గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21-27 వ తేదీ వరకు

On
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21-27 వ తేదీ వరకు

గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21-27 వ తేదీ వరకు
- రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి.   
 హైదరాబాద్ అక్టోబర్ 17:

 ఈనెల 21 వ తేదీ నుండి 27 వ తేదీ వరకు జరిగే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను ఏవిధమైన పొరపాట్లు లేకుండా అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి స్పష్టం చేశారు.

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, సంబంధిత ఉన్నతాధికారులతో నేడు సచివాలయం నుండి వీడియో కాన్ఫ రెన్స్ నిర్వహించి సమీక్షించారు.

తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమీషన్ కార్యాలయం నుండి కమీషన్ చైర్మన్ డా. మహేందర్ రెడ్డి, సభ్యులు పాల్గొనగా, సచివాలయం నుండి డీజీపీ జితేందర్, కమీషన్ కార్యదర్శి నవీన్ నికోలస్, SPDCL MD ముష్రాఫ్ అలీ, రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కర్ణన్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు అనుదీప్, శశాంక్, గౌతమ్ తదితర అధికారులు హాజరయ్యారు. 


    ఈ సందర్బంగా    సి.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ,  గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు.  దీనికోసం 46 పరీక్షా కేంద్రాలను హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఏర్పాటు చేశామని వివరించారు.

ఈ పరీక్షలు నిర్వహించే అన్ని కేంద్రాల వద్ద ఏవిధమైన అవకతవకలు,అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు, విస్తృత స్థాయిలో సీనియర్ అధికారులతో పర్యవేక్షణను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్లు నేరుగా ఈ పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తారని,సంబంధిత పోలీస్ కమీషనర్లు కూడా తగు బందోబస్తు ఏర్పాట్లను చేపడుతారని తెలిపారు. అన్ని శాఖల అధికారులు ఏవిధమైన స్వల్ప సంఘటనలు జరుగకుండా అత్యంత అప్రమత్తంగా ఈ పరీక్షల నిర్వహణా విధులు నిర్వహించాలని పేర్కొన్నారు. 


 TGPSC చైర్మన్ డా. ఎం. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, 2011 సంవత్సరం అనంతరం గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయని, కొన్ని సంవత్సరాల అనంతరం జరిగే ఈ పరీక్షల నిర్వహణలో ప్రతీ అంశంలోనూ అత్యంత జాగ్రత్తగా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఆధునిక సాంకేతికత, సోషల్ మీడియా ఆక్టివ్ గా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ కూడా సవాలుతో కూడుకుంటున్నదని, ఈ నేపథ్యంలో ఏవిధమైన అపోహలు, పుకార్లకు తావివ్వకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని మహేందర్ రెడ్డి అన్నారు.

గ్రూప్ -1  జరిగే అన్ని పరీక్షా కేంద్రాల వద్ద విస్తృతమైన బందోబస్తు తోపాటు పరీక్షలు ప్రశాంతంగా కొనసాగేందుకు అన్ని చర్యలు చేపట్టామని డీజీపీ జితేందర్ తెలిపారు. 
 

TGPSC కార్యదర్శి నవీన్ నికోలస్ మాట్లాడుతూ, హైదరాబాద్ జిల్లాలో 8 , రంగారెడ్డి జిల్లాలో 11 , మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27  మొత్తం 46 కేంద్రాలలో  గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి పరీక్ష హాల్, చీఫ్ సూపరింటెండెంట్ రూమ్, పరిసర ప్రాంతాలన్నింటిలోనూ సీసీ టీవీ లను ఏర్పాటు చేసి, TGPSC కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. పరీక్షల నిర్వహణలో ప్రతి స్టెప్ లోనూ కచ్చితమైన నియమ నిబంధనలు పాటించేలా స్పష్టమైన మార్గదర్శకాలు అందచేశామని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు తీసుకునేందుకై ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు, మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించేది లేదని స్పష్టం చేశారు.

ఇప్పటికే, 85 శాతం అభ్యర్థులు తమ హాల్ టికెట్లను  డౌన్ లోడ్ చేసుకున్నారని తెలిపారు. దివ్యాంగులకు ప్రత్యేకంగా ఒక గంటను అదనంగా కేటాయిస్తున్నట్టు చెప్పారు. ఎవరికైతే పరీక్ష రాయడానికి సహాయకులు (స్క్రైబ్ ) అవసరమో, ఆ అభ్యర్థుల హాల్ టికెట్లపై ప్రత్యేకంగా పేర్కొనడం జరిగిందని, స్క్రైబ్ ల సహాయంతో పరీక్షలు వ్రాసే వారికి ప్రత్యేకంగా 4 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కార్యదర్శి వెల్లడించారు.

