తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం 6 అబద్ధాలు.. 66 మోసాలు
అన్నదాత అరిగోశలు.. మోసపోయిన మహిళలు. ఉద్యోగుల గోసలు
తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
6 అబద్ధాలు.. 66 మోసాలు
అన్నదాత అరిగోశలు.. మోసపోయిన మహిళలు. ఉద్యోగుల గోసలు.
గొల్లపల్లి డిసెంబర్ 04 ప్రజా మంటలు
కాంగ్రెస్ సంవత్సర పాలనలో జగిత్యాల అభివృద్ధి ఏది అని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా"బోగ శ్రావణి ప్రశ్నించంది.
కాంగ్రెస్ ప్రభుత్వం నియంతృత్వ అప్రజాస్వామిక మోసపూరిత పాలనలో గోస పడుతున్న బాధితులకు భరోసానిచ్చేందుకు భారతీయ జనతా పార్టీ భరోసా కల్పించేందుకు బిజెపి రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు జగిత్యాల్ నియోజకవర్గంలో ప్రజావ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఆరు గ్యారంటీల అమలుపై చార్జిషీట్ ను బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా "బోగ శ్రావణి విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో ప్రజలను నమ్మించి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి ఏడాది పాలనను పూర్తి చేసుకుంది కానీ నమ్మి ఓటు వేసిన ప్రజల జీవితాల్లో మార్పు మాత్రం రాలేదు,
కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు గ్యారెంటీల గారడితో తెలంగాణ ప్రజలను అనేక రకాలుగా దగా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు విజయోత్సవాల పేరిట మరిన్ని అబద్ధాల ప్రచారానికి తెరలేపుతోంది. డిసెంబర్ 7న కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలపై భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల తరఫున విడుదల చేస్తున్న చార్షీట్.ఇది.
జగిత్యాల్ నియోజకవర్గం లో ప్రధాన సమస్య అయిన యావర్ రోడ్ మరియు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సమస్యలు ఇప్పటివరకు ముందుకు సాగని పరిస్థితి
జగిత్యాల్ నియోజకవర్గంలో ఒకరు 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మరొకరు జగిత్యాల అభివృద్ధి కోసమని కాంగ్రెస్ పార్టీలో దొంగ చాటున చేరారు కానీ అభివృద్ధి మాత్రం కాలేదు.
రైతులందరికీ రూ.2 లక్షల పంట రుణమాఫీ ఏకకాలంలో చేస్తామన్నారు కానీ అది కొంతమంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారు
ప్రతి ఏటా రైతు భరోసా కింద రైతులు కౌలురైతులకు ఎకరానికి ఇస్తామన్న రూ.15,000 ఇప్పటివరకు ఇవ్వకుండా మోసం చేసింది.
యువ వికాసం కింద విద్యార్థులకు ఇస్తామన్న రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు అనే అమలుకు నోచుకోలేదు.మరియు అదేవిధంగా నిరుద్యోగులకు నెలకు రూ. 4 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ఇప్పటివరకు ఇవ్వలేదు,
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతి నెల రూ. 2500 చొప్పున ఆర్థిక సాయం అందని ద్రాక్ష గానే మిగిలింది. మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం అమలు చేశామని ప్రగల్బాలు పలుకుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం బస్సులను తప్పించడంతో రద్దీ పెరిగి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు,
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం కావస్తున్న ఇంతవరకు ఏ ఒక్కరికి కొత్త పెన్షన్ మంజూరు కాలేదు,
ప్రతి ఆటో డ్రైవర్ కు సంవత్సరానికి 12000 ఆర్థిక సాయం అందిస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు ఇప్పటివరకు,
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు గడిచినా కూడా బీసీ డిక్లరేషన్ కానీ సబ్ ప్లాన్ కానీ అమలు చేయలేదు,
అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిన ఏ ఒక్క అర్హుడికి కూడా రేషన్ కార్డు అందరి పరిస్థితి
కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళల భద్రత ప్రమాదంలో పడింది మహిళలపై వేధింపుల కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి,
కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత పాలనతో తెలంగాణ రాష్ట్రం మరింత అప్పుల ఊగులోకి కూరుకుపోతుంది,
ఈ కార్యక్రమంలో జగిత్యాల్ పట్టణ అధ్యక్షులు రంగు గోపాల్, మండల అధ్యక్షులు నలువాల తిరుపతి,అడెపు నర్సయ్య, రామ్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శిలు ఆముదరాజు, సిరికొండ రాజన్న, జిల్లా కోశాధికారి సుంకేట దశరథ్ రెడ్డి, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సాంబారి కళావతి, జిల్లా అధికార ప్రతినిధి భూమి రమణ, మాజీ ఎంపీటీసీ ఆకుల మహేష్, పూజారి శ్రీనివాస్, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు దూరిశెట్టి మమత, టౌన్ ఇంచార్జ్ మ్యాదరి అశోక్, పవన్ సింగ్, గాదస్ రాజేందర్,సింగం పద్మ, దీటి వెంకటేష్, చెరుకు గంగారెడ్డి, మహేష్ యాదవ్, కందుకూరి లక్ష్మణ్, చిట్యాల రాము మరియు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గుజరాత్లో SIR పని ఒత్తిడితో నాలుగు రోజుల్లో నలుగురు BLO సిబ్బంది మృతి
వడోదరా / గుజరాత్, నవంబర్ 22 (ప్రజా మంటలు):
గుజరాత్లో Special Intensive Revision (SIR) కార్యక్రమం క్రమంలో Booth Level Officers (BLO) మరియు BLO అసిస్టెంట్లపై భారీ పని ఒత్తిడి నెలకొంది. ఈ ఒత్తిడిలోనే వడోదరాలో BLO అసిస్టెంట్ ఉషాబెన్ ఇంద్రసింగ్ సోలంకీ విధి నిర్వహణలో మృతి చెందారు. గత నాలుగు రోజుల్లో... అణు రంగంలో ప్రైవేట్ ప్రవేశానికి బిల్లు:: మరో 10 కీలక బిల్లులు సిద్ధం
న్యూ ఢిల్లీ, నవంబర్ 22 (ప్రజా మంటలు):
డిసెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే వింటర్ సెషన్లో కేంద్ర ప్రభుత్వం మొత్తం 10 కీలక బిల్లులను ప్రవేశపెట్టబోతోంది. వీటిలో దేశంలోని సివిల్ న్యూక్లియర్ రంగాన్ని ప్రైవేట్ కంపెనీలకు తెరవడాన్ని ప్రతిపాదించే బిల్లు ప్రధానంగా నిలుస్తోంది.
అదేవిధంగా, చండీగఢ్పై రాష్ట్రపతికి నేరుగా చట్టాలు, నిబంధనలు రూపొందించే అధికారం... అందెశ్రీ కీర్తి తెలంగాణ చరిత్రలో శాశ్వతం:రేవంత్ రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 22 (ప్రజా మంటలు):
తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన కవులు, కళాకారులలో అందెశ్రీ పేరు ఎన్నటికీ చెరిగిపోదని, రాష్ట్ర చరిత్రలో ఆయన స్థానం శాశ్వతమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రవీంద్రభారతిలో జరిగిన అందెశ్రీ స్మారక సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,వజ్రాలపై దశాబ్దాలు చర్చించినా కోహినూర్కు పోటీ లేకపోయినట్టే,... జగిత్యాల జిల్లా నూతన డీసీసీ అధ్యక్షునికి ఆత్మీయ సన్మానం
జగిత్యాల, నవంబర్ 22 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రకటించిన జిల్లా కమిటీ అధ్యక్షుల్లో భాగంగా జగిత్యాల జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా, మాజీ మంత్రి వర్గీయుడైన, గాజంగి నందయ్య నియమితులయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఇందిరా భవన్లో నందయ్యను ఘనంగా సన్మానించారు.... తెలంగాణ జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ప్రకటన
హైదరాబాద్ నవంబర్ 22 (ప్రజా మంటలు):
తెలంగాణలో డీసీసీ అధ్యక్షులను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రకటించింది. మొత్తం 36 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించింది.డీసీసీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సగానికి పైగా కేటాయించింది.
