ఘనంగా ప్రారంభమైన " ప్రవాసీ ప్రజావాణి " గల్ఫ్ కార్మికుల కష్టాలు తీరుస్తాం - మంత్రి పొన్నం

On
ఘనంగా ప్రారంభమైన

ఘనంగా ప్రారంభమైన " ప్రవాసీ ప్రజావాణి "

గల్ఫ్ కార్మికుల కష్టాలు తీరుస్తాం - మంత్రి పొన్నం

IMG-20240927-WA0737

హైదరాబాద్ సెప్టెంబర్ 27:

జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో ప్రవాసి ప్రజావాణి ( గల్ఫ్ కార్మికులు, ఎన్నారై ల కోసం) ప్రత్యేక కౌంటర్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు 

 ప్రవాసి ప్రజావాణి ప్రత్యేక  కౌంటర్ ను రిబ్బన్ కట్ చేసి  హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.

కార్యక్రమంలో  ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్, ప్రజావాణి ఇంచార్జీ డాక్టర్ జీ చిన్నారెడ్డి , ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పిసిసి ఎన్నారై సెల్ ఛైర్మన్ వినోద్ కుమార్, ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య, ఎన్నారై విభాగం ప్రతినిధులు మంద భీం రెడ్డి, నంగి దేవేందర్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, చాంద్ పాషా,  నరేష్ రెడ్డి, నవీన్ రెడ్డి, చెన్నమనేని శ్రీనివాస్ రావు, తదితరులు పాల్గొన్నారు.

గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్నా షేక్ హుస్సేన్ కుటుంబం నుండి మొదటి అభ్యర్థనను  మంత్రి పొన్నం ప్రభాకర్, చిన్నారెడ్డి, జీవన్ రెడ్డి లు స్వీకరించారు.

సమస్యల వినతి కోసం భారీగా పాల్గొన్న గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబసభ్యులు పాల్గొన్నారు 

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రజావాణి కార్యక్రమానికి తెలంగాణ వ్యాప్తంగా గల్ఫ్ కార్మికులు సమస్యలపై పెద్ద ఎత్తున తరలి వచ్చిన వారిని చూస్తేనే సమస్య ఎంత పెద్దగా ఉంది అర్థం అవుతుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నికల్లో చెప్పినట్టు  4 అంశాల పై నిర్ణయం తీసుకోవడం జరిగిందని,అందులో మొదటిది తెలంగాణ ప్రభుత్వం పక్షాన ప్రజా భవన్ లో ప్రవాసి ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందను అన్నారు 

ఇంకా, రాష్ట్రం నుండి గల్ఫ్ దేశాలకు పెద్ద ఎత్తున ఉపాధి నిమిత్తం వెళ్ళారు.వారి సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందనీ అన్నారు.

గల్ఫ్ ప్రమాదంలో చనిపోయిన వారికి 5 లక్షల ఎక్ఫ్ గ్రెషీయ ఇవ్వడానికి ఇప్పటికే జీవో జారీ చేసుకున్నాం. గల్ఫ్ కార్మికుల కుటుంబాల పిల్లల చదువులకు ఇబ్బందులు లేకుండా గురుకులాల్లో సీట్లు కల్పిస్తున్నాం..

గల్ఫ్ కార్మికుల కోసం ఉత్తర తెలంగాణ ప్రాంతం నుండి ప్రాతినిద్యం వహిస్తున్న ఎమ్మెల్యేలతో అడ్వైజరి కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది..

నా నియోజకవర్గం లో జాబ్ మేళా పెడితే 9 వేల మంది వచ్చారు.విదేశాల్లో ఉపాధి అవకాశాల కోసం పోయేవరికి అక్కడి చట్టాలు తెలియడం లేదు..

వారికి ఇక్కడి కంపెనీలపై అవగాహన కల్పించాలి..వాటిపై విస్తృత సమాచారం అందించాలి..సంస్థను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలి.

ప్రజలను మోసం చేస్తూ విదేశాలకు పంపించి  అక్కడ ఇబ్బందులు పడేలా చేస్తున్నారు.అలాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి.ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. అక్కడ శిక్షణ పొంది విదేశాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలను సంకల్పించారు.

ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో ఈ ప్రజావాణి తీసుకురావడానికి కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Tags
Join WhatsApp

More News...

భారత రాజ్యాంగం ఎవరు రాశారు?

