సీనియర్ సిటీజేన్స్ డిమాండ్లను పరిష్కరించాలి  -టాస్కా జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్.  

On
సీనియర్ సిటీజేన్స్ డిమాండ్లను పరిష్కరించాలి  -టాస్కా జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్.  

సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం. సీనియర్ సిటీజేన్స్ డిమాండ్లను పరిష్కరించాలి         

-టాస్కా జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్.                

జగిత్యాల అక్టోబర్ 1:

తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవంను    ఘనంగా నిర్వహించారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ కార్యాలయంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం వేడుకలను రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 46 మందిని పట్టు శాలువాలతో,మెమోంటో లు,వయోవృద్ధుల చట్టం పుస్తకాలు అందించి సన్మానించారు.ఈ సందర్భంగా హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ తమ   సమస్యలని  సత్వరం పరిష్కరించాలని  ప్రభుత్వం ను డిమాండ్ చేశారు.ప్రత్యేక వయోవృద్ధుల శాఖ ఏర్పాటు చేయాలన్నారు.ఏజెన్సీ తో నడుపుతున్న టోల్ ఫ్రీ నెంబర్.14567 ను రద్దుచేసి  ఆ స్థానంలో సత్వరమే స్పందించే 100,104 ల వలె ప్రభుత్వ టోల్ ఫ్రీ ఏర్పాటు చేయాలని,వయోవృద్ధులకు అన్ని ఆసుపత్రుల్లోఉచిత వైద్య సేవలు అందించాలని కోరారు.

హైదరాబాద్లో సీనియర్ సిటిజెన్ల భవన్ కోసం 2 ఎకరాల స్థలం కేటాయించి,నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని,అన్ని మున్సిపాలిటీల్లో వయోవృద్ధులకి డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విష్వనాథం,కోశాధికారి వెల్ముల ప్రకాష్ రావు,పెన్షనర్స్ జిల్లా సహాయ అధ్యక్షుడు పి.సి.హన్మంత్ రెడ్డి,సీనియర్  సిటిజెన్ల ప్రతినిధులు ఎం.డి.యాకూబ్,పబ్బా శివానందం,రాజ్ మోహన్,ఒజ్జల బుచ్చిరెడ్డి,సౌడాల కమలాకర్,సత్యనారాయణ,నారాయణ,ఎం.డి.ఎక్బాల్,సయ్యద్ యూసుఫ్,జంగిలి రామానందం,దేవర శెట్టి జనార్ధన్,ధర్మ చొక్కారావు,రాపర్తి రాజేశం,భూమయ్య,కుందునూరి అనసూయ,గంగం జలజ, కరుణ, జిల్లా,డివిజన్,మండలగ్రామాల,సీనియర్ సిటిజెన్ల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News  State News 

సోషల్ మీడియా స్టార్డమ్‌తో సర్పంచ్ పీఠం

సోషల్ మీడియా స్టార్డమ్‌తో సర్పంచ్ పీఠం భీమదేవరపల్లి, డిసెంబర్ 18 (ప్రజా మంటలు): కలిసివచ్చిన అదృష్టం అంటే ఇదేనేమో. సోషల్ మీడియా ప్రభావం ఎన్నికల ఫలితాల్లో కీలకంగా మారిందనడానికి ఇది ఓ స్పష్టమైన ఉదాహరణ. లఘుచిత్రాల్లో నటిస్తూ అనేక మంది అభిమానులను సంపాదించుకున్న ఓ మహిళ ఇప్పుడు ఓ గ్రామానికి ప్రథమ పౌరురాలిగా నిలిచారు. ఇటీవల తెలంగాణలో నిర్వహించిన తొలి విడత పంచాయతీ...
Read More...
Local News  State News 

సర్పంచుల అపాయింట్మెంట్ డే వాయిదా

సర్పంచుల అపాయింట్మెంట్ డే వాయిదా డిసెంబర్ 22న బాధ్యతల స్వీకరణ హైదరాబాద్, డిసెంబర్ 18 (ప్రజా మంటలు): తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు పదవి బాధ్యతలు స్వీకరించే అపాయింట్మెంట్ డే వాయిదా పడింది. ఈనెల 20న నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ శాఖ డిసెంబర్ 22కు మార్చింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచులు, వార్డు సభ్యులు...
Read More...
Local News 

గాంధీ బస్ షెల్టర్ లో  ప్రైవేట్ వాహనాలు..

గాంధీ బస్ షెల్టర్ లో  ప్రైవేట్ వాహనాలు.. సికింద్రాబాద్, డిసెంబ  17 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ఎంసీహెచ్ (మాతా,శిశు కేంద్రం) విభాగ భవనం సమీపంలో ఉన్న బస్ షెల్టర్ ప్రైవేట్ వాహనాలకు అడ్డగా మారింది. నిత్యం వివిద ప్రాంతాల నుంచి వందలాది మంది గర్బిణీలు, బాలింతలు, వారి సహాయకులు ఎంసీహెచ్ భవనానికి వైద్యానికి వస్తూ, పోతుంటారు. అయితే ఇక్కడి బస్ షెల్టర్...
Read More...
State News 

పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ కీలక తీర్పు

పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ కీలక తీర్పు హైదరాబాద్, డిసెంబర్ 18 (ప్రజా మంటలు): తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి అనంతరం కాంగ్రెస్‌లో చేరిన ఐదుగురు ఎమ్మెల్యేలపై దాఖలైన పార్టీ ఫిరాయింపుల అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తోసిపుచ్చారు. పార్టీ ఫిరాయించినట్లు స్పష్టమైన ఆధారాలు లేవని పేర్కొంటూ, ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన పిటిషన్లను కొట్టివేస్తూ స్పీకర్...
Read More...
Today's Cartoon 

Today's Cartoon

Today's Cartoon
Read More...

