ది హిందూ పత్రిక వ్యవస్థాపకులు సుబ్రహ్మణ్య అయ్యర్.

- జనవరి 19 - సుబ్రహ్మణ్య అయ్యర్ జయంతి.

On
ది హిందూ పత్రిక వ్యవస్థాపకులు సుబ్రహ్మణ్య అయ్యర్.

రచయిత:  రామ కిష్టయ్య సంగన భట్ల. 

9440595494

భారతదేశములో ఒక విశిష్ట స్థానం కలిగి, దక్షిణ భారత దేశములో ఎక్కువ ప్రచురణ కలిగిన పత్రికగా, ప్రాచుర్యంలో ఉన్న ది హిందూ (The Hindu) ఆంగ్ల దినపత్రికను 140 సంవత్సరాలు కిందట ప్రధానంగా తిరువయ్యారుకు చెందిన 23 ఏళ్ళ జి. సుబ్రమణ్య అయ్యర్... ఆయన స్నేహితుడు, పచ్చయ్యప్ప కళాశాలలో ఆయన సహోద్యోగి, చెంగల్పట్టుకు చెందిన 21 ఏళ్ళ ఎం. వీరరాఘవా చారియర్ - నలుగురు న్యాయ శాస్త్ర విద్యార్థులు టి.టి.రంగాచారియర్, పి.వి. రంగాచారియర్, డి.కేశవ రావు పంత్, న్యాపతి సుబ్బారావు పంతులుతో కలిసి ట్రిప్లికేన్ సాహితీ సంఘం పేరుతో స్థాపించారు.

సుబ్రహ్మణ్య అయ్యర్ సుప్రసిద్ధ పాత్రికేయుడు, సంఘ సంస్కర్త, స్వతంత్ర సమర యోధుడు. ఆయన సుప్రసిద్ధ భారతీయ ఆంగ్ల దినపత్రిక ది హిందూ పత్రికను 20 సెప్టెంబరు 1878న స్థాపించారు. అది మొదలు 1878 లో వారపత్రికగా, 1889 లో దిన పత్రికగా మారింది. అయన ది హిందూ పత్రికకు 20 సెప్టెంబరు 1878 నుంచి అక్టోబర్ 1898 వరకూ అధినేతగానూ, సంపాదకునిగానూ, మేనేజింగ్ డైరెక్టర్ గానూ వ్యవహరించారు.

ఆనాటి మద్రాసు ప్రెసిడెన్సీ, తంజావూరు జిల్లాలో తిరువదిలో సుబ్రహ్మణ్య అయ్యర్ జనవరి 19, 1855న జన్మించారు.

మద్రాసు ఉన్నత న్యాయస్థానపు బెంచ్ కు సర్. టి.ముత్తుస్వామి అయ్యర్ ను నియమించాలన్న విషయంపై తమ మద్దతును వినిపించేందుకు సుబ్రహ్మణ్య అయ్యర్ ఎం. వీరరాఘవాచార్యర్, టి.టి.రాఘవాచార్యర్, పి.వి.రంగాచార్యర్, డి. కేశవరావు పంత్, ఎన్. సుబ్బారావు పంతులు వంటివారితో కలిసి 20 సెప్టెంబర్ 1878లో ది హిందూ స్థాపించారు. మొదట్లో వారపత్రికగా ది హిందూ ప్రారంభమైంది, తర్వాత మూడు వారాలకు ఓసారి వెలువడే పత్రికగా మారి చివరకు దినపత్రికగా స్థిరపడింది.

సుబ్రహ్మణ్య అయ్యర్ అనేక స్టింగ్ ఆపరేషన్లతో తీక్షణమైన, సునిశితమైన వ్యాసాలు రాశారు. భారత స్వాతంత్ర్య ఆశయాన్ని క్రియాశీలంగా సమర్థించి, బ్రిటీష్ సామ్రాజ్యవాదంపై నిరసన వ్యక్తం చేసేందుకు పత్రికను ఉపయోగించారు. 1897లో బాలగంగాధర తిలక్ ను బ్రిటీష్ అధికారులు నిర్బంధించి, జైలు పాలు చేసినప్పుడు ది హిందూ, అరెస్టును తీవ్రంగా ఖండించింది. 1883 డిసెంబర్ 3న పత్రిక 100 మౌంట్ రోడ్డుకు మారి, తన స్వంత ప్రెస్ అయిన ది నేషనల్ ప్రెస్ ను స్థాపించింది.

ది హిందూ 12 డిసెంబర్ 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటైనప్పుడు ఆ పరిణామాన్ని ఆహ్వానిస్తూ సంపాదకీయంలో రాశారు.