ఇక్కడ తెలంగాణ కొత్తగా ప్రకటించిన DCC అధ్యక్షుల జాబితా ను సులభంగా చదవగల టేబుల్ ఫార్మాట్లో అందిస్తున్నాను:
తెలంగాణ – జిల్లావారీ... ఇయ్యాల సికింద్రాబాద్ లో భారీ యూనిటీ మార్చ్ ర్యాలీ
సికింద్రాబాద్, నవంబర్ 22 (ప్రజామంటలు) :
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతిని పురస్కరించుకొని సికింద్రాబాద్ లో నేడు ఆదివారం ఉదయం భారీ యూనిటీ మార్చ్ ర్యాలీ నిర్వహించనున్నారు. శనివారం సీతాఫల్మండిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశలో బీజేపీ నాయకులు, జిల్లా యువజన శాఖ అధికారులు వివరాలు వెల్లడించారు.
ఉదయం 10 గంటలకు సీతాఫల్మండి... బీపీ పెరగడంతో నరాలు చిట్లి యువకుడు మృతి
ఇబ్రహీంపట్నం నవంబర్ 22 (ప్రజ మంటలు దగ్గుల అశోక్)
జగిత్యాలజిల్లా ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్ గ్రామానికి చెందిన చెని ప్రసాద్(38) s/o చెని చిన్న దేవయ్య కుమారుడు బీపీతో మెదడు లో నరాలు చితికి పోవడంతో గత నాలుగు రోజుల క్రితం నిజామాబాద్ ప్రైవేటు ఆసుపత్రిలో లో చేర్పించారు.ఎలాంటి ట్రీట్మెంట్ కి స్పందించకపోవడంతో నిన్న రాత్రి... గౌహతి టెస్ట్: దక్షిణాఫ్రికా తొలి రోజు 247 పరుగులు
గౌహతి నవంబర్ 22:
భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది.
ఓపెనర్లు ఐడెన్ మార్క్రామ్ మరియు రియాన్ రికల్డన్ జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు.
మార్క్రామ్ 38 పరుగులకు, రికల్డన్ 35 పరుగులకు... అమీర్పేట్లో రూ.25 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ హర్షం..
సికింద్రాబాద్, నవంబర్ 22 (ప్రజామంటలు):
అమీర్పేట్ డివిజన్లో రూ.25 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు రక్షించారని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ తెలిపారు. పార్కు కోసం దశాబ్దాల క్రితం కేటాయించిన 1500 గజాల స్థలాన్ని... కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో వెజిటేబుల్ డే సెలబ్రేషన్స్
సికింద్రాబాద్, నవంబర్ 22 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ భోలక్ పూర్ లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో శనివారం వెజిటేబుల్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. నర్సరీ,ఎల్ కేజీ, యూకేజీ చిన్నారి విద్యార్థులకు ఈ సందర్బంగా వెజిటేబుల్స్ ప్రాముఖ్యత గురించి వివరించారు.
దైనిందిన ఆహారంలో కూరగాయలను ఖచ్చితంగా తినాలని, వాటి వలన ఆరోగ్యం బాగుంటుందని, వెజిటేబుల్స్ లోని... కోరుట్ల తాళ్ళచెరువు ఫిల్టర్ బెడ్ పరిశీలించిన అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ )బి రాజా గౌడ్
కోరుట్ల నవంబర్ 22(ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా కోరుట్ల మండల కేంద్రంలోని తాళ్లచెరువు ఫిల్టర్ బెడ్ ను శనివారం పరిశీలించిన అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) బి.రాజ గౌడ్
పట్టణం లోని పట్టణ ప్రజలకు సకాలంలో నీరు అందించాలి. ఫిల్టర్ బెడ్ ను మరియు నీరు యొక్క స్వచ్ఛతను ఎప్పటికప్పుడు పరిశీలించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు.... కోటీ రూపాయల భూమిని ₹16 లక్షలకు ఇచ్చేది లేదంటూ ఆగ్రహించిన రైతులు
సంగారెడ్డి నవంబర్ 22,(ప్రజా మంటలు):సంగారెడ్డి జిల్లాలోని చౌటకూర్ మండలం శివ్వంపేట గ్రామంలో మంగళవారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ట్రిపుల్ ఆర్ రోడ్ ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణ నోటీసులు అందజేయడానికి వచ్చిన అధికారులను రైతులు పంచాయతీ కార్యాలయంలో బంధించారు.
భూసేకరణ నోటీసులు అందించడానికి వచ్చిన అధికారులు
ట్రిపుల్ ఆర్ రోడ్ నిర్మాణం కోసం ఎకరాకు... 