ది హిందూ పత్రిక వ్యవస్థాపకులు సుబ్రహ్మణ్య అయ్యర్.

- జనవరి 19 - సుబ్రహ్మణ్య అయ్యర్ జయంతి.

On
ది హిందూ పత్రిక వ్యవస్థాపకులు సుబ్రహ్మణ్య అయ్యర్.

రచయిత:  రామ కిష్టయ్య సంగన భట్ల. 

9440595494

భారతదేశములో ఒక విశిష్ట స్థానం కలిగి, దక్షిణ భారత దేశములో ఎక్కువ ప్రచురణ కలిగిన పత్రికగా, ప్రాచుర్యంలో ఉన్న ది హిందూ (The Hindu) ఆంగ్ల దినపత్రికను 140 సంవత్సరాలు కిందట ప్రధానంగా తిరువయ్యారుకు చెందిన 23 ఏళ్ళ జి. సుబ్రమణ్య అయ్యర్... ఆయన స్నేహితుడు, పచ్చయ్యప్ప కళాశాలలో ఆయన సహోద్యోగి, చెంగల్పట్టుకు చెందిన 21 ఏళ్ళ ఎం. వీరరాఘవా చారియర్ - నలుగురు న్యాయ శాస్త్ర విద్యార్థులు టి.టి.రంగాచారియర్, పి.వి. రంగాచారియర్, డి.కేశవ రావు పంత్, న్యాపతి సుబ్బారావు పంతులుతో కలిసి ట్రిప్లికేన్ సాహితీ సంఘం పేరుతో స్థాపించారు.

సుబ్రహ్మణ్య అయ్యర్ సుప్రసిద్ధ పాత్రికేయుడు, సంఘ సంస్కర్త, స్వతంత్ర సమర యోధుడు. ఆయన సుప్రసిద్ధ భారతీయ ఆంగ్ల దినపత్రిక ది హిందూ పత్రికను 20 సెప్టెంబరు 1878న స్థాపించారు. అది మొదలు 1878 లో వారపత్రికగా, 1889 లో దిన పత్రికగా మారింది. అయన ది హిందూ పత్రికకు 20 సెప్టెంబరు 1878 నుంచి అక్టోబర్ 1898 వరకూ అధినేతగానూ, సంపాదకునిగానూ, మేనేజింగ్ డైరెక్టర్ గానూ వ్యవహరించారు.

ఆనాటి మద్రాసు ప్రెసిడెన్సీ, తంజావూరు జిల్లాలో తిరువదిలో సుబ్రహ్మణ్య అయ్యర్ జనవరి 19, 1855న జన్మించారు.

మద్రాసు ఉన్నత న్యాయస్థానపు బెంచ్ కు సర్. టి.ముత్తుస్వామి అయ్యర్ ను నియమించాలన్న విషయంపై తమ మద్దతును వినిపించేందుకు సుబ్రహ్మణ్య అయ్యర్ ఎం. వీరరాఘవాచార్యర్, టి.టి.రాఘవాచార్యర్, పి.వి.రంగాచార్యర్, డి. కేశవరావు పంత్, ఎన్. సుబ్బారావు పంతులు వంటివారితో కలిసి 20 సెప్టెంబర్ 1878లో ది హిందూ స్థాపించారు. మొదట్లో వారపత్రికగా ది హిందూ ప్రారంభమైంది, తర్వాత మూడు వారాలకు ఓసారి వెలువడే పత్రికగా మారి చివరకు దినపత్రికగా స్థిరపడింది.

సుబ్రహ్మణ్య అయ్యర్ అనేక స్టింగ్ ఆపరేషన్లతో తీక్షణమైన, సునిశితమైన వ్యాసాలు రాశారు. భారత స్వాతంత్ర్య ఆశయాన్ని క్రియాశీలంగా సమర్థించి, బ్రిటీష్ సామ్రాజ్యవాదంపై నిరసన వ్యక్తం చేసేందుకు పత్రికను ఉపయోగించారు. 1897లో బాలగంగాధర తిలక్ ను బ్రిటీష్ అధికారులు నిర్బంధించి, జైలు పాలు చేసినప్పుడు ది హిందూ, అరెస్టును తీవ్రంగా ఖండించింది. 1883 డిసెంబర్ 3న పత్రిక 100 మౌంట్ రోడ్డుకు మారి, తన స్వంత ప్రెస్ అయిన ది నేషనల్ ప్రెస్ ను స్థాపించింది.

ది హిందూ 12 డిసెంబర్ 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటైనప్పుడు ఆ పరిణామాన్ని ఆహ్వానిస్తూ సంపాదకీయంలో రాశారు.

అయన సంప్రదాయ వాదానికి, మూఢ విశ్వాసాలకు పూర్తి వ్యతిరేకి, సంస్కరణల ప్రోత్సాహానికి ఆయన తన పత్రికను వినియోగించు కున్నారు. 

