ది హిందూ పత్రిక వ్యవస్థాపకులు సుబ్రహ్మణ్య అయ్యర్.
- జనవరి 19 - సుబ్రహ్మణ్య అయ్యర్ జయంతి.
రచయిత: రామ కిష్టయ్య సంగన భట్ల.
9440595494
భారతదేశములో ఒక విశిష్ట స్థానం కలిగి, దక్షిణ భారత దేశములో ఎక్కువ ప్రచురణ కలిగిన పత్రికగా, ప్రాచుర్యంలో ఉన్న ది హిందూ (The Hindu) ఆంగ్ల దినపత్రికను 140 సంవత్సరాలు కిందట ప్రధానంగా తిరువయ్యారుకు చెందిన 23 ఏళ్ళ జి. సుబ్రమణ్య అయ్యర్... ఆయన స్నేహితుడు, పచ్చయ్యప్ప కళాశాలలో ఆయన సహోద్యోగి, చెంగల్పట్టుకు చెందిన 21 ఏళ్ళ ఎం. వీరరాఘవా చారియర్ - నలుగురు న్యాయ శాస్త్ర విద్యార్థులు టి.టి.రంగాచారియర్, పి.వి. రంగాచారియర్, డి.కేశవ రావు పంత్, న్యాపతి సుబ్బారావు పంతులుతో కలిసి ట్రిప్లికేన్ సాహితీ సంఘం పేరుతో స్థాపించారు.
సుబ్రహ్మణ్య అయ్యర్ సుప్రసిద్ధ పాత్రికేయుడు, సంఘ సంస్కర్త, స్వతంత్ర సమర యోధుడు. ఆయన సుప్రసిద్ధ భారతీయ ఆంగ్ల దినపత్రిక ది హిందూ పత్రికను 20 సెప్టెంబరు 1878న స్థాపించారు. అది మొదలు 1878 లో వారపత్రికగా, 1889 లో దిన పత్రికగా మారింది. అయన ది హిందూ పత్రికకు 20 సెప్టెంబరు 1878 నుంచి అక్టోబర్ 1898 వరకూ అధినేతగానూ, సంపాదకునిగానూ, మేనేజింగ్ డైరెక్టర్ గానూ వ్యవహరించారు.
ఆనాటి మద్రాసు ప్రెసిడెన్సీ, తంజావూరు జిల్లాలో తిరువదిలో సుబ్రహ్మణ్య అయ్యర్ జనవరి 19, 1855న జన్మించారు.
మద్రాసు ఉన్నత న్యాయస్థానపు బెంచ్ కు సర్. టి.ముత్తుస్వామి అయ్యర్ ను నియమించాలన్న విషయంపై తమ మద్దతును వినిపించేందుకు సుబ్రహ్మణ్య అయ్యర్ ఎం. వీరరాఘవాచార్యర్, టి.టి.రాఘవాచార్యర్, పి.వి.రంగాచార్యర్, డి. కేశవరావు పంత్, ఎన్. సుబ్బారావు పంతులు వంటివారితో కలిసి 20 సెప్టెంబర్ 1878లో ది హిందూ స్థాపించారు. మొదట్లో వారపత్రికగా ది హిందూ ప్రారంభమైంది, తర్వాత మూడు వారాలకు ఓసారి వెలువడే పత్రికగా మారి చివరకు దినపత్రికగా స్థిరపడింది.
సుబ్రహ్మణ్య అయ్యర్ అనేక స్టింగ్ ఆపరేషన్లతో తీక్షణమైన, సునిశితమైన వ్యాసాలు రాశారు. భారత స్వాతంత్ర్య ఆశయాన్ని క్రియాశీలంగా సమర్థించి, బ్రిటీష్ సామ్రాజ్యవాదంపై నిరసన వ్యక్తం చేసేందుకు పత్రికను ఉపయోగించారు. 1897లో బాలగంగాధర తిలక్ ను బ్రిటీష్ అధికారులు నిర్బంధించి, జైలు పాలు చేసినప్పుడు ది హిందూ, అరెస్టును తీవ్రంగా ఖండించింది. 1883 డిసెంబర్ 3న పత్రిక 100 మౌంట్ రోడ్డుకు మారి, తన స్వంత ప్రెస్ అయిన ది నేషనల్ ప్రెస్ ను స్థాపించింది.
