బి.సి వసతి గృహాలకు, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి. - జిల్లా బీసీ సంక్షేమ సంఘం డిమాండ్.

On
బి.సి వసతి గృహాలకు, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి. - జిల్లా బీసీ సంక్షేమ సంఘం డిమాండ్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల నవంబర్ 3 (ప్రజా మంటలు) : 

జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన బీసీ సంక్షేమ సంఘం సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ..... రాష్ట్రంలోని 296 బీసీ కళాశాల వసతి గృహాలు 321 గురుకులాలకు వెంటనే సొంత భవనాలు నిర్మించాలని బి సి సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.

హాస్టల్లల్లో, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల మెస్ చార్జీల పెంపుపై కృతజ్ఞతలు తెలిపారు. రెండేళ్ల తమ నిరంతర పోరాటం తర్వాత మెస్ చార్జీలను పెంచడం ద్వారా సుమారు 8.60 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుందని తెలిపారు.

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు నిర్ణయించేందుకు ఏర్పాటు చేసిన బి సి కమిషన్ అందించే నివేదికకు ఆధారంగా హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో "ప్రత్యేక డెడికేషన్ కమిషన్" ఏర్పాటు చేసి రిజర్వేషన్లు వెంటనే ఖరారు చేయాలని ప్రభుత్వానికి సూచించారు.

మరియు రాష్ట్రంలో హాస్టల్లో గురుకుల పాఠశాల విద్యార్థుల మెస్ చార్జీలు పెంచడం హర్షణీయమని ముఖ్యమంత్రి కి, ఉపముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలుపుతున్నామని, అయితే మెస్ చార్జీలు పెంచడం వల్ల రాష్ట్రంలోని 8 లక్షల 60 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.

కాలేజీ హాస్టళ్ళకు 1500 నుంచి 2100, గురుకుల హాస్టళ్లలో 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు 950 నుంచి 1330, 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 1100 నుంచి 1540కి పెంచడంతోపాటు కాస్మోటిక్ ఛార్జీలు పెంచారన్నారు.

అయితే పెంచిన ధరల ప్రకారం విద్యార్థులకు మంచి పౌష్టిక ఆహారం అందించాలన్నారు.

అలాగే రాష్ట్రంలోని 295 బీసీ కాలేజీ హాస్టళ్ళు, 321 బి సి గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించాలని, కాలేజీ విద్యార్థులకు నెలకు 500 చొప్పున పాకెట్ మనీ ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుంది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ, బిసి యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు కొక్కు గంగాధర్, బి.సి యువజన సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తిరుపురం రాంచందర్, బిసి మహిళా సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాచకొండ రోజా (న్యాయవాది), బి.సి సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షురాలు బండపెల్లి మల్లీశ్వరి, యూత్ కో-ఆర్డినేటర్ హృషికేష్, ముద్దం గంగారెడ్డి, బిసి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  పర్యటన సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  పర్యటన సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  కొండగట్టు జనవరి 2 (ప్రజా మంటలు)1200 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో భారీ బందోబస్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు పర్యటన సందర్భంగా శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా 1200 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో  పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ  అశోక్...
Read More...

రాష్ట్ర  మంత్రులను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ దంపతులు

రాష్ట్ర  మంత్రులను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ దంపతులు       జగిత్యాల జనవరి 2 (ప్రజా మంటలు)నూతన సంవత్సరం 2026 పురస్కరించుకొని జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దంపతులు ఆడవాళ్ళ జ్యోతి లక్ష్మణ్తెలంగాణ రాష్ట్ర మంత్రులకు పొన్నం ప్రభాకర్ కి, అడ్లూరి లక్ష్మణ్ మరియు శ్రీధర్ బాబులను జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గాజంగి నందయ్యతో ప్రత్యక్షంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు...
Read More...

