ట్రాన్స్​ జెండర్ల వైద్యంపై గాంధీలో సైంటిఫిక్​ సెషన్

టాఫిక్​పై అవెర్నెస్​   * ఆన్​లైన్​ లో పాల్గొన్న 300 , ఆఫ్​ లైన్​ లో 200 మంది వైద్యులు

On
ట్రాన్స్​ జెండర్ల వైద్యంపై గాంధీలో సైంటిఫిక్​ సెషన్

ట్రాన్స్​ జెండర్ల వైద్యంపై గాంధీలో సైంటిఫిక్​ సెషన్​
  * దేశంలోనే మొదటిసారిగా ఈ టాఫిక్​పై అవెర్నెస్​
  * ఆన్​లైన్​ లో పాల్గొన్న 300 , ఆఫ్​ లైన్​ లో 200 మంది వైద్యులు

సికింద్రాబాద్​ నవంబర్​ 02 (ప్రజామంటలు) :

ట్రాన్స్​ జెండర్ల వైద్యం, వారిలో వచ్చే మానసిక, శారీరక నిర్మాణాల్లో వ్యత్యాసాలు, హార్మోన్ల ప్రభావం తదితర అంశాల్లో డాక్టర్లకు అవగాహన కల్పించేందుకు గాను గాంధీ మెడికల్​ కాలేజీ ఫిజియోలజీ డిపార్ట్​ మెంట్​ ఆధ్వర్యంలో ఒక రోజు కంటిన్యూస్​ ప్రొఫెషనల్​ డెవలప్​మెంట్​ (సీపీడీ) సెమినార్​ నిర్వహించారు. దేశంలోనే మొదటిసారిగా జరిగిన ఈ రాష్ర్ట స్థాయి అవెర్నెస్​ సెమినార్​ లో రాష్ర్టంలోని పలు ప్రభుత్వ వైద్యశాలల్లోని ప్లాస్టిక్​ సర్జరీ, సైకాలజీ, ఫీజియోలజీ, ఎండొక్రనాలజీ, సైకియాట్రిక్​,ఫోరెన్సిక్​, తదితర డిపార్ట్​ మెంట్ వైద్య నిపుణులు పాల్గొని ఆఫ్​ లైన్​ లో 200 మంది, ఆన్​ లైన్​ లో 300 మంది మొత్తం 500 మంది డాక్టర్లకు  ట్రాన్స్​ జెండర్ల వైద్యంపై వివరించారు. ఈసందర్బంగా ప్రొగ్రామ్​ చైర్​పర్సన్​, గాంధీ మెడికల్ కాలేజీ ఫిజియోలజీ ప్రొఫెసర్​ రమాదేవి మాట్లాడుతూ..దేశంలో ప్రస్తుతం ట్రాన్స్​ జెండర్ల హక్కుల కోసం వాయిస్​ పెరుగుతుందని, ఈ నేపద్యంలో ట్రాన్స్​ జెండర్లకు కూడ మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం రాష్ర్టంలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో 32 ట్రాన్స్​ జెండర్ల కు ప్రత్యేక వైద్య విభాగాలను ఏర్పాటు చేసిందన్నారు.  త్వరలో గాంధీ ఆసుపత్రిలో ట్రాన్స్​ జెండర్లకు ప్రత్యేక క్లినిక్​ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో మెడిసిన్​ చేసిన డాక్టర్​ ప్రాచీ రాథోడ్​  ప్రస్తుతం నిజామాబాద్​ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఆర్థోపెడిక్​ లో పీజీ చేస్తుందన్నారు. దేశంలో ప్రథమ ట్రాన్స్​ జెండర్​ పీజీ డాక్టర్ గా ఆమె ఖ్యాతి పాధించిందన్నారు. ఈసందర్బంగా డా.ప్రాచీ రాథోడ్​ సెషన్​ కు హాజరై ట్రాన్స్​ జెండర్​ గా తనకు ఎదురైన అరోగ్య, మానసిక సమస్యలు, తదితర అంశాలపై సమావేశంలో తన ప్రసంగంలో వివరించారు. అలాగే ట్రాన్స్​ జెండర్​ గా మార్పు చెందిన తర్వాత వచ్చే లీగల్​ సమస్యలపై యాదాద్రి భువనగిరి ప్రభుత్వ మెడికల్​ కాలేజీ ఫోరెన్సిక్​ మెడిసిన్​ హెచ్​ఓడీ ప్రొఫెసర్​ డా.లావణ్య కౌసిల్​ ప్రసంగించారు. హార్మోన్ల ప్రభావంపై ఉస్మానియా మెడికల్​ కాలేజీ ఎండోక్రానలజీ ప్రొఫెసర్​ డా.రాకేశ్​ కుమార్​ సహాయ్​, బీబీనగర్​ ఏయిమ్స్​ సైకియాట్రిక్​ అసోసియేట్​ ప్రొఫెసర్​ డా.మాలతేశ్​, ప్లాస్టిక్​ సర్జరీ ప్రొఫెసర్​ డా.పాలుకూరి లక్ష్మీ, సిద్దిపేట ప్రభుత్వ మెడికల్​ కాలేజీ గైనకాలజీ హెచ్​ఓడీ ప్రొ.మహాలక్ష్మీ, చేవేళ్ళ పట్నం మహేందర్​ రెడ్డి మెడికల్​ కాలేజీ ప్రిన్సిపాల్​ డా.డి.జోయరాణి లు సమావేశంలో ట్రాన్స్​ జెండర్లకు సంబందించిన అంశాలపై ప్రసంగించారు. కార్యక్రమంలో గాంధీ మెడికల్​ కాలేజీ ప్రిన్సిపాల్​ డా.కే.ఇందిర, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్​ ప్రొ.రాజకుమారి, సెమినార్​ చైర్​ పర్సన్​ప్రొఫెసర్​ రమాదేవి,  వైస్​ ప్రిన్సిపాల్​ డా.రవిశేఖర్​ రావు, డిప్యూటీ సూపరింటెండెంట్​ డా.సుభోద్​ కుమార్​, ఫిజియోలజీ మోహన్​ రెడ్డి, ఆయా ఆసుపత్రుల నుంచి వచ్చిన వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు
–––––––––––––
–ఫొటో

