ఘనంగా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ద్వాదశ ఆలయ ప్రధాన అర్చక సన్మాన మహోత్సవం.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
కొడిమ్యాల బృందావన్ రిసార్ట్ సెప్టెంబర్ 29 (ప్రజా మంటలు) :
బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో నాచుపెల్లి వద్ద గల బృందావనం ఫ్యామిలీ రిసార్ట్ కొండగట్టు వారి సౌజన్యంతో ప్రధాన ఆలయాల ద్వాదశ ఆలయ ప్రధాన అర్చక సన్మాన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అంతకు పూర్వము జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బంగారయ్య శర్మ, పురాణం మహేశ్వర శర్మ, నంబి వేణుగోపాల ఆచార్య తదితరులు జ్యోతి ప్రజలను చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. చిన్నారులు చేసిన నృత్యాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
విచ్చేసిన బ్రాహ్మణ బంధువులకు రిసార్ట్ యజమాని కొండల్ రావు బ్రాహ్మణ సమారాధన ఏర్పాటు చేశారు.
కార్యక్రమంలో బ్రాహ్మణ సంక్షేమ వేదిక అధ్యక్షులు బాల శ్రీనివాస్ తమ సంస్థ ద్వారా చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. కార్యదర్శి ఉజ్వల విచ్చేసిన అతిధులను స్వాగతించి తన కార్య నిర్వహణ నైపుణ్యంతో వేదిక కార్యక్రమంలో అన్ని తానై ఏర్పాట్లు చేశారు.
అంతకుముందు అతిథులకు వైదిక సాంప్రదాయం ప్రకారం మంగళవాద్యాల ఘోషతో పూర్ణకుంభ స్వాగతం పలికారు రిసార్ట్ యజమాని కొండలరావు దంపతులు.
విచ్చేసిన అర్చకులకు ముఖ్య అతిథులకు బృందావనం రిసార్ట్ లో శాలువలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పెద్దపూర్ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్

మేడిపల్లి భీమారం , మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

పద్మశాలి కిట్టి పార్టీ ఆధ్వర్యంలో మెహందీ ఉత్సవం

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

గ్రీవెన్స్ డే సందర్భంగా పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

కేసులకు భయపడి స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకోవద్దు - తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

కాలభైరవ దేవాలయంను దర్శించుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రాపల్లిలో ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ దినోత్సవం

హస్నాబాద్ గ్రామ యువకులచే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు

మానవత్వం మరిచిన పిన్ని మమత

ఘనంగా జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పుట్టిన రోజు వేడుకలు.

హనుమాన్ చాలీసా భక్త బృందం చే హరిహరాలయంలో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం
