శ్రీరాములపల్లిలో ఆయిల్ పాం సాగును ప్రోత్సహించడానికి అవగాహన సదస్సు
శ్రీరాములపల్లిలో ఆయిల్ పాం సాగును ప్రోత్సహించడానికి అవగాహన సదస్సు
గొల్లపల్లి జనవరి 10 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలంలోని శ్రీరాములపల్లి గ్రామం లో ఆయిల్ పాం సాగును ప్రోత్సహించడానికి జిల్లా లోని ఉద్యాన శాఖ మరియు లోహియా ఎడిబుల్ ఆయిల్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సహకారంతో ఆయిల్ పామ్ పంట మీద అవగాహన సదస్సును నిర్వహించడం ఇందులో భాగంగా జిల్లా ఉద్యాన అధికారి దేవ ప్రసాద్ మాట్లాడుతూ గొల్లపల్లి మండలంలో ఇదివరకే 310 ఎకరాలలో ఆయిల్పామ్ సాగును చేపట్టడం జరిగిందని ఆయన కొని ఆడారు. కొత్తగా ఆయిల్ పామ్ పంట సాగు చేయడానికి ముందుకు వచ్చే రైతులకు చెట్లను 90 శాతం సబ్సిడీ పై, డ్రిప్ పరికరాలను BC, సన్న చిన్న రైతులకు 90 శాతం ఎస్సీ, ఎస్టి రైతులకు 100 పర్సెంట్ సబ్సిడీ, OC పెద్ద రైతులకు 80% సబ్సిడీ మీద అందించడం జరుగుతుందని ఆయన మాట్లాడారు.ఆయిల్ పామ్ సాగు చేపట్టిన రైతులకు ఆయన తగిన సలహాలు సూచనలు చేశారు ఆయిల్ సాగు చేస్తున్న రైతులు కోకో పంటను అంతర పంటగా వేయాలని ఆయన కోరారు కోకో పంట సాగుతో 2 లక్షల నికర ఆదాయం ఎకరానికి పొందవచ్చు అని ఆయన సూచించారు. ఆ తర్వాత జగిత్యాల్ నియోజకవర్గ ఉద్యాన అధికారి కందుకూరి స్వాతి ,మాట్లాడుతూ ఆయిల్ పామ్ తోటల్లో మొదటి 3 సంవత్సరాలు వరి తప్ప మిగతా పత్తి, మొక్కజొన్న, పసుపు, అరటి, బొప్పాయి, కూరగాయలు అంతరపంట లుగా వేసుకోవచ్చని, తోట నిర్వహణ నిమిత్తం ఒక ఎకరానికి సంవత్సరనికి రూ. 4200/- చొప్పున 4 సంవత్సరాల వరకు రైతుకు ఇవ్వబడునని తెలిపారు.ప్రస్తుతం ఆయిల్ పామ్ టన్ను ధర రూ. 20,500/- ఉందని, ఎకరానికి ప్రతి సంవత్సరం కనీసం రూ. 1,00,000/- నికర ఆదాయం పొందవచ్చని తెలిపారు.
