షేమం, మౌలిక వసతులపై అధికారులతో సమగ్ర సమీక్ష – చెంచు కుటుంబాలతో ముఖాముఖిహైదరాబాద్, ఆగస్టు 5 (ప్రజా మంటలు):
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న చెంచు గిరిజనుల జీవన పరిస్థితులను తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్... పూర్తిస్థాయి పంచాయతీ కార్యదర్శి లేక గొల్లపల్లి అభివృద్ధి కుంటుపాటు
గొల్లపల్లికి రావాలంటేనే జంకుతున్న కార్యదర్శులు!రాజకీయ ఒత్తిళ్లే కారణమా..? గ్రామంలో గుసగుసలు?
గొల్లపల్లి, ఆగస్టు 5 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ పూర్తిస్థాయి కార్యదర్శి లేక తీవ్ర పరిపాలనా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నెలకోసారి ఇన్చార్జి కార్యదర్శిని నియమిస్తూ కాలం గడుపుతుండటంతో గ్రామ అభివృద్ధి పనులు పూర్తిగా స్తంభించిపోయే పరిస్థితి... ఐక్య ఉద్యమాలతోనే పీఆర్సీ సాధ్యం, అశాస్త్రీయమైన టెట్ పరీక్షను రద్దు చేయాలి : జిల్లా అధ్యక్షులు బైరం హరికిరణ్
జగిత్యాల ఆగస్టు 2 (ప్రజా మంటలు)రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ, పెన్షనర్ లకు రావాల్సిన పి.ఆర్సి , డి.ఏ లు, పెండింగ్ బకాయిల సమస్యలు ఐక్య ఉద్యమాలతోనే పరిష్కారమవుతాయని స్టేట్ టీచర్స్ యూనియన్ జగిత్యాల జిల్లా శాఖ సమావేశం తీర్మానించింది. ఆదివారం జగిత్యాల పట్టణంలో రామకృష్ణ డిగ్రీ కళాశాల సమావేశమందిరంలో ఎస్టీయు తృతీయ కార్యవర్గ... 