#Draft: Add Your Title

On
#Draft: Add Your Title

ధర్మపురిలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

 (రామ కిష్టయ్య సంగన భట్ల 9440595494)

 ప్రాచీన పుణ్య క్షేత్రమైన ధర్మపురి లోని శ్రీక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో, శుక్ర వారం వైకుంఠ (ముక్కోటి ఏకాదశి) వేడుకలు కన్నుల పండువగా, పైభవోపేతంగా జరిగాయి. ఉదయాత్ పూర్వం వేద మంత్రోచ్ఛారణల మధ్య, అర్చకులు పవిత్ర జలాలను కొనితెచ్చి లక్ష్మీ సమేత శ్రీ యోగానంద,శ్రీ ఉగ్ర నారసింహ, శ్రీ వేంకటేశ్వర స్వాముల మూల విరాట్టులను సాంప్రదాయ విధి విధాన రీతిలో, మహాక్షీరా భిషేకాది ప్రత్యేక పర్వదిన పూజలు నిర్వహించారు. అనంతరం సర్వాంగ సుందరంగా అలంకృతులైన స్థానిక ఇలవేల్పులను దేవస్థాన ప్రాంగణంలో విద్యుద్దీపికలలో, వివిధ పుష్ప మాలికలతో, శోభాయమానంగా తీర్చి దిద్దిన రంగవల్లులతో, ఆకర్షణీయంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై అసీసుల గావించారు.

ధనుర్మాస ప్రత్యేకతలో సప్త హారతులు, షోడశోపచార పూజలు, వేద, శాస్త్ర పురాణ, సంగీత, నృత్య, వాద్యాది అవధారయాలతో ఆర్చనలు, భక్తుల గోత్ర నామాదులతో పూజలు నిర్వహించగా, భక్తజనులు భక్తి శ్రద్ధలతో కన్నులారా గాంచి తరిం చారు. అనంతరం జయ జయ ధ్వనాల మధ్య ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ సమక్షంలో, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసా చార్య వైకుంఠ (ఉత్తర) ద్వారానికి పూజ చేసి, నారికేళములను సమర్పించి, వైకుంఠ ద్వారం తెరవగా,  ద్వారం ద్వారా  ప్రవేశించిన భక్తులు పరమానంద భరితులై తనివి తీరా దర్శనం చేసుకున్నారు. 

 దేవస్థానం ఈ ఓ శ్రీనివాస్ పర్య వేక్షణలో, దేవస్థాన అర్చకుల బృందం ఆధ్వర్యంలో, సిబ్బంది సహకారంతో, బొజ్జా సంపత్ కుమార్, రాజ గోపాల్, పాలేపు ప్రవీణ్ శర్మ ,  క్షేత్ర పండితుల మార్గదర్శకత్వంలో ఘనంగా కార్య క్రమాలను నిర్వహించారు. 

రాష్ట్ర ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, జిల్లా ఎస్పీ, డీఎస్పీ, ఆర్డీఓ మధుసూదన్, డిసిఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ సత్తమ్మ, వైస్ చైర్మన్ రామయ్య, మార్కెట్ చైర్ పర్సన్ లావణ్య, వైస్ చైర్మన్ నర్సింలు 
తదితరులు ప్రత్యేక పూజాదులలో పాల్గొన్నారు. అలాగే బచ్చు రాము గుప్తా సహకారంతో 
నూతర సంవత్సర క్యాలండర్ ను విప్ లక్ష్మణ్ కుమార్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఇతర ప్రముఖుల సమక్షంలో ఆవిష్కరించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత తదితరులు దైవ దర్శనాలు చేసుకున్నారు.

