ది హిందూ పత్రిక వ్యవస్థాపకులు సుబ్రహ్మణ్య అయ్యర్.

- జనవరి 19 - సుబ్రహ్మణ్య అయ్యర్ జయంతి.

On
ది హిందూ పత్రిక వ్యవస్థాపకులు సుబ్రహ్మణ్య అయ్యర్.

రచయిత:  రామ కిష్టయ్య సంగన భట్ల. 

9440595494

భారతదేశములో ఒక విశిష్ట స్థానం కలిగి, దక్షిణ భారత దేశములో ఎక్కువ ప్రచురణ కలిగిన పత్రికగా, ప్రాచుర్యంలో ఉన్న ది హిందూ (The Hindu) ఆంగ్ల దినపత్రికను 140 సంవత్సరాలు కిందట ప్రధానంగా తిరువయ్యారుకు చెందిన 23 ఏళ్ళ జి. సుబ్రమణ్య అయ్యర్... ఆయన స్నేహితుడు, పచ్చయ్యప్ప కళాశాలలో ఆయన సహోద్యోగి, చెంగల్పట్టుకు చెందిన 21 ఏళ్ళ ఎం. వీరరాఘవా చారియర్ - నలుగురు న్యాయ శాస్త్ర విద్యార్థులు టి.టి.రంగాచారియర్, పి.వి. రంగాచారియర్, డి.కేశవ రావు పంత్, న్యాపతి సుబ్బారావు పంతులుతో కలిసి ట్రిప్లికేన్ సాహితీ సంఘం పేరుతో స్థాపించారు.

సుబ్రహ్మణ్య అయ్యర్ సుప్రసిద్ధ పాత్రికేయుడు, సంఘ సంస్కర్త, స్వతంత్ర సమర యోధుడు. ఆయన సుప్రసిద్ధ భారతీయ ఆంగ్ల దినపత్రిక ది హిందూ పత్రికను 20 సెప్టెంబరు 1878న స్థాపించారు. అది మొదలు 1878 లో వారపత్రికగా, 1889 లో దిన పత్రికగా మారింది. అయన ది హిందూ పత్రికకు 20 సెప్టెంబరు 1878 నుంచి అక్టోబర్ 1898 వరకూ అధినేతగానూ, సంపాదకునిగానూ, మేనేజింగ్ డైరెక్టర్ గానూ వ్యవహరించారు.

ఆనాటి మద్రాసు ప్రెసిడెన్సీ, తంజావూరు జిల్లాలో తిరువదిలో సుబ్రహ్మణ్య అయ్యర్ జనవరి 19, 1855న జన్మించారు.

మద్రాసు ఉన్నత న్యాయస్థానపు బెంచ్ కు సర్. టి.ముత్తుస్వామి అయ్యర్ ను నియమించాలన్న విషయంపై తమ మద్దతును వినిపించేందుకు సుబ్రహ్మణ్య అయ్యర్ ఎం. వీరరాఘవాచార్యర్, టి.టి.రాఘవాచార్యర్, పి.వి.రంగాచార్యర్, డి. కేశవరావు పంత్, ఎన్. సుబ్బారావు పంతులు వంటివారితో కలిసి 20 సెప్టెంబర్ 1878లో ది హిందూ స్థాపించారు. మొదట్లో వారపత్రికగా ది హిందూ ప్రారంభమైంది, తర్వాత మూడు వారాలకు ఓసారి వెలువడే పత్రికగా మారి చివరకు దినపత్రికగా స్థిరపడింది.

సుబ్రహ్మణ్య అయ్యర్ అనేక స్టింగ్ ఆపరేషన్లతో తీక్షణమైన, సునిశితమైన వ్యాసాలు రాశారు. భారత స్వాతంత్ర్య ఆశయాన్ని క్రియాశీలంగా సమర్థించి, బ్రిటీష్ సామ్రాజ్యవాదంపై నిరసన వ్యక్తం చేసేందుకు పత్రికను ఉపయోగించారు. 1897లో బాలగంగాధర తిలక్ ను బ్రిటీష్ అధికారులు నిర్బంధించి, జైలు పాలు చేసినప్పుడు ది హిందూ, అరెస్టును తీవ్రంగా ఖండించింది. 1883 డిసెంబర్ 3న పత్రిక 100 మౌంట్ రోడ్డుకు మారి, తన స్వంత ప్రెస్ అయిన ది నేషనల్ ప్రెస్ ను స్థాపించింది.