అయన సంప్రదాయ వాదానికి, మూఢ విశ్వాసాలకు పూర్తి వ్యతిరేకి, సంస్కరణల ప్రోత్సాహానికి ఆయన తన పత్రికను వినియోగించు కున్నారు. 

సుబ్రహ్మణ్య అయ్యర్ వ్యాసాలు పత్రికను ఎన్నో పరువునష్టం దావాల్లోకి నెట్టాయి, కేసులపై పోరాటం సుబ్రహ్మణ్య అయ్యర్ ఆర్థిక స్థితిని దారుణంగా దిగజార్చింది. 1898లో సుబ్రహ్మణ్య అయ్యర్ ప్రధాన సంపాదకుడి పదవిని వీరరాఘవాచార్యర్ కు అప్పగించారు. 1905లో వార్తాపత్రికను సుసంపన్నుడైన బారిస్టరు కస్తూరి రంగ అయ్యంగార్ కొనేశారు.

సుబ్రహ్మణ్య అయ్యర్ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాలుపంచు కున్నారు. 12 డిసెంబర్ 1885లో తేజ్ పాల్ సంస్కృత కళాశాల వద్ద నిర్వహించిన, భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటుకు కారణమైన బొంబాయి కాన్ఫరెన్సులో పాల్గొన్న 72 మంది ప్రతినిధుల్లో ఆయన కూడా ఒకరు. భారత జాతీయ కాంగ్రెస్ రెండవ సమావేశాల్లో ప్రభుత్వ సర్వీసుల్లో భారతీయుల ప్రాతినిధ్యం గురించి నివేదించే కమిటీలో సుబ్రహ్మణ్య అయ్యర్ సభ్యునిగా ఎంపికయ్యారు. 1887 మద్రాసు సమావేశాల్లో అయన భారత జాతీయ కాంగ్రెస్ రాజ్యాంగాన్ని తయారుచేసే కమిటీలో సభ్యునిగా నియమితులయ్యారు. 1894 మద్రాసు సమావేశాల్లో లండన్ లో భారత రాజ్య కార్యదర్శి ఎదుట భారత జాతీయవాదుల వాదన వినిపించే ప్రతినిధి బృందంలో ఒకరిగా ఎంపికయ్యారు. ఫిరోజ్ షా మెహతా సూచనల ప్రకారం దక్షిణాఫ్రికాలో భారతీయుల స్థితిగతులను భారత దేశంలో వివరించేందుకు చేసిన పర్యటనలో భాగంగా పచ్చయ్యప్ప హాలులో ప్రసంగించినప్పుడు గాంధీని ఆయన కలిశారు. ఈ విషయాన్ని గాంధీ తన ఆత్మకథలో ప్రస్తావించారు. 1906లో ఆయన భారత జాతీయ కాంగ్రెస్ లక్ష్యాలను ప్రచారం చేసే స్టాండింగ్ కమిటీలో సభ్యునిగా ఎంపికయ్యారు.

1898లో సుబ్రహ్మణ్య అయ్యర్ ది హిందూతో తనకున్న సంబంధాలను విరమించుకుని, 1882లో తాను ప్రారంభించిన తమిళ వార్తాపత్రిక "స్వదేశ మిత్రన్" పై దృష్టిపెట్టారు. 1898లో ది హిందూను విడిచిపెట్టినప్పుడు స్వదేశమిత్రన్ ను మూడువారాలకు ఓసారి వెలువరించగా, 1899లో తొలి తమిళ దినపత్రికగా అభివృద్ధి చేశారు.

సుబ్రహ్మణ్య భారతి... సంపాదకుడి శైలిని వర్ణిస్తూ - "సుబ్రహ్మణ్య అయ్యర్ కలం బాగా ఘాటైన సన్న పచ్చి మిరప కాయల ముద్దలో ముంచినట్టు ఉంటుందని" అన్నారు. ఆ శైలి ఆయనను సమస్యల్లోకి నెట్టి 1908లో బ్రిటీషర్లు అరెస్టు చేసేదాకా తెచ్చింది. జైలులోని స్థితిగతులు, వేధింపులతో క్రమంగా ఆయన ఆరోగ్యం పాడైంది.

తర్వాతి కాలంలో సుబ్రహ్మణ్య అయ్యర్ కు కుష్టు వ్యాధి సోకగా, 18 ఏప్రిల్ 1916న మరణించారు.

Tags
Join WhatsApp

More News...

