తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం 6 అబద్ధాలు.. 66 మోసాలు
అన్నదాత అరిగోశలు.. మోసపోయిన మహిళలు. ఉద్యోగుల గోసలు
తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
6 అబద్ధాలు.. 66 మోసాలు
అన్నదాత అరిగోశలు.. మోసపోయిన మహిళలు. ఉద్యోగుల గోసలు.
గొల్లపల్లి డిసెంబర్ 04 ప్రజా మంటలు
కాంగ్రెస్ సంవత్సర పాలనలో జగిత్యాల అభివృద్ధి ఏది అని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా"బోగ శ్రావణి ప్రశ్నించంది.
కాంగ్రెస్ ప్రభుత్వం నియంతృత్వ అప్రజాస్వామిక మోసపూరిత పాలనలో గోస పడుతున్న బాధితులకు భరోసానిచ్చేందుకు భారతీయ జనతా పార్టీ భరోసా కల్పించేందుకు బిజెపి రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు జగిత్యాల్ నియోజకవర్గంలో ప్రజావ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఆరు గ్యారంటీల అమలుపై చార్జిషీట్ ను బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా "బోగ శ్రావణి విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో ప్రజలను నమ్మించి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి ఏడాది పాలనను పూర్తి చేసుకుంది కానీ నమ్మి ఓటు వేసిన ప్రజల జీవితాల్లో మార్పు మాత్రం రాలేదు,
కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు గ్యారెంటీల గారడితో తెలంగాణ ప్రజలను అనేక రకాలుగా దగా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు విజయోత్సవాల పేరిట మరిన్ని అబద్ధాల ప్రచారానికి తెరలేపుతోంది. డిసెంబర్ 7న కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలపై భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల తరఫున విడుదల చేస్తున్న చార్షీట్.ఇది.
జగిత్యాల్ నియోజకవర్గం లో ప్రధాన సమస్య అయిన యావర్ రోడ్ మరియు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సమస్యలు ఇప్పటివరకు ముందుకు సాగని పరిస్థితి
జగిత్యాల్ నియోజకవర్గంలో ఒకరు 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మరొకరు జగిత్యాల అభివృద్ధి కోసమని కాంగ్రెస్ పార్టీలో దొంగ చాటున చేరారు కానీ అభివృద్ధి మాత్రం కాలేదు.
రైతులందరికీ రూ.2 లక్షల పంట రుణమాఫీ ఏకకాలంలో చేస్తామన్నారు కానీ అది కొంతమంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారు
ప్రతి ఏటా రైతు భరోసా కింద రైతులు కౌలురైతులకు ఎకరానికి ఇస్తామన్న రూ.15,000 ఇప్పటివరకు ఇవ్వకుండా మోసం చేసింది.
యువ వికాసం కింద విద్యార్థులకు ఇస్తామన్న రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు అనే అమలుకు నోచుకోలేదు.మరియు అదేవిధంగా నిరుద్యోగులకు నెలకు రూ. 4 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ఇప్పటివరకు ఇవ్వలేదు,
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతి నెల రూ. 2500 చొప్పున ఆర్థిక సాయం అందని ద్రాక్ష గానే మిగిలింది. మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం అమలు చేశామని ప్రగల్బాలు పలుకుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం బస్సులను తప్పించడంతో రద్దీ పెరిగి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు,
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం కావస్తున్న ఇంతవరకు ఏ ఒక్కరికి కొత్త పెన్షన్ మంజూరు కాలేదు,
ప్రతి ఆటో డ్రైవర్ కు సంవత్సరానికి 12000 ఆర్థిక సాయం అందిస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు ఇప్పటివరకు,
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు గడిచినా కూడా బీసీ డిక్లరేషన్ కానీ సబ్ ప్లాన్ కానీ అమలు చేయలేదు,
అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిన ఏ ఒక్క అర్హుడికి కూడా రేషన్ కార్డు అందరి పరిస్థితి
కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళల భద్రత ప్రమాదంలో పడింది మహిళలపై వేధింపుల కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి,
కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత పాలనతో తెలంగాణ రాష్ట్రం మరింత అప్పుల ఊగులోకి కూరుకుపోతుంది,
ఈ కార్యక్రమంలో జగిత్యాల్ పట్టణ అధ్యక్షులు రంగు గోపాల్, మండల అధ్యక్షులు నలువాల తిరుపతి,అడెపు నర్సయ్య, రామ్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శిలు ఆముదరాజు, సిరికొండ రాజన్న, జిల్లా కోశాధికారి సుంకేట దశరథ్ రెడ్డి, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సాంబారి కళావతి, జిల్లా అధికార ప్రతినిధి భూమి రమణ, మాజీ ఎంపీటీసీ ఆకుల మహేష్, పూజారి శ్రీనివాస్, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు దూరిశెట్టి మమత, టౌన్ ఇంచార్జ్ మ్యాదరి అశోక్, పవన్ సింగ్, గాదస్ రాజేందర్,సింగం పద్మ, దీటి వెంకటేష్, చెరుకు గంగారెడ్డి, మహేష్ యాదవ్, కందుకూరి లక్ష్మణ్, చిట్యాల రాము మరియు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పకడ్బందీగా ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ బుధవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల ఫిబ్రవరి 25 ( ప్రజా మంటలు)ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా బుధవారం జగిత్యాల ఎస్.కె.ఎన్.ఆర్ (బాలుర) జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ పరిశీలించారు.