ది హిందూ 12 డిసెంబర్ 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటైనప్పుడు ఆ పరిణామాన్ని ఆహ్వానిస్తూ సంపాదకీయంలో రాశారు.

అయన సంప్రదాయ వాదానికి, మూఢ విశ్వాసాలకు పూర్తి వ్యతిరేకి, సంస్కరణల ప్రోత్సాహానికి ఆయన తన పత్రికను వినియోగించు కున్నారు. 

సుబ్రహ్మణ్య అయ్యర్ వ్యాసాలు పత్రికను ఎన్నో పరువునష్టం దావాల్లోకి నెట్టాయి, కేసులపై పోరాటం సుబ్రహ్మణ్య అయ్యర్ ఆర్థిక స్థితిని దారుణంగా దిగజార్చింది. 1898లో సుబ్రహ్మణ్య అయ్యర్ ప్రధాన సంపాదకుడి పదవిని వీరరాఘవాచార్యర్ కు అప్పగించారు. 1905లో వార్తాపత్రికను సుసంపన్నుడైన బారిస్టరు కస్తూరి రంగ అయ్యంగార్ కొనేశారు.

సుబ్రహ్మణ్య అయ్యర్ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాలుపంచు కున్నారు. 12 డిసెంబర్ 1885లో తేజ్ పాల్ సంస్కృత కళాశాల వద్ద నిర్వహించిన, భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటుకు కారణమైన బొంబాయి కాన్ఫరెన్సులో పాల్గొన్న 72 మంది ప్రతినిధుల్లో ఆయన కూడా ఒకరు. భారత జాతీయ కాంగ్రెస్ రెండవ సమావేశాల్లో ప్రభుత్వ సర్వీసుల్లో భారతీయుల ప్రాతినిధ్యం గురించి నివేదించే కమిటీలో సుబ్రహ్మణ్య అయ్యర్ సభ్యునిగా ఎంపికయ్యారు. 1887 మద్రాసు సమావేశాల్లో అయన భారత జాతీయ కాంగ్రెస్ రాజ్యాంగాన్ని తయారుచేసే కమిటీలో సభ్యునిగా నియమితులయ్యారు. 1894 మద్రాసు సమావేశాల్లో లండన్ లో భారత రాజ్య కార్యదర్శి ఎదుట భారత జాతీయవాదుల వాదన వినిపించే ప్రతినిధి బృందంలో ఒకరిగా ఎంపికయ్యారు. ఫిరోజ్ షా మెహతా సూచనల ప్రకారం దక్షిణాఫ్రికాలో భారతీయుల స్థితిగతులను భారత దేశంలో వివరించేందుకు చేసిన పర్యటనలో భాగంగా పచ్చయ్యప్ప హాలులో ప్రసంగించినప్పుడు గాంధీని ఆయన కలిశారు. ఈ విషయాన్ని గాంధీ తన ఆత్మకథలో ప్రస్తావించారు. 1906లో ఆయన భారత జాతీయ కాంగ్రెస్ లక్ష్యాలను ప్రచారం చేసే స్టాండింగ్ కమిటీలో సభ్యునిగా ఎంపికయ్యారు.

1898లో సుబ్రహ్మణ్య అయ్యర్ ది హిందూతో తనకున్న సంబంధాలను విరమించుకుని, 1882లో తాను ప్రారంభించిన తమిళ వార్తాపత్రిక "స్వదేశ మిత్రన్" పై దృష్టిపెట్టారు. 1898లో ది హిందూను విడిచిపెట్టినప్పుడు స్వదేశమిత్రన్ ను మూడువారాలకు ఓసారి వెలువరించగా, 1899లో తొలి తమిళ దినపత్రికగా అభివృద్ధి చేశారు.

సుబ్రహ్మణ్య భారతి... సంపాదకుడి శైలిని వర్ణిస్తూ - "సుబ్రహ్మణ్య అయ్యర్ కలం బాగా ఘాటైన సన్న పచ్చి మిరప కాయల ముద్దలో ముంచినట్టు ఉంటుందని" అన్నారు. ఆ శైలి ఆయనను సమస్యల్లోకి నెట్టి 1908లో బ్రిటీషర్లు అరెస్టు చేసేదాకా తెచ్చింది. జైలులోని స్థితిగతులు, వేధింపులతో క్రమంగా ఆయన ఆరోగ్యం పాడైంది.

