శ్రీరాములపల్లిలో ఆయిల్ పాం సాగును ప్రోత్సహించడానికి అవగాహన సదస్సు
శ్రీరాములపల్లిలో ఆయిల్ పాం సాగును ప్రోత్సహించడానికి అవగాహన సదస్సు
గొల్లపల్లి జనవరి 10 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలంలోని శ్రీరాములపల్లి గ్రామం లో ఆయిల్ పాం సాగును ప్రోత్సహించడానికి జిల్లా లోని ఉద్యాన శాఖ మరియు లోహియా ఎడిబుల్ ఆయిల్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సహకారంతో ఆయిల్ పామ్ పంట మీద అవగాహన సదస్సును నిర్వహించడం ఇందులో భాగంగా జిల్లా ఉద్యాన అధికారి దేవ ప్రసాద్ మాట్లాడుతూ గొల్లపల్లి మండలంలో ఇదివరకే 310 ఎకరాలలో ఆయిల్పామ్ సాగును చేపట్టడం జరిగిందని ఆయన కొని ఆడారు. కొత్తగా ఆయిల్ పామ్ పంట సాగు చేయడానికి ముందుకు వచ్చే రైతులకు చెట్లను 90 శాతం సబ్సిడీ పై, డ్రిప్ పరికరాలను BC, సన్న చిన్న రైతులకు 90 శాతం ఎస్సీ, ఎస్టి రైతులకు 100 పర్సెంట్ సబ్సిడీ, OC పెద్ద రైతులకు 80% సబ్సిడీ మీద అందించడం జరుగుతుందని ఆయన మాట్లాడారు.ఆయిల్ పామ్ సాగు చేపట్టిన రైతులకు ఆయన తగిన సలహాలు సూచనలు చేశారు ఆయిల్ సాగు చేస్తున్న రైతులు కోకో పంటను అంతర పంటగా వేయాలని ఆయన కోరారు కోకో పంట సాగుతో 2 లక్షల నికర ఆదాయం ఎకరానికి పొందవచ్చు అని ఆయన సూచించారు. ఆ తర్వాత జగిత్యాల్ నియోజకవర్గ ఉద్యాన అధికారి కందుకూరి స్వాతి ,మాట్లాడుతూ ఆయిల్ పామ్ తోటల్లో మొదటి 3 సంవత్సరాలు వరి తప్ప మిగతా పత్తి, మొక్కజొన్న, పసుపు, అరటి, బొప్పాయి, కూరగాయలు అంతరపంట లుగా వేసుకోవచ్చని, తోట నిర్వహణ నిమిత్తం ఒక ఎకరానికి సంవత్సరనికి రూ. 4200/- చొప్పున 4 సంవత్సరాల వరకు రైతుకు ఇవ్వబడునని తెలిపారు.ప్రస్తుతం ఆయిల్ పామ్ టన్ను ధర రూ. 20,500/- ఉందని, ఎకరానికి ప్రతి సంవత్సరం కనీసం రూ. 1,00,000/- నికర ఆదాయం పొందవచ్చని తెలిపారు.