పరీక్షా కేంద్రంలో నిర్వహణ విధానం, ప్రశ్నపత్రాల భద్రత, హాల్ టికెట్ల పరిశీలన ప్రక్రియలను ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ పరిశీలించారు.... ఇంటర్ మరియు పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి_ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
జగిత్యాల ఫిబ్రవరి 24 (ప్రజా మంటలు)పరీక్షా కేంద్రాలకు 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి
ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పారా మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండాలి
పరీక్షా సమయానుకూలంగా ఆర్టీసీ బస్సులు నడపాలి
ఇంటర్ మరియు పదవ తరగతి పరీక్షల నిర్వహణ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి... గడ్డి మందు వినియోగంలో రైతుల ఆలోచనలో మార్పు రావాలి డా ఏం.మహేశ్ రెడ్డి
జగిత్యాల రూరల్ ఫిబ్రవరి 24 ( ప్రజా మంటలు)పారాక్వాట్ గడ్డి మందు పూర్తిగా నిశేదించాలి దీని వినియోగంలో రైతుల్లో మార్పు రావాలని వైద్యులు మర్రి మహేష్ రెడ్డి అన్నారు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మిపురం గ్రామంలో డా,,మర్రి మహేష్ రెడ్డి ఆద్వర్యంలో పారాక్వాట్ గడ్డి మందు మరియు ఉచిత వైద్య శిబిరం మంగళవారం నిర్వహించబడింది.... ఎమ్మెల్యే ,పలువురు మంత్రులతో సీఎం ను కలిసిన మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి
జగిత్యాల ఫిబ్రవరి 24 ( ప్రజా మంటలు)జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ గా నూతనంగా ఎన్నికైన సమిండ్ల వాణీ శ్రీనివాస్ జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మన్ కుమార్ తో కలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి ని,రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ఈ... బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావును మర్యాదపూర్వకంగా కలిసిన జగిత్యాల రాయికల్ బిజెపి కౌన్సిలర్ లు
హైదరాబాద్ ఫిబ్రవరి 23 (ప్రజా మంటలు)మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన జగిత్యాల్ నియోజకవర్గ జగిత్యాల మరియు రాయికల్ పట్టణ కౌన్సిలర్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావు ని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా. బోగ శ్రావణి తో కలిసి హైదరాబాద్ లో... ఎంపీ అరవిందును డా బోగ శ్రావణి తో కలిసిన జగిత్యాల రాయికల్ బిజెపి కౌన్సిలర్లు
హైదరాబాద్ ఫిబ్రవరి 23 (ప్రజా మంటలు)మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన జగిత్యాల్ నియోజకవర్గ జగిత్యాల మరియు రాయికల్ పట్టణ కౌన్సిలర్లు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా .భోగ శ్రావణి తో కలిసి హైదరాబాద్ లో వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో... గ్రీవెన్స్ డే సందర్భంగా పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం
జగిత్యాల ఫిబ్రవరి 23 (ప్రజా మంటలు)
ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 14 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు... ఓ సి(అగ్రవర్ణాల) రిజర్వేషన్ల అమలుకు డిమాండ్ 10 శాతం రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో అమలు చేయాలి : పొలాడి రామారావు.
న్యూ ఢిల్లీ ఫిబ్రవరి 23(ప్రజా మంటలు)
దేశంలో ఇతర కులాలు (ఓ సి– అధర్ క్యాస్ట్ / అగ్రవర్ణాలు) ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక అన్యాయాలను ప్రభుత్వం గుర్తించి న్యాయం చేయాలని ఓసి సామాజిక సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఓసీ సంక్షేమ సంఘాల ఐక్యవేదిక,న్యూఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద సోమవారం మహా ధర్నా... టిఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షునికి వివాహ వార్షికోత్సవ శుభకాంక్షలు తెలిపిన జగిత్యాల టిఎన్జిఓలు
కరీంనగర్ ఫిబ్రవరి 22 ( ప్రజా మంటలు)సన్మానించిన జిల్లా అధ్యక్షులు నాగేందర్ రెడ్డి. కరీంనగర్ లో ఉద్యోగ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మరియు టిఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ వివాహ వార్షికోత్సవం సందర్బంగా జగిత్యాల టిఎన్జిఓ జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి మరియు జిల్లా కార్యదర్శి ఊకంటి అమరేందర్ రెడ్డి అధ్వర్యంలో... దేవాదుల భూసేకరణకు జూన్ 2లోపు ₹600 కోట్లు –రేవంత్ రెడ్డి
ములుగు జిల్లా (ప్రజా మంటలు):ములుగు జిల్లాలోని జె. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం (JCRDLIS)లో భాగంగా భూసేకరణ కోసం జూన్ 2వ తేదీలోపు ₹600 కోట్ల నిధులు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి A. రేవంత్ రెడ్డి ప్రకటించారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లోపు అన్ని అంచనాలను ప్రభుత్వ ఆమోదానికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. దేవాదుల పంప్... మల్యాల వరద కాలువలో కారు పడి తిర్మణి రమణ మృతి – పెగడపల్లిలో విషాదం
జగిత్యాల జిల్లా (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పెగడపల్లి మండలం సుద్ధపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, మాజీ సింగిల్ విండో వైస్ చైర్మన్ తిర్మణి రమణ మల్యాల వరద కాలువలో కారుతో సహా మృతిచెందిన స్థితిలో కనిపించారు.
స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... భీమ్రాజుపల్లి ఉపసర్పంచ్ భర్తను పరామర్శించిన మంత్రి సతీమణి కాంతా కుమారి
గొల్లపల్లి, ఫిబ్రవరి 22 (ప్రజా మంటలు):గొల్లపల్లి మండలంలోని భీమ్రాజుపల్లి గ్రామ ఉపసర్పంచ్ బొమ్మెన రాజమ్మ భర్త బొమ్మన భీమయ్య అనారోగ్యానికి గురికావడంతో, విషయం తెలుసుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంత కుమారి కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా కాంతా కుమారి భీమయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ఆర్థిక సాయం అందించారు.... 