ఆదివాసీ ప్రాంతాలు, ఆదివాసీల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఆదివాసీ ప్రాంతాలు, ఆదివాసీల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్ జనవరి 10:
రాష్ట్రంలోని ఆదివాసీ ప్రాంతాలు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఆదివాసీ సంఘాలు, ప్రజా ప్రతినిధులతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆదివాసీ సంఘాల ప్రతినిధులు విద్య, ఉద్యోగావకాశాలు, రోడ్లు, రవాణా, సాగు, తాగునీటి వంటి పలు అంశాలు, సమస్యలను ముఖ్యమంత్రికి విన్నవించారు. ఆదివాసీల కోసం ఇప్పటికే చేపట్టిన పలు విషయాలను ప్రస్తావిస్తూ వారు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.
✅ కొమురం భీమ్ జయంతి, వర్ధంతిలను అధికారిక ఉత్సవంగా నిర్వహించాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే పలు అంశాలపై అధికారులకు సూచనలిచ్చారు. ఐటీడీఏ ప్రాంతాలకు జనాభా ప్రాతిపదికన ప్రత్యేక కోటాలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపునకు చర్యలు తీసుకోవాలి.
✅ స్పెషల్ డ్రైవ్ కింద ఇందిర జలప్రభ ద్వారా ఉచితంగా బోర్లు వేసేందుకు చర్యలు చేపట్టాలి. ఆదివాసీ రైతుల వ్యవసాయ బోర్లకు సోలార్ పంపుసెట్లు ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకోవాలి. ఆదివాసీ గూడాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి.
✅ ఇంద్రవెల్లి అమరుల స్తూపాన్ని స్మృతి వనంగా మార్చాలని, అమరుల కుటుంబాలకు ఇండ్లు మంజూరు చేయడం వంటి చర్యలు ఇప్పటికే తీసుకున్నాం. రాజకీయంగానూ ఆదివాసీలకు న్యాయం చేస్తూ ముందుకు వెళుతున్నాం. అలాగే ఆదివాసీలు విద్య, ఉద్యోగ, ఆర్ధిక అభివృద్ధికి చర్యలు చేపడుతున్నాం.
✅ ఆదివాసీల మాతృ భాషలో విద్యను అందించడం, గోండు భాషలో ప్రాథమిక విద్యను అందించే అంశంపై అధ్యయనం చేసి నివేదిక అందించాలి. ఆదివాసీల కోసం ప్రత్యేకంగా స్టడీ సర్కిల్, మౌలిక సదుపాయాలను వెంటనే మంజూరు చేస్తున్నాం.
✅ విదేశాల్లో చదువుకునే ఆదివాసీ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్ షిప్పులకు సంబంధించి పెండింగ్ బిల్స్ క్లియర్ చేయాలి. ఇప్పటికే మంజూరైన బీఈడీ కళాశాలకు టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలి.
✅ ఆదివాసీ రాయి సెంటర్లకు భవనాలు నిర్మించేందుకు అధ్యయనం చేసి నివేదిక తయారు అందించాలి. కేస్లాపూర్ జాతరకు నిధులు మంజూరుకు చర్యలు తీసుకోవాలి. ఉద్యమాల్లో ఆదివాసీలపై పెట్టిన కేసులు తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి.
✅ ఈ సమావేశంలో మంత్రి ధనసరి సీతక్క గారు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
✅ ఆదివాసీ సంఘాల నేతలు ఆత్రం సక్కు గారు, గోడం గణేష్, మేస్రం మనోహర్, మర్స్ కోల తిరుపతి, టేకం భాస్కర్, జుగున్క దేవు సర్మేది, కొడప హన్నుపటేల్, ఆద అమృతరావు గారు, మేస్రం మోతీరాం గారు, ఆత్రం సుగుణ గారు, ప్రొ. గుమ్మడి అనురాధ గారు, ప్రొ. అప్క నాగేశ్వర రావు, ప్రొ. రేగ రాజేందర్, ప్రొ. సిదం కిశోర్, సిదం జగ్ను గారు, ఆత్రం లక్ష్మణ్, సోయం భీంరావు, సిదం అర్జు, బుర్సా పోచయ్య, మేస్రం గంగారాంతో పాటు పలువురు ప్రతినిధులు హాజరయ్యారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
టి జి ఆర్ ఎస్ ఏ జగిత్యాల జిల్లా అణిముత్యాలు దొంతి రాజేశ్వరి గీర్దావర్ మరియు పంగరాజేశం జిపిఓ కు ఘన సన్మానము
జగిత్యాల మార్చి 26 (ప్రజా మంటలు)
దొంత రాజేశ్వరి గిర్ధవర్ ఆర్చరికి ఘన సన్మానం
దొంత రాజేశ్వరి గిర్దావర్ వెల్గటూర్ మండలం ఓపెన్ మాస్టర్ గేమ్స్ 2025 లో నేషనల్ గేమ్స్ గోవా : బంగారు పథకం ఉత్తరఖాండు :బంగారు పథకం హిమాచల్ ప్రదేశ్ : బంగారు పథకం సౌత్ కొరియ : 2023 లో... మరణానంతరం కూడా ప్రాణదాతగా నిలిచిన మానవత్వానికి నిలువుటద్దం హెడ్ కానిస్టేబుల్ నల్లాల లక్ష్మీరాజం”*
*“
జగిత్యాల మార్చి 26 ప్రజా మంటలు) జిల్లా కోరుట్ల పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న నల్లాల లక్ష్మీరాజం ఆకస్మిక మరణం జిల్లా పోలీస్ శాఖకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
పోలీస్ అంటే కేవలం రక్షణ మాత్రమే కాదు
విధి నిర్వహణలోనే కాకుండా, మరణానంతరం కూడా తన అవయవాలను దానం చేసి మరో... జగిత్యాల నుండి బయలుదేరిన బస్సు మార్కాపురం వద్ద ప్రమాదం: 13 మందికి మృతి
మార్కాపురం, మార్చి 26 (ప్రజా మంటలు):
ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం 13 మంది ప్రాణాలను బలిగొంది. హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన సెమీ-స్లీపర్ బస్సు టిప్పర్ లారీని ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది.జగిత్యాల నుండి కనిగిరి/పామూరు వైపు సుమారు 40–45 మంది ప్రయాణికులతో బయలుదేరిన... లోక్ జనశక్తి (రామ్ విలాస్) పార్టీ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీకి సిద్ధం
న్యూ ఢిల్లీ, మార్చి 25 (ప్రజా మంటలు):
రాబోయే స్థానిక సంస్థల, కార్పొరేషన్ ఎన్నికల్లో లోక్ జనశక్తి (రామ్ విలాస్) పార్టీ తమ పార్టీ గుర్తుపై స్వతంత్రంగా పోటీ చేయనున్నట్లు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై జరిగిన చర్చల అనంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఈ విషయాన్ని... కాంగ్రెస్కు జీవన్ రెడ్డి రాజీనామా: జగిత్యాలలో భావోద్వేగ తుఫాన్, కార్యకర్తల సామూహిక రాజీనామాలు
జగిత్యాల, మార్చ్ 25 (ప్రజా మంటలు):
కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామా చేయడం జగిత్యాల రాజకీయాల్లో పెద్ద ప్రకంపనలు సృష్టించింది. నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకుంటూ తీసుకున్న ఈ నిర్ణయం పూర్తిగా భావోద్వేగభరితంగా మారింది.“ఇంకా ఎంతకాలం ఈ అవమానాలు.. ఈ మానసిక క్షోభ” అంటూ జీవన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం... కవి, రచయిత నల్లాల లక్ష్మి రాజం అకాల మృతి
కరీంనగర్ జిల్లా నుండి ఎదిగిన ప్రముఖ రచయిత, దళిత సాహితీవేత్త నల్లాల లక్ష్మి రాజం అకాల మరణం పట్ల సాహితీ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమైంది. ప్రముఖ రచయిత బి.ఎస్. రాములు తన సంతాపాన్ని తెలియజేస్తూ, ఇది సాహిత్య రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు.కథా రచయితగా, నాటకకర్తగా, పాటల కవిగా నల్లాల లక్ష్మి... శానిటేషన్ వాహనములు ట్రాక్టర్లు ఆటోలు పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి
జగిత్యాల మార్చి 24 ( ప్రజా మంటలు)కొత్త బస్టాండ్ వాటర్ ట్యాంక్ దగ్గర శానిటేషన్ వాహనములు ట్రాక్టర్లు, ఆటోలు పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్
ఈ సందర్భంగా మాట్లాడుతూ తరచు వాహనములు మరమ్మతుకు గురవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయిల్ చేంజ్ సకాలంలో చేస్తూ మెయింటెనెన్స్ చేయాలని ఆదేశించారు. పట్టణ... క్షయవ్యాధి నిర్మూలనకు ప్రజలలో అవగాహన పెంపొందించాలి – జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
జగిత్యాల మార్చి 24 (ప్రజా మంటలు)ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మున్సిపల్... తెలంగాణ కేబినెట్ ముఖ్యాంశాలు తేదీ. 23.03.26.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
నేటి తెలంగాణ కేబినెట్ ముఖ్యాంశాలు
హైదరాబాద్ 23 మార్చి (ప్రజా మంటలు). :
1. విద్వేషపూరిత ప్రసంగాలు.. విద్వేష పూరిత నేరాల నిరోధక బిల్లు (తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లు 2026) ను మంత్రివర్గం ఆమోదించింది.
మత... విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలి ఐసిడిఎస్ సిడిపిఓ మమత
జగిత్యాల, మార్చి 23: (ప్రజా మంటలు)విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచే దిశగా అంగన్వాడి టీచర్లు కృషి చేయాలని ఐ సి డి ఎస్ సిడిపిఓ మమత అన్నారు. సోమవారం జగిత్యాల అర్బన్ మండలంలోని మోతె గ్రామంలో గల అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాలు సజావుగా... ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల మార్చి 23 (ప్రజా మంటలు)
ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను అదేశించారు.
సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను ఆర్డీఓలతో కలిసి స్వీకరించారు.
జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ
పలు... ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల మార్చి 23 (ప్రజా మంటలు)
ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను అదేశించారు.
సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను ఆర్డీఓలతో కలిసి స్వీకరించారు.
జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ
పలు... 