గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21-27 వ తేదీ వరకు
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21-27 వ తేదీ వరకు
- రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి.
హైదరాబాద్ అక్టోబర్ 17:
ఈనెల 21 వ తేదీ నుండి 27 వ తేదీ వరకు జరిగే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను ఏవిధమైన పొరపాట్లు లేకుండా అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి స్పష్టం చేశారు.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, సంబంధిత ఉన్నతాధికారులతో నేడు సచివాలయం నుండి వీడియో కాన్ఫ రెన్స్ నిర్వహించి సమీక్షించారు.
తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమీషన్ కార్యాలయం నుండి కమీషన్ చైర్మన్ డా. మహేందర్ రెడ్డి, సభ్యులు పాల్గొనగా, సచివాలయం నుండి డీజీపీ జితేందర్, కమీషన్ కార్యదర్శి నవీన్ నికోలస్, SPDCL MD ముష్రాఫ్ అలీ, రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కర్ణన్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు అనుదీప్, శశాంక్, గౌతమ్ తదితర అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా సి.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. దీనికోసం 46 పరీక్షా కేంద్రాలను హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఏర్పాటు చేశామని వివరించారు.
ఈ పరీక్షలు నిర్వహించే అన్ని కేంద్రాల వద్ద ఏవిధమైన అవకతవకలు,అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు, విస్తృత స్థాయిలో సీనియర్ అధికారులతో పర్యవేక్షణను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్లు నేరుగా ఈ పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తారని,సంబంధిత పోలీస్ కమీషనర్లు కూడా తగు బందోబస్తు ఏర్పాట్లను చేపడుతారని తెలిపారు. అన్ని శాఖల అధికారులు ఏవిధమైన స్వల్ప సంఘటనలు జరుగకుండా అత్యంత అప్రమత్తంగా ఈ పరీక్షల నిర్వహణా విధులు నిర్వహించాలని పేర్కొన్నారు.
TGPSC చైర్మన్ డా. ఎం. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, 2011 సంవత్సరం అనంతరం గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయని, కొన్ని సంవత్సరాల అనంతరం జరిగే ఈ పరీక్షల నిర్వహణలో ప్రతీ అంశంలోనూ అత్యంత జాగ్రత్తగా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఆధునిక సాంకేతికత, సోషల్ మీడియా ఆక్టివ్ గా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ కూడా సవాలుతో కూడుకుంటున్నదని, ఈ నేపథ్యంలో ఏవిధమైన అపోహలు, పుకార్లకు తావివ్వకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని మహేందర్ రెడ్డి అన్నారు.
గ్రూప్ -1 జరిగే అన్ని పరీక్షా కేంద్రాల వద్ద విస్తృతమైన బందోబస్తు తోపాటు పరీక్షలు ప్రశాంతంగా కొనసాగేందుకు అన్ని చర్యలు చేపట్టామని డీజీపీ జితేందర్ తెలిపారు.
TGPSC కార్యదర్శి నవీన్ నికోలస్ మాట్లాడుతూ, హైదరాబాద్ జిల్లాలో 8 , రంగారెడ్డి జిల్లాలో 11 , మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27 మొత్తం 46 కేంద్రాలలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి పరీక్ష హాల్, చీఫ్ సూపరింటెండెంట్ రూమ్, పరిసర ప్రాంతాలన్నింటిలోనూ సీసీ టీవీ లను ఏర్పాటు చేసి, TGPSC కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. పరీక్షల నిర్వహణలో ప్రతి స్టెప్ లోనూ కచ్చితమైన నియమ నిబంధనలు పాటించేలా స్పష్టమైన మార్గదర్శకాలు అందచేశామని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు తీసుకునేందుకై ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు, మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించేది లేదని స్పష్టం చేశారు.
