డైట్ ఛార్జిల పెంపుపై గొల్లపల్లిలో గురుకులంలో సంబరాలు.
- విద్యార్థులతో కేక్ కట్ చేయించిన ప్రిన్సిపల్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల నవంబర్ 2 ( ప్రజా మంటలు ) :
రాష్ట్ర సర్కారు ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థుల డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచడంతో గొల్లపల్లి లోని మహాత్మా జ్యోతి బాపూలే బాలికల గురుకుల పాఠశాలలో సంబరాలు జరుపుకొన్నారు. పాఠశాల అవరణలోనే ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చెరుకు సుష్మిత విద్యార్థులతో కేక్ కట్ చేయించి సంబరాలను జరుపుకొన్నారు.
ఈ సందర్బంగా డి.సి.వో, ప్రిన్సిపాల్ చెరుకు సుష్మిత మాట్లాడుతూ......నిరుపేద విద్యార్థిని, విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులకు నాణ్యతతో కూడిన భోజనం అందించాలని డైట్, కాస్మోటిక్ ఛార్జిలను పెంచారన్నారు. అలాగే ఈ నిధులు పక్కదారి పట్టకుండా ఉండేందుకు గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లించే ఏర్పాట్లు చేయడం విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో ఈ సారి 40శాతం డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచడంతో రాష్ట్రంలోని 7 లక్షల 65వేల 705 మంది విద్యార్థులకు న్యాయం జరుగుతుందని అన్నారు.
డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంలతో పాటు పలు శాఖల కార్యదర్శులకు విద్యార్థుల పక్షాన ప్రిన్సిపాల్ చెరుకు సుష్మిత కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమం లో అ పాఠశాల టీచర్లు, సిబ్బంది, విద్యార్ధినులు ఉన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భారత ప్రధాని మోదీకి బిహార్ ఎన్నికల్లో కఠిన పరీక్ష – నిరుద్యోగం, ఓటర్ల జాబితాలపై అనుమానాలు కీలకం
.jpeg)
శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి దేవస్థానం లో శ్రీ అన్నపూర్ణా దేవి, శ్రీ నంది ధ్వజస్తంభ పున ప్రతిష్ట కరపత్రాన్ని ఆవిష్కరించిన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక

బిసి సంక్షేమ సంఘం జిల్లా మహిళ కార్యనిర్వహక అధ్యక్షురాలుగా అరవ లక్ష్మి ఉత్తర్వులు ఇచ్చిన కృష్ణయ్య

సోను, సతీష్ ల పార్టీ నుండి బహిష్కరణ

ఇజ్రాయెల్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘన — 47 సార్లు దాడులు, 38 మంది పాలస్తీనియన్లు మృతి

రాష్ట్ర అభివృద్ధిలో యాదవులు కీలక పాత్ర - సీఎం రేవంత్ రెడ్డి

టపాకులు రాత్రి 8 నుంచి 10 మధ్యనే కాల్చాలి - తిరుమలగిరి ఇన్స్పెక్టర్. జి నాగరాజు

దీపావళి జీవితాల్లో వెలుగు నింపాలి - అజాగ్రత్తతో జీవితాన్ని ఆగం చేసుకోకండి

పేద నిందితులకు బెయిల్ మొత్తాన్ని DLSA చెల్లించచ్చు - సుప్రీంకోర్టు

అమెరికా తర్వాత అతి పెద్ద ఏఐ పెట్టుబడి భారత్లోనే — సూపర్ ఇంటెలిజెన్స్ దశాబ్దం రాబోతోంది - గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్
.jpeg)
బీర్ పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నూతన ట్రస్ట్ బోర్డ్

నిజామాబాద్లో కానిస్టేబుల్ హత్య
