ఘనంగా ప్రారంభమైన " ప్రవాసీ ప్రజావాణి " గల్ఫ్ కార్మికుల కష్టాలు తీరుస్తాం - మంత్రి పొన్నం
ఘనంగా ప్రారంభమైన " ప్రవాసీ ప్రజావాణి "
గల్ఫ్ కార్మికుల కష్టాలు తీరుస్తాం - మంత్రి పొన్నం

హైదరాబాద్ సెప్టెంబర్ 27:
జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో ప్రవాసి ప్రజావాణి ( గల్ఫ్ కార్మికులు, ఎన్నారై ల కోసం) ప్రత్యేక కౌంటర్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు
ప్రవాసి ప్రజావాణి ప్రత్యేక కౌంటర్ ను రిబ్బన్ కట్ చేసి హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.
కార్యక్రమంలో ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్, ప్రజావాణి ఇంచార్జీ డాక్టర్ జీ చిన్నారెడ్డి , ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పిసిసి ఎన్నారై సెల్ ఛైర్మన్ వినోద్ కుమార్, ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య, ఎన్నారై విభాగం ప్రతినిధులు మంద భీం రెడ్డి, నంగి దేవేందర్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, చాంద్ పాషా, నరేష్ రెడ్డి, నవీన్ రెడ్డి, చెన్నమనేని శ్రీనివాస్ రావు, తదితరులు పాల్గొన్నారు.
గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్నా షేక్ హుస్సేన్ కుటుంబం నుండి మొదటి అభ్యర్థనను మంత్రి పొన్నం ప్రభాకర్, చిన్నారెడ్డి, జీవన్ రెడ్డి లు స్వీకరించారు.
సమస్యల వినతి కోసం భారీగా పాల్గొన్న గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబసభ్యులు పాల్గొన్నారు
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రజావాణి కార్యక్రమానికి తెలంగాణ వ్యాప్తంగా గల్ఫ్ కార్మికులు సమస్యలపై పెద్ద ఎత్తున తరలి వచ్చిన వారిని చూస్తేనే సమస్య ఎంత పెద్దగా ఉంది అర్థం అవుతుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నికల్లో చెప్పినట్టు 4 అంశాల పై నిర్ణయం తీసుకోవడం జరిగిందని,అందులో మొదటిది తెలంగాణ ప్రభుత్వం పక్షాన ప్రజా భవన్ లో ప్రవాసి ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందను అన్నారు
ఇంకా, రాష్ట్రం నుండి గల్ఫ్ దేశాలకు పెద్ద ఎత్తున ఉపాధి నిమిత్తం వెళ్ళారు.వారి సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందనీ అన్నారు.
గల్ఫ్ ప్రమాదంలో చనిపోయిన వారికి 5 లక్షల ఎక్ఫ్ గ్రెషీయ ఇవ్వడానికి ఇప్పటికే జీవో జారీ చేసుకున్నాం. గల్ఫ్ కార్మికుల కుటుంబాల పిల్లల చదువులకు ఇబ్బందులు లేకుండా గురుకులాల్లో సీట్లు కల్పిస్తున్నాం..
గల్ఫ్ కార్మికుల కోసం ఉత్తర తెలంగాణ ప్రాంతం నుండి ప్రాతినిద్యం వహిస్తున్న ఎమ్మెల్యేలతో అడ్వైజరి కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది..
నా నియోజకవర్గం లో జాబ్ మేళా పెడితే 9 వేల మంది వచ్చారు.విదేశాల్లో ఉపాధి అవకాశాల కోసం పోయేవరికి అక్కడి చట్టాలు తెలియడం లేదు..
వారికి ఇక్కడి కంపెనీలపై అవగాహన కల్పించాలి..వాటిపై విస్తృత సమాచారం అందించాలి..సంస్థను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలి.
ప్రజలను మోసం చేస్తూ విదేశాలకు పంపించి అక్కడ ఇబ్బందులు పడేలా చేస్తున్నారు.అలాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి.ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. అక్కడ శిక్షణ పొంది విదేశాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలను సంకల్పించారు.
ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో ఈ ప్రజావాణి తీసుకురావడానికి కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల అభివృద్ధే నా లక్ష్యం – ఎంపీ అరవింద్ విమర్శలకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కౌంటర్
జగిత్యాల మార్చ్ 07 (ప్రజా మంటలు):
జగిత్యాల అభివృద్ధే తన ప్రధాన ఎజెండా అని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. కేంద్రీయ విద్యాలయం విషయంలో కాలయాపన చేస్తున్నారని ఎంపీ అరవింద్ చేసిన ఆరోపణలకు ఆయన ఘాటుగా స్పందించారు.జగిత్యాల పట్టణంలోని మోతే రోడ్డు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో... హింస ద్వారా సమస్యలకు పరిష్కారం సాధ్యం కాదు: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ మార్చ్ 07 (ప్రజా మంటలు):
హింస ద్వారా సమస్యలకు పరిష్కారం సాధ్యం కాదని, ప్రజాస్వామ్య మార్గంలోనే సమాజంలో మార్పు సాధ్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు.లొంగిపోయిన మావోయిస్టులకు ప్రాణరక్షణతో పాటు ఆర్థిక సహాయం, పునరావాసం కల్పిస్తామని తెలిపారు. కేంద్ర... ప్రతి జిల్లాకు ఓక వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలి*
*
జగిత్యాల, మార్చి 7(ప్రజా మంటలు)
ప్రతి జిల్లా కు ఓక వెల్నెస్ సెంటర్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసి స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ కు అప్పగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కరబూజ రవీందర్ అన్నారు. శనివారం స్థానిక పెన్షనర్స్ భవన్ లో జిల్లా కార్యనిర్వాహక వర్గ... రాష్ట్రస్థాయిలో ర్యాంకు సాధించిన విద్యార్థినిని అభినందించిన ఎమ్మెల్యే సంజయ్
జగిత్యాల: మార్చి 7 (ప్రజా మంటలు)అఖిల భారత సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష – 2026 లో పాఠశాలకు చెందిన విద్యార్థిని ఆర్. శ్రేయాన్వి రాష్ట్ర స్థాయిలో 23వ ర్యాంక్ సాధించి పాఠశాలకు గౌరవాన్ని తీసుకొచ్చింది.ఈ విజయాన్ని పురస్కరించుకొని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విద్యార్థిని ఆర్. శ్రేయాన్విని అభినందించారు
. ప్రతిభావంతులుగా... యూపీఎస్సీ ఫలితాలలో సత్తా చాటిన జగిత్యాల జిల్లా విద్యార్థి
జగిత్యాల మార్చి 7 ( ప్రజా మంటలు)748 ర్యాంక్ సాధించిన రాహుల్ ను సన్మానించిన గ్రామస్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు
*ఇటీవల విడుదలైన యూపీఎస్సీ 2025 --2026 ఫలితాలలో జగిత్యాల జిల్లాకు చెందిన రాహుల్ 748 ర్యాంకు సాధించి సత్తా చాటాడు. *జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం హన్మజీపేట గ్రామానికి చెందిన పుదరి... సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 23వ ర్యాంక్ సాధించిన మానస స్కూల్ విద్యార్థిని శ్రేయాన్వి
జగిత్యాల, మార్చ్ 07 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లాలో విద్యా రంగంలో మరో విశిష్ట విజయాన్ని మానస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ సాధించింది. అఖిల భారత సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష – 2026లో పాఠశాలకు చెందిన విద్యార్థిని ఆర్. శ్రేయాన్వి రాష్ట్ర స్థాయిలో 23వ ర్యాంక్ సాధించి పాఠశాలకు గౌరవాన్ని తీసుకొచ్చింది.
ఈ విజయాన్ని... 2025 తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రకటన: ఉత్తమ నటుడిగా నాగ చైతన్య, ఉత్తమ నటిగా రష్మిక మందాన
2025 తెలంగాణ Gaddar Awards విజేతల జాబితా
హైదరాబాద్, మార్చ్ 07:
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే గద్దర్ అవార్డులు – 2025 ను ప్రకటించింది. తెలుగు సినీ రంగంలో ప్రతిభ కనబరిచిన నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు ఈ అవార్డులు ప్రకటించారు.
ప్రధాన అవార్డులుఉత్తమ నటుడు – నాగ చైతన్య (తండేల్)ఉత్తమ... ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కోరుతూ బీసీ నాయకుల చే కలెక్టర్ కు వినతి
జగిత్యాల మార్చ్6( ప్రజా మంటలు) జిల్లా కలెక్టర్ కి. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 8000 కోట్లను వెంటనే విడుదల చేయాలని చెల్లించాలని. వినతి పత్రం సమర్పించిన బీసీ నాయకులు
(తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 8000 కోట్లను వెంటనే చెల్లించాలని డిమాండ్.) తెలంగాణ రాష్ట్రంలో... జిల్లాలో ఎనిమిదవ రోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతం
జగిత్యాల మార్చి 6 (ప్రజా మంటలు)జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు 30 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించడం జరిగింది.జనరల్ కోర్సులకు సంబంధించి 4193 విద్యార్థులకు గాను 4138 విద్యార్థులు హాజరు కాగా 55 విద్యార్థులు గైర్హాజరయ్యారు మరియు ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 847 విద్యార్థులకు గాను 809 విద్యార్థులు హాజరు కాగా 38... త్వరలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తామని ప్రకటన
తిరుమల మార్చ్ 06 (ప్రజా మంటలు):
కల్వకుంట్ల కవిత శుక్రవారం ఉదయం తన భర్త అనిల్తో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. గురువారం సాయంత్రం అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్న కవిత, శుక్రవారం ఉదయం ప్రత్యేక దర్శనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత,... త్వరలో కొత్త పార్టీ, తెలంగాణ హక్కుల కోసం పోరాటం : తిరుమలలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు –
అలిపిరి మార్చ్ 05 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. గురువారం సాయంత్రం అలిపిరి నుంచి కుటుంబ సభ్యులు, జాగృతి నాయకులతో కలిసి మెట్ల మార్గం ద్వారా బయలుదేరిన ఆమె రాత్రి సుమారు 10 గంటల సమయంలో తిరుమలకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం... జగిత్యాలలో నవోదయ విద్యాలయం ఏర్పాటులో ఎమ్మెల్యే నిర్లక్ష్యం – ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు
జగిత్యాల మార్చ్ 05, (ప్రజా మంటలు):
జగిత్యాల నియోజకవర్గ కార్యాలయం “కమల నిలయం”లో జరిగిన మీడియా సమావేశంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నాగ శ్రావణితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరవింద్ జగిత్యాలలో నవోదయ విద్యాలయం స్థాపనకు అవసరమైన భూమి కేటాయింపు అంశంపై రాష్ట్ర... 