ఇప్పటికే, 85 శాతం అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకున్నారని తెలిపారు. దివ్యాంగులకు ప్రత్యేకంగా ఒక గంటను అదనంగా కేటాయిస్తున్నట్టు చెప్పారు. ఎవరికైతే పరీక్ష రాయడానికి సహాయకులు (స్క్రైబ్ ) అవసరమో, ఆ అభ్యర్థుల హాల్ టికెట్లపై ప్రత్యేకంగా పేర్కొనడం జరిగిందని, స్క్రైబ్ ల సహాయంతో పరీక్షలు వ్రాసే వారికి ప్రత్యేకంగా 4 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కార్యదర్శి వెల్లడించారు.
అన్నిపరీక్షా కేంద్రాల 46 వద్ద ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కర్ణన్ తెలిపారు. నిరంతరం విధ్యుత్ సరఫరా అందించేవిధంగా చర్యలు చేపట్టినట్టు, ఇందుకుగాను ముగ్గురు సి.ఈ లు పర్యవేక్షిస్తారని SPDCL ఎండీ ముషారఫ్ అలీ అన్నారు. అన్ని కేంద్రాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
--
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అగ్ని ప్రమాద బాధితులు
కొండగట్టు జనవరి 10 (ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టులో గతంలో షార్ట్ సర్క్యూట్ ద్వారా బొమ్మల వ్యాపారుల దుకాణాలు కాలిపోగా నిరాశ్రయులైన బొమ్మల దుకాణాల యజమానులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా విద్యుత్ శాఖ తరపున ఆర్థిక సహాయం అందించినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వడ్లూరి లక్ష్మణ్ కుమార్, కిషన్ రావుపేట ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు
వెల్గటూర్ జనవరి 10 (ప్రజా మంటలు) జక్కాపురం నారాయణస్వామి వెల్గటూర్
మండలంలోని కిషన్రావు పేట ఉన్నత ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు నర్ముల గంగన్న ఆధ్వర్యంలో పాఠశాలలకు సంక్రాంతి సెలవులు రావడం వలన ముందస్తుగా ఘనంగా సంక్రాంత్రి సంబరాలు జరుపుకున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి పాఠశాల ప్రాంగణాన్ని రంగురంగుల ముగ్గులు, తోరణాలతో పల్లెటూరి వాతావరణాన్ని తలపించేలా అలంకరించారు. ... బిట్స్ పిలానీ యంగ్ అచీవర్స్ అవార్డు అనుదీప్ ఐఏఎస్కు ప్రదానం
హైదరాబాద్, జనవరి 10 (ప్రజా మంటలు):
ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థుల్లోంచి ఎంపిక చేసిన యంగ్ అచీవర్స్ అవార్డును ఐఏఎస్ అధికారి అనుదీప్ దురిశెట్టి అందుకున్నారు.
జగిత్యాల జిల్లా మెట్పల్లి వాసి అయిన అనుదీప్ దురిశెట్టి, ప్రజాజీవన రంగంలో విశిష్ట సేవలందించినందుకు పబ్లిక్ లైఫ్ కేటగిరీలో ఈ పురస్కారానికి... ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వకపోతే భూపోరాటాలు తప్పవు: తెలంగాణ జాగృతి
హైదరాబాద్, జనవరి 10 (ప్రజా మంటలు):
తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్ హెచ్చరించారు. ముఖ్యంగా ఉద్యమకారులకు హామీ ఇచ్చిన 250 గజాల భూమిని వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు.
బంజారాహిల్స్లోని జాగృతి కార్యాలయంలో జరిగిన ఉద్యమకారులతో ఆత్మీయ సమ్మేళనంలో... జాగృతి ఖతార్ చైర్పర్సన్కు నారీ శక్తి సమ్మాన్ అవార్డు
హైదరాబాద్, జనవరి 10 (ప్రజా మంటలు):
గల్ఫ్ దేశాల్లోని భారతీయ కార్మికులు, ప్రవాసులకు విశేష సేవలందిస్తున్న జాగృతి ఖతార్ అడ్వైజరీ చైర్పర్సన్ నందిని అబ్బగౌని ప్రతిష్టాత్మక నారీ శక్తి సమ్మాన్ అవార్డుకు ఎంపికయ్యారు.
ఖతార్లోని భారతీయ దౌత్య కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రవాసీ భారతీయ దివస్ కార్యక్రమం దోహా నగరంలోని ఐసీసీ అశోకా హాల్... ఆదర్శ అటవీశాఖాధికారి అశోక్ రావు.
