ట్రాన్స్​ జెండర్ల వైద్యంపై గాంధీలో సైంటిఫిక్​ సెషన్

టాఫిక్​పై అవెర్నెస్​   * ఆన్​లైన్​ లో పాల్గొన్న 300 , ఆఫ్​ లైన్​ లో 200 మంది వైద్యులు

On
ట్రాన్స్​ జెండర్ల వైద్యంపై గాంధీలో సైంటిఫిక్​ సెషన్

ట్రాన్స్​ జెండర్ల వైద్యంపై గాంధీలో సైంటిఫిక్​ సెషన్​
  * దేశంలోనే మొదటిసారిగా ఈ టాఫిక్​పై అవెర్నెస్​
  * ఆన్​లైన్​ లో పాల్గొన్న 300 , ఆఫ్​ లైన్​ లో 200 మంది వైద్యులు

సికింద్రాబాద్​ నవంబర్​ 02 (ప్రజామంటలు) :

ట్రాన్స్​ జెండర్ల వైద్యం, వారిలో వచ్చే మానసిక, శారీరక నిర్మాణాల్లో వ్యత్యాసాలు, హార్మోన్ల ప్రభావం తదితర అంశాల్లో డాక్టర్లకు అవగాహన కల్పించేందుకు గాను గాంధీ మెడికల్​ కాలేజీ ఫిజియోలజీ డిపార్ట్​ మెంట్​ ఆధ్వర్యంలో ఒక రోజు కంటిన్యూస్​ ప్రొఫెషనల్​ డెవలప్​మెంట్​ (సీపీడీ) సెమినార్​ నిర్వహించారు. దేశంలోనే మొదటిసారిగా జరిగిన ఈ రాష్ర్ట స్థాయి అవెర్నెస్​ సెమినార్​ లో రాష్ర్టంలోని పలు ప్రభుత్వ వైద్యశాలల్లోని ప్లాస్టిక్​ సర్జరీ, సైకాలజీ, ఫీజియోలజీ, ఎండొక్రనాలజీ, సైకియాట్రిక్​,ఫోరెన్సిక్​, తదితర డిపార్ట్​ మెంట్ వైద్య నిపుణులు పాల్గొని ఆఫ్​ లైన్​ లో 200 మంది, ఆన్​ లైన్​ లో 300 మంది మొత్తం 500 మంది డాక్టర్లకు  ట్రాన్స్​ జెండర్ల వైద్యంపై వివరించారు. ఈసందర్బంగా ప్రొగ్రామ్​ చైర్​పర్సన్​, గాంధీ మెడికల్ కాలేజీ ఫిజియోలజీ ప్రొఫెసర్​ రమాదేవి మాట్లాడుతూ..దేశంలో ప్రస్తుతం ట్రాన్స్​ జెండర్ల హక్కుల కోసం వాయిస్​ పెరుగుతుందని, ఈ నేపద్యంలో ట్రాన్స్​ జెండర్లకు కూడ మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం రాష్ర్టంలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో 32 ట్రాన్స్​ జెండర్ల కు ప్రత్యేక వైద్య విభాగాలను ఏర్పాటు చేసిందన్నారు.  త్వరలో గాంధీ ఆసుపత్రిలో ట్రాన్స్​ జెండర్లకు ప్రత్యేక క్లినిక్​ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో మెడిసిన్​ చేసిన డాక్టర్​ ప్రాచీ రాథోడ్​  ప్రస్తుతం నిజామాబాద్​ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఆర్థోపెడిక్​ లో పీజీ చేస్తుందన్నారు. దేశంలో ప్రథమ ట్రాన్స్​ జెండర్​ పీజీ డాక్టర్ గా ఆమె ఖ్యాతి పాధించిందన్నారు. ఈసందర్బంగా డా.ప్రాచీ రాథోడ్​ సెషన్​ కు హాజరై ట్రాన్స్​ జెండర్​ గా తనకు ఎదురైన అరోగ్య, మానసిక సమస్యలు, తదితర అంశాలపై సమావేశంలో తన ప్రసంగంలో వివరించారు. అలాగే ట్రాన్స్​ జెండర్​ గా మార్పు చెందిన తర్వాత వచ్చే లీగల్​ సమస్యలపై యాదాద్రి భువనగిరి ప్రభుత్వ మెడికల్​ కాలేజీ ఫోరెన్సిక్​ మెడిసిన్​ హెచ్​ఓడీ ప్రొఫెసర్​ డా.లావణ్య కౌసిల్​ ప్రసంగించారు. హార్మోన్ల ప్రభావంపై ఉస్మానియా మెడికల్​ కాలేజీ ఎండోక్రానలజీ ప్రొఫెసర్​ డా.రాకేశ్​ కుమార్​ సహాయ్​, బీబీనగర్​ ఏయిమ్స్​ సైకియాట్రిక్​ అసోసియేట్​ ప్రొఫెసర్​ డా.మాలతేశ్​, ప్లాస్టిక్​ సర్జరీ ప్రొఫెసర్​ డా.పాలుకూరి లక్ష్మీ, సిద్దిపేట ప్రభుత్వ మెడికల్​ కాలేజీ గైనకాలజీ హెచ్​ఓడీ ప్రొ.మహాలక్ష్మీ, చేవేళ్ళ పట్నం మహేందర్​ రెడ్డి మెడికల్​ కాలేజీ ప్రిన్సిపాల్​ డా.డి.జోయరాణి లు సమావేశంలో ట్రాన్స్​ జెండర్లకు సంబందించిన అంశాలపై ప్రసంగించారు. కార్యక్రమంలో గాంధీ మెడికల్​ కాలేజీ ప్రిన్సిపాల్​ డా.కే.ఇందిర, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్​ ప్రొ.రాజకుమారి, సెమినార్​ చైర్​ పర్సన్​ప్రొఫెసర్​ రమాదేవి,  వైస్​ ప్రిన్సిపాల్​ డా.రవిశేఖర్​ రావు, డిప్యూటీ సూపరింటెండెంట్​ డా.సుభోద్​ కుమార్​, ఫిజియోలజీ మోహన్​ రెడ్డి, ఆయా ఆసుపత్రుల నుంచి వచ్చిన వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు
–––––––––––––
–ఫొటో

