ఘనంగా ప్రారంభమైన " ప్రవాసీ ప్రజావాణి " గల్ఫ్ కార్మికుల కష్టాలు తీరుస్తాం - మంత్రి పొన్నం
ఘనంగా ప్రారంభమైన " ప్రవాసీ ప్రజావాణి "
గల్ఫ్ కార్మికుల కష్టాలు తీరుస్తాం - మంత్రి పొన్నం

హైదరాబాద్ సెప్టెంబర్ 27:
జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో ప్రవాసి ప్రజావాణి ( గల్ఫ్ కార్మికులు, ఎన్నారై ల కోసం) ప్రత్యేక కౌంటర్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు
ప్రవాసి ప్రజావాణి ప్రత్యేక కౌంటర్ ను రిబ్బన్ కట్ చేసి హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.
కార్యక్రమంలో ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్, ప్రజావాణి ఇంచార్జీ డాక్టర్ జీ చిన్నారెడ్డి , ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పిసిసి ఎన్నారై సెల్ ఛైర్మన్ వినోద్ కుమార్, ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య, ఎన్నారై విభాగం ప్రతినిధులు మంద భీం రెడ్డి, నంగి దేవేందర్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, చాంద్ పాషా, నరేష్ రెడ్డి, నవీన్ రెడ్డి, చెన్నమనేని శ్రీనివాస్ రావు, తదితరులు పాల్గొన్నారు.
గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్నా షేక్ హుస్సేన్ కుటుంబం నుండి మొదటి అభ్యర్థనను మంత్రి పొన్నం ప్రభాకర్, చిన్నారెడ్డి, జీవన్ రెడ్డి లు స్వీకరించారు.
సమస్యల వినతి కోసం భారీగా పాల్గొన్న గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబసభ్యులు పాల్గొన్నారు
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రజావాణి కార్యక్రమానికి తెలంగాణ వ్యాప్తంగా గల్ఫ్ కార్మికులు సమస్యలపై పెద్ద ఎత్తున తరలి వచ్చిన వారిని చూస్తేనే సమస్య ఎంత పెద్దగా ఉంది అర్థం అవుతుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నికల్లో చెప్పినట్టు 4 అంశాల పై నిర్ణయం తీసుకోవడం జరిగిందని,అందులో మొదటిది తెలంగాణ ప్రభుత్వం పక్షాన ప్రజా భవన్ లో ప్రవాసి ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందను అన్నారు
ఇంకా, రాష్ట్రం నుండి గల్ఫ్ దేశాలకు పెద్ద ఎత్తున ఉపాధి నిమిత్తం వెళ్ళారు.వారి సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందనీ అన్నారు.
గల్ఫ్ ప్రమాదంలో చనిపోయిన వారికి 5 లక్షల ఎక్ఫ్ గ్రెషీయ ఇవ్వడానికి ఇప్పటికే జీవో జారీ చేసుకున్నాం. గల్ఫ్ కార్మికుల కుటుంబాల పిల్లల చదువులకు ఇబ్బందులు లేకుండా గురుకులాల్లో సీట్లు కల్పిస్తున్నాం..
గల్ఫ్ కార్మికుల కోసం ఉత్తర తెలంగాణ ప్రాంతం నుండి ప్రాతినిద్యం వహిస్తున్న ఎమ్మెల్యేలతో అడ్వైజరి కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది..
నా నియోజకవర్గం లో జాబ్ మేళా పెడితే 9 వేల మంది వచ్చారు.విదేశాల్లో ఉపాధి అవకాశాల కోసం పోయేవరికి అక్కడి చట్టాలు తెలియడం లేదు..
వారికి ఇక్కడి కంపెనీలపై అవగాహన కల్పించాలి..వాటిపై విస్తృత సమాచారం అందించాలి..సంస్థను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలి.
ప్రజలను మోసం చేస్తూ విదేశాలకు పంపించి అక్కడ ఇబ్బందులు పడేలా చేస్తున్నారు.అలాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి.ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. అక్కడ శిక్షణ పొంది విదేశాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలను సంకల్పించారు.
ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో ఈ ప్రజావాణి తీసుకురావడానికి కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
స్పీకర్ క్లిన్ చిట్: జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ బీఆర్ఎస్లోనే
జగిత్యాల, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్పై బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన అనర్హత పిటిషన్ను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేశారు. ఎమ్మెల్యే పార్టీ మారినట్లు నిరూపించే ఆధారాలు లేవని స్పష్టంగా పేర్కొన్నారు.
