ట్రాన్స్ జెండర్ల వైద్యంపై గాంధీలో సైంటిఫిక్ సెషన్
టాఫిక్పై అవెర్నెస్ * ఆన్లైన్ లో పాల్గొన్న 300 , ఆఫ్ లైన్ లో 200 మంది వైద్యులు
ట్రాన్స్ జెండర్ల వైద్యంపై గాంధీలో సైంటిఫిక్ సెషన్
* దేశంలోనే మొదటిసారిగా ఈ టాఫిక్పై అవెర్నెస్
* ఆన్లైన్ లో పాల్గొన్న 300 , ఆఫ్ లైన్ లో 200 మంది వైద్యులు
సికింద్రాబాద్ నవంబర్ 02 (ప్రజామంటలు) :
ట్రాన్స్ జెండర్ల వైద్యం, వారిలో వచ్చే మానసిక, శారీరక నిర్మాణాల్లో వ్యత్యాసాలు, హార్మోన్ల ప్రభావం తదితర అంశాల్లో డాక్టర్లకు అవగాహన కల్పించేందుకు గాను గాంధీ మెడికల్ కాలేజీ ఫిజియోలజీ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో ఒక రోజు కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ (సీపీడీ) సెమినార్ నిర్వహించారు. దేశంలోనే మొదటిసారిగా జరిగిన ఈ రాష్ర్ట స్థాయి అవెర్నెస్ సెమినార్ లో రాష్ర్టంలోని పలు ప్రభుత్వ వైద్యశాలల్లోని ప్లాస్టిక్ సర్జరీ, సైకాలజీ, ఫీజియోలజీ, ఎండొక్రనాలజీ, సైకియాట్రిక్,ఫోరెన్సిక్, తదితర డిపార్ట్ మెంట్ వైద్య నిపుణులు పాల్గొని ఆఫ్ లైన్ లో 200 మంది, ఆన్ లైన్ లో 300 మంది మొత్తం 500 మంది డాక్టర్లకు ట్రాన్స్ జెండర్ల వైద్యంపై వివరించారు. ఈసందర్బంగా ప్రొగ్రామ్ చైర్పర్సన్, గాంధీ మెడికల్ కాలేజీ ఫిజియోలజీ ప్రొఫెసర్ రమాదేవి మాట్లాడుతూ..దేశంలో ప్రస్తుతం ట్రాన్స్ జెండర్ల హక్కుల కోసం వాయిస్ పెరుగుతుందని, ఈ నేపద్యంలో ట్రాన్స్ జెండర్లకు కూడ మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం రాష్ర్టంలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో 32 ట్రాన్స్ జెండర్ల కు ప్రత్యేక వైద్య విభాగాలను ఏర్పాటు చేసిందన్నారు. త్వరలో గాంధీ ఆసుపత్రిలో ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక క్లినిక్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో మెడిసిన్ చేసిన డాక్టర్ ప్రాచీ రాథోడ్ ప్రస్తుతం నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఆర్థోపెడిక్ లో పీజీ చేస్తుందన్నారు. దేశంలో ప్రథమ ట్రాన్స్ జెండర్ పీజీ డాక్టర్ గా ఆమె ఖ్యాతి పాధించిందన్నారు. ఈసందర్బంగా డా.ప్రాచీ రాథోడ్ సెషన్ కు హాజరై ట్రాన్స్ జెండర్ గా తనకు ఎదురైన అరోగ్య, మానసిక సమస్యలు, తదితర అంశాలపై సమావేశంలో తన ప్రసంగంలో వివరించారు. అలాగే ట్రాన్స్ జెండర్ గా మార్పు చెందిన తర్వాత వచ్చే లీగల్ సమస్యలపై యాదాద్రి భువనగిరి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ మెడిసిన్ హెచ్ఓడీ ప్రొఫెసర్ డా.లావణ్య కౌసిల్ ప్రసంగించారు. హార్మోన్ల ప్రభావంపై ఉస్మానియా మెడికల్ కాలేజీ ఎండోక్రానలజీ ప్రొఫెసర్ డా.రాకేశ్ కుమార్ సహాయ్, బీబీనగర్ ఏయిమ్స్ సైకియాట్రిక్ అసోసియేట్ ప్రొఫెసర్ డా.మాలతేశ్, ప్లాస్టిక్ సర్జరీ ప్రొఫెసర్ డా.పాలుకూరి లక్ష్మీ, సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ గైనకాలజీ హెచ్ఓడీ ప్రొ.మహాలక్ష్మీ, చేవేళ్ళ పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.డి.జోయరాణి లు సమావేశంలో ట్రాన్స్ జెండర్లకు సంబందించిన అంశాలపై ప్రసంగించారు. కార్యక్రమంలో గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.కే.ఇందిర, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రొ.రాజకుమారి, సెమినార్ చైర్ పర్సన్ప్రొఫెసర్ రమాదేవి, వైస్ ప్రిన్సిపాల్ డా.రవిశేఖర్ రావు, డిప్యూటీ సూపరింటెండెంట్ డా.సుభోద్ కుమార్, ఫిజియోలజీ మోహన్ రెడ్డి, ఆయా ఆసుపత్రుల నుంచి వచ్చిన వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు
