గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21-27 వ తేదీ వరకు
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21-27 వ తేదీ వరకు
- రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి.
హైదరాబాద్ అక్టోబర్ 17:
ఈనెల 21 వ తేదీ నుండి 27 వ తేదీ వరకు జరిగే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను ఏవిధమైన పొరపాట్లు లేకుండా అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి స్పష్టం చేశారు.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, సంబంధిత ఉన్నతాధికారులతో నేడు సచివాలయం నుండి వీడియో కాన్ఫ రెన్స్ నిర్వహించి సమీక్షించారు.
తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమీషన్ కార్యాలయం నుండి కమీషన్ చైర్మన్ డా. మహేందర్ రెడ్డి, సభ్యులు పాల్గొనగా, సచివాలయం నుండి డీజీపీ జితేందర్, కమీషన్ కార్యదర్శి నవీన్ నికోలస్, SPDCL MD ముష్రాఫ్ అలీ, రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కర్ణన్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు అనుదీప్, శశాంక్, గౌతమ్ తదితర అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా సి.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. దీనికోసం 46 పరీక్షా కేంద్రాలను హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఏర్పాటు చేశామని వివరించారు.
ఈ పరీక్షలు నిర్వహించే అన్ని కేంద్రాల వద్ద ఏవిధమైన అవకతవకలు,అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు, విస్తృత స్థాయిలో సీనియర్ అధికారులతో పర్యవేక్షణను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్లు నేరుగా ఈ పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తారని,సంబంధిత పోలీస్ కమీషనర్లు కూడా తగు బందోబస్తు ఏర్పాట్లను చేపడుతారని తెలిపారు. అన్ని శాఖల అధికారులు ఏవిధమైన స్వల్ప సంఘటనలు జరుగకుండా అత్యంత అప్రమత్తంగా ఈ పరీక్షల నిర్వహణా విధులు నిర్వహించాలని పేర్కొన్నారు.
TGPSC చైర్మన్ డా. ఎం. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, 2011 సంవత్సరం అనంతరం గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయని, కొన్ని సంవత్సరాల అనంతరం జరిగే ఈ పరీక్షల నిర్వహణలో ప్రతీ అంశంలోనూ అత్యంత జాగ్రత్తగా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఆధునిక సాంకేతికత, సోషల్ మీడియా ఆక్టివ్ గా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ కూడా సవాలుతో కూడుకుంటున్నదని, ఈ నేపథ్యంలో ఏవిధమైన అపోహలు, పుకార్లకు తావివ్వకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని మహేందర్ రెడ్డి అన్నారు.
గ్రూప్ -1 జరిగే అన్ని పరీక్షా కేంద్రాల వద్ద విస్తృతమైన బందోబస్తు తోపాటు పరీక్షలు ప్రశాంతంగా కొనసాగేందుకు అన్ని చర్యలు చేపట్టామని డీజీపీ జితేందర్ తెలిపారు.
TGPSC కార్యదర్శి నవీన్ నికోలస్ మాట్లాడుతూ, హైదరాబాద్ జిల్లాలో 8 , రంగారెడ్డి జిల్లాలో 11 , మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27 మొత్తం 46 కేంద్రాలలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి పరీక్ష హాల్, చీఫ్ సూపరింటెండెంట్ రూమ్, పరిసర ప్రాంతాలన్నింటిలోనూ సీసీ టీవీ లను ఏర్పాటు చేసి, TGPSC కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. పరీక్షల నిర్వహణలో ప్రతి స్టెప్ లోనూ కచ్చితమైన నియమ నిబంధనలు పాటించేలా స్పష్టమైన మార్గదర్శకాలు అందచేశామని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు తీసుకునేందుకై ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు, మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించేది లేదని స్పష్టం చేశారు.