తర్వాతి కాలంలో సుబ్రహ్మణ్య అయ్యర్ కు కుష్టు వ్యాధి సోకగా, 18 ఏప్రిల్ 1916న మరణించారు.

Tags

More News...

Local News 

ధర్మపురి మం "నేరెళ్ల లోనే జవహర్ నవోదయ నెలకొల్పాలని కేంద్రమంత్రికి ప్రభుత్వ విప్, ఎంపి వినతి

ధర్మపురి మం ఢిల్లీ ఫిబ్రవరి 11 ( ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్రంలోని ధర్మపురి మండలం నేరెళ్లలో జవహర్ నవోదయ విద్యాలయాన్ని సకాలంలో అమలు చేయాలని కేంద్ర విద్య శాఖ మంత్రివర్యులు ధర్మేంద్ర ప్రధాన్ కలిసిన ప్రభుత్వ విప్పు లక్ష్మణ్ కుమార్  *కేంద్ర ప్రభుత్వం జవహర్ నవోదయ విద్యాలయన్ని ధర్మపురి మండలం నేరెళ్లలో మంజూరు చేయగా దాన్ని తరలించకుండ...
Read More...
Local News 

ఘనంగా కొనసాగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

ఘనంగా కొనసాగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జగిత్యాల ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు)జగిత్యాల రూరల్ మం అంబర్ పేట గ్రామములో కొండపై స్వయంభుగా వెలసినశ్రీవేంకటేశ్వర స్వామి వారి 25 వ వార్షిక బ్రహ్మోత్సవాలు  లో భాగంగా  మంగళవారం రెండవ రోజులో భాగంగా ఘనంగానిర్వహించిన కార్యక్రమాలు విశ్వక్సేన విధి వాసుదేవ పుణ్యాహవాచనం, అంకురారోపణ ముత్సాంగ్గ్రహణం, ఆచార్య రిత్వికరణం, వైనతేయ ప్రతిష్టా విధి...
Read More...
Local News  State News 

రైతులకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 

రైతులకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం  రైతులకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం  రైతుల సంక్షేమం కోసం రూ. 55,256 కోట్లు వ్యయం చేసిన ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే రైతులకు మేలు పదేళ్ల కాలంలో రైతులకు బీ.ఆర్.ఎస్. చేసిందేమీ లేదు  - రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి  హైదరాబాద్ ఫిబ్రవరి 11: కాంగ్రెస్...
Read More...
Local News 

సుబ్రహ్మాణ్యస్వామి సేవలో మాజీ మంత్రి మర్రి సికింద్రాబాద్​ ఫిబ్రవరి 11 (

సుబ్రహ్మాణ్యస్వామి సేవలో మాజీ మంత్రి మర్రి  సికింద్రాబాద్​ ఫిబ్రవరి 11 ( సుబ్రహ్మాణ్యస్వామి సేవలో మాజీ మంత్రి మర్రి సికింద్రాబాద్​ ఫిబ్రవరి 11 (ప్రజామంటలు): పద్మారావునగర్​ లోని స్కందగిరి శ్రీసుబ్రహ్మాణ్యస్వామి ఆలయాన్ని మాజీ మంత్రి,రాష్ర్ట బీజేపీ నాయకులు మర్రి శశిధర్​ రెడ్డి మంగళవారం సందర్శించారు. తైపూసం పాల్గుడి కావడి పౌర్ణమి వేడుకల సందర్బంగా స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఆలయ నిర్వాహకులు మర్రిశశిధర్​ రెడ్డిని శాలువాతో...
Read More...
Local News 

జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిభిరం

జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిభిరం జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిభిరం సికింద్రాబాద్​, ఫిబ్రవరి 11 ( ప్రజామంటలు): బన్సీలాల్ పేట్ లోని చాచా నెహ్రూ నగర్ కమ్యునిటీ హాలులో మంగళవారం జరిగిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.  రెయిన్ బో ఫౌండేషన్ ఇండియా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రైయిన్ బో కమ్యూనిటీ కేర్...
Read More...