Tags
Join WhatsApp

More News...

అంగరంగ వైభవంగా శ్రీవారి కళ్యాణ మహోత్సవ వేడుకలు 

అంగరంగ వైభవంగా శ్రీవారి కళ్యాణ మహోత్సవ వేడుకలు  జగిత్యాల ఫిబ్రవరి 6 (ప్రజా మంటలు)పట్టణంలోని శ్రీ శ్రీనివాసా0 జనేయ భవాని శంకర దేవాలయంలో 66వ ఆలయ వార్షికోత్సవ సందర్భంగా శుక్రవారం సాయంత్రం శ్రీ శ్రీనివాస పద్మావతి ల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.స్వామివారి నామస్మరణతో ఆలయం అంతా మారుమోగింది. ఈ సందర్భంగా ప్రత్యేక వేదికపై ఉత్సవమూర్తులను...
Read More...
National  International   State News 

డాలర్‌పై రూపాయి పైచేయి: మూడేళ్లలోనే అతిపెద్ద లాభం, భారత్–అమెరికా ట్రేడ్ డీల్ ప్రభావం

డాలర్‌పై రూపాయి పైచేయి: మూడేళ్లలోనే అతిపెద్ద లాభం, భారత్–అమెరికా ట్రేడ్ డీల్ ప్రభావం న్యూఢిల్లీ ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు): డాలర్ ముందు రూపాయి తన బలాన్ని చాటింది. గత కొంతకాలంగా డాలర్ కారణంగా రూపాయి ఒత్తిడిని ఎదుర్కొన్నా, గత వారం ఒక్కసారిగా బలపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మూడేళ్లలోనే అత్యధిక లాభాన్ని నమోదు చేసింది. మొత్తం వారంలో రూపాయి 1.4 శాతం బలపడగా, ఇది జనవరి 2023 తర్వాత...
Read More...

షిల్లాంగ్ గని ప్రమాదంలో 25 కు చేరిన మృతుల సంఖ్య

షిల్లాంగ్ గని ప్రమాదంలో 25 కు చేరిన మృతుల సంఖ్య షిల్లాంగ్ ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు): మెఘాలయ రాష్ట్రంలో నిన్న జరిగిన బొగ్గు గని పేలుడు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 25కు చేరింది.  మరో ఏడుగురు మృతదేహాలు వెలికితీయడంతో మరణాల సంఖ్య పెరిగినట్లు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ఐ. నోంగ్రాంగ్ తెలిపారు. ఇప్పటివరకు 12...
Read More...

జగిత్యాల జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ లో  "స్కూలొంపిక్స్-2026" పేరిట క్రీడా ఉత్సవాలు

జగిత్యాల జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ లో   జగిత్యాల ఫిబ్రవరి 6 (ప్రజా మంటలు)జ్యోతి హై స్కూల్ ఐఐటి అకాడమీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే వార్షిక క్రీడోత్సవాలు ఈ సంవత్సరం *“స్కూలోంపిక్స్ –2026 Annual Sports Meet”* పేరుతో ఘనంగా నిర్వహించబడనున్నాయి. ఈ క్రీడోత్సవాలు 2026 ఫిబ్రవరి 6, 7 మరియు 8 తేదీలలో జగిత్యాల పట్టణంలోని గీతా విద్యాలయం గ్రౌండ్...
Read More...
State News 

విధి నిర్వహణలో మరణించిన ప్రమోద్, సౌమ్య కుటుంబాలకు ₹ కోటి చెక్కు అందజేసిన సీఎం

విధి నిర్వహణలో మరణించిన ప్రమోద్, సౌమ్య కుటుంబాలకు ₹ కోటి చెక్కు అందజేసిన సీఎం నిజామాబాద్ ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు): విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య కుటుంబానికి, అలాగే గతేడాది కత్తిపోటుతో మృతి చెందిన పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.1 కోటి చొప్పున ఆర్థిక సహాయ చెక్కులు అందజేశారు. ‘ప్రజా పాలన – ప్రగతి బాట’ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్...
Read More...