ఇప్పటికే, 85 శాతం అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకున్నారని తెలిపారు. దివ్యాంగులకు ప్రత్యేకంగా ఒక గంటను అదనంగా కేటాయిస్తున్నట్టు చెప్పారు. ఎవరికైతే పరీక్ష రాయడానికి సహాయకులు (స్క్రైబ్ ) అవసరమో, ఆ అభ్యర్థుల హాల్ టికెట్లపై ప్రత్యేకంగా పేర్కొనడం జరిగిందని, స్క్రైబ్ ల సహాయంతో పరీక్షలు వ్రాసే వారికి ప్రత్యేకంగా 4 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కార్యదర్శి వెల్లడించారు.
అన్నిపరీక్షా కేంద్రాల 46 వద్ద ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కర్ణన్ తెలిపారు. నిరంతరం విధ్యుత్ సరఫరా అందించేవిధంగా చర్యలు చేపట్టినట్టు, ఇందుకుగాను ముగ్గురు సి.ఈ లు పర్యవేక్షిస్తారని SPDCL ఎండీ ముషారఫ్ అలీ అన్నారు. అన్ని కేంద్రాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
--
More News...
<%- node_title %>
<%- node_title %>
ఐ–బొమ్మ పైరసీ వెబ్సైట్ లో సంచలన ప్రకటన
హైదరాబాద్, నవంబర్ 17 (ప్రజా మంటలు):
ఇన్నాళ్లు పోలీసులను చాలెంజ్ చేసిన ibomma సంచలన ప్రకటనను తన వెబ్సైట్ లో పోస్ట్ చేసింది.
ఐ–బొమ్మ తన ప్రకటనలో, “ఈ మధ్యలో మీరు మా గురించి విన్నే ఉంటారు… మొదటి నుంచీ మా విశ్వసనీయ అభిమానులుగా ఉన్నారు… కానీ ఇప్పుడు మా సేవలను నిలిపివేస్తున్నాం. దేశవ్యాప్తంగా మా... ఖమ్మం జాగృతి జనంబాటలో సమస్యలపై కవిత విమర్శలు, పరిశీలనలు
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జాగృతి జనంబాటలో భాగంగా కవిత పర్యటన. మోడల్ స్కూల్ సమస్యలు, సీతారామ ఎత్తిపోతల పథకం ఆలస్యం, సింగరేణి కార్మికుల ఇబ్బందులు, వైరా మార్కెట్ సమస్యలు, ప్రజా సమస్యలపై కీలక వ్యాఖ్యలు. సమగ్ర కథనం 15 దుకాణాలకు ఓపెన్ వేలం వేసి కేటాయించండి. - ప్రజావాణికి వినతి పత్రం సమర్పణ
సికింద్రాబాద్, నవంబర్ 17 (ప్రజామంటలు) :
బన్సీలాల్ పేట డివిజన్ లోని న్యూ బోయిగూడ, ఐడీహెచ్ కాలనీల పరిధిలోని 15 జీహెచ్ఎమ్ సీ షాపింగ్ కాంప్లెక్స్ లల్లోని మొత్తం 15 దుకాణాలకు కొత్తం ఓపెన్ వేలం వేసి, అర్హులకు కేటాయించాలని సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ నార్త్ జోన్ అధికారులకు కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు ఐత చిరంజీవి సోమవారం... దార్జిలింగ్ గోర్ఖా సమస్యపై మమతా బెనర్జీ లేఖ – ఇంటర్లాక్యూటర్ నియామకం రద్దు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి
హైదరాబాద్, నవంబర్ 17 (ప్రజా మంటలు):పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. దార్జిలింగ్ కొండ ప్రాంతంలోని గోర్ఖా సమస్యలపై చర్చలు నిర్వహించేందుకు కేంద్రం నియమించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి నియామకాన్ని రద్దు చేయాలంటూ ఆమె పునరుద్ఘాటించారు. గోర్ఖాల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషించాలనే... తల్లిదండ్రులను వేదిస్తున్న కొడుకులు -ఎస్పీ, ఆర్డీవో లకు ఫిర్యాదులు.