ది హిందూ 12 డిసెంబర్ 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటైనప్పుడు ఆ పరిణామాన్ని ఆహ్వానిస్తూ సంపాదకీయంలో రాశారు.
అయన సంప్రదాయ వాదానికి, మూఢ విశ్వాసాలకు పూర్తి వ్యతిరేకి, సంస్కరణల ప్రోత్సాహానికి ఆయన తన పత్రికను వినియోగించు కున్నారు.
సుబ్రహ్మణ్య అయ్యర్ వ్యాసాలు పత్రికను ఎన్నో పరువునష్టం దావాల్లోకి నెట్టాయి, కేసులపై పోరాటం సుబ్రహ్మణ్య అయ్యర్ ఆర్థిక స్థితిని దారుణంగా దిగజార్చింది. 1898లో సుబ్రహ్మణ్య అయ్యర్ ప్రధాన సంపాదకుడి పదవిని వీరరాఘవాచార్యర్ కు అప్పగించారు. 1905లో వార్తాపత్రికను సుసంపన్నుడైన బారిస్టరు కస్తూరి రంగ అయ్యంగార్ కొనేశారు.
సుబ్రహ్మణ్య అయ్యర్ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాలుపంచు కున్నారు. 12 డిసెంబర్ 1885లో తేజ్ పాల్ సంస్కృత కళాశాల వద్ద నిర్వహించిన, భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటుకు కారణమైన బొంబాయి కాన్ఫరెన్సులో పాల్గొన్న 72 మంది ప్రతినిధుల్లో ఆయన కూడా ఒకరు. భారత జాతీయ కాంగ్రెస్ రెండవ సమావేశాల్లో ప్రభుత్వ సర్వీసుల్లో భారతీయుల ప్రాతినిధ్యం గురించి నివేదించే కమిటీలో సుబ్రహ్మణ్య అయ్యర్ సభ్యునిగా ఎంపికయ్యారు. 1887 మద్రాసు సమావేశాల్లో అయన భారత జాతీయ కాంగ్రెస్ రాజ్యాంగాన్ని తయారుచేసే కమిటీలో సభ్యునిగా నియమితులయ్యారు. 1894 మద్రాసు సమావేశాల్లో లండన్ లో భారత రాజ్య కార్యదర్శి ఎదుట భారత జాతీయవాదుల వాదన వినిపించే ప్రతినిధి బృందంలో ఒకరిగా ఎంపికయ్యారు. ఫిరోజ్ షా మెహతా సూచనల ప్రకారం దక్షిణాఫ్రికాలో భారతీయుల స్థితిగతులను భారత దేశంలో వివరించేందుకు చేసిన పర్యటనలో భాగంగా పచ్చయ్యప్ప హాలులో ప్రసంగించినప్పుడు గాంధీని ఆయన కలిశారు. ఈ విషయాన్ని గాంధీ తన ఆత్మకథలో ప్రస్తావించారు. 1906లో ఆయన భారత జాతీయ కాంగ్రెస్ లక్ష్యాలను ప్రచారం చేసే స్టాండింగ్ కమిటీలో సభ్యునిగా ఎంపికయ్యారు.
1898లో సుబ్రహ్మణ్య అయ్యర్ ది హిందూతో తనకున్న సంబంధాలను విరమించుకుని, 1882లో తాను ప్రారంభించిన తమిళ వార్తాపత్రిక "స్వదేశ మిత్రన్" పై దృష్టిపెట్టారు. 1898లో ది హిందూను విడిచిపెట్టినప్పుడు స్వదేశమిత్రన్ ను మూడువారాలకు ఓసారి వెలువరించగా, 1899లో తొలి తమిళ దినపత్రికగా అభివృద్ధి చేశారు.
