ది హిందూ పత్రిక వ్యవస్థాపకులు సుబ్రహ్మణ్య అయ్యర్.
- జనవరి 19 - సుబ్రహ్మణ్య అయ్యర్ జయంతి.
రచయిత: రామ కిష్టయ్య సంగన భట్ల.
9440595494
భారతదేశములో ఒక విశిష్ట స్థానం కలిగి, దక్షిణ భారత దేశములో ఎక్కువ ప్రచురణ కలిగిన పత్రికగా, ప్రాచుర్యంలో ఉన్న ది హిందూ (The Hindu) ఆంగ్ల దినపత్రికను 140 సంవత్సరాలు కిందట ప్రధానంగా తిరువయ్యారుకు చెందిన 23 ఏళ్ళ జి. సుబ్రమణ్య అయ్యర్... ఆయన స్నేహితుడు, పచ్చయ్యప్ప కళాశాలలో ఆయన సహోద్యోగి, చెంగల్పట్టుకు చెందిన 21 ఏళ్ళ ఎం. వీరరాఘవా చారియర్ - నలుగురు న్యాయ శాస్త్ర విద్యార్థులు టి.టి.రంగాచారియర్, పి.వి. రంగాచారియర్, డి.కేశవ రావు పంత్, న్యాపతి సుబ్బారావు పంతులుతో కలిసి ట్రిప్లికేన్ సాహితీ సంఘం పేరుతో స్థాపించారు.
సుబ్రహ్మణ్య అయ్యర్ సుప్రసిద్ధ పాత్రికేయుడు, సంఘ సంస్కర్త, స్వతంత్ర సమర యోధుడు. ఆయన సుప్రసిద్ధ భారతీయ ఆంగ్ల దినపత్రిక ది హిందూ పత్రికను 20 సెప్టెంబరు 1878న స్థాపించారు. అది మొదలు 1878 లో వారపత్రికగా, 1889 లో దిన పత్రికగా మారింది. అయన ది హిందూ పత్రికకు 20 సెప్టెంబరు 1878 నుంచి అక్టోబర్ 1898 వరకూ అధినేతగానూ, సంపాదకునిగానూ, మేనేజింగ్ డైరెక్టర్ గానూ వ్యవహరించారు.
ఆనాటి మద్రాసు ప్రెసిడెన్సీ, తంజావూరు జిల్లాలో తిరువదిలో సుబ్రహ్మణ్య అయ్యర్ జనవరి 19, 1855న జన్మించారు.
మద్రాసు ఉన్నత న్యాయస్థానపు బెంచ్ కు సర్. టి.ముత్తుస్వామి అయ్యర్ ను నియమించాలన్న విషయంపై తమ మద్దతును వినిపించేందుకు సుబ్రహ్మణ్య అయ్యర్ ఎం. వీరరాఘవాచార్యర్, టి.టి.రాఘవాచార్యర్, పి.వి.రంగాచార్యర్, డి. కేశవరావు పంత్, ఎన్. సుబ్బారావు పంతులు వంటివారితో కలిసి 20 సెప్టెంబర్ 1878లో ది హిందూ స్థాపించారు. మొదట్లో వారపత్రికగా ది హిందూ ప్రారంభమైంది, తర్వాత మూడు వారాలకు ఓసారి వెలువడే పత్రికగా మారి చివరకు దినపత్రికగా స్థిరపడింది.
సుబ్రహ్మణ్య అయ్యర్ అనేక స్టింగ్ ఆపరేషన్లతో తీక్షణమైన, సునిశితమైన వ్యాసాలు రాశారు. భారత స్వాతంత్ర్య ఆశయాన్ని క్రియాశీలంగా సమర్థించి, బ్రిటీష్ సామ్రాజ్యవాదంపై నిరసన వ్యక్తం చేసేందుకు పత్రికను ఉపయోగించారు. 1897లో బాలగంగాధర తిలక్ ను బ్రిటీష్ అధికారులు నిర్బంధించి, జైలు పాలు చేసినప్పుడు ది హిందూ, అరెస్టును తీవ్రంగా ఖండించింది. 1883 డిసెంబర్ 3న పత్రిక 100 మౌంట్ రోడ్డుకు మారి, తన స్వంత ప్రెస్ అయిన ది నేషనల్ ప్రెస్ ను స్థాపించింది.