సుబ్రహ్మణ్య అయ్యర్ వ్యాసాలు పత్రికను ఎన్నో పరువునష్టం దావాల్లోకి నెట్టాయి, కేసులపై పోరాటం సుబ్రహ్మణ్య అయ్యర్ ఆర్థిక స్థితిని దారుణంగా దిగజార్చింది. 1898లో సుబ్రహ్మణ్య అయ్యర్ ప్రధాన సంపాదకుడి పదవిని వీరరాఘవాచార్యర్ కు అప్పగించారు. 1905లో వార్తాపత్రికను సుసంపన్నుడైన బారిస్టరు కస్తూరి రంగ అయ్యంగార్ కొనేశారు.

సుబ్రహ్మణ్య అయ్యర్ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాలుపంచు కున్నారు. 12 డిసెంబర్ 1885లో తేజ్ పాల్ సంస్కృత కళాశాల వద్ద నిర్వహించిన, భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటుకు కారణమైన బొంబాయి కాన్ఫరెన్సులో పాల్గొన్న 72 మంది ప్రతినిధుల్లో ఆయన కూడా ఒకరు. భారత జాతీయ కాంగ్రెస్ రెండవ సమావేశాల్లో ప్రభుత్వ సర్వీసుల్లో భారతీయుల ప్రాతినిధ్యం గురించి నివేదించే కమిటీలో సుబ్రహ్మణ్య అయ్యర్ సభ్యునిగా ఎంపికయ్యారు. 1887 మద్రాసు సమావేశాల్లో అయన భారత జాతీయ కాంగ్రెస్ రాజ్యాంగాన్ని తయారుచేసే కమిటీలో సభ్యునిగా నియమితులయ్యారు. 1894 మద్రాసు సమావేశాల్లో లండన్ లో భారత రాజ్య కార్యదర్శి ఎదుట భారత జాతీయవాదుల వాదన వినిపించే ప్రతినిధి బృందంలో ఒకరిగా ఎంపికయ్యారు. ఫిరోజ్ షా మెహతా సూచనల ప్రకారం దక్షిణాఫ్రికాలో భారతీయుల స్థితిగతులను భారత దేశంలో వివరించేందుకు చేసిన పర్యటనలో భాగంగా పచ్చయ్యప్ప హాలులో ప్రసంగించినప్పుడు గాంధీని ఆయన కలిశారు. ఈ విషయాన్ని గాంధీ తన ఆత్మకథలో ప్రస్తావించారు. 1906లో ఆయన భారత జాతీయ కాంగ్రెస్ లక్ష్యాలను ప్రచారం చేసే స్టాండింగ్ కమిటీలో సభ్యునిగా ఎంపికయ్యారు.

1898లో సుబ్రహ్మణ్య అయ్యర్ ది హిందూతో తనకున్న సంబంధాలను విరమించుకుని, 1882లో తాను ప్రారంభించిన తమిళ వార్తాపత్రిక "స్వదేశ మిత్రన్" పై దృష్టిపెట్టారు. 1898లో ది హిందూను విడిచిపెట్టినప్పుడు స్వదేశమిత్రన్ ను మూడువారాలకు ఓసారి వెలువరించగా, 1899లో తొలి తమిళ దినపత్రికగా అభివృద్ధి చేశారు.

సుబ్రహ్మణ్య భారతి... సంపాదకుడి శైలిని వర్ణిస్తూ - "సుబ్రహ్మణ్య అయ్యర్ కలం బాగా ఘాటైన సన్న పచ్చి మిరప కాయల ముద్దలో ముంచినట్టు ఉంటుందని" అన్నారు. ఆ శైలి ఆయనను సమస్యల్లోకి నెట్టి 1908లో బ్రిటీషర్లు అరెస్టు చేసేదాకా తెచ్చింది. జైలులోని స్థితిగతులు, వేధింపులతో క్రమంగా ఆయన ఆరోగ్యం పాడైంది.

తర్వాతి కాలంలో సుబ్రహ్మణ్య అయ్యర్ కు కుష్టు వ్యాధి సోకగా, 18 ఏప్రిల్ 1916న మరణించారు.

Tags
Join WhatsApp

More News...

National  International   Economy  

ట్రంప్ గ్లోబల్ టారిఫ్ 15%: భారత్‌పై ఎలాంటి ప్రభావం ఎంత?

