ది హిందూ పత్రిక వ్యవస్థాపకులు సుబ్రహ్మణ్య అయ్యర్.
- జనవరి 19 - సుబ్రహ్మణ్య అయ్యర్ జయంతి.
రచయిత: రామ కిష్టయ్య సంగన భట్ల.
9440595494
భారతదేశములో ఒక విశిష్ట స్థానం కలిగి, దక్షిణ భారత దేశములో ఎక్కువ ప్రచురణ కలిగిన పత్రికగా, ప్రాచుర్యంలో ఉన్న ది హిందూ (The Hindu) ఆంగ్ల దినపత్రికను 140 సంవత్సరాలు కిందట ప్రధానంగా తిరువయ్యారుకు చెందిన 23 ఏళ్ళ జి. సుబ్రమణ్య అయ్యర్... ఆయన స్నేహితుడు, పచ్చయ్యప్ప కళాశాలలో ఆయన సహోద్యోగి, చెంగల్పట్టుకు చెందిన 21 ఏళ్ళ ఎం. వీరరాఘవా చారియర్ - నలుగురు న్యాయ శాస్త్ర విద్యార్థులు టి.టి.రంగాచారియర్, పి.వి. రంగాచారియర్, డి.కేశవ రావు పంత్, న్యాపతి సుబ్బారావు పంతులుతో కలిసి ట్రిప్లికేన్ సాహితీ సంఘం పేరుతో స్థాపించారు.
సుబ్రహ్మణ్య అయ్యర్ సుప్రసిద్ధ పాత్రికేయుడు, సంఘ సంస్కర్త, స్వతంత్ర సమర యోధుడు. ఆయన సుప్రసిద్ధ భారతీయ ఆంగ్ల దినపత్రిక ది హిందూ పత్రికను 20 సెప్టెంబరు 1878న స్థాపించారు. అది మొదలు 1878 లో వారపత్రికగా, 1889 లో దిన పత్రికగా మారింది. అయన ది హిందూ పత్రికకు 20 సెప్టెంబరు 1878 నుంచి అక్టోబర్ 1898 వరకూ అధినేతగానూ, సంపాదకునిగానూ, మేనేజింగ్ డైరెక్టర్ గానూ వ్యవహరించారు.
ఆనాటి మద్రాసు ప్రెసిడెన్సీ, తంజావూరు జిల్లాలో తిరువదిలో సుబ్రహ్మణ్య అయ్యర్ జనవరి 19, 1855న జన్మించారు.
మద్రాసు ఉన్నత న్యాయస్థానపు బెంచ్ కు సర్. టి.ముత్తుస్వామి అయ్యర్ ను నియమించాలన్న విషయంపై తమ మద్దతును వినిపించేందుకు సుబ్రహ్మణ్య అయ్యర్ ఎం. వీరరాఘవాచార్యర్, టి.టి.రాఘవాచార్యర్, పి.వి.రంగాచార్యర్, డి. కేశవరావు పంత్, ఎన్. సుబ్బారావు పంతులు వంటివారితో కలిసి 20 సెప్టెంబర్ 1878లో ది హిందూ స్థాపించారు. మొదట్లో వారపత్రికగా ది హిందూ ప్రారంభమైంది, తర్వాత మూడు వారాలకు ఓసారి వెలువడే పత్రికగా మారి చివరకు దినపత్రికగా స్థిరపడింది.
సుబ్రహ్మణ్య అయ్యర్ అనేక స్టింగ్ ఆపరేషన్లతో తీక్షణమైన, సునిశితమైన వ్యాసాలు రాశారు. భారత స్వాతంత్ర్య ఆశయాన్ని క్రియాశీలంగా సమర్థించి, బ్రిటీష్ సామ్రాజ్యవాదంపై నిరసన వ్యక్తం చేసేందుకు పత్రికను ఉపయోగించారు. 1897లో బాలగంగాధర తిలక్ ను బ్రిటీష్ అధికారులు నిర్బంధించి, జైలు పాలు చేసినప్పుడు ది హిందూ, అరెస్టును తీవ్రంగా ఖండించింది. 1883 డిసెంబర్ 3న పత్రిక 100 మౌంట్ రోడ్డుకు మారి, తన స్వంత ప్రెస్ అయిన ది నేషనల్ ప్రెస్ ను స్థాపించింది.
