శ్రీరాములపల్లిలో ఆయిల్ పాం సాగును  ప్రోత్సహించడానికి అవగాహన సదస్సు

On
శ్రీరాములపల్లిలో ఆయిల్ పాం సాగును  ప్రోత్సహించడానికి అవగాహన సదస్సు

శ్రీరాములపల్లిలో ఆయిల్ పాం సాగును  ప్రోత్సహించడానికి అవగాహన సదస్సుIMG-20250110-WA0641

గొల్లపల్లి జనవరి 10 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలంలోని శ్రీరాములపల్లి గ్రామం లో ఆయిల్ పాం సాగును  ప్రోత్సహించడానికి జిల్లా  లోని ఉద్యాన శాఖ మరియు లోహియా ఎడిబుల్ ఆయిల్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సహకారంతో ఆయిల్ పామ్ పంట మీద అవగాహన సదస్సును నిర్వహించడం ఇందులో భాగంగా జిల్లా ఉద్యాన అధికారి దేవ ప్రసాద్ మాట్లాడుతూ గొల్లపల్లి మండలంలో ఇదివరకే 310 ఎకరాలలో ఆయిల్పామ్ సాగును చేపట్టడం  జరిగిందని ఆయన కొని ఆడారు. కొత్తగా ఆయిల్ పామ్ పంట సాగు చేయడానికి ముందుకు వచ్చే రైతులకు చెట్లను 90 శాతం సబ్సిడీ పై, డ్రిప్ పరికరాలను BC, సన్న చిన్న రైతులకు 90 శాతం ఎస్సీ, ఎస్టి రైతులకు 100 పర్సెంట్ సబ్సిడీ, OC పెద్ద రైతులకు 80% సబ్సిడీ మీద  అందించడం జరుగుతుందని ఆయన మాట్లాడారు.ఆయిల్ పామ్ సాగు చేపట్టిన రైతులకు ఆయన తగిన సలహాలు సూచనలు చేశారు ఆయిల్ సాగు చేస్తున్న రైతులు కోకో పంటను అంతర పంటగా వేయాలని ఆయన కోరారు కోకో పంట సాగుతో 2 లక్షల నికర ఆదాయం ఎకరానికి పొందవచ్చు అని ఆయన సూచించారు. ఆ తర్వాత జగిత్యాల్ నియోజకవర్గ ఉద్యాన అధికారి కందుకూరి స్వాతి ,మాట్లాడుతూ ఆయిల్ పామ్ తోటల్లో మొదటి 3 సంవత్సరాలు వరి తప్ప మిగతా పత్తి, మొక్కజొన్న, పసుపు, అరటి, బొప్పాయి, కూరగాయలు అంతరపంట లుగా వేసుకోవచ్చని, తోట నిర్వహణ నిమిత్తం ఒక ఎకరానికి సంవత్సరనికి రూ. 4200/- చొప్పున 4 సంవత్సరాల వరకు రైతుకు ఇవ్వబడునని తెలిపారు.ప్రస్తుతం ఆయిల్ పామ్ టన్ను ధర రూ. 20,500/- ఉందని, ఎకరానికి ప్రతి సంవత్సరం కనీసం రూ. 1,00,000/- నికర ఆదాయం పొందవచ్చని తెలిపారు.
లోహియా కంపెనీ తరఫున జిల్లా మేనేజర్ విజయ్ భరత్ , మాట్లాడుతూ  ఆయిల్ పామ్ కొత్తగా చేపట్టే రైతులకు పంట సాగు గురించి వివరించారు అదేవిధంగా ఇదివరకే పంట సాగు చేపట్టిన వారికి సలహాలు పలు సూచనలు 
చేశారు
బుగ్గారం మండలంలోని యశ్వంతరావుపేట గ్రామంలో ఫ్యాక్టరీ నెలకొలపుతున్నామని, రైతు పండించిన గెలలని 1993 ఆయిల్ పామ్ చట్టం ప్రకారం కంపెనీ కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయబడునని తెలిపారు.అదేవిధంగా మండల వ్యవసాయ అధికారి కరుణశ్రీ,  మాట్లాడుతూ వరికి ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్ పామ్ సాగు చేపట్టాలని సూచించారు. రైతులు మట్టి నమూనా పరీక్ష నివేదికను అనుసరించి ఎరువులు వేయాలని తెలిపారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పురపాటి రాజిరెడ్డి, మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో సాగు చేస్తున్న ఆయిల్ పామ్ పంటను చూసానని, అది లాభసాటి పంట అని అందరు వేయాల్సిందిగా కోరారు.ఇట్టి సమావేశంలో జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమల అధికారి శ్రీ దేవప్రసాద్ ,మండల వ్యవసాయ అధికారి కరుణశ్రీ ,ఉద్యాన అధికారి కె. స్వాతి,ఏ ఈ ఓ వంశీకృష్ణ ,లోహియా కంపెనీ జిల్లా మేనేజర్ విజయభరత్, లోహియా సిబ్బంది సంజీవ్, అన్వేష్,  మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పురపాటి రాజిరెడ్డి, ఇతర  రైతులు పాల్గొన్నారు

Tags
Join WhatsApp

More News...

