శ్రీరాములపల్లిలో ఆయిల్ పాం సాగును  ప్రోత్సహించడానికి అవగాహన సదస్సు

On
శ్రీరాములపల్లిలో ఆయిల్ పాం సాగును  ప్రోత్సహించడానికి అవగాహన సదస్సు

శ్రీరాములపల్లిలో ఆయిల్ పాం సాగును  ప్రోత్సహించడానికి అవగాహన సదస్సుIMG-20250110-WA0641

గొల్లపల్లి జనవరి 10 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలంలోని శ్రీరాములపల్లి గ్రామం లో ఆయిల్ పాం సాగును  ప్రోత్సహించడానికి జిల్లా  లోని ఉద్యాన శాఖ మరియు లోహియా ఎడిబుల్ ఆయిల్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సహకారంతో ఆయిల్ పామ్ పంట మీద అవగాహన సదస్సును నిర్వహించడం ఇందులో భాగంగా జిల్లా ఉద్యాన అధికారి దేవ ప్రసాద్ మాట్లాడుతూ గొల్లపల్లి మండలంలో ఇదివరకే 310 ఎకరాలలో ఆయిల్పామ్ సాగును చేపట్టడం  జరిగిందని ఆయన కొని ఆడారు. కొత్తగా ఆయిల్ పామ్ పంట సాగు చేయడానికి ముందుకు వచ్చే రైతులకు చెట్లను 90 శాతం సబ్సిడీ పై, డ్రిప్ పరికరాలను BC, సన్న చిన్న రైతులకు 90 శాతం ఎస్సీ, ఎస్టి రైతులకు 100 పర్సెంట్ సబ్సిడీ, OC పెద్ద రైతులకు 80% సబ్సిడీ మీద  అందించడం జరుగుతుందని ఆయన మాట్లాడారు.ఆయిల్ పామ్ సాగు చేపట్టిన రైతులకు ఆయన తగిన సలహాలు సూచనలు చేశారు ఆయిల్ సాగు చేస్తున్న రైతులు కోకో పంటను అంతర పంటగా వేయాలని ఆయన కోరారు కోకో పంట సాగుతో 2 లక్షల నికర ఆదాయం ఎకరానికి పొందవచ్చు అని ఆయన సూచించారు. ఆ తర్వాత జగిత్యాల్ నియోజకవర్గ ఉద్యాన అధికారి కందుకూరి స్వాతి ,మాట్లాడుతూ ఆయిల్ పామ్ తోటల్లో మొదటి 3 సంవత్సరాలు వరి తప్ప మిగతా పత్తి, మొక్కజొన్న, పసుపు, అరటి, బొప్పాయి, కూరగాయలు అంతరపంట లుగా వేసుకోవచ్చని, తోట నిర్వహణ నిమిత్తం ఒక ఎకరానికి సంవత్సరనికి రూ. 4200/- చొప్పున 4 సంవత్సరాల వరకు రైతుకు ఇవ్వబడునని తెలిపారు.ప్రస్తుతం ఆయిల్ పామ్ టన్ను ధర రూ. 20,500/- ఉందని, ఎకరానికి ప్రతి సంవత్సరం కనీసం రూ. 1,00,000/- నికర ఆదాయం పొందవచ్చని తెలిపారు.
లోహియా కంపెనీ తరఫున జిల్లా మేనేజర్ విజయ్ భరత్ , మాట్లాడుతూ  ఆయిల్ పామ్ కొత్తగా చేపట్టే రైతులకు పంట సాగు గురించి వివరించారు అదేవిధంగా ఇదివరకే పంట సాగు చేపట్టిన వారికి సలహాలు పలు సూచనలు 
చేశారు
బుగ్గారం మండలంలోని యశ్వంతరావుపేట గ్రామంలో ఫ్యాక్టరీ నెలకొలపుతున్నామని, రైతు పండించిన గెలలని 1993 ఆయిల్ పామ్ చట్టం ప్రకారం కంపెనీ కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయబడునని తెలిపారు.అదేవిధంగా మండల వ్యవసాయ అధికారి కరుణశ్రీ,  మాట్లాడుతూ వరికి ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్ పామ్ సాగు చేపట్టాలని సూచించారు. రైతులు మట్టి నమూనా పరీక్ష నివేదికను అనుసరించి ఎరువులు వేయాలని తెలిపారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పురపాటి రాజిరెడ్డి, మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో సాగు చేస్తున్న ఆయిల్ పామ్ పంటను చూసానని, అది లాభసాటి పంట అని అందరు వేయాల్సిందిగా కోరారు.ఇట్టి సమావేశంలో జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమల అధికారి శ్రీ దేవప్రసాద్ ,మండల వ్యవసాయ అధికారి కరుణశ్రీ ,ఉద్యాన అధికారి కె. స్వాతి,ఏ ఈ ఓ వంశీకృష్ణ ,లోహియా కంపెనీ జిల్లా మేనేజర్ విజయభరత్, లోహియా సిబ్బంది సంజీవ్, అన్వేష్,  మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పురపాటి రాజిరెడ్డి, ఇతర  రైతులు పాల్గొన్నారు

Tags
Join WhatsApp

More News...