ది హిందూ 12 డిసెంబర్ 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటైనప్పుడు ఆ పరిణామాన్ని ఆహ్వానిస్తూ సంపాదకీయంలో రాశారు.
అయన సంప్రదాయ వాదానికి, మూఢ విశ్వాసాలకు పూర్తి వ్యతిరేకి, సంస్కరణల ప్రోత్సాహానికి ఆయన తన పత్రికను వినియోగించు కున్నారు.
సుబ్రహ్మణ్య అయ్యర్ వ్యాసాలు పత్రికను ఎన్నో పరువునష్టం దావాల్లోకి నెట్టాయి, కేసులపై పోరాటం సుబ్రహ్మణ్య అయ్యర్ ఆర్థిక స్థితిని దారుణంగా దిగజార్చింది. 1898లో సుబ్రహ్మణ్య అయ్యర్ ప్రధాన సంపాదకుడి పదవిని వీరరాఘవాచార్యర్ కు అప్పగించారు. 1905లో వార్తాపత్రికను సుసంపన్నుడైన బారిస్టరు కస్తూరి రంగ అయ్యంగార్ కొనేశారు.
సుబ్రహ్మణ్య అయ్యర్ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాలుపంచు కున్నారు. 12 డిసెంబర్ 1885లో తేజ్ పాల్ సంస్కృత కళాశాల వద్ద నిర్వహించిన, భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటుకు కారణమైన బొంబాయి కాన్ఫరెన్సులో పాల్గొన్న 72 మంది ప్రతినిధుల్లో ఆయన కూడా ఒకరు. భారత జాతీయ కాంగ్రెస్ రెండవ సమావేశాల్లో ప్రభుత్వ సర్వీసుల్లో భారతీయుల ప్రాతినిధ్యం గురించి నివేదించే కమిటీలో సుబ్రహ్మణ్య అయ్యర్ సభ్యునిగా ఎంపికయ్యారు. 1887 మద్రాసు సమావేశాల్లో అయన భారత జాతీయ కాంగ్రెస్ రాజ్యాంగాన్ని తయారుచేసే కమిటీలో సభ్యునిగా నియమితులయ్యారు. 1894 మద్రాసు సమావేశాల్లో లండన్ లో భారత రాజ్య కార్యదర్శి ఎదుట భారత జాతీయవాదుల వాదన వినిపించే ప్రతినిధి బృందంలో ఒకరిగా ఎంపికయ్యారు. ఫిరోజ్ షా మెహతా సూచనల ప్రకారం దక్షిణాఫ్రికాలో భారతీయుల స్థితిగతులను భారత దేశంలో వివరించేందుకు చేసిన పర్యటనలో భాగంగా పచ్చయ్యప్ప హాలులో ప్రసంగించినప్పుడు గాంధీని ఆయన కలిశారు. ఈ విషయాన్ని గాంధీ తన ఆత్మకథలో ప్రస్తావించారు. 1906లో ఆయన భారత జాతీయ కాంగ్రెస్ లక్ష్యాలను ప్రచారం చేసే స్టాండింగ్ కమిటీలో సభ్యునిగా ఎంపికయ్యారు.
1898లో సుబ్రహ్మణ్య అయ్యర్ ది హిందూతో తనకున్న సంబంధాలను విరమించుకుని, 1882లో తాను ప్రారంభించిన తమిళ వార్తాపత్రిక "స్వదేశ మిత్రన్" పై దృష్టిపెట్టారు. 1898లో ది హిందూను విడిచిపెట్టినప్పుడు స్వదేశమిత్రన్ ను మూడువారాలకు ఓసారి వెలువరించగా, 1899లో తొలి తమిళ దినపత్రికగా అభివృద్ధి చేశారు.