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కుల కోసం ఏ త్యాగానికైనా సిద్ధం_ స్థానిక సంస్థల్లో ఆధిపత్యం చెలాయించాలని చూస్తే మెడలు పట్టి గెంటేయాలి మాజీ మంత్రి జీవన్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కుల కోసం ఏ త్యాగానికైనా సిద్ధం_ స్థానిక సంస్థల్లో ఆధిపత్యం చెలాయించాలని చూస్తే మెడలు పట్టి గెంటేయాలి మాజీ మంత్రి జీవన్ రెడ్డి    జగిత్యాల జనవరి 4( ప్రజా మంటలు) స్థానిక సంస్థల్లో ఆదిపత్యం చెలాయించాలని చూస్తే మెడలు పట్టి గెంటాయాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి.    జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో జగిత్యాల పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి, డీ సీ సీ అధ్యక్షుడు గాజంగి...
Read More...
Local News 

ఫుట్ పాత్ అనాధలకు ఔషధాలు, దుస్తుల పంపిణీ

ఫుట్ పాత్ అనాధలకు ఔషధాలు, దుస్తుల పంపిణీ సికింద్రాబాద్,  జనవరి 04 (ప్రజా మంటలు): హైదరాబాద్ నగరంలోని రోడ్ల పక్కన ఫుట్‌పాత్‌లపై జీవనం సాగిస్తున్న నిరాశ్రయులు, అనాథలకు స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం దుస్తులు, ఔషధాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వివిధ రుగ్మతులతో బాధపడుతున్న వారికి మందులు అందించడంతో పాటు ప్రమాదాలకు గురైన వారికి ప్రాథమిక చికిత్స చేశారు.ఈ కార్యక్రమంలో స్కై ఫౌండేషన్...
Read More...

బన్సీలాల్ పేటలో క్రీడోత్సవం రిజిస్ట్రేషన్లు ప్రారంభం

బన్సీలాల్ పేటలో క్రీడోత్సవం రిజిస్ట్రేషన్లు ప్రారంభం సికింద్రాబాద్, జనవరి 04 (ప్రజా మంటలు):  ప్రధానమంత్రి సంసద్ మహోత్సవం 2025–26లో భాగంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రేరణతో, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు సికింద్రాబాద్ పార్లమెంట్ మహా క్రీడోత్సవం కింద బన్సీలాల్‌పేట్ డివిజన్‌లో క్రీడా రిజిస్ట్రేషన్ ప్రారంభోత్సవం నిర్వహించారు. డివిజన్ బీజేపీ అధ్యక్షులు రామంచ మహేష్ అధ్యక్షతన జరిగిన ఈ...
Read More...

మేడిపల్లి వద్ద ఆర్టీసీ బస్సు–తవేరా ఢీ పలువురికి గాయాలు

మేడిపల్లి వద్ద ఆర్టీసీ బస్సు–తవేరా ఢీ  పలువురికి గాయాలు మెట్టుపల్లి, జనవరి 4 (ప్రజా మంటలు – దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడిపల్లి గ్రామం వద్ద ఆర్టీసీ బస్సు మరియు తవేరా వాహనం ఢీకొన్న ఘటనలో పలువురు గాయపడ్డారు. మెట్టుపల్లి నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు (TS 16 UC 3599) ఆదివారం తెల్లవారుజామున సుమారు 4:45 గంటలకు మేడిపల్లి...
Read More...

నిరుపేద కుటుంబానికి వైద్య సాయం...  4 లక్షల ఎల్ ఓ సి అందజేత...

నిరుపేద కుటుంబానికి వైద్య సాయం...  4 లక్షల ఎల్ ఓ సి అందజేత...   చిగురుమామిడి జనవరి 4 (ప్రజా మంటలు):   చిగురుమామిడి మండల కేంద్రానికి చెందిన చెరుకు వంశీ (18) అనే యువకుడు గత కొంతకాలంగా మూత్ర పిండాల వ్యాధితో బాధ పడుతున్నాడు. రెండు కిడ్నీలు పూర్తిగా పని చేయక పోవడం వల్ల కిడ్నీ మార్పిడి చేయాల్సిన అవసరం ఉంది. తన తల్లి కిడ్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న స్థానిక...
Read More...
Comment  International  

వెనిజులా పై అమెరికా దాడి: చట్టమా? లేక సామ్రాజ్యవాద దౌర్జన్యమా?