అన్నిపరీక్షా కేంద్రాల 46 వద్ద ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కర్ణన్ తెలిపారు. నిరంతరం విధ్యుత్ సరఫరా అందించేవిధంగా చర్యలు చేపట్టినట్టు, ఇందుకుగాను ముగ్గురు సి.ఈ లు పర్యవేక్షిస్తారని SPDCL ఎండీ ముషారఫ్ అలీ అన్నారు. అన్ని కేంద్రాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. 
--

Tags
Join WhatsApp

More News...

బేగంపేట ప్రజా భవన్ ఎదుట ఉద్రిక్తత – తెలంగాణ జాగృతి నేతలు, మహిళల అరెస్టు

బేగంపేట ప్రజా భవన్ ఎదుట ఉద్రిక్తత – తెలంగాణ జాగృతి నేతలు, మహిళల అరెస్టు హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ప్రజా మంటలు): బేగంపేటలోని ప్రజా భవన్ ముందు తెలంగాణ జాగృతి నాయకులు, మహిళలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. మహిళలను అరెస్ట్ చేస్తున్న దృశ్యాలను చిత్రీకరిస్తున్న జాగృతి కార్యాలయ ఉద్యోగి లక్ష్మణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇవ్వాలన్న ఎన్నికల హామీని అమలు చేయాలని, అలాగే అంగన్‌వాడీ...
Read More...
National  Comment  International  

రష్యా - అమెరికా ఒకటైతే బంగారం ధర పడిపోతుందా?

రష్యా - అమెరికా ఒకటైతే బంగారం ధర పడిపోతుందా? బంగారం ధర ₹1 లక్షకు పడిపోతుందా? – గ్లోబల్ పవర్ షిఫ్ట్ వెనుక అసలు కథ. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1.57 లక్షలు.ఇది సాధారణ పెరుగుదల కాదు — ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నమ్మకం కదిలిన సంకేతం. ఇప్పుడు ప్రశ్న:👉 ఈ...
Read More...

జిల్లా బీజేపీ అధ్యక్షునిపై కౌన్సిలర్ల దాడి: కౌన్సిలర్ మీనా సస్పెన్షన్

జిల్లా బీజేపీ అధ్యక్షునిపై కౌన్సిలర్ల దాడి: కౌన్సిలర్ మీనా సస్పెన్షన్ మెట్‌పల్లి ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు): మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించినప్పటికీ, పార్టీ అధ్యక్షుడు రాచకొండ యాదగిరి మున్సిపల్ చైర్మన్ పదవి సాధించేందుకు ప్రయత్నించలేదని, కౌన్సిలర్లకు విప్ కూడా జారీ చేయలేదని ఆరోపిస్తూ కొంతమంది పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన నివాసంపై దాడికి దిగినట్లు సమాచారం. ఈ...
Read More...
State News 

తెలంగాణ జాగృతిలో చేరిన మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య కుమారుడు మనోహర్

తెలంగాణ జాగృతిలో చేరిన మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య కుమారుడు మనోహర్ హైదరాబాద్  ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు): బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, దివంగత మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య కుమారుడు కావేటి మనోహర్ కుమార్ తెలంగాణ జాగృతిలో చేరారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మనోహర్ కుమార్‌కు కండువా కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు. మనోహర్ కుమార్‌తో పాటు...
Read More...

కాంగ్రెస్ పార్టీలో కొనసాగడంపై ఆలోచిస్తున్నా… భవిష్యత్ ఏంటో గోచరించట్లేదు : మాజీ మంత్రి జీవన్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీలో కొనసాగడంపై ఆలోచిస్తున్నా… భవిష్యత్ ఏంటో గోచరించట్లేదు : మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు)కాంగ్రెస్ పార్టీలో తన భవిష్యత్‌పై ఆలోచిస్తున్నానని మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ —“భవిష్యత్ ఏంటో నాకు గోచరించట్లేదు. అవమానాలు ఇంకెంత కాలం భరించాలి?” అని ఆవేదన...
Read More...
Filmi News  State News 

జగిత్యాల లో సినీ హీరో అర్జున్ సందడి…

జగిత్యాల లో సినీ హీరో అర్జున్ సందడి… జగిత్యాల ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు) జగిత్యాల పట్టణంలో సినీ హీరో అర్జున్ సందడి చేశారు. స్థానిక శ్రీనివాస థియేటర్లో అర్జున్ మరియు ఆయన కుమార్తె ఐశ్వర్య అర్జున్ నటించిన సీతా పయనం చిత్రం ప్రదర్శింపబడుతున్న సందర్భంగా, మ్యాట్నీ షో సమయంలో థియేటర్‌ను సందర్శించి ప్రేక్షకులతో కలిసి సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ,...
Read More...