ఘనంగా ధనుర్మాస ఉత్సవం ప్రారంభం 

ఘనంగా ధనుర్మాస ఉత్సవం ప్రారంభం  జగిత్యాల డిసెంబర్ 16 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవ వేడుకలు  మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అమ్మవారికి పంచామృతాలతో అభిషేకము నిర్వహించి వివిధ పుష్పాలతో మాలలు అల్లి అలంకరించారు .సాయంత్రం మొదటి పాశురం సామూహికంగా...
Read More...

గ్రామపంచాయతీ ఎన్నికల్లో బి ఆర్ఎస్ మద్దతు తో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను అభినందించి సత్కరించిన జిల్లా అధ్యక్షులు మాజీ జెడ్పి చైర్పర్సన్

గ్రామపంచాయతీ ఎన్నికల్లో బి ఆర్ఎస్ మద్దతు తో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను అభినందించి సత్కరించిన జిల్లా అధ్యక్షులు మాజీ జెడ్పి చైర్పర్సన్ జగిత్యాల డిసెంబర్ 15 (ప్రజా మంటలు)జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జగిత్యాల నియోజకవర్గం లోని గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లను సన్మానించిన జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు  మరియు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ......
Read More...

మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పై మండిపడ్డ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పై మండిపడ్డ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్     ధర్మపురి డిసెంబర్ 16 (ప్రజా మంటలు) నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం  మీడియాతో మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూమాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్  గత 10 సంవత్సరాలలో చేసిన అరాచకాలు, అవినీతి త్వరలో ప్రజల ముందుంచుతాననిఅబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ మీ ప్రభుత్వం అన్నారు. , మీ నాయకత్వమే., సంక్షేమ శాఖ మంత్రిగా...
Read More...

మూడవ విడత సర్పంచ్ ఎన్నికకు 853 మంది పోలీసులతో భారీ బందోబస్తు:జిల్లా ఎస్పి  అశోక్ కుమార్ 

మూడవ విడత సర్పంచ్ ఎన్నికకు 853 మంది పోలీసులతో భారీ బందోబస్తు:జిల్లా ఎస్పి  అశోక్ కుమార్  జగిత్యాల డిసెంబర్ 16( ప్రజా మంటలు)   పోలింగ్ కేంద్రాల వద్ద 200 మీటర్ల వరకు  163  బి  ఎన్ ఎస్ ఎస్(144  సెక్షన్ అమలు)  విజయోత్సవ  ర్యాలీలు, ఊరేగింపులకు  అనుమతి లేదు జిల్లాలో జరగనున్న  మూడవ   విడత  గ్రామపంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా,నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా ఎస్పీ...
Read More...
Local News  Crime 

దళితుల భూమిని ఆక్రమించి, దారి మూసివేత

దళితుల భూమిని ఆక్రమించి, దారి మూసివేత ఎల్కతుర్తి డిసెంబర్ 16 (ప్రజా మంటలు):  హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల పరిధిలోని దండేపల్లి, దగ్గువారి పల్లె మధ్య ఉన్న డిబిఎం 20 ఎస్సారెస్పీ కాలువ ప్రభుత్వ భూమిని ఆక్రమించి సాగు చేసుకుంటూ, దళితుల పొలాలకు వెళ్లే మార్గాన్ని పూర్తిగా మూసివేస్తున్నారని దళిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సూరారం గ్రామానికి చెందిన బచ్చు శ్రీనివాస్...
Read More...

ఈనెల 21 న జాతీయ లోక్ ఆదాలత్ సద్వినియోగం చేసుకోండి జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి

ఈనెల 21 న జాతీయ లోక్ ఆదాలత్ సద్వినియోగం చేసుకోండి  జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి జగిత్యాల డిసెంబర్ 16 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్నపద్మావతి మాట్లాడుతూ ఈనెల 21న జాతీయ మెగా లోక్ ఆదాలత్ నిర్వహిస్తున్నామని ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వి నియోగం చేసుకుని రాజీ కుదుర్చుకోవాలని సూచించారు.  జిల్లాలో సుమారు 18 యేళ్ళనుంచి కేసులు నమోదు అయి...
Read More...
State News 

యంగ్ ఇండియా స్కూల్, IIM హైదరాబాద్, కేంద్రీయ–నవోదయ విద్యాలయాలపై కీలక చర్చలు

యంగ్ ఇండియా స్కూల్, IIM హైదరాబాద్, కేంద్రీయ–నవోదయ విద్యాలయాలపై కీలక చర్చలు న్యూఢిల్లీ డిసెంబర్ 16 (ప్రజా మంటలు): తెలంగాణలో విద్యా రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు కేంద్రం మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. న్యూఢిల్లీలో జరిగిన భేటీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు...
Read More...