హత్యకు పాల్పడ్డ ఇద్దరు నిందితుల అరెస్ట్  వివరాలు వెల్లడించిన పట్టణ సిఐ కరుణాకర్

హత్యకు పాల్పడ్డ ఇద్దరు నిందితుల అరెస్ట్   వివరాలు వెల్లడించిన పట్టణ సిఐ కరుణాకర్    జగిత్యాల జనవరి 2 (ప్రజా మంటలు)పట్టణంలోని గోవిందుపల్లికి చెందిన కొలగాని అంజయ్యను జగిత్యాల పట్టణానికి చెందిన బాసోజి శ్రీనివాస్ ఇతని కొడుకు వేణు, చారి లు కలిసి డిసెంబర్ 31 న దాడి చేసి హత్య చేసినట్టు పట్టణ సిఐ కరుణాకర్ శుక్రవారం మీడియాతో వివరాలు తెలిపారు . మృతుడు అంజయ్యకు నిందితుడు శ్రీనివాస్...
Read More...

వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా సీటు బెల్టు ధరించాలి -జిల్లా రవాణా అధికారి యం.  శ్రీనివాస్

వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా సీటు బెల్టు ధరించాలి  -జిల్లా రవాణా అధికారి యం.  శ్రీనివాస్ జగిత్యాల జనవరి 2 ( ప్రజా మంటలు)జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవల సందర్భంగా జగిత్యాల జిల్లా రవాణా అధికారి యం. శ్రీనివాస్ ఆధ్వర్యంలో  జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద సీట్ బెల్ట్ పై అవగాహన కార్యక్రమాన్ని శనివారం   నిర్వహించారు  ఈ సందర్భంగా సీట్ బెల్ట్ ధరించిన వారిని గులాబీ పువ్వు...
Read More...

కరీంనగర్ మున్సిపల్ కౌన్సిల్ పై ఎంఐఎం జెండా ఎగురవేస్తాము నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ పిలుపు

కరీంనగర్ మున్సిపల్ కౌన్సిల్ పై ఎంఐఎం జెండా ఎగురవేస్తాము  నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ పిలుపు      జగిత్యాల, జనవరి 02(ప్రజా మంటలు) తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న ఎంఐఎం పార్టీదే మాత్రమే సూపర్ పవర్ అని, ఎంఐఎం మద్దతు లేనిదే ఆకు కూడా కదలదని, రాష్ట్ర రాజకీయాల్లో ఎంఐఎం పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తుందని, భవిష్యత్తులో ఎంఐఎం పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా శ్రమించాలని, హైదరాబాద్ నాంపల్లి ఎమ్మెల్యే, యూత్...
Read More...

రోటరీ క్లబ్ ఆఫ్ జగిత్యాల సెంట్రల్, జగిత్యాల క్లబ్ ఆధ్వర్యంలో ప్రముఖ విద్యావేత్త కాసుగుంటి సుధాకర్ రావు మృతికి ఘనంగా శ్రద్ధాంజలి

రోటరీ క్లబ్ ఆఫ్ జగిత్యాల సెంట్రల్, జగిత్యాల క్లబ్ ఆధ్వర్యంలో ప్రముఖ విద్యావేత్త కాసుగుంటి సుధాకర్ రావు మృతికి ఘనంగా శ్రద్ధాంజలి    జగిత్యాల జనవరి 2 ( ప్రజా మంటలు) రోటరీ క్లబ్ ఆఫ్ జగిత్యాల సెంట్రల్ మరియు జగిత్యాల క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ ఆవరణలో .....శుక్రవారం ఉదయం 11 గంటలకు విద్యావేత్త జగిత్యాల క్లబ్ మరియు రోటరీ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు కాసుగంటి సుధాకర్ రావు మృతి పట్ల సంతాప సమావేశం నిర్వహించి ఆయన చిత్రపటానికి పూల...
Read More...