వెనిజులా పై అమెరికా దాడి: చట్టమా? లేక సామ్రాజ్యవాద దౌర్జన్యమా? — సిహెచ్. వి. ప్రభాకర్ రావు     వెనిజులా పై అమెరికా చేసిన సైనిక–భద్రతా చర్యలు, ఆ దేశ అధ్యక్షుడిని, ఆయన భార్యను బలవంతంగా అమెరికాకు తీసుకెళ్లి క్రిమినల్ కేసులు నమోదు చేయడం ప్రపంచ రాజకీయ చరిత్రలో అత్యంత ప్రమాదకర మలుపుగా మారింది. ఇది ఒక సాధారణ “చట్ట అమలు చర్య” కాదు; ఒక సార్వభౌమ దేశంపై...
Read More...

బీసీల బందు కేసీఆర్ అయితే బీసీలకు రాబందు రేవంత్ రెడ్డి- దావ వసంత సురేష్ 

బీసీల బందు కేసీఆర్ అయితే బీసీలకు రాబందు రేవంత్ రెడ్డి- దావ వసంత సురేష్        జగిత్యాల జనవరి 3(ప్రజా మంటలు)పట్టణంలోని సావిత్రిబాయి పూలే పార్కులో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా బిఆర్ఎస్ నాయకులతో కలిసి సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా తొలి జడ్పి చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...* బిఆర్ఎస్ హయంలో బడుగు బలహీన వర్గాలకు...
Read More...

రాష్ట్ర మంత్రివర్యులు  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన టీఎన్జీవో నాయకులు

రాష్ట్ర మంత్రివర్యులు  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన టీఎన్జీవో నాయకులు జగిత్యాల జనవరి 3(ప్రజా మంటలు)టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి  ఆధ్వర్యంలో రాష్ట్ర ఎస్సి ఎస్టి వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు. మంత్రివర్యులు  అడ్లూరి లక్ష్మణ్ కుమార్  మాట్లాడుతూ టీఎన్జీవో ఉద్యోగులందరికీ నూతన సంవత్సర...
Read More...

డాక్టర్ అరిగేలా అభినవ్ కు అత్యుత్తమ పరిశోధన పత్రం అవార్డు

డాక్టర్ అరిగేలా అభినవ్ కు అత్యుత్తమ పరిశోధన పత్రం అవార్డు జగిత్యాల జనవరి 3 ( ప్రజా మంటలు)జగిత్యాల ముద్దుబిడ్డ డాక్టర్ అరిగేలా అభినవ్ కు అత్యుత్తమ పరిశోధన పత్రం అవార్డు లభించింది. హైదరాబాదులో నిర్వహించిన 22వ అప్రస్కాన్ 20 25 అసోసియేషన్ ఆఫ్ ప్లాస్టిక్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కాన్ఫరెన్స్లో జగిత్యాలకు చెందిన డాక్టర్ అభినవ్...
Read More...

కోరుట్ల పట్టణంలో రెస్టారెంట్లు మరియు టిఫిన్ సెంటర్లు లో తనిఖీలు.. జరిమానాలు విధించిన మున్సిపల్ అధికారులు

కోరుట్ల పట్టణంలో రెస్టారెంట్లు మరియు టిఫిన్ సెంటర్లు లో తనిఖీలు.. జరిమానాలు విధించిన మున్సిపల్ అధికారులు    కోరుట్ల జనవరి 3 (ప్రజా మంటలు) పట్టణంలో రెస్టారెంట్లు మరియు టిఫిన్ సెంటర్లు లో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు పట్టణంలో తనిఖీలు చేసిన మున్సిపల్ అధికారులు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రవీందర్ ఆదేశాల మేరకు పట్టణంలో గల రెస్టారెంట్లు, హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో  తనిఖీలు నిర్వహించి పరిశుభ్రత పాటించని, మరియు సింగిల్...
Read More...

అభయాంజనేయ స్వామి ఆలయంలో ధార్మిక సంస్థల సమావేశం

అభయాంజనేయ స్వామి ఆలయంలో ధార్మిక సంస్థల సమావేశం      జగిత్యాల జనవరి 3(ప్రజా మంటలు)  వివిధ ధార్మిక సంస్థల సమావేశము  అభయాంజనేయ స్వామి టెంపుల్ అరవింద నగర్ లో  జరిగింది దీనిలో భూమి, నీరు,వాయువు అగ్ని ఆకాశము పంచభూతాలను కాపాడుతూ  పర్యావరణo అసమతౌల్యం వల్ల జరిగే నష్టాలను అధిగమించుటకు పర్యావరణ సమస్యలను అధిగమించుటకు అందరూ అన్ని దేవాలయాలలో సింగల్ యూస్ ప్లాస్టిక్ వాడకూడదని నిర్ణయం
Read More...
Local News  State News 

ఆంజనేయుని దయతోనే నాకు పునర్జన్మ – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఆంజనేయుని దయతోనే నాకు పునర్జన్మ – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు, జనవరి 3 (ప్రజా మంటలు): ఆంజనేయ స్వామి దయతోనే తనకు పునర్జన్మ లభించిందని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కొండగట్టులో టిటిడి సహకారంతో నిర్మించనున్న వాయుపుత్ర సదన్ ధర్మశాల, దీక్ష విరమణ...
Read More...