ది హిందూ పత్రిక వ్యవస్థాపకులు సుబ్రహ్మణ్య అయ్యర్.
- జనవరి 19 - సుబ్రహ్మణ్య అయ్యర్ జయంతి.
రచయిత: రామ కిష్టయ్య సంగన భట్ల.
9440595494
భారతదేశములో ఒక విశిష్ట స్థానం కలిగి, దక్షిణ భారత దేశములో ఎక్కువ ప్రచురణ కలిగిన పత్రికగా, ప్రాచుర్యంలో ఉన్న ది హిందూ (The Hindu) ఆంగ్ల దినపత్రికను 140 సంవత్సరాలు కిందట ప్రధానంగా తిరువయ్యారుకు చెందిన 23 ఏళ్ళ జి. సుబ్రమణ్య అయ్యర్... ఆయన స్నేహితుడు, పచ్చయ్యప్ప కళాశాలలో ఆయన సహోద్యోగి, చెంగల్పట్టుకు చెందిన 21 ఏళ్ళ ఎం. వీరరాఘవా చారియర్ - నలుగురు న్యాయ శాస్త్ర విద్యార్థులు టి.టి.రంగాచారియర్, పి.వి. రంగాచారియర్, డి.కేశవ రావు పంత్, న్యాపతి సుబ్బారావు పంతులుతో కలిసి ట్రిప్లికేన్ సాహితీ సంఘం పేరుతో స్థాపించారు.
సుబ్రహ్మణ్య అయ్యర్ సుప్రసిద్ధ పాత్రికేయుడు, సంఘ సంస్కర్త, స్వతంత్ర సమర యోధుడు. ఆయన సుప్రసిద్ధ భారతీయ ఆంగ్ల దినపత్రిక ది హిందూ పత్రికను 20 సెప్టెంబరు 1878న స్థాపించారు. అది మొదలు 1878 లో వారపత్రికగా, 1889 లో దిన పత్రికగా మారింది. అయన ది హిందూ పత్రికకు 20 సెప్టెంబరు 1878 నుంచి అక్టోబర్ 1898 వరకూ అధినేతగానూ, సంపాదకునిగానూ, మేనేజింగ్ డైరెక్టర్ గానూ వ్యవహరించారు.
ఆనాటి మద్రాసు ప్రెసిడెన్సీ, తంజావూరు జిల్లాలో తిరువదిలో సుబ్రహ్మణ్య అయ్యర్ జనవరి 19, 1855న జన్మించారు.
మద్రాసు ఉన్నత న్యాయస్థానపు బెంచ్ కు సర్. టి.ముత్తుస్వామి అయ్యర్ ను నియమించాలన్న విషయంపై తమ మద్దతును వినిపించేందుకు సుబ్రహ్మణ్య అయ్యర్ ఎం. వీరరాఘవాచార్యర్, టి.టి.రాఘవాచార్యర్, పి.వి.రంగాచార్యర్, డి. కేశవరావు పంత్, ఎన్. సుబ్బారావు పంతులు వంటివారితో కలిసి 20 సెప్టెంబర్ 1878లో ది హిందూ స్థాపించారు. మొదట్లో వారపత్రికగా ది హిందూ ప్రారంభమైంది, తర్వాత మూడు వారాలకు ఓసారి వెలువడే పత్రికగా మారి చివరకు దినపత్రికగా స్థిరపడింది.
సుబ్రహ్మణ్య అయ్యర్ అనేక స్టింగ్ ఆపరేషన్లతో తీక్షణమైన, సునిశితమైన వ్యాసాలు రాశారు. భారత స్వాతంత్ర్య ఆశయాన్ని క్రియాశీలంగా సమర్థించి, బ్రిటీష్ సామ్రాజ్యవాదంపై నిరసన వ్యక్తం చేసేందుకు పత్రికను ఉపయోగించారు. 1897లో బాలగంగాధర తిలక్ ను బ్రిటీష్ అధికారులు నిర్బంధించి, జైలు పాలు చేసినప్పుడు ది హిందూ, అరెస్టును తీవ్రంగా ఖండించింది. 1883 డిసెంబర్ 3న పత్రిక 100 మౌంట్ రోడ్డుకు మారి, తన స్వంత ప్రెస్ అయిన ది నేషనల్ ప్రెస్ ను స్థాపించింది.