భారీ ఏర్పాట్లు 

వైకుంఠ ఏకాదశి మహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక శ్రద్ధతో, శ్రమ కోర్చి ఈ ఏడు భారీ ఏర్పాట్లు గావించారు. ప్రధాన రహదారి నుండి దేవస్థానం లోపలి వరకూ క్యూలైన్లు ఏర్పరిచారు. దేవస్థాన ప్రాంగణంలో విద్యుద్దీమాలతో, రంగవల్లులతో, పెద్దఎత్తున పందిళ్ళను, ప్రత్యేక పుష్ప వేదికను ఏర్పాటు చేశారు. దేవస్థానం బయట రోడుపై వివిధ ఆకృతులలో రంగులద్దారు. స్వాములను ఆసీనుల గావించిన ప్రదేశాన శాశ్వత ఇనుప షెడ్లను అందంగా తీర్చి దిద్దారు. ధర్మపురి సిఐ రాం నర్సింహా రెడ్డి రూప కల్పన మేరకు డివిజన్ లోని పలువురు ఎస్ఐలు, ఎఎస్ఐలు/హెడ్ కానిస్టే బుల్స్, సివిల్ కానిస్టేబుల్స్, హోంగార్డులు, మహిళా హోంగార్డులు, డిస్ట్రిక్ట్ గార్డులు, ప్రైవేటు సెక్యూటిరీ గార్డులు దేవస్థానంలో కట్టుదిట్టమైన బందోబస్తుని ర్వహించారు. ఎస్.ఆర్.ఆర్. కేబుల్ నెట్ వర్క్ ద్వారా గావించిన ప్రత్యక్ష ప్రసారం స్థానికంగా వీక్షించారు. బాచంపెల్లి సంతోష్ కుమార్ 
వ్యాఖ్యానాలు ఆకట్టుకున్నాయి. 
గుండి జగదీశ్వర్, బృందం భక్తి సంగీత విభావరి అలరించింది. కోలాట బృందం నృత్యాలు, విన్యాసాలు, ఆటపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 

 వైకుంఠ ద్వార దర్శనంలో జాప్యం 

వైకుంఠ ఏకాదశి సందర్భంగా, ఉత్సవాలలో ప్రధానమైన ఉత్తర ద్వార దర్శన కార్యక్రమ నిర్వహణ విషయంలో, పెరిగిన రద్దీ కారణంగా, దైవ సేవలు ద్వారం గుండా వేంచేపు చేయడంలో కాలా యాపన జరిగింది. వాస్తవానికి కారణాలేవైనా, ప్రత్యేక వేదిక వద్ద పూజలు 5గంటల తర్వాత ప్రారంభం చేశారు. IMG-20250110-WA0552
 ధనుర్మాస శుక్లపక్ష ఏకాదశి ప్రభాత సమయంలో, వైకుంఠంలో శ్రీమహావిష్ణువును దర్శించి తరించిన నేపథ్యంలో, ఇంద్రాది దేవతలు జరుపు కుంటున్న ఈ ఉత్సవ వేడుకలలో ప్రాతః కాలంలో బ్రాహ్మీముహూర్తంలో పూ జలొనర్చి, సూర్యోదయానికి ముందే వైకుంఠ (ఉత్తర) ద్వారం తెరవబడి, ఆ ద్వారం గుండా వేంచేసే స్వాముల దర్శనాలు చేసుకోవడం ప్రధానం మరియు క్షేత్రంలో అనుసరణీయమైన సాంప్రదాయం కాగా, భక్తుల రద్దీ అధికమై, దర్శనాలకై బారులు తీరిన సందర్భంలో, ఉదయాత్పూ ర్వమే ఉత్తర ద్వారం తెరిచినా, స్వాముల సేవల వేంచేపు చాలా ఆలస్యమై ఉదయం
 8.30గంటల వరకు దైవ సేవలు పట్టణంలోకి వెళ్ళడం నిర్వహించారు. స్వాముల ఉత్సవ మూర్తుల సేవలను పట్టణ వీధుల గుండా ఊరేగించి, ఇసుక స్థంభం వద్ద పూజలు నిర్వహించాక, దేవస్థానానికి తిరిగి వచ్చారు. 
ముక్కోటి వేదిక వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, వైకుంఠ ద్వారం నుండి భక్తుల దర్శనాలను కొనసాగించారు.

Tags

More News...

Local News 

6 లక్షల మంది భక్తులు బల్కంపేట అమ్మవారిని దర్శించుకున్నారు  - పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ

6 లక్షల మంది భక్తులు బల్కంపేట అమ్మవారిని దర్శించుకున్నారు  - పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ సికింద్రాబాద్ జూలై 03 (ప్రజామంటలు): బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఎదురుకోలు, కళ్యాణ మహోత్సవం, రథోత్సవం, బోనాల జాతర ఘనంగా నిర్వహించడం జరిగిందని సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ తెలిపారు. మూడు రోజుల ఉత్సవాలకు దాదాపు 6 లక్షలకు పైగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి సేవలో...
Read More...
Opinion 

