తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం 6 అబద్ధాలు.. 66 మోసాలు
అన్నదాత అరిగోశలు.. మోసపోయిన మహిళలు. ఉద్యోగుల గోసలు
తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
6 అబద్ధాలు.. 66 మోసాలు
అన్నదాత అరిగోశలు.. మోసపోయిన మహిళలు. ఉద్యోగుల గోసలు.
గొల్లపల్లి డిసెంబర్ 04 ప్రజా మంటలు
కాంగ్రెస్ సంవత్సర పాలనలో జగిత్యాల అభివృద్ధి ఏది అని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా"బోగ శ్రావణి ప్రశ్నించంది.
కాంగ్రెస్ ప్రభుత్వం నియంతృత్వ అప్రజాస్వామిక మోసపూరిత పాలనలో గోస పడుతున్న బాధితులకు భరోసానిచ్చేందుకు భారతీయ జనతా పార్టీ భరోసా కల్పించేందుకు బిజెపి రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు జగిత్యాల్ నియోజకవర్గంలో ప్రజావ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఆరు గ్యారంటీల అమలుపై చార్జిషీట్ ను బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా "బోగ శ్రావణి విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో ప్రజలను నమ్మించి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి ఏడాది పాలనను పూర్తి చేసుకుంది కానీ నమ్మి ఓటు వేసిన ప్రజల జీవితాల్లో మార్పు మాత్రం రాలేదు,
కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు గ్యారెంటీల గారడితో తెలంగాణ ప్రజలను అనేక రకాలుగా దగా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు విజయోత్సవాల పేరిట మరిన్ని అబద్ధాల ప్రచారానికి తెరలేపుతోంది. డిసెంబర్ 7న కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలపై భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల తరఫున విడుదల చేస్తున్న చార్షీట్.ఇది.
జగిత్యాల్ నియోజకవర్గం లో ప్రధాన సమస్య అయిన యావర్ రోడ్ మరియు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సమస్యలు ఇప్పటివరకు ముందుకు సాగని పరిస్థితి
జగిత్యాల్ నియోజకవర్గంలో ఒకరు 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మరొకరు జగిత్యాల అభివృద్ధి కోసమని కాంగ్రెస్ పార్టీలో దొంగ చాటున చేరారు కానీ అభివృద్ధి మాత్రం కాలేదు.
రైతులందరికీ రూ.2 లక్షల పంట రుణమాఫీ ఏకకాలంలో చేస్తామన్నారు కానీ అది కొంతమంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారు
ప్రతి ఏటా రైతు భరోసా కింద రైతులు కౌలురైతులకు ఎకరానికి ఇస్తామన్న రూ.15,000 ఇప్పటివరకు ఇవ్వకుండా మోసం చేసింది.
యువ వికాసం కింద విద్యార్థులకు ఇస్తామన్న రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు అనే అమలుకు నోచుకోలేదు.మరియు అదేవిధంగా నిరుద్యోగులకు నెలకు రూ. 4 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ఇప్పటివరకు ఇవ్వలేదు,
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతి నెల రూ. 2500 చొప్పున ఆర్థిక సాయం అందని ద్రాక్ష గానే మిగిలింది. మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం అమలు చేశామని ప్రగల్బాలు పలుకుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం బస్సులను తప్పించడంతో రద్దీ పెరిగి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు,
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం కావస్తున్న ఇంతవరకు ఏ ఒక్కరికి కొత్త పెన్షన్ మంజూరు కాలేదు,
ప్రతి ఆటో డ్రైవర్ కు సంవత్సరానికి 12000 ఆర్థిక సాయం అందిస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు ఇప్పటివరకు,
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు గడిచినా కూడా బీసీ డిక్లరేషన్ కానీ సబ్ ప్లాన్ కానీ అమలు చేయలేదు,
అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిన ఏ ఒక్క అర్హుడికి కూడా రేషన్ కార్డు అందరి పరిస్థితి
కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళల భద్రత ప్రమాదంలో పడింది మహిళలపై వేధింపుల కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి,
కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత పాలనతో తెలంగాణ రాష్ట్రం మరింత అప్పుల ఊగులోకి కూరుకుపోతుంది,
ఈ కార్యక్రమంలో జగిత్యాల్ పట్టణ అధ్యక్షులు రంగు గోపాల్, మండల అధ్యక్షులు నలువాల తిరుపతి,అడెపు నర్సయ్య, రామ్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శిలు ఆముదరాజు, సిరికొండ రాజన్న, జిల్లా కోశాధికారి సుంకేట దశరథ్ రెడ్డి, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సాంబారి కళావతి, జిల్లా అధికార ప్రతినిధి భూమి రమణ, మాజీ ఎంపీటీసీ ఆకుల మహేష్, పూజారి శ్రీనివాస్, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు దూరిశెట్టి మమత, టౌన్ ఇంచార్జ్ మ్యాదరి అశోక్, పవన్ సింగ్, గాదస్ రాజేందర్,సింగం పద్మ, దీటి వెంకటేష్, చెరుకు గంగారెడ్డి, మహేష్ యాదవ్, కందుకూరి లక్ష్మణ్, చిట్యాల రాము మరియు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
2 లక్షల ఉద్యోగాలు, 20 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి కల్వకుంట్ల కవిత ధర్నా, డిమాండ్
హైదరాబాద్, జూన్ 29 (ప్రజా మంటలు):
ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని, రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని, జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత సోమవారం దిల్సుఖ్నగర్ చౌరస్తాలో నిరుద్యోగులతో కలిసి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం స్పందించే వరకు నిరుద్యోగుల వెన్నంటి... పోలియో చుక్కలను వేసి చిన్నారుల జీవితాలలో వెలుగులు నింపాలి - పి.సి.సి సేవాదళ్ సెక్రటరీ బోగోజి ముఖేష్ ఖన్నా
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)
జగిత్యాల 28 జూన్ ( ప్రజా మంటలు) :
జాతీయ పల్స్ పోలియో దినోత్సవం సందర్భంగా 0-5 ఏండ్ల వయస్సు ఉన్న పిల్లలకు తప్పనిసరిగా రెండు పోలియో చుక్కలను వేసి చిన్నారుల జీవితాలలో వెలుగులు నింపాలని పి.సి.సి సేవాదళ్ సెక్రటరీ బోగోజి ముఖేష్ ఖన్నా వెల్లడించారు.
పోలియో... యూపీఏ, ఎన్డీఏ పాలనల్లో ధరల పెరుగుదలపై సోషల్ మీడియాలో వైరల్ పోస్టు
న్యూఢిల్లీ, జూన్ 28 (ప్రజా మంటలు):మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం (2004–2014), ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం (2014–2026) హయాంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను పోలుస్తూ ఒక గ్రాఫిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (2004–2014) పాలనలోని ధరలు, ఆ... తమిళనాడు ప్రైవేట్ పాఠశాలల సంఘం అధ్యక్షుడు పి.డి. అరసకుమార్ అరెస్ట్
రూ.100 కోట్ల ప్రైవేట్ పాఠశాలల అనుమతుల మోసం కేసు
చెన్నై, జూన్ 28 (ప్రజా మంటలు):
తమిళనాడులో ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వ అనుమతులు, శాశ్వత గుర్తింపు (Recognition), గ్రేడ్ అప్గ్రేడేషన్, డీటీసీపీ (DTCP), సీఎండీఏ (CMDA) అనుమతులు ఇప్పిస్తానని నమ్మబలికి రూ.100 కోట్లకు పైగా వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు ప్రైవేట్... మంచాల రామేశం స్మారకార్థం ఆర్వో వాటర్ ప్లాంటేషన్ వితరణ