సుబ్రహ్మణ్య భారతి... సంపాదకుడి శైలిని వర్ణిస్తూ - "సుబ్రహ్మణ్య అయ్యర్ కలం బాగా ఘాటైన సన్న పచ్చి మిరప కాయల ముద్దలో ముంచినట్టు ఉంటుందని" అన్నారు. ఆ శైలి ఆయనను సమస్యల్లోకి నెట్టి 1908లో బ్రిటీషర్లు అరెస్టు చేసేదాకా తెచ్చింది. జైలులోని స్థితిగతులు, వేధింపులతో క్రమంగా ఆయన ఆరోగ్యం పాడైంది.
తర్వాతి కాలంలో సుబ్రహ్మణ్య అయ్యర్ కు కుష్టు వ్యాధి సోకగా, 18 ఏప్రిల్ 1916న మరణించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగరవేయాలి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
జగిత్యాల జనవరి 7 ( ప్రజా మంటలు) జగిత్యాల మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగుర వేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
జిల్లా బి ఆర్ యస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్, జిల్లా బి ఆర్ యస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు , జిల్లా తొలి జడ్పీ... నేచురల్, ఆర్గానిక్ వ్యవసాయం రైతుకు లాభదాయకం : డా. జీ. చిన్నారెడ్డి
హైదరాబాద్, జనవరి 07 (ప్రజా మంటలు):
నేచురల్, ఆర్గానిక్ వ్యవసాయం వల్ల ప్రజల ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా భూమి సారవంతంగా మారి రైతుకు మేలు జరుగుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి తెలిపారు.
లక్డికాపూల్లోని ఫ్యాప్సీ కాన్ఫరెన్స్ హాల్లో రాష్ట్ర వ్యవసాయ అధికారుల సంఘం డైరీలు, క్యాలెండర్లు, పాకెట్ డైరీలను... బి ఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్ష పదవికి గట్టు సతీష్ రాజీనామా
జగిత్యాల జనవరి 7 ( ప్రజా మంటలు) 2014 నుండి దాదాపు దశాబ్ద కాలం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ (టిఆర్ఎస్) పార్టీ కార్యకర్తగా, జగిత్యాల పట్టణ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించిన గట్టు సతీష్ వ్యక్తిగత కారణాలతో అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు.
బిఆర్ ఎస్ పార్టీ కుటుంబ... భగవద్గీతే నిజమైన విద్యకు పునాది., సిద్దార్థ విద్యా సంస్థల ఎస్ ఎస్ సి విద్యార్థులకు దేవనాథ జీయర్ స్వామీజీ బోధ
జగిత్యాల జనవరి 7(ప్రజా మంటలు)పట్టణం లోని సిద్ధార్థ విద్యాసంస్థ ఆధ్వర్యంలో మానస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలలో సూర్య గ్లోబల్ స్కూల్, జ్యోతి హై స్కూల్, మానస హై స్కూల్ విద్యార్థుల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే ఉద్దేశంతో 10వ తరగతి విద్యార్థులకోసం “ఎగ్జామ్ ఛాలెంజెస్– మోటివేషనల్ సెషన్ ” అనే ప్రేరణాత్మక కార్యక్రమాన్ని నిర్వహించారు. ... కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఆమోదం
హైదరాబాద్ జనవరి 07 (ప్రజామంటలు):
నిజామాబాద్ స్థానిక సంస్థల శాసన మండలి సభ్యత్వానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన రాజీనామాను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. ఈ మేరకు లెజిస్లేటివ్ సెక్రటరీ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేశారు.