గాంధీ ఆసుపత్రి ఆవరణలో నిరాశ్రయుల దుర్బర జీవితం…

గాంధీ ఆసుపత్రి ఆవరణలో నిరాశ్రయుల దుర్బర జీవితం… సికింద్రాబాద్, ఫిబ్రవరి 16 ( ప్రజామంటలు):  గాంధీ ఆసుపత్రి ఆవరణలో ఆశ్రయం లేక జీవనం సాగిస్తున్న నిరాశ్రయుల జీవితాలు గుండెల్ని పిండేసే  దృశ్యాలుగా మారుతున్నాయి. ఎవరి ఆదరణ లేక, కనీస సౌకర్యాలు లేక కొందరు ఫుట్‌పాత్‌లనే ఇంటిగా మార్చుకుని రోజులు గడుపుతున్నారు. అన్నదానాల కోసం చేరిన వారు, కాలక్రమేణా అక్కడే జీవితం గడపాల్సిన పరిస్థితికి చేరుకున్నారు.అనారోగ్యంతో...
Read More...

న్యాయవాది ఖాదీర్ హత్య నిందితులకు కఠిన శిక్షలు విధించాలి

న్యాయవాది ఖాదీర్ హత్య నిందితులకు కఠిన శిక్షలు విధించాలి మెట్టుపల్లి ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు – దగ్గుల అశోక్) రంగారెడ్డి బార్ అసోసియేషన్ సభ్యులు యండి. ఖాదీర్పై దాడి చేసి హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని మెట్టుపల్లి బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పసునూరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం మెట్టుపల్లి కోర్టులో న్యాయవాదులు ఖాదీర్ హత్యకు...
Read More...

హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గా దండి లక్ష్మీ కొమురయ్య

హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గా దండి లక్ష్మీ కొమురయ్య హుస్నాబాద్ | ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు) సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో నేడు జరిగిన ప్రత్యేక సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. 14వ వార్డు సభ్యులు దండి లక్ష్మీ కొమురయ్యను హుస్నాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా, 7వ వార్డు సభ్యులు చిత్తారి పద్మ రవీందర్ను వైస్ చైర్‌పర్సన్‌గా...
Read More...
Local News 

రాయికల్ మున్సిపల్ పీఠంపై ఎగిరిన గులాబీ జెండా

రాయికల్ మున్సిపల్ పీఠంపై ఎగిరిన గులాబీ జెండా ఐదు సీట్లు గెలుచుకున్న బీజేపీ లో నిరాశ రాయికల్  ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు): జగిత్యాల నియోజకవర్గంలోని రాయికల్ పట్టణ మున్సిపాలిటీపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పట్టు సాధించింది. మొత్తం 7 మంది కౌన్సిలర్ల మద్దతుతో బీఆర్ఎస్ అధికారాన్ని కైవసం చేసుకుంది. ▪️ మున్సిపల్ చైర్మన్‌గా కట్కం రవీందర్ ఎన్నిక▪️ వైస్ చైర్మన్‌గా...
Read More...

ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా వేముల నాగలక్ష్మి (కాంగ్రెస్) ఎన్నిక

ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా వేముల నాగలక్ష్మి (కాంగ్రెస్) ఎన్నిక ధర్మపురి | ఫిబ్రవరి 16 – ప్రజా మంటలు ధర్మపురి మున్సిపల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మున్సిపల్ చైర్‌పర్సన్‌గా వేముల నాగలక్ష్మిను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపిక చేశారు. అదే సమయంలో, వైస్ చైర్మన్‌గా ఇందారపు రామన్నను తిరిగి నియమించారు. ▪️ మొదటినుంచి ప్రచారంలో ఉన్న అభ్యర్థి కాకుండా కొత్త అభ్యర్థికి...
Read More...

జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నిక: గెలిచింది సంజయ్ వర్గమా? లేక రేవంత్ రాజకీయ పంతమా?

జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నిక: గెలిచింది సంజయ్ వర్గమా? లేక రేవంత్ రాజకీయ పంతమా? జగిత్యాల రాజకీయాల్లో సంచలన మార్పు: కొత్త సమీకరణలు ? (ప్రత్యేక విశ్లేషణాత్మక కథనం) జగిత్యాల పట్టణ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా సమిండ్ల వాణి ఎన్నిక కావడం కేవలం స్థానిక పదవి మార్పు కాదు. ఇది కాంగ్రెస్ లోపలి శక్తి సమీకరణాల్లో ఒక కీలక మలుపు. బయటికి చూస్తే ఇది👉 సంజయ్ కుమార్ వర్గ విజయం...
Read More...