మెడిసిన్ అప్డేట్- 2026 లో డాక్టర్ శంకర్ వ్యాసం ప్రచురణ.  జగిత్యాల వైద్యుడికి దక్కిన అరుదైన అవకాశం. 

మెడిసిన్ అప్డేట్- 2026 లో డాక్టర్ శంకర్ వ్యాసం ప్రచురణ.   జగిత్యాల వైద్యుడికి దక్కిన అరుదైన అవకాశం.     జగిత్యాల. జనవరి 2( ప్రజా మంటలు) జగిత్యాల పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు, సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ భీమనాతిని శంకర్ కు అరుదైన అవకాశం దక్కింది. మెడిసిన్ అప్డేట్ - 2026 వైద్య గ్రంథంలో  డాక్టర్ శంకర్ వ్యాసం ప్రచురితమైంది.      వైద్య రంగంలో  కొత్త కొత్త అంశాలు, ఆవిష్కరణలతో ప్రతి సంవత్సరం న్యూఢిల్లీలోని జేపీ బ్రదర్స్...
Read More...
State News 

మూసీ పునరుజ్జీవానికి వేగం – మార్చి నాటికి టెండర్లు, త్వరలో పనులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

మూసీ పునరుజ్జీవానికి వేగం – మార్చి నాటికి టెండర్లు, త్వరలో పనులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, డిసెంబర్ 02 (ప్రజా మంటలు): మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టును వేగవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. మార్చి 31లోగా అంచనాలు సిద్ధం చేసి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నట్లశాసన సభలో చెప్పారు. మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధి, కాలుష్య నివారణ, శుద్ధి నీటి ప్రవాహం...
Read More...
National  State News 

కేసీఆర్ సభకు రాకపోతే పార్టీని ఎవ్వరూ కాపాడలేరు – కవిత

కేసీఆర్ సభకు రాకపోతే పార్టీని ఎవ్వరూ కాపాడలేరు – కవిత హైదరాబాద్, జనవరి 02 (ప్రజా మంటలు): బీఆర్ఎస్ నేత కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సభకు రాకపోతే పార్టీని ఎవ్వరూ కాపాడలేరని ఆమె స్పష్టం చేశారు. శాసనమండలి ఆవరణలో పాత్రికేయులతో మాట్లాడుతూ, కవిత తీవ్ర స్థాయిలో స్పందించారు. కేసీఆర్ సభకు హాజరై ప్రజల ముందు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని, అలా చేయకపోతే...
Read More...
State News 

కౌన్సిల్‌లో మాట్లాడి రాజీనామా ఆమోదింప చేసుకుంటా – కవిత

కౌన్సిల్‌లో మాట్లాడి రాజీనామా ఆమోదింప చేసుకుంటా – కవిత హైదరాబాద్, జనవరి 02 (ప్రజా మంటలు): తాను చేసిన రాజీనామాను కౌన్సిల్‌లో మాట్లాడిన తర్వాతే ఆమోదింప చేయించుకుంటానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సెప్టెంబర్ 3న రాజీనామా చేసినప్పటికీ ఇప్పటివరకు దాన్ని ఆమోదించలేదని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం శాసన మండలి సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో, తనకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఛైర్మన్‌ను కోరనున్నట్లు...
Read More...

తుంగురు గ్రామంలో 20 లక్షలతో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్

తుంగురు గ్రామంలో 20 లక్షలతో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్       బీర్పూర్ జనవరి 1 (ప్రజా మంటలు) బీర్పూర్ మండల తుంగూరు గ్రామంలో 20 లక్షలతో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ గ్రామ పంచాయతీ స్టల దాత సర్పంచ్ రాజగోపాల్ రావు  స్థలాన్ని అఫిడవిట్ రూపంలో ఎమ్మెల్యే  చేతుల మీదుగా పంచాయతీ రాజ్ డి.ఈ. మిలింద్ కి...
Read More...
Today's Cartoon 

Today's Cartoon

Today's Cartoon Today's Cartoon 
Read More...