జగిత్యాల జూన్ 22(ప్రజా మంటలు)జగిత్యాల పట్టణంలోని క్రిటికల్ కేర్ హాస్పిటల్ యందు మంచాల రామేశం స్మారకార్థం మంచాల కృష్ణ ఏర్పాటు చేసిన ఆర్వో (ఆర్ ఓ) వాటర్ ప్లాంట్ను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మరియు జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంచాల కృష్ణ... జగిత్యాలలో 120 గ్రాముల గంజాయి స్వాధీనం.. నిందితుడు అరెస్ట్
జగిత్యాల, జూన్ 20 (ప్రజా మంటలు):జగిత్యాల రూరల్ మండలం చల్గల్ శివార్లలో గంజాయి తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో రూరల్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాయికల్ మండలం ఉప్పుమడుగు గ్రామానికి చెందిన దగ్గు రాజేష్ వద్ద నుంచి 120 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి, అనంతరం... నకిలీ ట్రక్ చిట్టీలతో రూ.91 లక్షల ప్రభుత్వ నిధుల దుర్వినియోగం :
ఆరుగురు నిందితుల అరెస్ట్.. రూ.14.16 లక్షల నగదు స్వాధీనం, రూ.46.21 లక్షల ఖాతాలు ఫ్రీజ్
సిరిసిల్ల, జూన్ 20 (ప్రజా మంటలు):
ప్రభుత్వ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి సుమారు రూ.91 లక్షల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన కేసులో ఆరుగురు నిందితులను సిరిసిల్ల టౌన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా... వీధికుక్కల దాడి, నిరాశ్రయ వృద్ధురాలి దుస్థితిపై మానవ హక్కుల కమిషన్ సుమోటో విచారణ
హైదరాబాద్, జూన్ 20 (ప్రజా మంటలు):
తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్ఆర్సీ) న్యాయ సభ్యురాలు శ్రీమతి శివడి ప్రవీణ రెండు వార్తా కథనాలను స్వప్రేరితంగా (సుమోటో) విచారణకు స్వీకరించారు. సాక్షి దినపత్రికలో జూన్ 20న ప్రచురితమైన వార్తల ఆధారంగా ఈ చర్యలు చేపట్టారు.హెచ్ఆర్సీ నెం.2468/2026 కింద, వరంగల్ నగరంలోని శాలినీనగర్లో వీధికుక్క దాడిలో... సాహితీవేత్త ఎంవీ నరసింహారెడ్డికి ఘనంగా నివాళులు
జగిత్యాల జూన్ 19 ( ప్రజా మంటలు) సాహితీవేత్త, విద్యావేత్త రోటరీ క్లబ్ పూర్వ అధ్యక్షులు ఎంవి నరసింహారెడ్డి సంస్కరణ కార్యక్రమం జిల్లా కేంద్రంలోని పద్మ నాయక మండపంలో శుక్రవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నరసింహారెడ్డి శిష్య బృందం, విద్యాసంస్థల ఉపాధ్యాయ బృందం, అధ్యాపకులు బంధువులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొని ఆయన చిత్రపటానికి ఘనంగా... సింగరేణి ప్రాంత వనరులు, ప్రజలను దోచుకుంటున్న కాంగ్రెస్ నేతలు: కవిత
ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తెలంగాణ రక్షణ సేన ఎదుగుతుంది - కల్వకుంట్ల కవిత
పెద్దపల్లి, జూన్ 19 (ప్రజా మంటలు):
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుపై తీవ్ర విమర్శలు చేశారు. సింగరేణి ప్రాంత ప్రజలు,... మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ఎదగాలి :చిన్నారెడ్డి
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డిహైదరాబాద్, జూన్ 17 (ప్రజా మంటలు):
పురుషులతో సమానంగా మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి అన్నారు. బుధవారం మార్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCRHRD)లో నిర్వహించిన ‘ఉమెన్ ఎంపవర్మెంట్... రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ ప్రారంభం నేడు
హైదరాబాద్, జూన్ 17 (ప్రజా మంటలు):
రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి A. Revanth Reddy ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ (TPS)ను నేడు ప్రారంభించనున్నారు. విద్యా రంగంలో సంస్కరణలకు నాంది పలుకుతున్న ఈ పాఠశాల సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్గా రూపుదిద్దుకుంది.
నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంతర్జాతీయ... 