జగిత్యాల నవంబర్ 17 (ప్రజా మంటలు):
కడుపున పుట్టిన పిల్లలే వృద్దాప్యంలో ఉన్న తల్లి దండ్రులను వేధింపులకు గురిచేస్తూ, చంపుత మని బెదిరిస్తూ, చివరకు ఇంట్లోంచి గెంటి వేస్తున్నారు. జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామానికి చెందిన గుగ్గిళ్ల నర్సవ్వ( 80) అనే వృద్దురాలిని ఆమె నడిపి కొడుకు, కోడలు తన స్వంత ఇంటి లోనుంచి... డెఫ్లింపిక్స్లో స్వర్ణం సాధించిన ధనుష్ శ్రీకాంత్కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
జపాన్ డెఫ్లింపిక్స్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణ పతకం, ప్రపంచ రికార్డు సాధించిన హైదరాబాద్ షూటర్ ధనుష్ శ్రీకాంత్కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు. యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచిన ధనుష్కు ప్రభుత్వ అండ. సౌదీ అరేబియా బస్సు ప్రమాదం: 45 మంది రాష్ట్రవాసులు: ,: తెలంగాణ కేబినెట్ 5 లక్షల పరిహారం
హైదరాబాద్, నవంబర్ 17 (ప్రజా మంటలు):సౌదీ అరేబియాలో మక్కా నుంచి మదీనాకు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణకు చెందిన యాత్రికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ సానుభూతి ప్రకటించింది. ఈ దుర్ఘటనపై జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేసి, బాధిత కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల... డిసెంబర్ మొదటివారంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్
హైదరాబాద్, నవంబర్ 17 (ప్రజా మంటలు):
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు వేగం పెరిగింది. ఈరోజు సమావేశమైన రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలను తీసుకుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలను ముందుగానే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. ముఖ్యంగా రిజర్వేషన్లపై హైకోర్టు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని, 50 శాతం మించకుండా రిజర్వేషన్లు అమలు... రాజేశ్ ను పోలీసులు చిత్రహింసలు చేసి, చంపారు.?
విచారణ చేయకుండానే రిమాండ్ చేశారని ఆరోపణ
గాంధీ ఆసుపత్రి వద్ద ఫ్యామిలీమెంబర్స్, ధర్మ స్టూడెంట్స్ నేతల ఆందోళన టూరిజం మేనేజ్మెంట్లో డా. దినేష్ కుమార్ గట్టుకు పిహెచ్.డి
హైదరాబాద్, నవంబర్ 17 (ప్రజా మంటలు):
చైతన్య (డీమ్డ్ టు బి యూనివర్సిటీ) డా. దినేష్ కుమార్ గట్టుకు టూరిజం మేనేజ్మెంట్లో పిహెచ్.డి డాక్టోరల్ డిగ్రీని ప్రకటించింది. ఆయన పరిశోధన ‘తెలంగాణలోని అమ్యూజ్మెంట్ పార్కులపై పర్యాటకుల అవగాహన, వైఖరి మరియు సంతృప్తి’పై ఆధారితం. ఈ పరిశోధన ప్రొఫెసర్ జి. విజయ్ పర్యవేక్షణలో పూర్తయింది. యూనివర్సిటీ అధికారులు... రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుల చొరవ- రహదారి పక్కన దట్టంగా పెరిగిన పొదల తొలగింపు
మేడిపల్లి నవంబర్ 17 ( ప్రజా మంటలు)జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణనే ప్రధాన లక్ష్యంగా జిల్లా ఎస్పి అశోక్ కుమార్, ఆదేశాల మేరకు మేడిపల్లి ఎస్ఐ శ్రీధర్ రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు.
రంగా పూర్ – భీమరం రహదారిపై ఫ్లడ్ కాలువ సమీపంలోని మూలమలుపు(కర్వ్ పాయింట్)లో దట్టంగా పెరిగిన పొదలు, మొక్కలు కారణంగా... ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కార మార్గం చూపాలి వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల నవంబర్ 17 (ప్రజా మంటలు)ప్రజావాణి ఫిర్యాదుల సంఖ్య : 24
ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అదేశించారు.
సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను అదనపు కలెక్టర్ లు మరియు ఆర్డీఓల... 