#Draft: Add Your Title

#Draft: Add Your Title మహాంకాళి పీఎస్​ పరిధిలో యువతి మిస్సింగ్​సికింద్రాబాద్​ ఫిబ్రవరి 11 (ప్రజామంటలు): సికింద్రాబాద్​ మహాంకాళి పీఎస్​ పరిధిలో ఓ యువతి మిస్సింగ్​ అయింది. ఇన్​స్పెక్టర్​ పరశురామ్​ తెలిపిన వివరాల ప్రకారం..సుభాష్​ నగర్​ కు చెందిన బట్టిన్వర్​ నేహా(19) ప్యాట్నీ సెంటర్​ లోని చెన్నై షాపింగ్​ మాల్​ లో సేల్స్​ గర్ల్​ గా పనిచేస్తోంది. ఈనెల...
Read More...
Local News 

స్కందగిరిలో ఘనంగా తైపూసం పాలకావడి ఉత్సవాలు

స్కందగిరిలో ఘనంగా తైపూసం పాలకావడి ఉత్సవాలు స్కందగిరిలో ఘనంగా తైపూసం పాలకావడి ఉత్సవాలు సికింద్రాబాద్​ ఫిబ్రవరి 11 (ప్రజామంటలు) : పద్మారావునగర్​ లోని స్కందగిరి శ్రీసుబ్రహ్మాణ్యస్వామి ఆలయంలో మంగళవారం తైపూసం పాలకావడి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుంచే వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శించి, శ్రీసుబ్రహ్మాణ్యస్వామి వార్లను దర్శించుకున్నారు. భుజాన పాల కలశంతో కూడిన కావడిని ఎత్తుకొని ఆలయం చుట్టు ప్రదక్షిణ...
Read More...
Local News 

నేషనల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ లో గోల్డ్ మెడల్ విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే డా. సంజయ్ 

నేషనల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ లో గోల్డ్ మెడల్ విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే డా. సంజయ్  ▪️ జగిత్యాల ఫిబ్రవరి 11(ప్రజా మంటలు)  హైదరాబాదులో నిర్వహించిన నేషనల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్  తెలంగాణ మైనార్టీ జూనియర్ కాలేజ్ విద్యార్థి  ఎండీ అయా నొద్దీన్ ( ఏం పీ సి 1 సం:) గోల్డ్ మెడల్ సాధించినందుకు  ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  గారు అభినందించారు ఈ కార్యక్రమంలో మైనార్టీ జూనియర్ కళాశాల...
Read More...
Local News 

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు జగిత్యాల ఫిబ్రవరి 11(ప్రజా మంటలు)300 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన జగిత్యాల రూరల్ మం  అంబారి పేట  శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే దేవాలయం వద్ద బోర్డును ఏర్పాటు చేశామని, ఏ మతాన్ని గానీ వ్యక్తులను గానీ కించపరచాలనే ఉద్దేశం తమ గ్రామస్తులకు లేదని అంబారిపేట గ్రామస్తులు స్పష్టం చేశారు....
Read More...
Local News 

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు జగిత్యాల ఫిబ్రవరి 11(ప్రజా మంటలు)300 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన జగిత్యాల రూరల్ మం  అంబారి పేట  శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే దేవాలయం వద్ద బోర్డును ఏర్పాటు చేశామని, ఏ మతాన్ని గానీ వ్యక్తులను గానీ కించపరచాలనే ఉద్దేశం తమ గ్రామస్తులకు లేదని అంబారిపేట గ్రామస్తులు స్పష్టం చేశారు....
Read More...
Local News 

పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి బ్రహ్మోత్సవ  ఆహ్వాన పత్రిక అందజేత

పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి బ్రహ్మోత్సవ  ఆహ్వాన పత్రిక అందజేత    జగిత్యాల ఫిబ్రవరి 11(ప్రజా మంటలు)పట్టణంలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి  నివాసంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి పురాని పేట , బోయవాడ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవ కార్యక్రమంలో హాజరు కావాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ  కి ఆహ్వాన పత్రిక అందజేశారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి...
Read More...
National  International   State News 

మోడీ అమెరికా పర్యటనకు ముందే ట్రంప్ బహుమతి

మోడీ అమెరికా పర్యటనకు ముందే ట్రంప్ బహుమతి అమెరికా విదేశీ అవినీతి చట్టాన్ని ట్రంప్ సస్పెండ్ చేశారు; అదానీ గ్రూప్ స్టాక్స్ పెరిగాయి మోడీ అమెరికా పర్యటనకు ముందే ట్రంప్ బహుమతి వాషింగ్టన్, ఫిబ్రవరి 11: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ అధికారులకు లంచం ఇవ్వకుండా అమెరికా కంపెనీలు నిషేధించే చట్టం అమలును నిలిపివేయడానికి ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేసిన తర్వాత,...
Read More...