ట్రాన్స్​ జెండర్ల వైద్యంపై గాంధీలో సైంటిఫిక్​ సెషన్

టాఫిక్​పై అవెర్నెస్​   * ఆన్​లైన్​ లో పాల్గొన్న 300 , ఆఫ్​ లైన్​ లో 200 మంది వైద్యులు

On
ట్రాన్స్​ జెండర్ల వైద్యంపై గాంధీలో సైంటిఫిక్​ సెషన్

ట్రాన్స్​ జెండర్ల వైద్యంపై గాంధీలో సైంటిఫిక్​ సెషన్​
  * దేశంలోనే మొదటిసారిగా ఈ టాఫిక్​పై అవెర్నెస్​
  * ఆన్​లైన్​ లో పాల్గొన్న 300 , ఆఫ్​ లైన్​ లో 200 మంది వైద్యులు

సికింద్రాబాద్​ నవంబర్​ 02 (ప్రజామంటలు) :

ట్రాన్స్​ జెండర్ల వైద్యం, వారిలో వచ్చే మానసిక, శారీరక నిర్మాణాల్లో వ్యత్యాసాలు, హార్మోన్ల ప్రభావం తదితర అంశాల్లో డాక్టర్లకు అవగాహన కల్పించేందుకు గాను గాంధీ మెడికల్​ కాలేజీ ఫిజియోలజీ డిపార్ట్​ మెంట్​ ఆధ్వర్యంలో ఒక రోజు కంటిన్యూస్​ ప్రొఫెషనల్​ డెవలప్​మెంట్​ (సీపీడీ) సెమినార్​ నిర్వహించారు. దేశంలోనే మొదటిసారిగా జరిగిన ఈ రాష్ర్ట స్థాయి అవెర్నెస్​ సెమినార్​ లో రాష్ర్టంలోని పలు ప్రభుత్వ వైద్యశాలల్లోని ప్లాస్టిక్​ సర్జరీ, సైకాలజీ, ఫీజియోలజీ, ఎండొక్రనాలజీ, సైకియాట్రిక్​,ఫోరెన్సిక్​, తదితర డిపార్ట్​ మెంట్ వైద్య నిపుణులు పాల్గొని ఆఫ్​ లైన్​ లో 200 మంది, ఆన్​ లైన్​ లో 300 మంది మొత్తం 500 మంది డాక్టర్లకు  ట్రాన్స్​ జెండర్ల వైద్యంపై వివరించారు. ఈసందర్బంగా ప్రొగ్రామ్​ చైర్​పర్సన్​, గాంధీ మెడికల్ కాలేజీ ఫిజియోలజీ ప్రొఫెసర్​ రమాదేవి మాట్లాడుతూ..దేశంలో ప్రస్తుతం ట్రాన్స్​ జెండర్ల హక్కుల కోసం వాయిస్​ పెరుగుతుందని, ఈ నేపద్యంలో ట్రాన్స్​ జెండర్లకు కూడ మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం రాష్ర్టంలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో 32 ట్రాన్స్​ జెండర్ల కు ప్రత్యేక వైద్య విభాగాలను ఏర్పాటు చేసిందన్నారు.  త్వరలో గాంధీ ఆసుపత్రిలో ట్రాన్స్​ జెండర్లకు ప్రత్యేక క్లినిక్​ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో మెడిసిన్​ చేసిన డాక్టర్​ ప్రాచీ రాథోడ్​  ప్రస్తుతం నిజామాబాద్​ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఆర్థోపెడిక్​ లో పీజీ చేస్తుందన్నారు. దేశంలో ప్రథమ ట్రాన్స్​ జెండర్​ పీజీ డాక్టర్ గా ఆమె ఖ్యాతి పాధించిందన్నారు. ఈసందర్బంగా డా.ప్రాచీ రాథోడ్​ సెషన్​ కు హాజరై ట్రాన్స్​ జెండర్​ గా తనకు ఎదురైన అరోగ్య, మానసిక సమస్యలు, తదితర అంశాలపై సమావేశంలో తన ప్రసంగంలో వివరించారు. అలాగే ట్రాన్స్​ జెండర్​ గా మార్పు చెందిన తర్వాత వచ్చే లీగల్​ సమస్యలపై యాదాద్రి భువనగిరి ప్రభుత్వ మెడికల్​ కాలేజీ ఫోరెన్సిక్​ మెడిసిన్​ హెచ్​ఓడీ ప్రొఫెసర్​ డా.లావణ్య కౌసిల్​ ప్రసంగించారు. హార్మోన్ల ప్రభావంపై ఉస్మానియా మెడికల్​ కాలేజీ ఎండోక్రానలజీ ప్రొఫెసర్​ డా.రాకేశ్​ కుమార్​ సహాయ్​, బీబీనగర్​ ఏయిమ్స్​ సైకియాట్రిక్​ అసోసియేట్​ ప్రొఫెసర్​ డా.మాలతేశ్​, ప్లాస్టిక్​ సర్జరీ ప్రొఫెసర్​ డా.పాలుకూరి లక్ష్మీ, సిద్దిపేట ప్రభుత్వ మెడికల్​ కాలేజీ గైనకాలజీ హెచ్​ఓడీ ప్రొ.మహాలక్ష్మీ, చేవేళ్ళ పట్నం మహేందర్​ రెడ్డి మెడికల్​ కాలేజీ ప్రిన్సిపాల్​ డా.డి.జోయరాణి లు సమావేశంలో ట్రాన్స్​ జెండర్లకు సంబందించిన అంశాలపై ప్రసంగించారు. కార్యక్రమంలో గాంధీ మెడికల్​ కాలేజీ ప్రిన్సిపాల్​ డా.కే.ఇందిర, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్​ ప్రొ.రాజకుమారి, సెమినార్​ చైర్​ పర్సన్​ప్రొఫెసర్​ రమాదేవి,  వైస్​ ప్రిన్సిపాల్​ డా.రవిశేఖర్​ రావు, డిప్యూటీ సూపరింటెండెంట్​ డా.సుభోద్​ కుమార్​, ఫిజియోలజీ మోహన్​ రెడ్డి, ఆయా ఆసుపత్రుల నుంచి వచ్చిన వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు
–––––––––––––
–ఫొటో