State News 

నేరెళ్ల బాధితులకు న్యాయం చేయాలి -  కల్వకుంట్ల కవిత

నేరెళ్ల బాధితులకు న్యాయం చేయాలి -  కల్వకుంట్ల కవిత    సిరిసిల్ల జూలై 28(ప్రజా మంటలు):సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో జరిగిన పోలీసుల దాష్టీకం తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. బాధితుడు గంధం గోపాల్ కుటుంబాన్ని, ఇతర బాధితులను పరామర్శించిన ఆమె, గత ప్రభుత్వంలో తాను భాగస్వామిగా ఉన్నందుకు క్షమాపణ కోరారు. ఘటనకు బాధ్యులైన...
Read More...
State News 

హైద్రా గొప్ప పని చెస్తుంది - దాని చీఫ్ ను మార్చెదె లేదు - పీఎం రేవంత్

హైద్రా గొప్ప పని చెస్తుంది - దాని చీఫ్ ను మార్చెదె లేదు - పీఎం రేవంత్ హైదరాబాద్, జూలై 28: హైడ్రా (HYDRA) వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా చర్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఉందని, అక్రమ నిర్మాణాలు, చెరువులు, ప్రభుత్వ భూముల కబ్జాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. హైడ్రా ప్రభుత్వ తీసుకొచ్చిన అత్యంత పెద్ద పరిపాలనా సంస్కరణల్లో ఒకటని పేర్కొన్నారు.సీఎం...
Read More...
State News 

జగిత్యాల వైద్య రంగ అభివృద్ధికి కీలక నిర్ణయాలు

 జగిత్యాల వైద్య రంగ అభివృద్ధికి కీలక నిర్ణయాలు హైదరాబాద్, జూలై 28 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా వైద్య వ్యవస్థ అభివృద్ధిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, కోరుట్ల ఎమ్మల్యే  డా. సంహ పాల్గొని, జిల్లా వైద్య రంగానికి సంబంధించిన పలు కీలక...
Read More...
Filmi News  State News 

సినీ నటి పావలా శ్యామల కన్నుమూత.. తెలుగు చిత్రసీమలో విషాదం

సినీ నటి పావలా శ్యామల కన్నుమూత.. తెలుగు చిత్రసీమలో విషాదం హైదరాబాద్, జూలై 28 (ప్రజా మంటలు): ప్రముఖ సీనియర్ సినీ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల (73) మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం, వయోభారంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తీవ్రమైన గుండెపోటుకు గురికావడంతో వైద్యులు ప్రాణాలు కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు....
Read More...
Local News 

రైతు బజార్ లోనే కూరగాయల విక్రయాలు జరపాలి. టౌన్ సిఐ కరుణాకర్ 

రైతు బజార్ లోనే కూరగాయల విక్రయాలు జరపాలి.  టౌన్ సిఐ కరుణాకర్     జగిత్యాల జూలై 27 (ప్రజా మంటలు) కూరగాయలు విక్రయించే రైతులు రైతు బజార్ లోపలే తమ కూరగాయలను విక్రయించాలని టౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు. రైతు బజార్ ఎదుట రహదారికి రెండు వైపులా కూరగాయలు విక్రయించడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రజల ఫిర్యాదు మేరకు  జిల్లా ఎస్పీ ఆదేశాలతో సోమవారం టౌన్ సిఐ కరుణాకర్ ట్రాఫిక్...
Read More...
National 

బోర్నపల్లి–జగన్నాథ్‌పూర్ బ్రిడ్జిపై రాజకీయ దుమారం.. జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కౌంటర్

బోర్నపల్లి–జగన్నాథ్‌పూర్ బ్రిడ్జిపై రాజకీయ దుమారం.. జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కౌంటర్ జగిత్యాల, జూలై 27 (ప్రజా మంటలు): బోర్నపల్లి–జగన్నాథ్‌పూర్ బ్రిడ్జి నిర్మాణం అంశంపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఘాటుగా స్పందించారు. జగిత్యాల మోతే రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పలు అంశాలపై వివరణ ఇచ్చారు. మంత్రి లక్ష్మణ్ కుమార్‌ను హైదరాబాద్‌లో...
Read More...
Local News  State News 

ఎల్ నినో తో ఆందోళనలో ఉన్న రైతులను ఎరువుల బ్లాక్ మార్కెట్‌తో మరింత దోచుకుంటున్న ప్రభుత్వం. - దావ వసంత సురేష్.