పాశ్చాత్య ప్రభావంతో  లివ్-ఇన్ సంబంధాలు : విఫలం తర్వాత కేసులు

పాశ్చాత్య ప్రభావంతో  లివ్-ఇన్ సంబంధాలు : విఫలం తర్వాత కేసులు అలహాబాద్, జనవరి 24 ప్రత్యేక ప్రతినిధి):పాశ్చాత్య ఆలోచనల ప్రభావంతో యువత వివాహం లేకుండా లివ్-ఇన్ సంబంధాల్లోకి వెళ్తోందని, అలాంటి సంబంధాలు విఫలమైన తర్వాత అత్యాచారం వంటి కేసులు నమోదు అవుతున్నాయని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 'లైవ్ లా' లో ప్రచురించిన కథనం ప్రకారం, మహిళలకు అనుకూలంగా ఉన్న చట్టాల ఆధారంగా...
Read More...
National  State News 

డీఎంకే వైపు ఏఐఏడీఎంకే నేతల వలస

డీఎంకే వైపు ఏఐఏడీఎంకే నేతల వలస తమిళనాడులోని ముఖ్యమైన పార్టీల గుర్తులు చెన్నై, జనవరి 24 (ప్రత్యేక ప్రతినిధి): తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే వైపు ఏఐఏడీఎంకేకు చెందిన పలువురు మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చేరుతున్నారు. గత ఆరు నెలల్లో మాజీ మంత్రి–ఎంపీ అన్వర్ రాజా, మాజీ ఎంపీ వి. మైత్రేయన్, మాజీ ఎమ్మెల్యే కార్తిక్ తొండైమాన్ సహా,...
Read More...
National  International  

జపాన్‌లో ఎన్నిక‌ల సమరానికి సానే తకైచి పాంక్నిర్ణయం

జపాన్‌లో ఎన్నిక‌ల సమరానికి సానే తకైచి పాంక్నిర్ణయం టోక్యో జనవరి 24: జపాన్ అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP) నాయకురాలు మరియు 104వ ప్రధాన మంత్రి సానే తకైచి, గత అక్టోబర్‌లో పదవీ స్వీకరించినప్పటికీ, పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయం మేరకు ఫిబ్రవరి 8, 2026న దేశవ్యాప్త సాధారణ ఎన్నికలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. తకైచి...
Read More...

అంతర్జాతీయ భ్రూణ హత్యల నివారణ దినోత్సవ కరపత్ర ఆవిష్కరణ

అంతర్జాతీయ భ్రూణ హత్యల నివారణ దినోత్సవ కరపత్ర ఆవిష్కరణ   జగిత్యాల జనవరి 24 (ప్రజా మంటలు)అంతర్జాతీయ భృణహత్యల నివారణ దినోత్సవం పురస్కరించుకొని పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం రూపొందించిన, కరపత్రాలను,  ప్రముఖ పౌరాణిక పండితులు బుర్రా భాస్కర శర్మ, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత, జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ ఎన్.శ్రీనివాస్, ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బుర్రా భాస్కర శర్మ మాట్లాడుతూ          పురి...
Read More...
Local News  State News 

జీవన్ రెడ్డి మీద ఉన్న ప్రేమ బిజెపి కార్యకర్తలపై లేదా..? ఎంపీ అరవింద్ ఒంటెద్దు పోకడలు మానుకోవాలి.

జీవన్ రెడ్డి మీద ఉన్న ప్రేమ బిజెపి కార్యకర్తలపై లేదా..?  ఎంపీ అరవింద్ ఒంటెద్దు పోకడలు మానుకోవాలి. జగిత్యాల, జనవరి 24 (ప్రజా మంటలు) 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ లో పని చేసిన జీవన్ రెడ్డిని కాంగ్రెస్ నాయకత్వం ఇబ్బంది పెట్టడం తనకు బాధ కలిగిస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించడాన్ని జగిత్యాల బిజెపి సీనియర్ నేతలు తీవ్రంగా ఖండించారు. శనివారం బిజెపి సీనియర్ నేతలు సీపెళ్లి రవీందర్, అంకార్ సుధాకర్,...
Read More...
State News 

టీ-హబ్‌ స్టార్టప్‌ల కేంద్రంగానే కొనసాగాలి: సీఎం రేవంత్ రెడ్డి

టీ-హబ్‌ స్టార్టప్‌ల కేంద్రంగానే కొనసాగాలి: సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, జనవరి 24 (ప్రజా మంటలు): టీ-హబ్‌ను పూర్తిగా స్టార్టప్‌ల కేంద్రంగా మాత్రమే కొనసాగించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను టీ-హబ్‌కు మార్చనున్నారన్న వార్తలపై సీఎం వెంటనే స్పందించారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో ఫోన్‌లో మాట్లాడి స్పష్టమైన ఆదేశాలు...
Read More...
National  International  

నోబెల్ శాంతి బహుమతి నిర్లక్ష్యమే గ్రీన్‌ల్యాండ్ అంశంపై వ్యాఖ్యలకు కారణమా?

నోబెల్ శాంతి బహుమతి నిర్లక్ష్యమే గ్రీన్‌ల్యాండ్ అంశంపై వ్యాఖ్యలకు కారణమా? అమెరికా రాజకీయాల్లో మరో వివాదాస్పద ప్రకటన వాషింగ్టన్ జనవరి 24: గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకోవాలన్న గత వ్యాఖ్యల వెనుక కారణం నోబెల్ శాంతి బహుమతి అందకపోవడంపై అసంతృప్తినేనని అమెరికా మాజీ అధ్యక్షుడు వ్యాఖ్యానించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ వ్యాఖ్యలు మరోసారి ప్రపంచ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. తాను అంతర్జాతీయంగా శాంతి స్థాపనకు...
Read More...
State News 

నాంపల్లి ఎగ్జిబిషన్‌కు ఎవరూ రావొద్దు: సీపీ సజ్జనార్

నాంపల్లి ఎగ్జిబిషన్‌కు ఎవరూ రావొద్దు: సీపీ సజ్జనార్ హైదరాబాద్, జనవరి 24 (ప్రజా మంటలు): నాంపల్లి ప్రాంతంలో జరిగిన భారీ అగ్నిప్రమాదం నేపథ్యంలో ప్రజలు **నాంపల్లి ఎగ్జిబిషన్ (నుమాయిష్)**కు రావద్దని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ప్రజలకు స్పష్టంగా సూచించారు. ఈరోజు నుమాయిష్ సందర్శనను వాయిదా వేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నాంపల్లిలోని బచ్చాస్ ఫర్నీచర్ షోరూమ్ గోదాంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది....
Read More...
Local News  State News 

మున్సిపల్ ఎన్నికల బరిలో తెలంగాణ జాగృతి?

మున్సిపల్ ఎన్నికల బరిలో తెలంగాణ జాగృతి? హైదరాబాద్, జనవరి 24 (ప్రజా మంటలు): తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేపుతూ, తెలంగాణ జాగృతి పార్టీ చీఫ్ కవిత మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని తుద నిర్ణయం తీసుకున్నారు. స్థానిక రాజకీయాల్లో తన ఉనికిని ఘాటుగా చాటేందుకు, పార్టీ అభ్యర్థులను సింహం గుర్తుతో బరిలో నిలపనుంది. పార్టీకి శాశ్వత గుర్తింపుగా సింహం గుర్తును ప్రజల్లో...
Read More...
State News 

పంటల ధర నిర్ణయ అధికారం రైతులకే ఉండాలి

పంటల ధర నిర్ణయ అధికారం రైతులకే ఉండాలి హైదరాబాద్, జనవరి 24 (ప్రజా మంటలు):పంటల ధరలను నిర్ణయించే అధికారం రైతులకే ఉండాలని, మార్కెట్‌లో జరిగే మోసాలను నియంత్రించడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి స్పష్టం చేశారు.శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన వ్యవసాయ శాఖ రిటైర్డ్ అధికారుల సంఘం రాష్ట్ర...
Read More...

ప్రముఖ విద్యావేత్త, సామాజిక సేవా తత్పరుడు కాసుగంటి సుధాకర్ రావు సేవలు నేటి తరానికి స్ఫూర్తి ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ప్రముఖ విద్యావేత్త, సామాజిక సేవా తత్పరుడు కాసుగంటి  సుధాకర్ రావు సేవలు నేటి తరానికి స్ఫూర్తి ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల జనవరి 24 (ప్రజా మంటలు)ప్రముఖ విద్యావేత్త,సామాజిక వేత్త,పారిశ్రామిక వేత్త సరస్వతీ శిశు మందిర్, శ్రీవాణి జూనియర్ కళాశాల ఛైర్మెన్ కాసుగంటి సుధాకర్ రావు  ప్రథమ మాసికం( సంస్మరణ   ) కార్యక్రమానికి ఎమ్మెల్యే దా సంజయ్ కుమార్ పద్మనాయక కళ్యాణ మండపానికి హాజరై వారి చిత్రపటానికి నివాళులర్పించి వారు చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఎందరో...
Read More...
Crime  State News 

నాంపల్లి రోడ్‌లో ఫర్నిచర్ షాప్ భవనంలో అగ్నిప్రమాదం

నాంపల్లి రోడ్‌లో ఫర్నిచర్ షాప్ భవనంలో అగ్నిప్రమాదం హైదరాబాద్, జనవరి 24 (ప్రజా మంటలు): హైదరాబాద్ నాంపల్లి రోడ్‌లోని ఓ బహుళ అంతస్తుల ఫర్నిచర్ షాప్ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా మొత్తం ఆరుగురు మంటల్లో చిక్కుకుని తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఫర్నిచర్ షాప్‌కు చెందిన సెల్లార్‌లో ముందుగా అగ్ని...
Read More...