Tags
Join WhatsApp

More News...

Local News 

ఎస్ ఎస్ ఎస్ ఎం హై స్కూల్ ఎస్ ఎస్ సి ర్యాంకర్లకు అభినందనలు

ఎస్ ఎస్ ఎస్ ఎం హై స్కూల్ ఎస్ ఎస్ సి ర్యాంకర్లకు అభినందనలు జగిత్యాల ఏప్రిల్ 29 ( ప్రజా మంటలు) జిల్లా కేంద్రానికి చెందిన ఎస్ ఎస్ ఎస్ ఎం హై స్కూల్ కు చెందిన సింగిడి చక్రిత 561/600, ఎంబారి చరణ్ 547/600 బుధవారం విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించినారు. 500 పైబడి 45 శాతం విద్యార్థులు ఫలితాలు సాధించారు. 100% విద్యార్థులు ఉత్తీర్ణత...
Read More...
Local News 

ఎస్ఎస్ఎస్సి లో578/600 మార్కులు సాధించిన పాలెపు హాసిని శర్మను అభినందించిన పాఠశాల యాజమాన్యం

ఎస్ఎస్ఎస్సి లో578/600 మార్కులు సాధించిన పాలెపు హాసిని శర్మను అభినందించిన పాఠశాల యాజమాన్యం జగిత్యాల ఏప్రిల్ 29 ( ప్రజా మంటలు)  పొలాస గ్రామానికి చెందిన పాలెపు రాజు కూతురు పాలెపు హాసిని శర్మ జిల్లా కేంద్రంలోని శ్రీనిధి ఒలంపియాడ్ పాఠశాలలో చదువుచున్నది. బుధవారం విడుదలైన ఎస్ఎస్ఎస్సి ఫలితాలలో 578/600 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా శ్రీనిధి ఒలంపియాడ్ పాఠశాల కరస్పాండెంట్ ఎం రాజేందర్ ప్రిన్సిపల్ మేఘమాల డైరెక్టర్
Read More...
Local News 