అభివృద్ధి కోసమే కాంగ్రెస్తో సమన్వయం – డా. సంజయ్ స్పష్టం
ఈ తీర్పుపై... పక్కింటి సంసారంలో చిచ్చు పెట్టడం మానుకో: మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
అభివృద్ధి అంటే పక్కింటికి కన్నం వేయడమా? అంటూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్పై మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపు అంశంపై స్పీకర్ ఇప్పటికే స్పష్టమైన తీర్పు ఇచ్చారని, ఎమ్మెల్యే... జగిత్యాల మున్సిపాలిటీ – ప్రధాన పార్టీల అభ్యర్థుల జాబితా
జగిత్యాల ఫిబ్రవరి 03 (ప్రజా మంటలు):
ప్రధాన పార్టీలు – బీజేపీ (BJP), కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు.(వార్డు – రిజర్వేషన్ – అభ్యర్థి పేరు – పార్టీ)
🔹 వార్డు 1 (BC-G)
అనిల్ కుమార్ కుసారి – INC
నిమిషకవి వంశీకృష్ణ – BRS
పుప్పాల రాజేష్ – BJP
🔹... బి.ఎల్.ఓ లు తమ విధులను జాగ్రత్తగా నిర్వహించాలి జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్. లత
జగిత్యాల ఫిబ్రవరి 3 ( ప్రజా మంటలు)పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో బి.ఎల్.ఓ లు తమ విధులను జాగ్రత్తగా నిర్వహించాలనిఅదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్. లత పేర్కొన్నారు.
ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో బి.ఎల్.ఓల పాత్ర కీలకమని చెప్పారు. ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన 18 సంవత్సరాలు... క్రమశిక్షణతో ఉండడం తప్పా: జీవన్ రెడ్డి
జగిత్యాల, ఫిబ్రవరి 3 (ప్రజా మంటలు):
నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తూ, రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించడమే నా తప్పా? అని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ—కష్టకాలంలో పార్టీని నమ్ముకుని... జగిత్యాల మాల జంగం పురోహితులచే రాజరాజేశ్వర స్వామి పల్లకి సేవ
జగిత్యాల ఫిబ్రవరి 3 ( ప్రజా మంటలు) మాల జంగం కు చెందిన వేల్పుల వంశస్థులకు మంగళవారం రాజరాజేశ్వర స్వామి పల్లకి సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా మంచినీళ్ల భావి వద్ద గల శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయంలో పురాని పేటకు చెందినమాల జంగం కుల మహేశ్వర పురోహితులు లక్కం శివనాథం, మురళీదాస్, మోహన్, కోదాది... జగిత్యాల పట్టణ బి ఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు కు శుభాకాంక్షలు తెలిపిన దావా వసంత
జగిత్యాల ఫిబ్రవరి 3 (ప్రజా మంటలు)జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆదేశాల మేరకు పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన వెంకటేశ్వరరావు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ని మర్యాదపూర్వకంగా కలవగా వారికి శాలువ కప్పి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
మున్సిపల్ ఎలక్షన్లో బిఆర్ఎస్ పార్టీ... రాయికల్ మున్సిపల్ బి ఆర్ఎస్ అభ్యర్థులకు బీఫాంలు అందజేసిన దావా వసంత
రాయికల్ ఫిబ్రవరి 3 ( ప్రజా మంటలు)మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు జగిత్యాల రాయికల్ పట్టణ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జ్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆదేశానుసారం రాయికల్ పట్టణ మున్సిపల్ ఎన్నికల అభ్యర్థులకు బిఆర్ఎస్ పార్టీ బీ ఫాములు... పంతం నెగ్గించుకొన్న MLA సంజయ్: 35 సీట్లతో పై చేయి.
జీవన్ రెడ్డి వర్గంలో తీవ్ర అసంతృప్తి – కార్యకర్తల ఆగ్రహం
జీవన్ రెడ్డి నిర్ణయం కొరకు ఎదిరి చూపు?
జగిత్యాల ఫిబ్రవరి 03 (ప్రజా మంటలు):
జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ల కేటాయింపు తీవ్ర వివాదానికి దారితీసింది. టికెట్ల పంపిణీలో అన్యాయం జరిగిందంటూ సీనియర్ నేత జీవన్ రెడ్డి వర్గం తీవ్ర అసంతృప్తిని... రావి నారాయణ రెడ్డికి తెలంగాణలో సముచిత స్థానం కల్పిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
భూమి–భుక్తి–వెట్టిచాకిరి విముక్తి పోరాట వీరుడికి ప్రభుత్వ గౌరవం
హైదరాబాద్ ఫిబ్రవరి 02 (ప్రజా మంటలు):
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన సమరయోధుడు రావి నారాయణ రెడ్డికి తెలంగాణ సమాజంలో ప్రభుత్వం సముచితమైన స్థానం కల్పిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రావి నారాయణ రెడ్డి చరిత్రను పాఠ్యాంశాల్లో... హుస్నాబాద్ పట్టణాన్ని రాష్ట్రంలో రోల్ మోడల్ చేస్తా - పొన్నం
హుస్నాబాద్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, ఫిబ్రవరి2,(ప్రజా మంటలు):
ఈనెల 11 వ తేదీన జరిగే ఎన్నికల్లో హుస్నాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని 20 లోస్థానాలు గెలిపించి తనకు మరింత బలాన్ని ఇవ్వాలని హుస్నాబాద్ పట్టణంను ప్రత్యేక ప్రణాళిక ద్వారా అభివృద్ధి చేస్తున్నామని ,గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో ఒక్క డబుల్... 