–––––––––––––
–ఫొటో
More News...
<%- node_title %>
<%- node_title %>
రెండేళ్ల ప్రజా పాలన సక్సెస్ పై సికింద్రాబాద్ లో సంబరాలు
సికింద్రాబాద్, డిసెంబర్ 08 (ప్రజామంటలు): :
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని, మూడో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్ నియోజకవర్గంలోని సీతాఫలమండిలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకలను కాంటెస్టెడ్ ఎమ్మెల్యే మరియు నియోజకవర్గ ఇంచార్జ్ అదం సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ... పెండ్లి నిరాకరణపై రెచ్చిపోయిన బావ : గొంతులో కత్తి దించి, యువతిని దారుణంగా చంపిన మానవ మృగం
రక్తపు మడుగులో కుప్పకూలి ప్రాణాలు విడిచిన పవిత్ర
వారాసిగూడ పీఎస్ పరిధిలో పట్టపగలు అమానవీయ ఘటన పోలింగ్ రోజున ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకం* జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
*కొడిమ్యాల డిసెంబర్ 8 (ప్రజా మంటలు)
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ లో భాగంగా
సోమవారం రోజున కొడిమ్యాల మండలం కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రిసైడింగ్ అధికారులకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ పరిశీలించి పలు అంశాల మీద ప్రిసైడింగ్ అధికారులకు అవగాహన కల్పించారు.... జాతీయ మాలల క్రైస్తవ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులుగా ప్రవీణ్
**
జగిత్యాల, డిసెంబర్ 8(ప్రజా మంటలు) భారత జాతీయ మాలల క్రైస్తవ ఐక్యవేదిక జగిత్యాల జిల్లా అధ్యక్షులుగా ముద్దమల్ల ప్రవీణ్ ను నియమించారు. సోమవారం జగిత్యాల లో జాతీయ మాలల ఐక్య వేదిక సమావేశం అధ్యక్షులు మ్యాదరి శ్రీహరి అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర నాయకులు హాజరుకాగా ఇదే వేదికగా జాతీయ... స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల కోసం ఫ్లాగ్ మార్చ్ * ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అన్ని వర్గాల ప్రజలు పోలీసులకు సహకరించాలి
జగిత్యాల రూరల్ డిసెంబర్ 8 (ప్రజా మంటలు)
సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాబితా పూర్ గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సి.ఐ సుధాకర్ మాట్లాడుతూ.... ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ గమ్యస్థానానికి సుఖంగా చేరుకోవాలి ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం
జగిత్యాలడిసెంబర్ 8 (ప్రజా మంటలు) ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ గమ్యానికి సుఖ ప్రయాణం చేయాలని ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం టౌన్ ఎస్ఐ రవికిరణ్ అన్నారు.