లోహియా కంపెనీ తరఫున జిల్లా మేనేజర్ విజయ్ భరత్ , మాట్లాడుతూ ఆయిల్ పామ్ కొత్తగా చేపట్టే రైతులకు పంట సాగు గురించి వివరించారు అదేవిధంగా ఇదివరకే పంట సాగు చేపట్టిన వారికి సలహాలు పలు సూచనలు
చేశారు
బుగ్గారం మండలంలోని యశ్వంతరావుపేట గ్రామంలో ఫ్యాక్టరీ నెలకొలపుతున్నామని, రైతు పండించిన గెలలని 1993 ఆయిల్ పామ్ చట్టం ప్రకారం కంపెనీ కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయబడునని తెలిపారు.అదేవిధంగా మండల వ్యవసాయ అధికారి కరుణశ్రీ, మాట్లాడుతూ వరికి ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్ పామ్ సాగు చేపట్టాలని సూచించారు. రైతులు మట్టి నమూనా పరీక్ష నివేదికను అనుసరించి ఎరువులు వేయాలని తెలిపారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పురపాటి రాజిరెడ్డి, మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో సాగు చేస్తున్న ఆయిల్ పామ్ పంటను చూసానని, అది లాభసాటి పంట అని అందరు వేయాల్సిందిగా కోరారు.ఇట్టి సమావేశంలో జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమల అధికారి శ్రీ దేవప్రసాద్ ,మండల వ్యవసాయ అధికారి కరుణశ్రీ ,ఉద్యాన అధికారి కె. స్వాతి,ఏ ఈ ఓ వంశీకృష్ణ ,లోహియా కంపెనీ జిల్లా మేనేజర్ విజయభరత్, లోహియా సిబ్బంది సంజీవ్, అన్వేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పురపాటి రాజిరెడ్డి, ఇతర రైతులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
జనరల్ బజార్లో నటి, యాంకర్ సుమ సందడి
సికింద్రాబాద్, జనవరి 21 (ప్రజా మంటలు):
సికింద్రాబాద్ జనరల్ బజార్లో కుబేరా సిల్క్స్ నూతన షోరూమ్ను ప్రముఖ నటి, యాంకర్ సుమ కనకాల ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూమ్ పరిసరాలు సందడిగా మారాయి. కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు శ్యామ్సుందర్, శాలిని, వ్యాపార ప్రముఖులు, వినియోగదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
2025 జూలై 12న... వెయిట్ లాస్ ఇంజెక్షన్లతో పెరుగుతున్న ‘ఆకస్మిక’ గర్భధారణలు
హైదరాబాద్ / న్యూఢిల్లీ జనవరి 21:
టైప్-2 డయాబెటిస్ చికిత్స, బరువు తగ్గడానికి వినియోగిస్తున్న ఆధునిక GLP-1 ఇంజెక్షన్లు (Ozempic, Wegovy, Mounjaro) భారతదేశంలో అనూహ్య పరిణామానికి దారితీస్తున్నాయి. ఈ మందులు వాడుతున్న మహిళల్లో ఊహించని విధంగా గర్భధారణలు పెరుగుతున్నాయని గైనకాలజిస్టులు, ఎండోక్రైనాలజిస్టులు వెల్లడిస్తున్నారు. ఈ పరిణామాన్ని వైద్య పరిభాషలో **‘ఒజెంపిక్ బేబీస్’**గా పిలుస్తున్నారు.
ప్రత్యేకించి ... నేరాల నియంత్రణకు,కమ్యూనిటీ భద్రతకు సీసీ కెమెరాలు దోహదం చేస్తాయి. సీసీ కెమెరాలు ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల రూరల్ జనవరి 21 (ప్రజా మంటలు)
నూతన సాంకేతికత ను గ్రామాల్లో ఉపయోగించి దాతల సహకారంతో 2లక్షల రూపాయల విలువగల సి సి కెమెరాలు ఏర్పాటు అభినందనీయం. సిసి కెమెరాల ఏర్పాటు తో పాటు వారు నిర్వహణ చాలా ముఖ్యమని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు.
నేరాల నియంత్రణ,గ్రామంలో కొత్త వ్యక్తుల రాకపోకలు చిత్రించి,అనుమానాస్పద... 25ఏండ్ల యువతికి పున:ర్జన్మ ప్రసాదించిన గాంధీ డాక్టర్లు
సికింద్రాబాద్, జనవరి 21 (ప్రజామంటలు) :
గాంధీఆస్పత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించి ఓ మహిళ రోగికి పునర్జన్మ ప్రసాదించారు. కార్డియోథోరాసిస్ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన సర్జరీ వివరాలను ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొ. వాణితో కలిసి సీటీసర్జరీ హెచ్ఓడీ ప్రొ. రవీంద్ర బుధవారం మీడియాకు వెల్లడించారు.
