తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం 6 అబద్ధాలు.. 66 మోసాలు

అన్నదాత అరిగోశలు.. మోసపోయిన మహిళలు. ఉద్యోగుల గోసలు

On
తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం 6 అబద్ధాలు.. 66 మోసాలు

తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
6 అబద్ధాలు.. 66 మోసాలు

అన్నదాత అరిగోశలు.. మోసపోయిన మహిళలు. ఉద్యోగుల గోసలు.

గొల్లపల్లి డిసెంబర్ 04 ప్రజా మంటలు

కాంగ్రెస్ సంవత్సర పాలనలో జగిత్యాల అభివృద్ధి ఏది అని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా"బోగ శ్రావణి ప్రశ్నించంది.

కాంగ్రెస్ ప్రభుత్వం నియంతృత్వ అప్రజాస్వామిక మోసపూరిత పాలనలో గోస పడుతున్న బాధితులకు భరోసానిచ్చేందుకు భారతీయ జనతా పార్టీ భరోసా కల్పించేందుకు బిజెపి రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు జగిత్యాల్ నియోజకవర్గంలో ప్రజావ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఆరు గ్యారంటీల అమలుపై చార్జిషీట్ ను బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల  నియోజకవర్గం ఇంచార్జ్ డా "బోగ శ్రావణి విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో ప్రజలను నమ్మించి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి ఏడాది పాలనను పూర్తి చేసుకుంది కానీ నమ్మి ఓటు వేసిన ప్రజల జీవితాల్లో మార్పు మాత్రం రాలేదు,
కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు గ్యారెంటీల గారడితో తెలంగాణ ప్రజలను అనేక రకాలుగా దగా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు విజయోత్సవాల పేరిట మరిన్ని అబద్ధాల ప్రచారానికి తెరలేపుతోంది. డిసెంబర్ 7న కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలపై భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల తరఫున విడుదల చేస్తున్న చార్షీట్.ఇది.IMG-20241204-WA0554
జగిత్యాల్ నియోజకవర్గం లో ప్రధాన సమస్య అయిన యావర్ రోడ్ మరియు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సమస్యలు ఇప్పటివరకు ముందుకు సాగని పరిస్థితి
జగిత్యాల్ నియోజకవర్గంలో ఒకరు 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మరొకరు జగిత్యాల అభివృద్ధి కోసమని కాంగ్రెస్ పార్టీలో దొంగ చాటున చేరారు కానీ అభివృద్ధి మాత్రం కాలేదు.
రైతులందరికీ రూ.2 లక్షల పంట రుణమాఫీ ఏకకాలంలో చేస్తామన్నారు కానీ అది కొంతమంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారు
ప్రతి ఏటా రైతు భరోసా కింద రైతులు కౌలురైతులకు ఎకరానికి ఇస్తామన్న రూ.15,000 ఇప్పటివరకు ఇవ్వకుండా మోసం చేసింది.
యువ వికాసం కింద విద్యార్థులకు ఇస్తామన్న రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు అనే అమలుకు నోచుకోలేదు.మరియు అదేవిధంగా నిరుద్యోగులకు నెలకు రూ. 4 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ఇప్పటివరకు ఇవ్వలేదు,
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతి నెల రూ. 2500 చొప్పున ఆర్థిక సాయం అందని ద్రాక్ష గానే మిగిలింది. మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం అమలు చేశామని ప్రగల్బాలు పలుకుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం బస్సులను తప్పించడంతో రద్దీ పెరిగి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు,
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం కావస్తున్న ఇంతవరకు ఏ ఒక్కరికి కొత్త పెన్షన్ మంజూరు కాలేదు,
ప్రతి ఆటో డ్రైవర్ కు సంవత్సరానికి 12000 ఆర్థిక సాయం అందిస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు ఇప్పటివరకు,
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు గడిచినా కూడా బీసీ డిక్లరేషన్ కానీ సబ్ ప్లాన్ కానీ అమలు చేయలేదు,
అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిన ఏ ఒక్క అర్హుడికి కూడా రేషన్ కార్డు అందరి పరిస్థితి
కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళల భద్రత ప్రమాదంలో పడింది మహిళలపై వేధింపుల కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి,
కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత పాలనతో తెలంగాణ రాష్ట్రం మరింత అప్పుల ఊగులోకి కూరుకుపోతుంది,
ఈ కార్యక్రమంలో జగిత్యాల్ పట్టణ అధ్యక్షులు రంగు గోపాల్, మండల అధ్యక్షులు నలువాల తిరుపతి,అడెపు నర్సయ్య, రామ్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శిలు ఆముదరాజు, సిరికొండ రాజన్న, జిల్లా కోశాధికారి సుంకేట దశరథ్ రెడ్డి, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సాంబారి కళావతి, జిల్లా అధికార ప్రతినిధి భూమి రమణ, మాజీ ఎంపీటీసీ ఆకుల మహేష్, పూజారి శ్రీనివాస్, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు దూరిశెట్టి మమత, టౌన్ ఇంచార్జ్ మ్యాదరి అశోక్, పవన్ సింగ్, గాదస్ రాజేందర్,సింగం పద్మ, దీటి వెంకటేష్, చెరుకు గంగారెడ్డి, మహేష్ యాదవ్, కందుకూరి లక్ష్మణ్, చిట్యాల రాము మరియు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