SSC ఫలితాలలో  రాష్ట్ర స్థాయిలో సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం

SSC ఫలితాలలో  రాష్ట్ర స్థాయిలో సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం    జగిత్యాల ఏప్రిల్ 29 ( ప్రజా మంటలు) పట్టణంలోని సిద్ధార్థ విద్యా సంస్థలు  మరోసారి తమ ప్రతిభను చాటుకుంటూ SSC ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో అద్భుత విజయాన్ని సాధించాయి.  ఈరోజు విడుదలైన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో రాష్ట్ర స్థాయి లో 591, 590  మార్కులతో  జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచారు. అదే విధంగా...
Read More...
Local News 

పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేయాలి-రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేయాలి-రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి ఏప్రిల్ 28 (ప్రజా మంటలు) రానున్న 2027  గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై  సమీక్షపుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.2027లో జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్ల నేపథ్యంలో చేపట్టాల్సిన భూసేకరణ (ల్యాండ్ అక్విజిషన్) మరియు దేవాలయ అభివృద్ధి పనులపై  టెంపుల్ మాస్టర్...
Read More...
Local News 

రాష్ట్ర ప్రభుత్వం వాసవి మాత జయంతి ప్రభుత్వ పరంగా నిర్వహించడం హర్షణీయం... - ఎమ్మెల్యే సంజయ్ కుమార్

రాష్ట్ర ప్రభుత్వం వాసవి మాత జయంతి ప్రభుత్వ పరంగా నిర్వహించడం హర్షణీయం...  - ఎమ్మెల్యే సంజయ్ కుమార్    జగిత్యాల ఏప్రిల్ 26 (ప్రజా మంటలు) శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతా జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణం లో ఆర్య వైశ్య సంఘం ఆద్వర్యం లో జయంతి వేడుకల్లో పాల్గొని పోచమ్మ ఆలయం నుండి వాసవి మాత ఆలయానికి వాసవి కన్యకా పరమేశ్వరి మాతని పల్లకిలో తీసుకొచ్చే కార్యక్రమంలో పాల్గొని పల్లకి మోసి ప్రత్యేక...
Read More...
Local News 

ఘనంగా వాసవీ మాత జయంతి వేడుకలు

ఘనంగా వాసవీ మాత జయంతి వేడుకలు జగిత్యాల ఏప్రిల్ 26 ( ప్రజా మంటలు)  జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో  వాసవీ మాత జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బి. ఎస్.లత పాల్గొన్నారు.*ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బి.ఎస్.లత మాట్లాడుతూ*  వాసవీ మాత        
Read More...
Local News 

ఈత సరదాకు వెళ్ళి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు

ఈత సరదాకు వెళ్ళి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు    బుగ్గారం ఏప్రిల్ 26 ( ప్రజా మంటలు)  సర్పంచ్ లు గ్రామాలలో టామ్ - టామ్ చేయించాలి బుగ్గారం ఎస్సై జి.సతీష్  వేసవి కాలం కదా అని ఈత సరదాతో బావుల్లోకి, చెరువుళ్ళోకి  వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని జగిత్యాల జిల్లా బుగ్గారం ఎస్సై జి.సతీష్ అన్నారు. ఆదివారం ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక...
Read More...
Local News  Crime 