వివరాలు ఇవి...ఆసిఫాబాద్కు చెందిన పల్లవి (25) పలు... శంకరాచార్యులు – మహంత్ యోగి వివాదం : హోదా, ధర్మం, క్షమాపణ ప్రశ్న
(ప్రత్యేక కథనం)
ఉత్తరప్రదేశ్లో జ్యోతిర్పీఠ శంకరాచార్యులు మరియు సీఎం యోగి ఆదిత్యనాథ్ మధ్య ఇటీవల చోటుచేసుకున్న వాదనలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఈ వివాదం కేవలం రాజకీయ కోణంలోనే కాకుండా, హిందూ ధర్మంలో ఉన్న శంకరాచార్యుల హోదా, మహంత్ స్థానం, ధార్మిక మర్యాదలు వంటి అంశాలను మళ్లీ ప్రశ్నార్థకంగా నిలబెట్టింది.
శంకరాచార్యులు – హిందూ ధర్మంలో... 25వ వార్డ్ కు చెందిన పలువురు బిజెపిలో చేరిక
జగిత్యాల జనవరి 21 (ప్రజా మంటలు)పట్టణ 25వ వార్డ్ కి చెందిన గుండేటి సాయి మరియు 25 వార్డ్ సభ్యులు కేంద్ర ప్రభుత్వం మరియు నరేంద్ర మోడీ అమలు చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలకు ఆకర్షితులై భారతీయ జనతా పార్టీలో చేరగా వారికి భారతీయ జనతా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన... డిప్యూటీ సీఎం ను కలిసిన బీసీ నేతలు
ధర్మపురి జనవరి 21 ( ప్రజా మంటలు)పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కు ధర్మపురి కి విచ్చేసినతెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ కలసి బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం వినతి పత్రం అందించారు
తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42... శ్రీ భక్త మార్కండేయ జయంతి సందర్భంగా ఆలయంలో పూజలు చేసిన డాక్టర్ భోగ శ్రావణి ప్రవీణ్
బుగ్గారం జనవరి 21 (ప్రజా మంటలు) శ్రీ భక్త మార్కండేయ జయంతి సందర్భంగా బుగ్గారం మండలంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా బోగ శ్రావణి
ఈ కార్యక్రమంలో బుగ్గారం బిజెపి మండల అధ్యక్షులు శ్రీధర్, రాష్ట్ర పద్మశాలి మహిళా ఉపాధ్యక్షురాలు సింగం... మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి.
జగిత్యాల జనవరి 21 ( ప్రజా మంటలు)మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని పునరుద్దరించాలని జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి అన్నారు.
జగిత్యాల రూరల్ మండలం చల్ గల్ గ్రామంలో ఉపాధి హామీ వర్కర్స్ తో విజయలక్ష్మి మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ... ట్రంప్ ప్రతిపాదించిన “Board of Peace” – ప్రపంచ నాయకులకు ఆహ్వానం,
(ప్రత్యేక కథనం)
యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన తాజా లేఖలో ప్రపంచ దేశాధినేతలను “Board of Peace” (ప్రపంచ శాంతి బోర్డు) అనే కొత్త అంతర్జాతీయ శాంతి సంస్థలో భాగస్వాములుగా చేరమని ఆహ్వానించారు. ఈ బోర్డు గాజా సహారా వివాదానికి సమాధానాలు కనుగొనడమే ధ్యేయంగా ప్రారంభమౌతుందన్నట్లు వెల్లడించారు, తదుపరి ఇతర అంతర్జాతీయ సంఘర్షణలకు... అన్ని వర్గాల సంక్షేమంతో పాటుగా శుద్ధ నీటి వ్యవస్థల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
ధర్మపురి జనవరి 21 (ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లాలోని ధర్మపురిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లతో కలిసి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్యం, అన్ని వర్గాల సంక్షేమంతో పాటు శుద్ధ త్రాగునీటి వ్యవస్థల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని... రాష్ట్రస్థాయి గణతంత్ర దినోత్సవ పరేడ్కు జ్యోతి హై స్కూల్ – ఐఐటీ అకాడమీ విద్యార్థులు
జగిత్యాల జనవరి 21 (ప్రజా మంటలు)పట్టణంలోని జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ కి చెందిన 8 మంది స్కౌట్స్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించబడే రాష్ట్రస్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్కు ఎంపిక కావడం పాఠశాలకు ఎంతో గర్వకారణంగా నిలిచింది
ఈ రాష్ట్రస్థాయి పరేడ్కు సంబంధించిన శిక్షణ మరియు రిహార్సల్స్... 