సుబ్రహ్మణ్య భారతి... సంపాదకుడి శైలిని వర్ణిస్తూ - "సుబ్రహ్మణ్య అయ్యర్ కలం బాగా ఘాటైన సన్న పచ్చి మిరప కాయల ముద్దలో ముంచినట్టు ఉంటుందని" అన్నారు. ఆ శైలి ఆయనను సమస్యల్లోకి నెట్టి 1908లో బ్రిటీషర్లు అరెస్టు చేసేదాకా తెచ్చింది. జైలులోని స్థితిగతులు, వేధింపులతో క్రమంగా ఆయన ఆరోగ్యం పాడైంది.
తర్వాతి కాలంలో సుబ్రహ్మణ్య అయ్యర్ కు కుష్టు వ్యాధి సోకగా, 18 ఏప్రిల్ 1916న మరణించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇబ్రహీంపట్నంలో పోలీస్ అమరవీరుల మాస ఉత్సవాల్లో భాగంగా కొవ్వొత్తుల ర్యాలీ.
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 23 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
పోలీస్ అమరవీరుల మాస ఉత్సవాల్లో భాగంగా గౌరవ ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్,జగిత్యాల్ గారి ఆదేశానుసారం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ ఐ, ఏ. అనిల్ గారి ఆధ్వర్యంలో గురువారం రోజున ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో యువకులతో పాటుగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగినది.... బీర్పూర్ ను పర్యాటక ప్రాంతం గా అభివృద్ధి చేస్తా - ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
1 కోటి రూపాయల నిధులు మంజూరుకు తన వంతుగా కృషి చేస్తా
దేవాలయాల్లో రాజకీయాలకు స్థానం లేదు
సామాజిక సేవా కార్యక్రమాల తోనే ప్రజల్లో గుర్తింపు, సేవ చేయాలని లక్ష్యం తోనే రాజకీయాల్లోకి వచ్చాను
సారంగాపూర్ అక్టోబర్ 23 (ప్రజా మంటలు):
బీర్పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ట్రస్ట్ బోర్డ్ నూతన కార్యవర్గ... డీజీపీ ని కలిసిన మాజీ మంత్రి రాజేశం గౌడ్, వ్యాపారవేత్త ప్రమోద్ అగర్వాల్
హైదరాబాద్ అక్టోబర్ 22 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి)గా ఇటీవలే నియమితులైన బి. శివధర్ రెడ్డి ను మాజీ మంత్రి మరియు తెలంగాణ రాష్ట్ర తొలి ఆర్థిక సంఘం చైర్మన్ జి. రాజేశం గౌడ్, వ్యాపారవేత్త ప్రమోద్ అగర్వాల్ డిజిపి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ... అమెరికా ఆంక్షల ప్రభావం: రష్యా చమురు దిగుమతులను తగ్గిస్తున్న భారత్ ?
అమెరికా ఆంక్షలు 21 నవంబర్ నుంచి అమల్లోకి
న్యూఢిల్లీ అక్టోబర్ 23:భారత రిఫైనరీలు రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడితో పాటు, నవంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చే రోస్నెఫ్ట్ (Rosneft), లుకోయిల్ (Lukoil) కంపెనీలపై అమెరికా ఆంక్షలు ఈ నిర్ణయానికి... సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ స్థలం పరిశీలించిన సిఇ ఎండి ,షఫీమియా
(అంకం భూమయ్య)
గొల్లపల్లి అక్టోబర్ 23 (ప్రజా మంటలు):
గొల్లపెల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల స్థల పరిశీలన కొరకు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు గురువారం సాంఘీక మైనారిటీ పాఠశాల సిఇ ఎండి, షఫీమియా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి పై గాదరీ కిశోర్ వ్యాఖ్యల ఖండన - హెచ్చరిక కబర్ధార్.