సిజేరియన్ ప్రసవాలను తగ్గించి సాధారణ ప్రసవాలను పెంచాలి

సిజేరియన్ ప్రసవాలను తగ్గించి సాధారణ ప్రసవాలను పెంచాలి    జగిత్యాల టౌన్, ఆగస్టు 24 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లాలో సిజేరియన్ ప్రసవాల సంఖ్య అధికంగా ఉన్న నేపథ్యంలో వాటిని తగ్గించి సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ముస్కు జైపాల్ రెడ్డి సూచించారు. జగిత్యాలలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో జిల్లాలోని గైనకాలజిస్టులతో ప్రసూతి సేవలు, సిజేరియన్ సెక్షన్ ఆడిట్‌పై సమీక్షా సమావేశం...
Read More...
Local News  Crime  State News 

వృద్ధ మహిళకు ప్రాణభయం.. ఆస్తి, ఇన్సూరెన్స్ కోసం వేధింపులు -ప్రజావాణిలో ఫిర్యాదు 

వృద్ధ మహిళకు ప్రాణభయం.. ఆస్తి, ఇన్సూరెన్స్ కోసం వేధింపులు -ప్రజావాణిలో ఫిర్యాదు  జగిత్యాల, ఆగస్టు 24 (ప్రజా మంటలు): తన చిన్న కుమారుడి మరణానంతరం ఆస్తి, ఇన్సూరెన్స్ హక్కులను వదులుకోవాలని ఒత్తిడి చేస్తూ కోడలు, ఆమె తల్లిదండ్రులు తనను వేధిస్తున్నారని ధర్మపురికి చెందిన వృద్ధ మహిళ దహగం దత్తప్రియ ప్రజావాణిలో ఫిర్యాదులో  ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉందని, ముందస్తు పోలీసు రక్షణ కల్పించాలని ఆమె అధికారులను కోరారు.తన...
Read More...
State News 

సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన

సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన    హైదరాబాద్, ఆగస్టు 24 (ప్రజా మంటలు): తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధులకు వెల్లడించారు. బ్రిటన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన సీఎం సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో...
Read More...
State News 

గురుకులాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం నిర్లక్ష్యం- కొప్పుల

గురుకులాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం నిర్లక్ష్యం- కొప్పుల జగిత్యాల, ఆగస్టు 24 (ప్రజా మంటలు): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అందించిన విద్యా అవకాశాలను ప్రస్తుత ప్రభుత్వం దెబ్బతీస్తోందని విమర్శించారు. సోమవారం...
Read More...
Crime  State News 

బైపాస్ రోడ్డుపై బయోమెడికల్ వ్యర్థాలు.. మున్సిపల్ హెచ్చరిక బోర్డు కళ్లముందే నిర్లక్ష్యం

బైపాస్ రోడ్డుపై బయోమెడికల్ వ్యర్థాలు.. మున్సిపల్ హెచ్చరిక బోర్డు కళ్లముందే నిర్లక్ష్యం జగిత్యాల, ఆగస్టు 24 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలో హాస్పిటల్ వ్యర్థాల నిర్వహణపై నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. బైపాస్ రోడ్డులోని మోతె డౌన్ చౌరస్తా వద్ద కెనాల్‌పై ‘బయో హజార్డ్’, ‘ఇన్ఫెక్షియస్’ అని ముద్రించిన హాస్పిటల్ వ్యర్థాలను గుర్తుతెలియని వ్యక్తులు పడేసి వెళ్లారు. ఈ ప్రాంతంలో చెత్త వేస్తే రూ.5 వేల జరిమానా విధిస్తామని...
Read More...
Local News 

నేటి అర్ధరాత్రి నుండి ఆటోల బంద్ _ప్రజలు సహకరించాలి 

నేటి అర్ధరాత్రి నుండి ఆటోల బంద్ _ప్రజలు సహకరించాలి  జగిత్యాల ఆగస్ట్ 23 (ప్రజా మంటలు) సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 9348422113 నేటి అర్ధరాత్రి నుండి జగిత్యాల జిల్లా స్థాయిలో రాష్ట్ర పిలుపుమేరకు ఆటోలు బంద్ నిర్వహిస్తున్నట్లు ఆటో డ్రైవర్లు తెలిపారు. విధి లేని పరిస్థితుల్లోనే తాము బందుకు శ్రీకారం చుట్టామని ప్రజలు తమ పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించాలన్నారు.      రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో...
Read More...
Crime  State News 

మహిళా ఉద్యోగి ఆరోపణలన్నీ ఆవాస్తవం -   ది మనోహార్ హోటల్ చైర్మన్ డీవీ మనోహర్  వెల్లడి..