భారత రాజ్యాంగం ఎవరు రాశారు? ప్రతి సంవత్సరం నవంబర్ 26న భారతదేశం రాజ్యాంగ దినోత్సవం (Constitution Day) జరుపుకుంటుంది. 1949లో ఇదే రోజున డా. బీఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగాన్ని స్వీకరించారు.భారత రాజ్యాంగం సాధారణమైన పత్రం కాదు; ఇది దేశ ప్రజాస్వామ్యానికి పునాది. ఈ సందర్భంగా చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడం ముఖ్యం. 1. ...
Read More...
National  State News 

శంషాబాద్ GMR ఏరోపార్క్‌లో సఫ్రాన్ LEAP ఇంజిన్ MRO కేంద్రం ప్రారంభం

శంషాబాద్ GMR ఏరోపార్క్‌లో సఫ్రాన్ LEAP ఇంజిన్ MRO కేంద్రం ప్రారంభం హైదరాబాద్ నవంబర్ 26 (ప్రజా మంటలు): శంషాబాద్‌లోని GMR ఏరోపార్క్‌లో కీలక విమానయాన మౌలిక వసతుల అభివృద్ధికి మరొక పెద్ద అడుగు పడింది. ఫ్రాన్స్‌కు చెందిన ప్రతిష్టాత్మక ఏరోస్పేస్ సంస్థ సఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా ఏర్పాటు చేసిన LEAP ఇంజిన్ MRO (Maintenance, Repair & Overhaul) కేంద్రంను ముఖ్యమంత్రి ...
Read More...
National  International   State News 

ఎన్‌విడియా షేర్ల పతనం – ఏఐ పందెంలో గూగుల్ ఆధిక్యం ?

ఎన్‌విడియా షేర్ల పతనం – ఏఐ పందెంలో గూగుల్ ఆధిక్యం ?   భయాలతో $115 బిలియన్ మార్కెట్ విలువ ఆవిరి న్యూయార్క్ నవంబర్ 26: ప్రపంచ ఏఐ చిప్ రంగాన్ని దశాబ్దం పైగా ఆధిపత్యం చేసిన ఎన్‌విడియా షేర్లు మంగళవారం భారీగా క్షీణించాయి. గూగుల్ తన స్వంత కృత్రిమ మేధస్సు కోసం అభివృద్ధి చేసిన టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్స్ (TPUs) మరింత శక్తిగా ముందుకు వస్తున్నాయనే అంచనాలు పెట్టుబడిదారుల్లో...
Read More...
National  State News 

దేశంలోని ప్రైవేట్ యూనివర్సిటీల పనితీరుపై సమగ్ర వివరాలు కోరిన సుప్రీం కోర్టు

దేశంలోని ప్రైవేట్ యూనివర్సిటీల పనితీరుపై సమగ్ర వివరాలు కోరిన సుప్రీం కోర్టు న్యూ ఢిల్లీ నవంబర్ 26: దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్, నాన్-గవర్నమెంట్ మరియు డీమ్‌డ్ టు బీ యూనివర్సిటీల స్థాపన, నిర్వహణ, నియంత్రణ వ్యవస్థలపై సమగ్ర పరిశీలనకు సుప్రీం కోర్టు ఆసక్తి వ్యక్తం చేసింది. ఒక విద్యార్థి తన పేరు మార్పు సమస్యపై అమితి యూనివర్సిటీపై దాఖలు చేసిన రిటు పిటీషన్‌ను పరిశీలిస్తున్న సమయంలో, విచారణను విస్తరించి ...
Read More...
National  Filmi News 

ధర్మేంద్ర: హిందీ సినీ ప్రపంచం యొక్క చిరస్మరణీయ అందగాడు

ధర్మేంద్ర: హిందీ సినీ ప్రపంచం యొక్క చిరస్మరణీయ అందగాడు    హిందీ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ధర్మేంద్ర, 1960లో విడుదలైన "దిల్ భీ తేరా హమ్ భీ తేరా"చిత్రంతో మొదటి అడుగు వేశారు. ముఖేశ్ పాడిన “ముఝ్‌కో ఇస్ రాత్ కీ తన్‌హాయీ మే ఆవాజ్ నా దో” అనే గీతంతో ఆయన ప్రవేశం మృదువైనదైనా, గుర్తుండిపోయేలా నిలిచింది. ముంబై నగరంలోని...
Read More...
Local News  State News 

నిరంజన్ రెడ్డి ఎందుకు అగ్రెసివ్ అవుతున్నారు? – జాగృతి ప్రతినిధుల ప్రశ్న

నిరంజన్ రెడ్డి ఎందుకు అగ్రెసివ్ అవుతున్నారు? – జాగృతి ప్రతినిధుల ప్రశ్న తెలంగాణ జాగృతి చేపట్టిన జాగృతి జనం బాటు కార్యక్రమంలో ప్రజలు నిరంజన్ రెడ్డి అక్రమాల గురించి వెల్లడించారని, కల్వకుంట్ల కవిత వాటినే మీడియా ముందు చెప్పారని జాగృతి ప్రతినిధులు మనోజా గౌడ్, శ్రీకాంత్ గౌడ్ స్పష్టం చేశారు. ఎవరిపై వ్యక్తిగత విమర్శ చేయాలన్న ఉద్దేశం లేదని తెలిపారు. వనపర్తి–పెబ్బేరు ప్రాంతాలలో ప్రజలు చెరువులు, కుంటల...
Read More...