సోమవారం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాలతో డిఎస్పి రఘు చందర్ సూచనలతో టౌన్ సిఐ కరుణాకర్ పర్యవేక్షణలో arive alive కార్యక్రమంలో భాగంగా వాహనం నడిపేటప్పుడు సురక్షితంగా గమ్యస్థానానికి... అవల్కొప్పం… న్యాయం కోసం 3,215 రోజుల నిరీక్షణ! దిలీప్ కేసు తీర్పుతో మళ్లీ ట్రెండ్లో హ్యాష్ట్యాగ్
కొచ్చి, డిసెంబర్ 08:2017లో ప్రముఖ మలయాళ నటిపై జరిగిన లైంగిక వేధింపుల కేసులో నటుడు దిలీప్ నిర్దోషి అని ఎర్నాకుళం ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు ప్రకటించడంతో, సోషల్ మీడియాలో ‘అవల్కొప్పం’ (We stand with her) హ్యాష్ట్యాగ్ మళ్లీ పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.
మలయాళ సినీ పరిశ్రమలో 2017లో మహిళా భద్రత కోసం... తెలంగాణను దేశంలో ముందంజలో నిలపడం లక్ష్యం : రేవంత్ రెడ్డి
హైదరాబాద్ డిసెంబర్ 08 (ప్రజా మంటలు):
తెలంగాణను దేశంలో ముందంజలో నిలపడం లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన **‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్’**పై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం, రాష్ట్ర భవిష్యత్తు లక్ష్యాలను వివరించారు.
సీఎం మాట్లాడుతూ,2047 నాటికి తెలంగాణను 3... వీరాపూర్ ఏకగ్రీవ ఎంపికలపై జీవన్ రెడ్డి అభినందనలు
జగిత్యాల (రూరల్) డిసెంబర్ 08 (ప్రజా మంటలు):
జగిత్యాల ఇందిరాభవన్లో వీరాపూర్ గ్రామం కొత్తగా ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ దిండిగాల గంగు రామస్వామి గౌడ్, ఉపసర్పంచ్ దుంపల నర్సిరెడ్డి సహా వార్డ్ సభ్యులను మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి సన్మానించారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ—గతంలో సర్పంచ్గా ఉన్న రామస్వామి... మేడ్చల్–మల్కాజ్గిరి సమస్యలు భయంకర స్థాయిలో ఉన్నాయి: కవిత
ఇది తెలంగాణ రైజింగ్ కాదు, Telangana Sinking,”
తెలంగాణ జాగృతి జనంబాట – కూకట్పల్లి ప్రెస్ మీట్
కూకట్ పల్లి డిసెంబర్ 08 (ప్రజా మంటలు):
మేడ్చల్–మల్కాజ్గిరి పర్యటనలో ప్రజల సమస్యలను స్వయంగా చూశానని, పరిస్థితులు ఊహించని స్థాయిలో దారుణంగా ఉన్నాయని జాగృతి నాయకురాలు కవిత తెలిపారు. ఉప్పల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, కూకట్పల్లిలో జరిగిన... “ఏం సాధించారని సంబరాలు" – తెలంగాణ జాగృతి అధికార ప్రతినిధి డా.నలమాస శ్రీకాంత్ గౌడ్
“స్థానిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారు”
హైదరాబాద్, డిసెంబర్ 8 (ప్రజా మంటలు):
ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు అని తెలంగాణ జాగృతి అధికార ప్రతినిధి డా. నలమాస శ్రీకాంత్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు. బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, రెండేళ్ల... న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా — బార్ కౌన్సిల్ అభ్యర్థి పోలు వెంకట రాజ్ కుమార్
మెట్టుపల్లి డిసెంబర్ 08 (ప్రజా మంటలు – దగ్గుల అశోక్):
రాబోయే తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే న్యాయవాదుల సంక్షేమం కోసం మరింత బలోపేత చర్యలు తీసుకుంటానని కరీంనగర్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పోలు వెంకట రాజ్ కుమార్ తెలిపారు.
సోమవారం మెట్టుపల్లి బార్ అసోసియేషన్ న్యాయవాదులతో జరిగిన సమావేశంలో ఆయన... 