జగిత్యాల జనవరి 10(ప్రజా మంటలు) ఆదర్శ జిల్లా అటవీశాఖ అధికారిగా పూసాల అశోక్ రావు పేరొందారని టీ పెన్షనర్స్,సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ అన్నారు.శనివారం జిల్లా సీనియర్ సిటీజేన్స్ సమావేశ మందిరంలో వయో వృద్ధుల చట్టం పై అవగాహన సదస్సు, రిటైర్డ్ జిల్లా ఆటవీ శాఖ అధికారి 65 వ
ఈ... విమర్శలకు అభివృద్ధి పనులతో బదులిస్తా ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల జనవరి 10 ( ప్రజా మంటలు)విమర్శలకు అభివృద్ధి పనులతో బదులిస్తానని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు.జగిత్యాల పట్టణంలో 36 42 43 వార్డులలో 1 కోటి 30 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు డ్రైనేజీ అభివృద్ధి పనులను పరిశీలించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ అనంతరం మాట్లాడుతూ
పట్టణంలో... కోరుట్ల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
కోరుట్ల జనవరి 10 (ప్రజా మంటలు) జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆకస్మికంగా కోరుట్ల పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లో పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, నేర నియంత్రణకు మరింత పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
స్టేషన్లో నిర్వహిస్తున్న కేసు డైరీలు, జనరల్ డైరీ, రిజిస్టర్లు, ఇతర రికార్డులను... వాసవి మాతా ఆలయంలో ఘనంగా లక్ష్మీ గణపతి హవనం
జగిత్యాల జనవరి 10(ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని వైశ్య భవన్లో వాసవి మాత ఆలయంలో శనివారం లక్ష్మీ గణపతి హోమం ఘనంగా నిర్వహించారూ .ఆలయంలో కొద్ది రోజుల్లో నూతనంగా కృష్ణ శిలతో కూడిన బ్రహ్మసూత్ర శివలింగం, మేధా దక్షిణామూర్తి, వాసవి మాత ,శక్తి గణపతి, దాసాంజనేయ స్వామి విగ్రహాలు ప్రతిష్టించరున్నారు. దీనికిగాను నాందిగా శ్రీ లక్ష్మీ... వనపర్తి జిల్లాలో ఏసీబీకి చిక్కిన మరో ప్రభుత్వ అధికారి
వనపర్తి, జనవరి 10 (ప్రజా మంటలు):
వనపర్తి జిల్లాలో మరో ప్రభుత్వ అధికారి అవినీతి బారిన పడటం కలకలం రేపింది. పౌర సరఫరాల శాఖ వనపర్తి జిల్లా మేనేజర్ కుంభ జగన్మోహన్ ఏసీబీ అధికారుల వలలో చిక్కారు. సీఎంఆర్ (Custom Milled Rice) కేటాయింపు పేరుతో మిల్లు యజమానిని లంచం కోరిన కేసులో ఆయనను ఏసీబీ... దావోస్ వేదికగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ : రేవంత్ రెడ్డి
హైదరాబాద్ జనవరి 10 (ప్రజా మంటలు):
రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడే పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా, దావోస్లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం–2026 సదస్సులో ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ను ప్రపంచానికి పరిచయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లే దిశగా ప్రభుత్వం కట్టుదిట్టంగా... ఇండెక్స్ మార్పులతో బంగారం–వెండి మార్కెట్లో కలకలం
లండన్ / అంతర్జాతీయ మార్కెట్లు జనవరి 10:
2026 సంవత్సరంలో అంతర్జాతీయ బులియన్ మార్కెట్ తొలి పెద్ద పరీక్షను ఎదుర్కొంటోంది. కమోడిటీ ఇండెక్స్లలో జరిగే వార్షిక పునఃసంఘటన (Index Rebalancing) కారణంగా బంగారం, వెండిలో $10 బిలియన్లకు పైగా విలువైన అమ్మకాలు జరగనున్నట్లు అంచనాలు వెలువడ్డాయి.
2025లో రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం, వెండి ధరలు... 