ది హిందూ 12 డిసెంబర్ 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటైనప్పుడు ఆ పరిణామాన్ని ఆహ్వానిస్తూ సంపాదకీయంలో రాశారు.
అయన సంప్రదాయ వాదానికి, మూఢ విశ్వాసాలకు పూర్తి వ్యతిరేకి, సంస్కరణల ప్రోత్సాహానికి ఆయన తన పత్రికను వినియోగించు కున్నారు.
సుబ్రహ్మణ్య అయ్యర్ వ్యాసాలు పత్రికను ఎన్నో పరువునష్టం దావాల్లోకి నెట్టాయి, కేసులపై పోరాటం సుబ్రహ్మణ్య అయ్యర్ ఆర్థిక స్థితిని దారుణంగా దిగజార్చింది. 1898లో సుబ్రహ్మణ్య అయ్యర్ ప్రధాన సంపాదకుడి పదవిని వీరరాఘవాచార్యర్ కు అప్పగించారు. 1905లో వార్తాపత్రికను సుసంపన్నుడైన బారిస్టరు కస్తూరి రంగ అయ్యంగార్ కొనేశారు.
సుబ్రహ్మణ్య అయ్యర్ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాలుపంచు కున్నారు. 12 డిసెంబర్ 1885లో తేజ్ పాల్ సంస్కృత కళాశాల వద్ద నిర్వహించిన, భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటుకు కారణమైన బొంబాయి కాన్ఫరెన్సులో పాల్గొన్న 72 మంది ప్రతినిధుల్లో ఆయన కూడా ఒకరు. భారత జాతీయ కాంగ్రెస్ రెండవ సమావేశాల్లో ప్రభుత్వ సర్వీసుల్లో భారతీయుల ప్రాతినిధ్యం గురించి నివేదించే కమిటీలో సుబ్రహ్మణ్య అయ్యర్ సభ్యునిగా ఎంపికయ్యారు. 1887 మద్రాసు సమావేశాల్లో అయన భారత జాతీయ కాంగ్రెస్ రాజ్యాంగాన్ని తయారుచేసే కమిటీలో సభ్యునిగా నియమితులయ్యారు. 1894 మద్రాసు సమావేశాల్లో లండన్ లో భారత రాజ్య కార్యదర్శి ఎదుట భారత జాతీయవాదుల వాదన వినిపించే ప్రతినిధి బృందంలో ఒకరిగా ఎంపికయ్యారు. ఫిరోజ్ షా మెహతా సూచనల ప్రకారం దక్షిణాఫ్రికాలో భారతీయుల స్థితిగతులను భారత దేశంలో వివరించేందుకు చేసిన పర్యటనలో భాగంగా పచ్చయ్యప్ప హాలులో ప్రసంగించినప్పుడు గాంధీని ఆయన కలిశారు. ఈ విషయాన్ని గాంధీ తన ఆత్మకథలో ప్రస్తావించారు. 1906లో ఆయన భారత జాతీయ కాంగ్రెస్ లక్ష్యాలను ప్రచారం చేసే స్టాండింగ్ కమిటీలో సభ్యునిగా ఎంపికయ్యారు.
1898లో సుబ్రహ్మణ్య అయ్యర్ ది హిందూతో తనకున్న సంబంధాలను విరమించుకుని, 1882లో తాను ప్రారంభించిన తమిళ వార్తాపత్రిక "స్వదేశ మిత్రన్" పై దృష్టిపెట్టారు. 1898లో ది హిందూను విడిచిపెట్టినప్పుడు స్వదేశమిత్రన్ ను మూడువారాలకు ఓసారి వెలువరించగా, 1899లో తొలి తమిళ దినపత్రికగా అభివృద్ధి చేశారు.
