బి.సి వసతి గృహాలకు, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి. - జిల్లా బీసీ సంక్షేమ సంఘం డిమాండ్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల నవంబర్ 3 (ప్రజా మంటలు) :
జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన బీసీ సంక్షేమ సంఘం సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ..... రాష్ట్రంలోని 296 బీసీ కళాశాల వసతి గృహాలు 321 గురుకులాలకు వెంటనే సొంత భవనాలు నిర్మించాలని బి సి సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
హాస్టల్లల్లో, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల మెస్ చార్జీల పెంపుపై కృతజ్ఞతలు తెలిపారు. రెండేళ్ల తమ నిరంతర పోరాటం తర్వాత మెస్ చార్జీలను పెంచడం ద్వారా సుమారు 8.60 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుందని తెలిపారు.
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు నిర్ణయించేందుకు ఏర్పాటు చేసిన బి సి కమిషన్ అందించే నివేదికకు ఆధారంగా హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో "ప్రత్యేక డెడికేషన్ కమిషన్" ఏర్పాటు చేసి రిజర్వేషన్లు వెంటనే ఖరారు చేయాలని ప్రభుత్వానికి సూచించారు.
మరియు రాష్ట్రంలో హాస్టల్లో గురుకుల పాఠశాల విద్యార్థుల మెస్ చార్జీలు పెంచడం హర్షణీయమని ముఖ్యమంత్రి కి, ఉపముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలుపుతున్నామని, అయితే మెస్ చార్జీలు పెంచడం వల్ల రాష్ట్రంలోని 8 లక్షల 60 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.
కాలేజీ హాస్టళ్ళకు 1500 నుంచి 2100, గురుకుల హాస్టళ్లలో 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు 950 నుంచి 1330, 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 1100 నుంచి 1540కి పెంచడంతోపాటు కాస్మోటిక్ ఛార్జీలు పెంచారన్నారు.
అయితే పెంచిన ధరల ప్రకారం విద్యార్థులకు మంచి పౌష్టిక ఆహారం అందించాలన్నారు.
అలాగే రాష్ట్రంలోని 295 బీసీ కాలేజీ హాస్టళ్ళు, 321 బి సి గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించాలని, కాలేజీ విద్యార్థులకు నెలకు 500 చొప్పున పాకెట్ మనీ ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుంది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ, బిసి యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు కొక్కు గంగాధర్, బి.సి యువజన సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తిరుపురం రాంచందర్, బిసి మహిళా సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాచకొండ రోజా (న్యాయవాది), బి.సి సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షురాలు బండపెల్లి మల్లీశ్వరి, యూత్ కో-ఆర్డినేటర్ హృషికేష్, ముద్దం గంగారెడ్డి, బిసి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి నోటీస్ జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు

చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం

రైతుల భూ సమస్యలను మళ్ళీ కలెక్టర్,తహసీల్దార్లకు ఇవ్వడం సరికాదు

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా మహాసభ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పెద్దమ్మ తల్లి బోనాల ఆహ్వాన పత్రిక అందజేత

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎదగాలి. -ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి

దశాబ్దం తర్వాత నెరవేరుతున్న పేదల సొంతింటి కల

బహరేన్ లో తొమ్మిది మంది తెలంగాణ వసూల అరెస్ట్

బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్

బోనాల జాతర నిధులు పక్కదారి పడుతున్నాయి..

ఉద్యోగ సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వేకు దేశంలో గుర్తింపు

గల్ఫ్ అడ్వైజరి బొర్డ్ కు చాంద్ పాషా విజ్ఞప్తి