Tags
Join WhatsApp

More News...

Local News 

TG EAPCET – 2026 ఫలితాలలో జ్యోతి పూర్వ విద్యార్థుల ఘన విజయం

TG EAPCET – 2026 ఫలితాలలో జ్యోతి పూర్వ విద్యార్థుల ఘన విజయం జగిత్యాల మే 17 (ప్రజా మంటలు)ఆదివారం విడుదల అయిన TG EAPCET – 2026 ఫలితాలలో JYOTHI HIGH SCHOOL IIT ACADEMY పూర్వ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచి సంస్థ ఖ్యాతిని మరింత పెంచారు. అత్యుత్తమ ర్యాంకులు సాధించి విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను సంస్థ...
Read More...
State News 

నీతి, నిజాయితీకి మారుపేరు డాక్టర్ జస్టిస్ జి. చంద్రయ్యకు నివాళులు: మాజీ మంత్రి రాజేశం గౌడ్

నీతి, నిజాయితీకి మారుపేరు డాక్టర్ జస్టిస్ జి. చంద్రయ్యకు నివాళులు: మాజీ మంత్రి రాజేశం గౌడ్ హైదరాబాద్, మే 16 (ప్రజా మంటలు): విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి, మానవ హక్కుల కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ జస్టిస్ జి. చంద్రయ్య అకాల మరణం బాధాకరమని మాజీ సీనియర్ మంత్రి గొడిశెల రాజేశం గౌడ్, మాజీ న్యాయమూర్తి నవ మోహన్ రావు, పాత్రికేయులు ప్రభాకర్ రావు, ఎల్జేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మినేని వికాస్...
Read More...
Local News  State News 

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఘనంగా గ్రంథాలయ వారోత్సవాలు.

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఘనంగా గ్రంథాలయ వారోత్సవాలు. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల మే 15 ( ప్రజా మంటలు) :  ప్రభుత్వం నిర్వహిస్తున్న 99 రోజుల కార్యాచరణలో విద్యాశాఖ వారోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం జిల్లా గ్రంథాలయ సంస్థ – జగిత్యాల ఆధ్వర్యంలో ఓల్డ్ బస్ స్టాండ్ జిల్లా గ్రంథాలయంలో గ్రంథాలయ దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...
Read More...
State News 

తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ ప్రస్థానం పైలాన్ వేరే చోటుకు మార్చాలని బ్రాహ్మణ సంఘం చే నిరసన.

తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ ప్రస్థానం పైలాన్ వేరే చోటుకు మార్చాలని బ్రాహ్మణ సంఘం చే నిరసన. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). ఖమ్మం మే 15 (ప్రజా మంటలు) :  నగరంలో లకారం ట్యాంక్ బండ్ సెంటర్లో భారత మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల సందర్భముగా ఏర్పాటు చేసినటువంటి కాంస్య విగ్రహము. ప్రాంతంలో తుమ్మల నాగేశ్వరరావు 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో చేసినటువంటి కార్యక్రమాల...
Read More...
Local News 

బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పథకాలను బ్రాహ్మణులు సద్వినియోగపరచుకోవాలి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పథకాలను బ్రాహ్మణులు సద్వినియోగపరచుకోవాలి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బండ్లగూడ, నాగోల్ మే 14(ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పథకాలను బ్రాహ్మణ సద్వినియోగపరచుకోవాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ వైస్ చైర్మన్ పదవి బాధ్యతల స్వీకరణ ఉత్సవం గురువారం బండ్లగూడ, నాగోల్...
Read More...
Comment  State News 

“తెలంగాణ దళిత సాహిత్య చరిత్రను విస్మరించొద్దు” :బి.ఎస్. రాములు బహిరంగ లేఖ..