లోహియా కంపెనీ తరఫున జిల్లా మేనేజర్ విజయ్ భరత్ , మాట్లాడుతూ ఆయిల్ పామ్ కొత్తగా చేపట్టే రైతులకు పంట సాగు గురించి వివరించారు అదేవిధంగా ఇదివరకే పంట సాగు చేపట్టిన వారికి సలహాలు పలు సూచనలు
చేశారు
బుగ్గారం మండలంలోని యశ్వంతరావుపేట గ్రామంలో ఫ్యాక్టరీ నెలకొలపుతున్నామని, రైతు పండించిన గెలలని 1993 ఆయిల్ పామ్ చట్టం ప్రకారం కంపెనీ కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయబడునని తెలిపారు.అదేవిధంగా మండల వ్యవసాయ అధికారి కరుణశ్రీ, మాట్లాడుతూ వరికి ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్ పామ్ సాగు చేపట్టాలని సూచించారు. రైతులు మట్టి నమూనా పరీక్ష నివేదికను అనుసరించి ఎరువులు వేయాలని తెలిపారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పురపాటి రాజిరెడ్డి, మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో సాగు చేస్తున్న ఆయిల్ పామ్ పంటను చూసానని, అది లాభసాటి పంట అని అందరు వేయాల్సిందిగా కోరారు.ఇట్టి సమావేశంలో జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమల అధికారి శ్రీ దేవప్రసాద్ ,మండల వ్యవసాయ అధికారి కరుణశ్రీ ,ఉద్యాన అధికారి కె. స్వాతి,ఏ ఈ ఓ వంశీకృష్ణ ,లోహియా కంపెనీ జిల్లా మేనేజర్ విజయభరత్, లోహియా సిబ్బంది సంజీవ్, అన్వేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పురపాటి రాజిరెడ్డి, ఇతర రైతులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
మెట్పల్లి వరుస దొంగతనాల కేసులు ఛేదింపు : 7 మంది నిందితుల అరెస్ట్
మెట్పల్లిలో వరుస దొంగతనాల కేసులు ఛేదింపు
7 మంది నిందితుల అరెస్ట్ – 15 తులాల బంగారం, 32 తులాల వెండి స్వాధీనం
మెట్పల్లి, ఫిబ్రవరి 5 (ప్రజా మంటలు):మెట్పల్లి పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో జరిగిన వరుస దొంగతనాల కేసులను మెట్పల్లి పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసులకు సంబంధించి ఏడుగురు నిందితులను... నాలుగు వారాల్లో తెలంగాణకు డీజీపీ నియమించాలి: సుప్రీంకోర్టు
హైదరాబాద్, ఫిబ్రవరి 05 (ప్రజా మంటలు):
నాలుగు వారాల్లోగా తెలంగాణ రాష్ట్రానికి పూర్తిస్థాయి డీజీపీని నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. డీజీపీ నియామకానికి యూపీఎస్సీ అత్యవసరంగా సిఫార్సులు చేయాలని స్పష్టం చేసింది.
అర్హత కలిగిన అధికారుల జోన్ ఆఫ్ కన్సిడరేషన్ నుంచి వారి పరస్పర ప్రతిభ (ఇంటర్-సే మెరిట్) ఆధారంగా ఎంపిక జరగాలని పేర్కొంది. ఈ ప్రక్రియను... ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి కులాల పేరిట దుర్భాషలాడరాదు
జగిత్యాల ఫిబ్రవరి 5 ( ప్రజా మంటలు)ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా విమర్శించవచ్చు కానీ తమ జాతి పేరిట ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వెలమజాతి పేరిట కెసిఆర్ ను విమర్శించడం సరికాదని జగిత్యాల వెలమ సంక్షేమ మండలి అధ్యక్షులు ఐల్నేని సాగర్ రావు అన్నారు. గురువారం వెలమ సంఘ భవనంలో నిర్వహించిన... లాయర్ స్వప్న హత్య ఘటనపై సీఎం స్పందించాలి: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, ఫిబ్రవరి 05 (ప్రజా మంటలు):రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలో హత్యకు గురైన న్యాయవాది స్వప్న కుటుంబ సభ్యులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబాన్ని ఓదార్చి ధైర్యం చెప్పారు.
ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కవిత, లాయర్ స్వప్న ఉదంతం సమాజాన్ని... ప్రభుత్వ డిగ్రీ విద్యార్థుల క్షేత్ర పర్యటన
హుస్నాబాద్,ఫిబ్రవరి5,(ప్రజా మంటలు):
ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులు మరియు అధ్యాపకులు కలిసి హుస్నాబాద్ లోని గోమాత జిన్నింగ్ మరియు ప్రెస్సింగ్ కాటన్ మిల్లును సందర్శించడం జరిగింది. ఈ సందర్శనలో భాగంగా రైతులు సేకరించిన పత్తిని ఏ విధంగా మిల్లులో శుభ్రం చేసి పత్తి గింజలను వేరు చేసి తెల్లని పత్తిని మిల్లులోని వివిధ యంత్రాల... యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన
మిర్యాలగూడ, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామంలో రూ.200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ‘ప్రజాపాలన – ప్రగతి బాట’ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.