చావు డబ్బు కొట్టి నిరసన వ్యక్తం చేసిన మాదిగ సంఘ నాయకులు...
(అంకం భూమయ్య)
గొల్లపల్లి అక్టోబర్ 23 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలో రాష్ట్ర మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమర్ ను అనుచిత వ్యాఖ్యలు చేసిన గాధరి కిషోర్ దిష్టిబొమ్మను డప్పులతో ఉరేగించి, దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా... మెడికల్ సీట్లు సాధించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు సన్మానం
(అంకం భూమయ్య)
గొల్లపల్లి అక్టోబర్ 23 (ప్రజా మంటలు):
గొల్లపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివి ఎంబిబిఎస్ మెడికల్ సీట్లు సాధించిన విద్యార్థులు కట్కూరి మహేందర్ రాపల్లి మరియు చందం రాజేష్ వెల్గటూర్ కళాశాలలో ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకుల చేతుల మీదుగా సన్మానించారు కట్కూరి మహేందర్ ,నిర్మల్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు సాధించగా, చంద... శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా యమద్వితీయ వేడుకలు యమధర్మరాజు స్వామివారికి ప్రత్యేక పూజలు
ధర్మపురి అక్టోబర్ 23 (ప్రజా మంటలు)
”యమద్వితీయ” పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం నకు అనుబంధ దేవాలయమైన శ్రీ యమధర్మరాజు వారి దేవాలయం లో గురువారం స్వామివారికి రుద్రాభిషేకం, మన్యసూక్తం,ఆయుష్యసూక్తం తో అబిషేకం , ఆయుష్యహోమం హరతి మంత్రపుష్పం కార్యక్రమంలు అత్యంత వైభవంగా నిర్వహించారు.
అనంతరం విశేష సంఖ్యలో భక్తులు... మండల సమాఖ్య సభ్యులకు యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు
(అంకం భూమయ్య)
గొల్లపల్లి అక్టోబర్ 23 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు కార్యక్రమంలో పి ఎం జె జె బి వై,పీఎం ఎస్బివై, అటల్ పెన్షన్ యోజన , సైబర్ సెక్యూరిటీ సుకన్య సమృద్ధి యోజన మరియు బ్యాంకు
కార్యక్రమానికి... ముగిసిన జగిత్యాల జిల్లా స్థాయి క్రీడా పోటీలు
జగిత్యాల అక్టోబర్ 23 (ప్రజా మంటలు):
జిల్లా కేంద్రం లో నిర్వహిస్తున్న , మై భారత్ (మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ , స్పోర్ట్స్, హో మై అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా), డిస్టిక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్, గురువారం ముగింపుకు చేరుకుం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగిత్యాల జిల్లా చైల్డ్ మ్యారేజ్ ప్రాజెక్టు... 37, 38 వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల అక్టోబర్ 23 ( ప్రజా మంటలు):
పట్టణ 38వ వార్డులో 30 లక్షలతో సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణ పనులకు,37 వ వార్డులో 10 లక్షలతో డ్రైన్ స్లాబ్ నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ .అంతకముందు 38వ వార్డు లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు... సీనియర్ సిటిజెన్ల హక్కుల రక్షణకు కృషి. -సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్.
జగిత్యాల అక్టోబర్ 23 (ప్రజా మంటలు):
సీనియర్ సిటిజెన్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్నామని తెలంగాణ అల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ అన్నారు.గురువారం జిల్లా కేంద్రం లోని సీనియర్ సిటిజెన్స్ కార్యాలయంలో టాస్కా జిల్లా స్థాయి సమావేశం జరిగింది.ఈ సందర్బంగా సీనియర్... 