బహుముఖ ప్రజ్ఞాశాలి, వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శి పట్టాభిరామ్

బహుముఖ ప్రజ్ఞాశాలి, వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శి పట్టాభిరామ్ వ్యక్తిత్వ వికాసానికి వెలుగునివ్విన బి.వి. పట్టాభిరామ్ మృతి    (రామ కిష్టయ్య సంగన భట్ల, సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్టు, కాలమిస్టు ...9440595494) ప్రముఖ ఇంద్రజాలికుడు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు బి వి పట్టాభిరామ్ మంగళ వారం గుండె పోటుతో మృతి చెందడంతో ఒక గొప్ప అపూర్వ అపురూప కళాకారుడిని తెలుగు కళామతల్లి కోల్పోయింది. బి.వి. పట్టాభిరామ్ (భావరాజు...
Read More...
Local News 

ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే 2025 వేడుకలు

ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే 2025 వేడుకలు సికింద్రాబాద్, జూలై 03 (ప్రజామంటలు) :   సికింద్రాబాద్ క్రిస్టియన్ ప్రెస్ క్లబ్ లో గురువారం  యేసుక్రీస్తు ప్రభువుతో జీవించిన శిష్యులు సెయింట్ తోమా హతసాక్షిగ చనిపోయిన రోజును పురస్కరించుకొని ఇండియన్ క్రిస్టియన్ భక్తి  దినోత్సవంగా జరుపుకున్నారు. సికింద్రాబాద్ లో  క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో సెయింట్ థామస్  చేసిన సువార్త పరిచర్యను కొనసాగించాలని  తీర్మానించారు. హిందూమతోన్మాద
Read More...
Local News  State News 

బన్సీలాల్ పేట లో వెలుగు చూసిన బోనాల చెక్కుల గోల్ మాల్

బన్సీలాల్ పేట లో వెలుగు చూసిన బోనాల చెక్కుల గోల్ మాల్   - లేని ఓ టెంపుల్ కు 8 ఏండ్ల నుంచి చెక్కులు  - మరికొన్ని టెంపుల్లో ఒక్కో దానికి రెండేసి చెక్కులు  - విచారణ ప్రారంభించిన ఎండోమెంట్ అధికారులు  - ఉన్నతాధికారులకు కాంగ్రెస్ నేతల ఫిర్యాదు.. సికింద్రాబాద్ జూలై 03 (ప్రజామంటలు) : ఆషాఢ మాస బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం ఇచ్చే చెక్కులు గత...
Read More...
Local News 

డెంగ్యూ పాజిటివ్ కేసు..అప్రమత్తమైన అధికారులు

డెంగ్యూ పాజిటివ్ కేసు..అప్రమత్తమైన అధికారులు సికింద్రాబాద్, జూలై 03 (ప్రజామంటలు): బన్సీలాల్ పేట డివిజన్ లో ఓ డెంగ్యూ పాజిటివ్ కేసు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గురువారం డివిజన్ లోని కీస్ బ్లాక్ జైనగర్ ప్రాంతంలోని ఓ వ్యక్తికి డెంగ్యూ పాజిటివ్ రావడంతో జీహెచ్ఎమ్సీ డిప్యూటీ కమిషనర్ డాకునాయక్ ఆధ్వర్యంలో అధికారుల బృందం కాలనీని సందర్శించారు. ఎంటమాలజీ సిబ్బంది కాలనీలో...
Read More...

రేపటి నుంచి వారం పాటు శ్రీసాయి సప్తాహ ఉత్సవాలు

రేపటి నుంచి వారం పాటు శ్రీసాయి సప్తాహ ఉత్సవాలు సికింద్రాబాద్, జూలై 03 (ప్రజామంటలు):   పద్మారావునగర్ డా.సాయి కుమార్ వ్యాధి నివారణ ఆశ్రమ్ లో రేపటి నుంచి ఈనెల 4 నుంచి 10 వ తేదీ వరకు వారం రోజుల పాటు శ్రీసాయి సప్తాహము ఉత్సవాలను నిర్వహించనున్నారు.ఈమేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి రోజు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. శ్రీసాయి
Read More...
Local News 

ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయి చదువుకి  శ్రీ సత్యసాయి సేవా సమితి ఆర్థిక చేయూత 

ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయి చదువుకి  శ్రీ సత్యసాయి సేవా సమితి ఆర్థిక చేయూత    జగిత్యాల జూలై 3(ప్రజా మంటలు    ) స్థానిక జగిత్యాల సాయినగర్ కి చెందిన శ్రీమతి మామిడాల చంద్రకళ  చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఇద్దరు ఆడపిల్లలను ఉన్నత చదువులు చదివిపిస్తూ వచ్చింది , కానీ ఇప్పుడు తన ఆరోగ్యం క్షీణించడంతో ఉద్యోగం చేసే పరిస్థితి లేకపోవడంతో ఇంజనీరింగ్ చదువుతున్న తన కూతురు వెన్నెల కాలేజ్ ఫీ...
Read More...
Local News 

రాయికల్ మండల కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన  జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ 

రాయికల్ మండల కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన  జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్  రాయికల్ జులై 3( ప్రజా మంటలు)   రాయికల్ మండల కేంద్రంలో  సామాజిక  ఆరోగ్య కేంద్రం ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఓ. పి. సేవలు, ఐపీ సేవలు రికార్డ్స్ ల్యాబ్ రికార్డ్స్ ఐపీ రికార్డ్స్ మెడికల్ ఫార్మసి జిల్లాకలెక్టర్ పరిశీలించారు.   ఆసుపత్రిలో వైద్య సేవలను గురించి నేరుగా పేషంట్లని వివరాలు అడిగివైద్య...
Read More...
Local News 

సేవా భారతి ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలు. 

సేవా భారతి ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలు.        జగిత్యాల జూలై 3 (ప్రజా మంటలు ) వాల్మీకి ఆవాసం సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో గురువారం గోరింటాకు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆషాడ మాసం సందర్భంగా స్త్రీలు గోరింటాకును ధరించడం ఆనవాయితీగా వస్తుంది. ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న మహిళలు, సేవికాసమితి సేవా భారతి కార్యకర్తలు...
Read More...
Local News 

పద్మశాలి సేవ సంఘ భవన నిర్మాణానికి నిధుల కోసం  ఎమ్మెల్యే కు వినతి 

పద్మశాలి సేవ సంఘ భవన నిర్మాణానికి నిధుల కోసం  ఎమ్మెల్యే కు వినతి      రాయికల్ జులై 3 ( ప్రజా మంటలు)మోరపల్లి  గ్రామంలో పద్మశాలి సేవా సంఘం భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వినతి పత్రాన్ని అందజేయగా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే నిధులు మంజూరుకు కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు కట్ట రాజేందర్,సదానందం పద్మశాలి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Read More...
Local News 

మలేసియా సదస్సుకు  జగిత్యాల జిల్లావాసి    గల్ఫ్ కార్మికుల స్థితిగతులపై అంతర్జాతీయ సదస్సు 

మలేసియా సదస్సుకు  జగిత్యాల జిల్లావాసి     గల్ఫ్ కార్మికుల స్థితిగతులపై అంతర్జాతీయ సదస్సు  జగిత్యాల జులై 2( ప్రజా మంటలు) మలేసియా రాజధాని కౌలాలంపూర్ లో జరుగుతున్న వలస కార్మికుల అంతర్జాతీయ సదస్సుకు జగిత్యాల జిల్లావాసి, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయిండ్ల రాజిరెడ్డి హాజరవుతున్నారు. ఈ నెల 4, 5, 6 తేదీలలో బిల్డింగ్ అండ్ వుడ్ వర్కర్స్ ఇంటర్నేషనల్ (బిడబ్ల్యుఐ) అనే అంతర్జాతీయ...
Read More...
Local News 

షిర్డీ సాయి మందిరంలో ఘనంగా సాయి చరిత్ర పారాయణం ప్రారంభం

షిర్డీ సాయి మందిరంలో ఘనంగా సాయి చరిత్ర పారాయణం ప్రారంభం జగిత్యాల జులై 3 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రం కృష్ణానగర్ లోని, శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సాయి సచ్చరిత్ర పారాయణం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. గురువారం నుంచి మళ్లీ గురువారం వరకు ఈ పారాయణం  కొనసాగనుంది. ప్రతి సంవత్సరం ఆషాడ పౌర్ణమి పురస్కరించుకొని సామూహిక శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణం జరుగుతుంది.   108...
Read More...