పెళ్లి వేడుకలో విషాదం – సరదా ఈత ప్రాణం తీసింది… 13 ఏళ్ల బాలుడు మృతి

పెళ్లి వేడుకలో విషాదం – సరదా ఈత ప్రాణం తీసింది… 13 ఏళ్ల బాలుడు మృతి గొల్లపల్లి, ఏప్రిల్ 26 (ప్రజా మంటలు): పెళ్లి వేడుకలో పాల్గొన్న అనంతరం సరదాగా ఈతకు వెళ్లిన బాలుడు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఘటన జగిత్యాల జిల్లాలో విషాదాన్ని నింపింది.బుగ్గారం మండలం బీర్సాని గ్రామానికి చెందిన కాంపెళ్లి రితేష్ (13) గొల్లపల్లి మండలం లోతునూరు గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యాడు. మధ్యాహ్న సమయంలో స్నేహితులతో...
Read More...
Local News 

ఘనంగా సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు

ఘనంగా సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు . జగిత్యాల ఏప్రిల్ 26( ప్రజా మంటలు)వాల్మీకి ఆవాసం సేవాభారతి అధ్వర్యంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆదివారం ఉదయం 11 గంటలకు ఘనంగా నిర్వహించారు. జగిత్యాల పట్టణం ధరూర్ క్యాంపులో గ్రామీణ నిరుపేద విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న  వాల్మీకి ఆవాసంలో ప్రతి సంవత్సరం వేసవి సెలవుల అనంతరం సామూహిక సత్యనారాయణ స్వామి...
Read More...
State News 

“తెలంగాణ వాదాన్ని ఎవరు చంపారు? ఎవరు కాపాడుతున్నారు?”

“తెలంగాణ వాదాన్ని ఎవరు చంపారు? ఎవరు కాపాడుతున్నారు?”    హైదరాబాద్, ఏప్రిల్ 26 (ప్రజా మంటలు): తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపుతూ టీఆర్ఎస్ నేత నవీన్ ఆచారి బీఆర్ఎస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కవిత  ప్రకటించిన “తెలంగాణ రాష్ట్ర సేన” నేపథ్యంలో బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా మారిందని తెలంగాణ రాష్ట్ర సేన నాయకులు రూప్ సింగ్, నవీనాచరి, ఇస్మాయిల్, వరలక్ష్మి, తదితరులు విమర్శించారు....
Read More...
Local News 

ఉద్యమ స్ఫూర్తికి గౌరవం – ఎమ్మెల్సీగా కోదండరాం నియామకంపై శుభాకాంక్షల వెల్లువ

ఉద్యమ స్ఫూర్తికి గౌరవం – ఎమ్మెల్సీగా కోదండరాం నియామకంపై శుభాకాంక్షల వెల్లువ జగిత్యాల, ఏప్రిల్ 25 (ప్రజా మంటలు): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్. కోదండరాం ఎమ్మెల్సీగా నియామకం కావడం పట్ల తెలంగాణ జన సమితి నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యమ రథసారధిగా ప్రజల ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లిన ఆయనకు ఈ పదవి లభించడం సముచిత గౌరవమని...
Read More...
National  State News 

మన కేసీఆర్ కాదు… మారిన మనిషి!” – బీఆర్ఎస్‌పై తీవ్ర దాడి, కొత్త పార్టీతో అధికారమే లక్ష్యం

మన కేసీఆర్ కాదు… మారిన మనిషి!” – బీఆర్ఎస్‌పై తీవ్ర దాడి, కొత్త పార్టీతో అధికారమే లక్ష్యం హైదరాబాద్ ఏప్రిల్ 25 (ప్రజా మంటలు); తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపేలా జాగృతి నేత కేసీఆర్‌పై నేరుగా, నిర్భయంగా విరుచుకుపడ్డారు. “ఇవ్వాళ ఉన్నది మన కేసీఆర్ కాదు… మారిన మనిషి” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ సమయంలో ప్రజల కోసం పోరాడిన నాయకుడు, ఇప్పుడు ప్రజలను పట్టించుకోని పాలకుడిగా మారిపోయాడని విమర్శించారు.నీళ్లు, నిధులు,...
Read More...