సుబ్రహ్మణ్య భారతి... సంపాదకుడి శైలిని వర్ణిస్తూ - "సుబ్రహ్మణ్య అయ్యర్ కలం బాగా ఘాటైన సన్న పచ్చి మిరప కాయల ముద్దలో ముంచినట్టు ఉంటుందని" అన్నారు. ఆ శైలి ఆయనను సమస్యల్లోకి నెట్టి 1908లో బ్రిటీషర్లు అరెస్టు చేసేదాకా తెచ్చింది. జైలులోని స్థితిగతులు, వేధింపులతో క్రమంగా ఆయన ఆరోగ్యం పాడైంది.
తర్వాతి కాలంలో సుబ్రహ్మణ్య అయ్యర్ కు కుష్టు వ్యాధి సోకగా, 18 ఏప్రిల్ 1916న మరణించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ దంపతులు
ధర్మపురి ఫిబ్రవరి 28 (ప్రజా మంటలు)పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని స్వామివారి కళ్యాణ మహోత్సవానికి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ దంపతులు హాజరై పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు... విద్యానగర్ శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ ఉత్సవ కరపత్రం ఆవిష్కరణ.
జగిత్యాల ఫిబ్రవరి 28 ( ప్రజా మంటలు)విద్యానగర్ సీతారామచంద్రస్వామి దేవాలయంలో నిర్వహించనున్న శ్రీరామనవమి ఉత్సవాల కరపత్రాన్ని శనివారం దేవాలయం ఆవరణలో ఆవిష్కరించారు. మార్చి 26 నుండి 28 వరకు శ్రీరాముని ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ఇనగంటి అశోక్ రావు తెలిపారు.
ఉత్సవాల్లో భాగంగా మార్చి 26 గురువారం విశ్వక్సేన... కిషన్ రావు పేట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా సైన్స్ డే వేడుకలు
వెల్గటూర్ ఫిబ్రవరి 28 ( ప్రజా మంటలు)మండలంలోని కిషన్రావుపేట ఉన్నత ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు నర్ముల గంగన్న ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.
సర్ సివి రామన్ పుట్టినరోజు సందర్భంగా రామన్ ఎఫెక్ట్ కనుగొని చరిత్ర సృష్టించిన ఫిబ్రవరి 28 రోజున జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటారని రామన్ ఎఫెక్ట్ను... వేట్లపాలెం పేలుడు ఘటన: 18 మంది మృతి : బాధితులను పరామర్శించనున్న సీఎం చంద్రబాబు
కాకినాడ ఫిబ్రవరి 28 (ప్రజా మంటలు):)
వేట్లపాలెం పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి18 మంది మృతి – బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండకాకినాడ జిల్లా సామర్లకోట మండలంలోని వేట్లపాలెం గ్రామంలో బాణాసంచా తయారీ కర్మాగారంలో జరిగిన భారీ పేలుడు రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది. ఈ ప్రమాదంలో 18 మంది కార్మికులు ప్రాణాలు... ఇరాన్పై ఇజ్రాయెల్ ముందస్తు దాడి : టెహ్రాన్లో పేలుళ్లు : మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు
టెహ్రాన్/టెల్ అవీవ్ ఫిబ్రవరి 28:
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రస్థాయికి చేరాయి. ఇజ్రాయెల్, ఇరాన్పై ముందస్తు (Pre-emptive) దాడులు ప్రారంభించినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ దాడుల నేపథ్యంలో టెహ్రాన్ నగరంలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ఇరానియన్ మీడియా వెల్లడించింది. ఉత్తర, తూర్పు టెహ్రాన్ ప్రాంతాల్లో పొగమంచు కమ్ముకుందని సమాచారం.
ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్... లిక్కర్ కేసు తీర్పు: నిర్దోషిగా కవిత: తెలంగాణ రాజకీయాలలో మలుపు?