ఎల్ నినో తో ఆందోళనలో ఉన్న రైతులను ఎరువుల బ్లాక్ మార్కెట్‌తో మరింత దోచుకుంటున్న ప్రభుత్వం. - దావ వసంత సురేష్. సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/ 9348422113.  జగిత్యాల 27 జూలై (ప్రజా మంటలు) :  జిల్లాలోని రైతులు యూరియా డిఏపి మరియు ఇతర ఎరువులు అధిక ధరలకు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న సందర్భంగా ఈరోజు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు బిఆర్ఎస్ నాయకులు మరియు రైతులతో కలిసి వినతి పత్రం ఇచ్చిన జగిత్యాల...
Read More...
State News 

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్‌.. వెంటనే తొలగించాలని సీఎస్‌కు ఆదేశం

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్‌.. వెంటనే తొలగించాలని సీఎస్‌కు ఆదేశం   కోర్టు ధిక్కార కేసులో కీలక పరిణామం.. ప్రభుత్వానికి ఇప్పుడు రెండు మార్గాలేనా? హైదరాబాద్, జూలై 27: హైదరాబాద్‌లో చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ పేరుతో ఏర్పాటైన హైడ్రా (HYDRAA) మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకుంది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించి, ఆయన స్థానంలో కొత్త అధికారిని నియమించాలని...
Read More...
Local News 

సుసంపన్నమైన వర్షాల కోసమే శ్రీమత్ విరాట పర్వ సప్తాహం 

సుసంపన్నమైన వర్షాల కోసమే శ్రీమత్ విరాట పర్వ సప్తాహం  జగిత్యాల జులై 26 (ప్రజా మంటలు)   సనాతనంగా  సుసంపర్ణమైన వర్షాల కోసమే మహాభారత అంతర్గత శ్రీమత్ విరాట పర్వసప్తాహం నిర్వహించబడేదని నంబి వేణుగోపాల ఆచార్య తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని గీత భవన్ లో శ్రీమాన్ నంబి వేణుగోపాల ఆచార్య చే శ్రీమత్ విరాటపర్వసప్తాహం ప్రారంభమైంది. ఆగస్టు ఒకటవ తేదీ శనివారం వరకు ఈ కార్యక్రమం...
Read More...
National  Local News  Opinion  State News 

ఒకే ఒక్క మొగాడు మొనగాడు ఎమ్మెల్యే పాయల్ శంకర్.. 

ఒకే ఒక్క మొగాడు మొనగాడు ఎమ్మెల్యే పాయల్ శంకర్..  సెల్యూట్ టు ది లీడర్...   నేడు ఎమ్మెల్యే పాయల్ శంకర్ విలువ ఇంతా అంతా కాదు అక్షరాల 2278.14 కోట్లు. అభినవ అపర భగీరథుడు అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్. అదిలాబాద్ జిల్లాకు బాహుబలి లాంటి మెగా నిధుల కేటాయింపు...  రాష్ట్రంలో అదిలాబాదు జిల్లా ఓటర్లే అత్యధిక ప్రభావవంతమైన వారు, తెలివి కలవారు ఒకటి పాయల్...
Read More...
Local News 

కార్గిల్ దివస్ సందర్భంగా వీర జవాన్లకు ఘన నివాళులు అర్పించిన గుంతకల్ బిజెపి నాయకులు

కార్గిల్ దివస్ సందర్భంగా వీర జవాన్లకు ఘన నివాళులు అర్పించిన గుంతకల్ బిజెపి నాయకులు గుంతకల్ జూలై 26 ( ప్రజా మంటలు)  భారతీయ జనతా పార్టీ పాత గుంతకల్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కార్గిల్ దివస్ సందర్భంగా వీర జవాన్లు అందరికీ నివాళులర్పించిన గుంతకల్ బిజెపి నాయకులు ఈ కార్యక్రమంలో బిజెపి ఓల్డ్ టౌన్ పట్టణ అధ్యక్షుడు వడ్డే రమేష్, బిజెపి సీనియర్ నాయకురాలు మరియు ఎఫ్సీఐ స్టేట్ డైరెక్టర్...
Read More...
Local News 

గీతా విద్యాలయం పూర్వ విద్యార్థుల సంకల్పం.  మిత్ర ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలకు శ్రీకారం. 

గీతా విద్యాలయం పూర్వ విద్యార్థుల సంకల్పం.   మిత్ర ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలకు శ్రీకారం.     జగిత్యాల, జులై 26(ప్రజా మంటలు) సిరిసిల్ల రాజేంద్ర శర్మ (9348422113) చేయి చేయి కలుపుదాం సేవ చేయ కదులుదాం... ప్రజల కొరకే మనమంతా ప్రతి నిమిషం బ్రతుకుదాం.. అంటూ శ్రీ సరస్వతీ విద్యాపీఠం అనుబంధ గీత విద్యాలయం పూర్వ విద్యార్థులు "మిత్ర ఫౌండేషన్" పేరుతో సేవా సంస్థకు శ్రీకారం చుట్టారు. జగిత్యాల గీత విద్యాలయంలో విద్యనభ్యసించిన...
Read More...