కార్యక్రమంలో నీలగిరి జిల్లా మహిళా సమాఖ్యకు రూ.1138 కోట్ల... జగిత్యాలలో 20 అడుగుల శ్రీవేంకటేశ్వర స్వామి 3డి సైకత శిల్ప ప్రదర్శన
జగిత్యాల, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
శ్రీ వెంకటేశ్వర స్వామి సమితి ఆధ్వర్యంలో తెలంగాణలో తొలిసారిగా జగిత్యాల కరీంనగర్ రోడ్ సర్కస్ గ్రౌండ్లో 20 అడుగుల కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి 3డి సైకత శిల్ప ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను శ్రీమాన్ నంబి వేణుగోపాల చార్య ప్రారంభించారు.
ఈ 3డి సైకత శిల్ప... మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యం ఇచ్చాం : జిల్లా BRS అధ్యక్షులు
జగిత్యాల, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలోని జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసి బి-ఫారాలు అందజేశామని తెలిపారు. జనరల్ స్థానాల్లోనూ బీసీ... తెలంగాణ అధ్యయన కమిటీల సభ్యులతో కవిత
హైదరాబాద్, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీలతో నేటి నుంచి వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. తెలంగాణ సమగ్రాభివృద్ధి, సబ్బండ వర్గాల వికాసం, సామాజిక తెలంగాణ సాధన లక్ష్యంగా 50 అధ్యయన కమిటీలను తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసింది.
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బ్లూ ప్రింట్ రూపొందించే... “విద్యార్థులే.. స్వీపర్లు!” అనే వార్తా కథనంపై హక్కుల కమీషన్ కేసు
హైదరాబాద్, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సభ్యులు (న్యాయ విభాగం) సివడి ప్రవీణ గారు, నమస్తే తెలంగాణ దినపత్రికలో 04.02.2026న ప్రచురితమైన “విద్యార్థులే.. స్వీపర్లు!” అనే వార్తా కథనాన్ని ఆధారంగా తీసుకొని స్వయంచాలక (సూవో-మోటు) విచారణ చేపట్టారు.
హైదరాబాద్లోని అనేక ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో స్వీపర్లు అందుబాటులో లేకపోవడంతో, 1వ... జగిత్యాల మున్సిపాలిటీ పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు
జగిత్యాల ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
బిఆర్ఎస్ - బీజేపీ | కాంగ్రెస్ మూడు ప్రధాన పార్టీల నుండి పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు, వార్డుల వారిగా..
వార్డు
రిజర్వేషన్
BRS
BJP
కాంగ్రెస్
1
BC(G)
నిమిషకవి వంశీకృష్ణ
పుప్పాల రాజేష్
అనిల్ కుమార్ కూసరి
2
UR(W)
వొడ్డినేని సంధ్య కుమారి
కాశెట్టి... ఐల్నేని ఆసుపత్రి వారి సౌజన్యముతో క్యాన్సర్ పై అవగాహన సదస్సు
జగిత్యాల ఫిబ్రవరి 4 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని వాల్మీకి ఆవాసం గీతావిద్యాలయం గ్రౌండ్ లో బుధవారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పురస్కరించుకొని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. క్యాన్సర్ వలన అనారోగ్యము మరణాలు తగ్గించడమే అవగాహన యొక్క ముఖ్య లక్ష్యం అని వైద్యులు పేర్కొన్నారు. డా వంశీ చేతన ప్రముఖ ఆంకాలజిస్ట్, డా వినీల ,డా... 