ప్రత్యేక కథనం
ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితకు కోర్టు నిర్దోషిగా తీర్పు రావడం తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక మలుపు. ఈ కేసు మొదటి నుంచీ కేంద్రంలోని Bharatiya Janata Party రాజకీయ కక్షసాధింపే అంటూ ఆమె ఆరోపించారు. దేశవ్యాప్తంగా ప్రత్యర్థి పార్టీలపై సీబీఐ, ఈడీ దర్యాప్తుల నేపథ్యంలో “ఇది వ్యూహాత్మక ఒత్తిడి రాజకీయమా?”... రుణభారం తగ్గిందా? కాళేశ్వరం విషయంలో అసలు నిజం ఏమిటి?
: హైదరాబాద్ ఫిబ్రవరి 27 (ప్రజా మంటలు):
తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో “రుణభారం తగ్గింది” అని చెబుతోంది. వడ్డీ రేటు తగ్గించామని, ఇన్స్టాల్మెంట్లు (EMI) తక్కువయ్యాయని చెప్పడం ప్రజలకు కొంత ఊరట కలిగించే విషయం. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే — నిజంగా రుణం తగ్గిందా? లేక కేవలం చెల్లింపు విధానం మారిందా?... మెట్పల్లిలో అదనపు కోర్టు కోసం హైకోర్టును కలిసిన బార్ అసోసియేషన్ నాయకులు
మెటుపల్లి, ఫిబ్రవరి 27 (ప్రజా మంటలు):
మెట్పల్లిలో పెండింగ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అదనపు కోర్టు మంజూరు చేయాలని కోరుతూ మెట్పల్లి బార్ అసోసియేషన్ ప్రతినిధులు గురువారం హైకోర్టు న్యాయమూర్తి యారా రేణుక మరియు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్. గోవర్ధన్ రెడ్డి లను కలిశారు.ప్రస్తుతం మెట్పల్లి కోర్టులో కేసులు అధికంగా పెండింగ్లో ఉన్నాయని,... బడిపిల్లల కథలకు ఆహ్వానం జిల్లా విద్యాశాఖాధికారి కె. రాము
జగిత్యాల ఫిబ్రవరి 27 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు కథా రచనలను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె. రాము ఒక ప్రకటనలో తెలిపారు.శుక్రవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ (టీఎన్జీవో) స్కూల్ ఎడ్యుకేషన్ జగిత్యాల జిల్లా... సీఎం కప్ కిక్ బాక్సింగ్ లో మెడల్ సాధించిన క్రీడాకారులను అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్
జగిత్యాల ఫిబ్రవరి 27 ( ప్రజా మంటలు)రాష్ట్ర స్తాయి సీఎం కప్ లో కిక్ బాక్సింగ్ లో గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారులను జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ అభినందించారు
సెకండ్ ఎడిషన్ సీఎం కప్ రాష్ట్రస్థాయి ఛాంపియన్షిప్ కిక్ బాక్సింగ్ విభాగంలో హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో పాల్గొని ఏ హర్షిత్... విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు చేరేందుకు నిరంతరం శ్రమించాలి జిల్లా కలెక్టర్
జగిత్యాల ఫిబ్రవరి 27 (ప్రజా మంటలు)పిఎం పోషణ్ తనిఖీ లో భాగంగా కెజిబివి పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
'పిఎం పోషణ్' తనిఖీ లో భాగంగా శుక్రవారం రోజున జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ జగిత్యాల పట్టణంలోని కస్తూర్బా గాంధీ (బాలికల) విద్యాలయం (కేజీబీవీ) ను ఆకస్మికంగా సందర్శించారు.... తెలంగాణ విద్యా కమిషన్ నివేదికపై TRTF ఆగ్రహం – ఉపాధ్యాయ హక్కులకు గొడ్డలి పెట్టినట్టేనా?
హైదరాబాద్ ఫిబ్రవరి 27 (ప్రజా మంటలు):
తెలంగాణ విద్యా కమిషన్ సమర్పించిన “తెలంగాణ విద్యా విధానం 2026” నివేదికపై తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సమాఖ్య (TRTF) తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది. ఆకునూరి మురళి కమిటీ ఇచ్చిన ఈ నివేదిక ప్రభుత్వ విద్యా వ్యవస్థ పునాదులను దెబ్బతీసేలా ఉందని సంఘం రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్,... 