ట్రంప్ గ్లోబల్ టారిఫ్ 15%: భారత్‌పై ఎలాంటి ప్రభావం ఎంత? ట్రంప్ మళ్ళీ 10 నుండి 15% సుంకాల పెంపు ప్రభావం - ఒక విశ్లేషణ  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన గ్లోబల్ టారిఫ్ పెంపు నిర్ణయం భారత్‌కు గణనీయమైన ఆర్థిక ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. శనివారం (ఫిబ్రవరి 21, 2026) ట్రంప్ మాట్లాడుతూ, ప్రపంచ దేశాలపై విధించదలచుకున్న టారిఫ్‌ను...
Read More...
Local News  State News 

హీలింగ్ క్యాపిటల్ గా హైదరాబాద్. - రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.

హీలింగ్ క్యాపిటల్ గా హైదరాబాద్. - రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  ఫార్మా రాజధానిగా అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతున్న హైదరాబాద్ ను హీలింగ్ క్యాపిటల్ గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా, అవకాశాలను అందిపుచ్చుకునేలా హెల్త్ కేర్...
Read More...
Local News 

తెలంగాణ మాజీ మంత్రి టి. హరీష్ రావు సమక్షంలో భారతదేశంలో రూఫ్‌టాప్ సోలార్ వినియోగాన్ని విప్లవాత్మకంగా మార్చేందుకు 'RENGY' యాప్ ప్రారంభం

తెలంగాణ మాజీ మంత్రి టి. హరీష్ రావు సమక్షంలో భారతదేశంలో రూఫ్‌టాప్ సోలార్ వినియోగాన్ని విప్లవాత్మకంగా మార్చేందుకు 'RENGY' యాప్ ప్రారంభం (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). హైదరాబాద్ 21 ఫిబ్రవరి (ప్రజా మంటలు) :  నివాస గృహాల ఇంధన అవసరాల కోసం డిజిటల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందిస్తున్న క్లీన్-టెక్ ఎనర్జీ సంస్థ 'రెంజి’ (Rengy) ప్రైవేట్ లిమిటెడ్'. నేడు (21 ఫిబ్రవరి 2026) తన ప్రతిష్టాత్మక RENGY యాప్‌ను ప్రారంభించింది తెలంగాణ మాజీ మంత్రి...
Read More...
Local News 

సీనియర్ సిటిజెన్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు — జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్

సీనియర్ సిటిజెన్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు — జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్    జగిత్యాల, ఫిబ్రవరి 21 (ప్రజా మంటలు):సీనియర్ సిటిజెన్ల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్ అన్నారు. శనివారం జగిత్యాలలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీనియర్ సిటిజెన్స్, పెన్షనర్స్ సంఘాల ప్రతినిధులు—జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో—ఎమ్మెల్యేను కలిసి...
Read More...
National  Crime  State News 

కర్ణాటక రాజకీయాల్లో సంచలం: బీజేపీ ఎమ్మెల్యే డా చంద్రూలమానీ లంచం కేసులో అరెస్ట్

కర్ణాటక రాజకీయాల్లో సంచలం: బీజేపీ ఎమ్మెల్యే డా చంద్రూలమానీ లంచం కేసులో అరెస్ట్ బెంగళూరు ఫిబ్రవరి 21 (ప్రజా మంటలు): కర్ణాటక రాజకీయాల్లో సంచలన ఘటన చోటుచేసుకుంది. అధికార భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే చంద్రూలమానీ లంచం కేసులో అరెస్టయ్యారు. మైనర్ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన రోడ్డు పక్కన రిటెయినింగ్ వాల్ (రక్షణ గోడ) నిర్మాణ పనుల కేటాయింపుకు గాను రూ.10 లక్షలు లంచం డిమాండ్ చేసిన...
Read More...
State News 

స్కూల్ విద్యార్థులకు ఏప్రిల్ 10 నుంచి 20 వరకు SA-II పరీక్షలు

 స్కూల్ విద్యార్థులకు ఏప్రిల్ 10 నుంచి 20 వరకు SA-II పరీక్షలు హైదరాబాద్, ఫిబ్రవరి 14 (ప్రజా మంటలు): తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి, తరగతులు 1 నుంచి 9 వరకు సమ్మేటివ్ అసెస్‌మెంట్-II (SA-II) పరీక్షలు ఏప్రిల్ 10 నుంచి 20, 2026 వరకు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరీక్షల టైమ్‌టేబుల్‌ను SCERT విడుదల చేసింది.ఏప్రిల్ 10,...
Read More...
Local News  Crime 

ఎర్దండి గ్రామ శివారులో అనుమానాస్పద మృతి

ఎర్దండి గ్రామ శివారులో అనుమానాస్పద మృతి ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 21 (ప్రజా మంటలు-దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామ శివారులో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాశెట్టి గణేష్‌కు చెందిన వ్యవసాయ భూమిలో ఎర్రోళ్ల లింబాద్రి (51), తండ్రి గంగారం, నివాసం మొగిలిపేట (మల్లాపూర్ మండలం) మృతదేహం లభ్యమైంది. మృతుడి తలకు తీవ్ర గాయాలు ఉండటంతో...
Read More...
National  Comment  International   Economy  