ది హిందూ 12 డిసెంబర్ 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటైనప్పుడు ఆ పరిణామాన్ని ఆహ్వానిస్తూ సంపాదకీయంలో రాశారు.
అయన సంప్రదాయ వాదానికి, మూఢ విశ్వాసాలకు పూర్తి వ్యతిరేకి, సంస్కరణల ప్రోత్సాహానికి ఆయన తన పత్రికను వినియోగించు కున్నారు.
సుబ్రహ్మణ్య అయ్యర్ వ్యాసాలు పత్రికను ఎన్నో పరువునష్టం దావాల్లోకి నెట్టాయి, కేసులపై పోరాటం సుబ్రహ్మణ్య అయ్యర్ ఆర్థిక స్థితిని దారుణంగా దిగజార్చింది. 1898లో సుబ్రహ్మణ్య అయ్యర్ ప్రధాన సంపాదకుడి పదవిని వీరరాఘవాచార్యర్ కు అప్పగించారు. 1905లో వార్తాపత్రికను సుసంపన్నుడైన బారిస్టరు కస్తూరి రంగ అయ్యంగార్ కొనేశారు.
సుబ్రహ్మణ్య అయ్యర్ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాలుపంచు కున్నారు. 12 డిసెంబర్ 1885లో తేజ్ పాల్ సంస్కృత కళాశాల వద్ద నిర్వహించిన, భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటుకు కారణమైన బొంబాయి కాన్ఫరెన్సులో పాల్గొన్న 72 మంది ప్రతినిధుల్లో ఆయన కూడా ఒకరు. భారత జాతీయ కాంగ్రెస్ రెండవ సమావేశాల్లో ప్రభుత్వ సర్వీసుల్లో భారతీయుల ప్రాతినిధ్యం గురించి నివేదించే కమిటీలో సుబ్రహ్మణ్య అయ్యర్ సభ్యునిగా ఎంపికయ్యారు. 1887 మద్రాసు సమావేశాల్లో అయన భారత జాతీయ కాంగ్రెస్ రాజ్యాంగాన్ని తయారుచేసే కమిటీలో సభ్యునిగా నియమితులయ్యారు. 1894 మద్రాసు సమావేశాల్లో లండన్ లో భారత రాజ్య కార్యదర్శి ఎదుట భారత జాతీయవాదుల వాదన వినిపించే ప్రతినిధి బృందంలో ఒకరిగా ఎంపికయ్యారు. ఫిరోజ్ షా మెహతా సూచనల ప్రకారం దక్షిణాఫ్రికాలో భారతీయుల స్థితిగతులను భారత దేశంలో వివరించేందుకు చేసిన పర్యటనలో భాగంగా పచ్చయ్యప్ప హాలులో ప్రసంగించినప్పుడు గాంధీని ఆయన కలిశారు. ఈ విషయాన్ని గాంధీ తన ఆత్మకథలో ప్రస్తావించారు. 1906లో ఆయన భారత జాతీయ కాంగ్రెస్ లక్ష్యాలను ప్రచారం చేసే స్టాండింగ్ కమిటీలో సభ్యునిగా ఎంపికయ్యారు.
1898లో సుబ్రహ్మణ్య అయ్యర్ ది హిందూతో తనకున్న సంబంధాలను విరమించుకుని, 1882లో తాను ప్రారంభించిన తమిళ వార్తాపత్రిక "స్వదేశ మిత్రన్" పై దృష్టిపెట్టారు. 1898లో ది హిందూను విడిచిపెట్టినప్పుడు స్వదేశమిత్రన్ ను మూడువారాలకు ఓసారి వెలువరించగా, 1899లో తొలి తమిళ దినపత్రికగా అభివృద్ధి చేశారు.