కల్వకుంట్ల కవిత 2021లో నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా నుంచి... కొండగట్టు క్షేత్రానికి భారీగా తరలివచ్చిన భక్తులు
కొండగట్టు జనవరి 6 (ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజామున నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.
ముందుగా బేతాళ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకున్నారు. టెంకాయ మొక్కులు చెల్లించి తమ... మంగళవారం కొండగట్టులో ట్రాఫిక్ రద్దీ.. పార్కింగ్ కొరతతో భక్తుల ఇబ్బందులు
కొండగట్టు జనవరి 6 (ప్రజా మంటలు)
బొజ్జనపెల్లి గణేష్ కొండగట్టు
కొండగట్టు ఆలయముకు మంగళవారం సందర్భంగా వాహనాల్లో వచ్చిన భక్తుల రద్దీతో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. గుట్టపై సరైన పార్కింగ్ సదుపాయం లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. అధిక సంఖ్యలో వాహనాలు రావడంతో తరచూ ఇలాంటి పరిస్థితి నెలకొంటోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.... మంగళవారం కొండగట్టులో ట్రాఫిక్ రద్దీ.. పార్కింగ్ కొరతతో భక్తుల ఇబ్బందులు
కొండగట్టు జనవరి 6 ( ప్రజా మంటలు)బొజ్జన పెల్లి గణేష్ (కొండగట్టు)
కొండగట్టు ఆలయముకు మంగళవారం సందర్భంగా వాహనాల్లో వచ్చిన భక్తుల రద్దీతో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.
గుట్టపై సరైన పార్కింగ్ సదుపాయం లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. అధిక సంఖ్యలో వాహనాలు రావడంతో తరచూ ఇలాంటి పరిస్థితి నెలకొంటోందని భక్తులు ఆవేదన... ప్రపంచ తెలుగు మహాసభల్లో జగిత్యాల వాసి సముద్రాల రాములు కు అరుదైన గౌరవం
జగిత్యాల జనవరి 6 ( ప్రజా మంటలు)ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు( అమరావతి) లో జరిగిన మూడవ ప్రపంచ తెలుగు మహాసభల్లో భారతదేశ వ్యాప్తంగా ఎంపికైన 120 మంది గాయని గాయకులలో జగిత్యాల వాసి సముద్రాల రాములు ఒకరిగా ఎంపికయ్యారు.
తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ సెక్రటరీ చెల్లాపురం శ్రీకాంత్ సముద్రాల రాములు గూర్చి మాట్లాడుతూ... నోడల్ అధికారులు విధులు సమర్థవంతంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
జగిత్యాల జనవరి 6 ( ప్రజా మంటలు)
జిల్లాలోని 5 మున్సిపల్ పరిధిలో ఎన్నికల నిర్వహణ కొరకు భాగంగా నోడల్ అధికారులకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అన్నారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ తో కలిసి... శ్రీ జంబి హనుమాన్ ఆలయంలో సామూహిక హనుమాన్ చాలీసా, లలితా చాలీసా పారాయణం
జగిత్యాల జనవరి 6 ( ప్రజా మంటలు)శ్రీ జంబి హనుమాన్ ఆలయంలో మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణం, లలితా చాలీసా పారాయణం సామూహికంగా భక్తులచే సాయంత్రం 7 గంటల నుండి సామూహిక పారాయణం కొనసాగింది.
.అనంతరం మంగళహారతి, మంత్రపుష్పం ,తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి నామస్మరణతో... మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ ను కలిసిన ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం
జగిత్యాల డిసెంబర్ 5 ( ప్రజా మంటలు)ఇటీవల జరిగిన ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ఎన్నికైన నూతన కార్యవర్గం సభ్యులు సోమవారం కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ను కలిసి పుష్పగుచ్చం అందించారు.
ఈ సందర్బంగా నూతన కార్యవర్గానికి జిల్లా కలెక్టర్ అభినందనలు తెలుపుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి మీడియా అని... 