ట్రేడ్ లేదా ట్రాప్? జపాన్ మార్కెట్లలో ‘టకైచి ప్రభావం’పై పెట్టుబడిదారుల సందేహాలు

ట్రేడ్ లేదా ట్రాప్? జపాన్ మార్కెట్లలో ‘టకైచి ప్రభావం’పై పెట్టుబడిదారుల సందేహాలు టోక్యో ఫిబ్రవరి 21:  జపాన్‌లో జరిగిన ఎన్నికల్లో సానయే టకైచి ఘన విజయం సాధించడంతో, జపాన్ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలను తాకాయి. ముఖ్యంగా నిక్కీ 225 సూచీ ఒక్క వారంలోనే సుమారు 5 శాతం పెరగడం పెట్టుబడిదారుల్లో ఉత్సాహాన్ని పెంచింది. అయితే ఈ ఉత్సాహం వెనుక ఆందోళన కూడా దాగి ఉందని మార్కెట్ నిపుణులు...
Read More...
National  State News 

జాతీయ స్థాయిలో ‘ఏఐ కౌన్సిల్’, ప్రత్యేక ‘ఏఐ మంత్రిత్వ శాఖ’ ఏర్పాటు చేయాలి.— ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

జాతీయ స్థాయిలో ‘ఏఐ కౌన్సిల్’, ప్రత్యేక ‘ఏఐ మంత్రిత్వ శాఖ’ ఏర్పాటు చేయాలి.— ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21 (ప్రజా మంటలు): కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) యావత్ ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో, జాతీయ స్థాయిలో జీఎస్టీ కౌన్సిల్, నీతి ఆయోగ్ తరహాలో ప్రత్యేకంగా ఒక “ఏఐ కౌన్సిల్” ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. అలాగే జాతీయ...
Read More...
National  International   Economy  

అమెరికా సుప్రీం కోర్ట్ షాక్ – ట్రంప్ టారిఫ్ యుద్ధం కొత్త మలుపు

అమెరికా సుప్రీం కోర్ట్ షాక్ – ట్రంప్ టారిఫ్ యుద్ధం కొత్త మలుపు వసూలు చేసిన టారిఫ్ నిధులు తిరిగి ఇచ్చేయాలా? హైదరాబాద్ ఫిబ్రవరి 21:    అమెరికా వాణిజ్య విధానాల్లో కీలక మలుపుగా, అమెరికా సుప్రీం కోర్ట్ ట్రంప్ ప్రభుత్వం అమలు చేసిన టారిఫ్‌లకు చట్టపరమైన బ్రేక్ వేసింది. జాతీయ భద్రత పేరుతో దిగుమతులపై భారీ సుంకాలు విధించే అధికారాన్ని అధ్యక్షుడు ఏకపక్షంగా వినియోగించలేడని కోర్ట్ స్పష్టం చేసింది. ఇది...
Read More...
State News 

ఇంటర్మీడియట్ బోర్డు ను ముట్టడించిన జాగృతి విద్యార్థి నాయకులు 

ఇంటర్మీడియట్ బోర్డు ను ముట్టడించిన జాగృతి విద్యార్థి నాయకులు  హైదరాబాద్, ఫిబ్రవరి 21 (ప్రజా మంటలు): నాంపల్లిలో ఇంటర్మీడియట్ బోర్డును ముట్టడించిన తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యాలయాన్ని తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు ముట్టడించారు.అనుమతి లేని ఇంటర్ కాలేజీలకు బోర్డు కొమ్ముకాస్తూ, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని విద్యార్థి నాయకులు తీవ్రంగా మండిపడ్డారు....
Read More...
Local News 

బిసి రిజర్వేషన్ల ఖరారు తర్వాతనే   జెడ్పిటిసి ,ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలి జిల్లా అదనపు కలెక్టర్కు బీసీ నాయకులు వినతి

బిసి రిజర్వేషన్ల ఖరారు తర్వాతనే   జెడ్పిటిసి ,ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలి జిల్లా అదనపు కలెక్టర్కు బీసీ నాయకులు వినతి జగిత్యాల ఫిబ్రవరి 20 (ప్రజా మంటలు)    స్థానిక సంస్థలలో  రిజర్వేషన్ల తర్వాతనే  జడ్.పి.టి.సి., ఎం.పి.టి.సి. ఎన్నికలకు వెళ్ళాలి. లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని బీసీ నాయకులు అన్నారు . రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల కంటే ముందు కామారెడ్డి డిక్లరేషన్లో బిసిలకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కల్పిస్తామని చెప్పి, 42% రిజర్వేషన్లను కల్పించకుండానే సర్పంచ్...
Read More...