సుబ్రహ్మణ్య భారతి... సంపాదకుడి శైలిని వర్ణిస్తూ - "సుబ్రహ్మణ్య అయ్యర్ కలం బాగా ఘాటైన సన్న పచ్చి మిరప కాయల ముద్దలో ముంచినట్టు ఉంటుందని" అన్నారు. ఆ శైలి ఆయనను సమస్యల్లోకి నెట్టి 1908లో బ్రిటీషర్లు అరెస్టు చేసేదాకా తెచ్చింది. జైలులోని స్థితిగతులు, వేధింపులతో క్రమంగా ఆయన ఆరోగ్యం పాడైంది.
తర్వాతి కాలంలో సుబ్రహ్మణ్య అయ్యర్ కు కుష్టు వ్యాధి సోకగా, 18 ఏప్రిల్ 1916న మరణించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఏసీబీకి చిక్కిన కాకతీయ యూనివర్సిటీ పీఎస్ ఎస్ఐ శ్రీకాంత్
హన్మకొండ జనవరి 08 (ప్రజా మంటలు):
కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ శ్రీకాంత్ ఏసీబీ అధికారుల వలకు చిక్కాడు. పేకాట కేసులో నిందితుడికి అనుకూలంగా వ్యవహరించేందుకు రూ.15 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తున్న సమయంలో హన్మకొండ ఏసీబీ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
పేకాట కేసును తేలిక చేయాలని... జేఎన్టీయూహెచ్ ఇంజినీరింగ్ కళాశాలలో 10000 Coders క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ విజయవంతం
జగిత్యాల | జనవరి 08 (ప్రజా మంటలు):
జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, జగిత్యాలలో బి.టెక్ విద్యార్థుల కోసం 10000 Coders ఆధ్వర్యంలో క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ను విజయవంతంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. జి. నరసింహ తెలిపారు.
ఈ క్యాంపస్ డ్రైవ్లో భాగంగా ముందుగా 10000 Coders సంస్థ హెచ్ఆర్ ప్రతినిధి పి.... ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కొత్త విద్యా విధానం : సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, జనవరి 08 (ప్రజా మంటలు):
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక విద్యా విధానాన్ని త్వరలో అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి రోహిత్ ఠాకూర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో... రోడ్డు భద్రత నియమాలు పాటించడం మనందరి భాద్యత * జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల జనవరి 8 ( ప్రజా మంటలు)
జిల్లాలో రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆధ్వర్యంలో“జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం – 2026” బైక్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు.
గురువారం జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం – 2026 బైక్ ర్యాలీని జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్... విద్యుత్ సమస్య ఎదురైన వెంటనే సంస్థ టోల్ ఫ్రీ నెంబర్ 1912 ను సంప్రదిస్తే త్వరతగతిన సమస్యని పరిష్కరిస్తాం ఏఈ. సంతోష్
జగిత్యాల జనవరి 8 ( ప్రజా మంటలు) విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో గురువారం స్థానిక తైసిల్ చౌరస్తాలో 'ప్రజా బాట' కార్యక్రమంలో భాగంగా విద్యుత్ వినియోగ దారులకు అవగాహన కల్పించారు. విద్యుత్ ప్రమాదాల నివారణపై ఏఈ సంతోష్, రాంజీ నాయక్ మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులు భద్రత నియమాలు పాటిస్తూ జాగ్రత్త వహించాలని, నాణ్యమైన విద్యుత్
వినియోగదారులకు... జర్నలిస్టులకు, న్యాయవాదులకు రక్షణ కరువు హై కోర్ట్ న్యాయవాది వి.రఘునాథ్
జగిత్యాల జనవరి 8 ( ప్రజా మంటలు)నేడు మన దేశంలో న్యాయం కోసం ఆరాటపడే జర్నలిస్టులకు, న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయిందని సీనియర్ హై కోర్టు న్యాయవాది వి.రఘునాథ్ అన్నారు. జగిత్యాలలో ఆయన గురువారం విలేఖరులతో మాట్లాడారు.