మహిళా ఉద్యోగి ఆరోపణలన్నీ ఆవాస్తవం -   ది మనోహార్ హోటల్ చైర్మన్ డీవీ మనోహర్  వెల్లడి.. సికింద్రాబాద్,ఆగస్ట్ 22 (ప్రజామంటలు): తమ సంస్థలో ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ కమ్ గెస్ట్ రిలేషన్స్ మేనేజర్‌గా పనిచేసిన కొరపు లావణ్య చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవమని, తీవ్ర నిరాధారమైనవని హోటల్ 'ది మనోహర్' చైర్మన్ డీవీ మనోహర్ స్పష్టం చేశారు. శనివారం బేగంపేటలోని హోటల్ 'ది మనోహర్'లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లావణ్య...
Read More...
State News 

యాదవులను కురుమ కులంలో కలపవద్దు

యాదవులను కురుమ కులంలో కలపవద్దు సికింద్రాబాద్,ఆగస్ట్ 22 (ప్రజామంటలు): యాదవ సామాజిక వర్గాన్ని కురుమ కులంలో కలపడానికి కుట్రలు జరుగుతున్నాయని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం, కురుమ జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్, సభ్యులు ఆర్. జయప్రకాష్, టి. సుదర్శన్‌లను కలిసి...
Read More...
National  State News 

జర్నలిస్టులపై ఇక అక్రమ కేసులు చెల్లవా? వైరల్ మెసేజ్‌లో నిజమెంత?

జర్నలిస్టులపై ఇక అక్రమ కేసులు చెల్లవా? వైరల్ మెసేజ్‌లో నిజమెంత? న్యూఢిల్లీ, ఆగస్టు 22 (ప్రజా మంటలు): దేశవ్యాప్తంగా జర్నలిస్టులకు సుప్రీంకోర్టు భారీ ఊరటనిచ్చిందంటూ సోషల్ మీడియా, వాట్సాప్‌లో వైరల్ అవుతున్న ఓ సందేశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. “పెన్నుతో వార్తలు రాసే జర్నలిస్టులు, వీడియో కెమెరాలతో వార్తలను కవర్ చేసే రిపోర్టర్లు, శాటిలైట్ న్యూస్ చానళ్లు, యూట్యూబ్ న్యూస్ ఛానళ్లు, ప్రింట్ మీడియా సంస్థల్లో పనిచేసే...
Read More...
Local News 

ఘనంగా కుంకుమార్చనలు, విశేష సంఖ్యలో పాల్గొన్న మహిళలు

ఘనంగా కుంకుమార్చనలు, విశేష సంఖ్యలో పాల్గొన్న మహిళలు   జగిత్యాల ఆగస్టు 21 (ప్రజా మంటలు)పవిత్ర శ్రావణమాసాన్ని పురస్కరించుకొని శ్రీ వరలక్ష్మి వ్రతం సందర్భంగా జిల్లా కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో శుక్రవారం సాయంత్రం నంబి వేణుగోపాల ఆచార్య ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పూజా ద్రవ్యాలు ఆలయం పక్షాన అందజేశారు . కార్యక్రమం అనంతరం తీర్థ...
Read More...
Local News  State News 

అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు -  మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు  -  మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి    రూ.32 కోట్లతో నూకలపల్లి 2బీహెచ్‌కే కాలనీకి మౌలిక వసతుల కల్పన రేషన్ దుకాణం, బస్సు సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్‌కు మంత్రి ఆదేశాలు భూ రీ సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం   - ఏడాదిన్నరలో రీ - సర్వే పూర్తి    ధర్మపురికి రెవెన్యూ డివిజన్, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేయాలి -  మంత్రి అడ్లూరి...
Read More...
Local News  Crime 

ఎల్కతుర్తిలో కారులో అనుమానాస్పద మృతదేహం కలకలం

ఎల్కతుర్తిలో కారులో అనుమానాస్పద మృతదేహం కలకలం    ఎల్కతుర్తి, ఆగస్టు 21 (ప్రజా మంటలు): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని 12వ వార్డులో కారులో అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభ్యమవడంతో స్థానికంగా కలకలం రేగింది. రెండు రోజులుగా రోడ్డుపక్కన పార్క్ చేసి ఉన్న కారులో నుంచి శుక్రవారం దుర్వాసన రావడంతో బాటసారులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎల్కతుర్తి పోలీసులు...
Read More...