అధికార పార్టీ అండతోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే సంజయ్ కుమార్

అధికార పార్టీ అండతోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రాయికల్, ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు): రాయికల్ మండలం ఆలూరు, రాజ్‌నగర్ గ్రామాల్లో మహిళా సమాఖ్య భవనాల నిర్మాణానికి రూ.10 లక్షల చొప్పున మంజూరు కాగా, ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ భూమిపూజ నిర్వహించారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షిస్తూ, గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్య,...
Read More...

జగిత్యాలలో బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరు

జగిత్యాలలో బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరు జగిత్యాల, ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు): మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల పట్టణంలోని పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్నర్ మీటింగ్‌లు నిర్వహించింది. టీఆర్ నగర్‌లో 10, 11వ వార్డుల అభ్యర్థులు ఎంఏ కాశీం, దేవేందర్ నాయక్‌కు, బీరయ్య గుడి సమీపంలో 18, 19, 20వ వార్డుల అభ్యర్థులు ఏనుగుల భూమయ్య, భారతి సంతోష్,...
Read More...
Local News 

యావర్ రోడ్డు విస్తరణ, పట్టణ అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే సంజయ్ కుమార్

యావర్ రోడ్డు విస్తరణ, పట్టణ అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్యాల, ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు): జగిత్యాల మోతే రోడ్డులోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ, జగిత్యాల–రాయికల్ పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనే తన లక్ష్యమన్నారు. 2021లో జగిత్యాల పట్టణంలో 12 జోన్ల పరిధిలో 121 సర్వే నంబర్లను మార్చి, యావర్ రోడ్డుపై ఉన్న ప్రాంతాలను రెసిడెన్షియల్,...
Read More...

ఆర్టీఐపై ఐదేళ్ల నిర్లక్ష్యం: సమాచార కమిషన్ ఆదేశాలతో కదిలిన జగిత్యాల జిల్లా యంత్రాంగం

ఆర్టీఐపై ఐదేళ్ల నిర్లక్ష్యం: సమాచార కమిషన్ ఆదేశాలతో కదిలిన జగిత్యాల జిల్లా యంత్రాంగం గొల్లపల్లి (బుగ్గారం) ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాల్లో గత ఐదేళ్లుగా ఆర్టీఐ దరఖాస్తులకు సమాచారం ఇవ్వని విషయం అధికారికంగా వెలుగులోకి వచ్చింది. 2022 మే 17న చుక్క గంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆర్టీఐ దాఖలు చేసినప్పటికీ, ఇప్పటి వరకు సమాచారం అందించకపోవడంతో ఆయన...
Read More...
National  International   Crime  State News 

ఎపిస్టీన్‌తో లేఖల వ్యవహారం: హరిదీప్ సింగ్ పూరి వివరణపై సందేహాలు

ఎపిస్టీన్‌తో లేఖల వ్యవహారం: హరిదీప్ సింగ్ పూరి వివరణపై సందేహాలు హైదరాబాద్, ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు): జెఫ్రీ ఎపిస్టీన్‌కు సంబంధించిన కేసు డాక్యుమెంట్లు, ఈమెయిల్ రికార్డులపై తాజాగా బయటకొచ్చిన ఫోటోలు కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పూరి గతంలో ఇచ్చిన వివరణలపై సందేహాలను లేవనెత్తుతున్నాయి. అలాగే మాజీ ప్రధాన సమాచార కమీషనర్ యశ్వర్ధన్ సిన్హా పేరు కూడా బయటపడింది. మొదటి ఫోటోలో కనిపిస్తున్న ఈమెయిల్ ప్రకారం,...
Read More...

టీటీడీ ఈఓగా బాధ్యతలు చేపట్టిన ముద్దాడ రవిచంద్ర

టీటీడీ ఈఓగా బాధ్యతలు చేపట్టిన ముద్దాడ రవిచంద్ర తిరుమల, ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు): టీటీడీ ఈఓగా  బాధ్యతలు స్వీకరించనున్న ముద్దాడ రవిచంద్ర తిరుమలకు చేరుకున్నారు. ఆయనకు తిరుమలలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, తిరుపతి జేఈవో వీరభద్రం, సీవీఎస్ఓ మురళీకృష్ణ, సీపీఆర్‌ఓ రవి స్వాగతం పలికారు. ఈరోజు ఉదయం 10 గంటల 8 నిమిషాలకు ముద్దాడ రవిచంద్ర అధికారికంగా టీటీడీ ఈఓగా...
Read More...
Local News  State News 

బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్న వ్యక్తికి టికెట్ ఎలా?

బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్న వ్యక్తికి టికెట్ ఎలా? హైదరాబాద్, ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు): బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు పిటిషన్ వేసిన బుట్టంగారి మాధవ్ రెడ్డికి బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఇవ్వడాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. ఇది బీసీ రిజర్వేషన్లకు బీఆర్ఎస్ వ్యతిరేకమన్న స్పష్టమైన సంకేతమని ఆమె వ్యాఖ్యానించారు. బీసీలకు విద్య, ఉపాధి, రాజకీయాల్లో 42 శాతం...
Read More...