దేశంలో నాలుగవ స్తంభం జర్నలిస్ట్ లని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా న్యాయవాదులను, జర్నలిస్టులను... జాతీయ సదస్సులో పాల్గొన్న వెనుగుమట్ల ఉపాధ్యాయుడు
గొల్లపల్లి జనవరి 8 (ప్రజా మంటలు) నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇండియా భాగస్వామ్యంతో అకాడమీ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ (ఏఎస్టీసీ) అనే సంస్థ ‘ఈనాడు’తో కలిసి గురువారం హైదరాబాద్లో ‘శాస్త్ర విజ్ఞానాన్ని ప్రయోగశాల నుంచి సమాజంలోకి తీసుకెళ్లడంలో సమాచార పాత్ర - వికసిత్ భారత్-2047 నిర్మాణం’ అనే ఇతివృత్తంతో,మాజీ ఉపరాష్ట్రపతి
సైన్స్... మేడారం జాతరకు కేసీఆర్కు ఆహ్వానం
సిద్ధిపేట, జనవరి 08 (ప్రజా మంటలు):మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావును జాతరకు హాజరుకావాల్సిందిగా రాష్ట్ర మహిళా మంత్రులు ఆహ్వానించారు.
రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ మరియు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీ రాజ్, మహిళా మరియు శిశు సంక్షేమ... బ్రాహ్మణులపై దాడికి నిరసనగా డిజిపి కి బ్రాహ్మణ సంఘాల నాయకుల ఫిర్యాదు.
హైదరాబాద్ జనవరి 8 ( ప్రజా మంటలు)బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో గోదావరి హారతి అర్చకులుగా పనిచేస్తున్న బ్రహ్మశ్రీ దీక్షిత్ సాయి కళాధర్ శర్మ పై మూడు రోజుల క్రితం కొందరు దుండగులు పథకం ప్రకారం దారుణంగా దాడి చేశారు పరుష పదజాలంతో దూషిస్తూ చాలా ఘోరంగా పిడిగుద్దులతో దాడి చేశారు.
ఇటీవల... శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ఘనంగా విశ్వక్సేన ఇష్టి గణపతి అభిషేకం
జగిత్యాల జనవరి 8 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత మదన వేణుగోపాల స్వామి వారి ఆలయంలో శ్రీ ధనుర్మాస ఉత్సవ సందర్భంగా లోక కళ్యాణార్థమై భగవత్ భాగవత ఆచార్య అనుగ్రహ ప్రాప్తికై, గురు వారం 8 వ రోజు నవహనీక, ఏకకుండాత్మక, విశ్వ క్షేనఇష్టి మూలమంత్ర హవనం , గణపతి... భోలక్పూర్లో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పర్యటన
సికింద్రాబాద్, జనవరి 8 (ప్రజా మంటలు):
మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గురువారం భోలక్పూర్ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ అపార్ట్మెంట్లలో నివసిస్తున్న ప్రజలతో ఆయన ఆత్మీయంగా మమేకమై వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. స్థానికులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా, కేవలం పది నిమిషాల్లోనే ఒక యువతి... కవితపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదు: తెలంగాణ జాగృతి
హైదరాబాద్ జనవరి 08 (ప్రజా మంటలు)::
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై తీన్మార్ మల్లన్న తప్పుడు, అసత్య ప్రచారం చేస్తున్నాడని తెలంగాణ జాగృతి నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో జరిగిన ప్రెస్మీట్లో రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీకాంత్ గౌడ్, నాయకులు ఆనంద్, మాధవి మీడియాతో మాట్లాడారు.
అగ్గిపెట్టె... 