 “తెలంగాణ దళిత సాహిత్య చరిత్రను విస్మరించొద్దు” :బి.ఎస్. రాములు బహిరంగ లేఖ.. హైదరాబాద్ మే 14 (ప్రజా మంటలు):తెలంగాణ సాహిత్య అకాడెమీ ప్రచురిస్తున్న పునాస ఎప్రిల్-జూన్ 2026 సంచికలో ప్రచురితమైన “తెలుగు సాహిత్యంలో అంబేద్కర్ ప్రభావం” వ్యాసంపై ప్రముఖ సామాజిక తత్వవేత్త, రచయిత, బీసీ కమీషన్ తొలి చైర్మన్  బి.ఎస్. రాములు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు కోయి కోటేశ్వరరావుకు బహిరంగ లేఖ రాశారు....
Read More...
State News 

బండి సంజయ్ కుమారుడిపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేయాలి: కవిత

బండి సంజయ్ కుమారుడిపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేయాలి: కవిత హైదరాబాద్ మే 13 (ప్రజా మంటలు):     కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేసి విదేశాలకు పారిపోకుండా చర్యలు తీసుకోవాలని టిఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలని, ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.బుధవారం...
Read More...
Local News 

కొండగట్టు అంజన్న భక్తులకు ఎం ఎస్ ఆర్ డి ఎఫ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ

కొండగట్టు అంజన్న భక్తులకు ఎం ఎస్ ఆర్ డి ఎఫ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కొండగట్టు మే 12 ( ప్రజా మంటలు)హనుమాన్ పెద్ద జయంతిని పురస్కరించుకుని కొండగట్టు అంజన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తుల సౌకర్యార్థం మ స్పోర్ట్స్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్* ( ఎం ఎస్ ఆర్ డి ఎఫ్) ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ సేవా కార్యక్రమం నిర్వహించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భక్తులకు అరటి...
Read More...
Spiritual   State News 

కొండగట్టు గిరి ప్రదక్షిణకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్

కొండగట్టు గిరి ప్రదక్షిణకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొండగట్టు, మే 11 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు అంజన్న ఆలయంలో రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకున్న మంత్రి, అంజన్నకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు మంత్రికి...
Read More...
Local News 

ట్రై సైకిల్స్ ను అందజేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, డి ఎస్పీ పురుషోత్తం రెడ్డి 

ట్రై సైకిల్స్ ను అందజేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, డి ఎస్పీ పురుషోత్తం రెడ్డి  జగిత్యాల మే 10 (ప్రజా మంటలు) రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో, ఆపి ప్రైవేంటివ్ హెల్త్ క్లినిక్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో దివ్యాంగ విద్యార్థులకు ట్రై సైకిల్స్ ను అందజేసే కార్యక్రమం జరిగింది.    జిల్లా కేంద్రంలోని పావని కంటి హాస్పిటల్ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ జగిత్యాల పూర్వ అధ్యక్షుడు,  శాసన...
Read More...
Local News 

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన  హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన  హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు కొండగట్టు మే 10 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో  హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు ఆదివారం అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. విశేష సంఖ్యలో భక్తుల నడుమ ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.   హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వైదిక...
Read More...
Local News 

విద్యార్థులకు  బాల్యం నుండే సంస్కారాన్ని అందించాలి. ఆర్ఎస్ఎస్ జిల్లా బౌద్ధిక్ ప్రముఖ కొంగరి సాయి కృష్ణ

విద్యార్థులకు  బాల్యం నుండే సంస్కారాన్ని అందించాలి.  ఆర్ఎస్ఎస్ జిల్లా బౌద్ధిక్ ప్రముఖ కొంగరి సాయి కృష్ణ    జగిత్యాల మే 10 (ప్రజా మంటలు  ) విద్యార్థులకు చదువుతోపాటు సంస్కారాన్ని కూడా బాల్యం నుండే అలవాటు చేయాలని ఆర్ఎస్ఎస్ జిల్లా బౌద్ధిక్ ప్రముఖ కొంగరి సాయి కృష్ణ అన్నారు. సేవా భారతి, గీతా విద్యాలయం ఆధ్వర్యంలో ఈనెల ఒకటి నుండి పది రోజులపాటు నిర్వహించిన సంస్కార సాధన వర్గ ముగింపు సమావేశం ఆదివారం గీతా...
Read More...