బీసీలకు దక్కింది 17.087% గ్రామ పంచాయతీలే: గతం కంటే 8% తక్కువ

బీసీలకు దక్కింది 17.087% గ్రామ పంచాయతీలే: గతం కంటే 8% తక్కువ ప్రభుత్వం ప్రకటించిన బిసి రిజర్వేషన్ల జాబితా బీసి నాయకుల నుండి విమర్శలను ఎదుర్కొంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్న 42% రిజర్వేషన్లు ఇవ్వకపోగా, గత ఎన్నికల్లో ఇచ్చిన 25 % కూడా కేటాయించలేకపోవడం విమర్శలకు దారితీస్తుంది. ఈ విషయంలో బిసి నాయకులు కోర్టుకు కూడా వెళ్లనున్నట్లు తెలుస్తుంది. ✔ప్రభుత్వం హామీ (42%) ✘ అమలైన...
Read More...
National  International   State News 

చైనా–అరుణాచల్ పాస్‌పోర్ట్ వివాదం: భారత మహిళను 18 గంటలు నిర్బంధించిన ఘటన

చైనా–అరుణాచల్ పాస్‌పోర్ట్ వివాదం: భారత మహిళను 18 గంటలు నిర్బంధించిన ఘటన న్యూఢిల్లీ/బీజింగ్ నవంబర్ 25 (మా ప్రత్యేక ప్రతినిధి): అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన భారతీయ మహిళను శాంఘై పుడోంగ్ విమానాశ్రయంలో చైనా అధికారులు “మీ పాస్‌పోర్ట్ చెల్లదు, ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగం” అంటూ 18 గంటలపాటు నిర్బంధించిన ఘటన భారత్–చైనా మధ్య మరల ఉద్రిక్తతలకు దారి తీసింది. లండన్ నుంచి జపాన్‌కు ట్రాన్సిట్ ప్రయాణం...
Read More...

నల్లగొండ కాంగ్రెస్‌లో డీసీసీ రగడ: కోమటిరెడ్డి ఆగ్రహంతో రాజకీయాల కుదుపు

నల్లగొండ కాంగ్రెస్‌లో డీసీసీ రగడ: కోమటిరెడ్డి ఆగ్రహంతో రాజకీయాల కుదుపు నల్లగొండ నవంబర్ 25 (ప్రజా మంటలు): నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌లో డీసీసీ నియామకం పెద్ద అంతర్గత కలహాలకు దారితీసింది. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పున్నా కైలాష్‌ను నియమించడం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. తనపై, తన కుటుంబంపై కైలాష్ అసభ్య పదజాలంతో మీడియా ముందు మాట్లాడాడని ఆరోపించిన కోమటిరెడ్డి, అలాంటి...
Read More...

“ఇందిరమ్మ చీరలు – ఎన్నికల కోసమే కాంగ్రెస్ తొందర”:  జగిత్యాల BRS నేతల విమర్శలు

“ఇందిరమ్మ చీరలు – ఎన్నికల కోసమే కాంగ్రెస్ తొందర”:  జగిత్యాల BRS నేతల విమర్శలు జగిత్యాల (రూరల్) నవంబర్ 25 (ప్రజా మంటలు): జిల్లా BRS పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు గుప్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వం హుటాహుటిన ‘ఇందిరమ్మ చీరల పంపిణీ’ ప్రారంభించిందని, ఇది పూర్తిగా రాజకీయ ప్రయోజనాలకే సంబంధించిన కార్యక్రమమని...
Read More...
Local News  Crime 

ఏపీకే ఫైళ్లు ఓపెన్ చేస్తే హ్యాకింగ్ ప్రమాదం

ఏపీకే ఫైళ్లు ఓపెన్ చేస్తే హ్యాకింగ్ ప్రమాదం సికింద్రాబాద్, నవంబర్ 25 (ప్రజామంటలు) :  తెలియని మూలాల నుంచి వచ్చే APK ఫైళ్లను ఓపెన్ చేయకూడదని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఆర్.వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఇలాంటి ఫైళ్లు ఓపెన్ చేస్తే ఫోన్లు హ్యాకింగ్‌కు గురై వ్యక్తిగత డేటా, బ్యాంకు వివరాలు దొంగిలించే అవకాశం ఉందని తెలిపారు. RTO Challan.apk, Aadhar.apk, SBI.apk, PM...
Read More...
Local News 

చాచా నెహ్రూ నగర్‌లో సైబర్ క్రైమ్ అవగాహన సదస్సు

చాచా నెహ్రూ నగర్‌లో సైబర్ క్రైమ్ అవగాహన సదస్సు సికింద్రాబాద్, నవంబర్ 25 (ప్రజామంటలు): దేశ వ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో గాంధీనగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఆర్. వెంకటేశ్వర్లు మంగళవారం చాచా నెహ్రూ నగర్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానికులు, దుకాణదారులకు సైబర్ మోసాల గురించి వివరించి, టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ 1930 వినియోగంపై సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా పాంప్లెట్లు కూడా...
Read More...