ఘనంగా ప్రారంభమైన " ప్రవాసీ ప్రజావాణి " గల్ఫ్ కార్మికుల కష్టాలు తీరుస్తాం - మంత్రి పొన్నం
ఘనంగా ప్రారంభమైన " ప్రవాసీ ప్రజావాణి "
గల్ఫ్ కార్మికుల కష్టాలు తీరుస్తాం - మంత్రి పొన్నం

హైదరాబాద్ సెప్టెంబర్ 27:
జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో ప్రవాసి ప్రజావాణి ( గల్ఫ్ కార్మికులు, ఎన్నారై ల కోసం) ప్రత్యేక కౌంటర్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు
ప్రవాసి ప్రజావాణి ప్రత్యేక కౌంటర్ ను రిబ్బన్ కట్ చేసి హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.
కార్యక్రమంలో ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్, ప్రజావాణి ఇంచార్జీ డాక్టర్ జీ చిన్నారెడ్డి , ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పిసిసి ఎన్నారై సెల్ ఛైర్మన్ వినోద్ కుమార్, ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య, ఎన్నారై విభాగం ప్రతినిధులు మంద భీం రెడ్డి, నంగి దేవేందర్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, చాంద్ పాషా, నరేష్ రెడ్డి, నవీన్ రెడ్డి, చెన్నమనేని శ్రీనివాస్ రావు, తదితరులు పాల్గొన్నారు.
గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్నా షేక్ హుస్సేన్ కుటుంబం నుండి మొదటి అభ్యర్థనను మంత్రి పొన్నం ప్రభాకర్, చిన్నారెడ్డి, జీవన్ రెడ్డి లు స్వీకరించారు.
సమస్యల వినతి కోసం భారీగా పాల్గొన్న గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబసభ్యులు పాల్గొన్నారు
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రజావాణి కార్యక్రమానికి తెలంగాణ వ్యాప్తంగా గల్ఫ్ కార్మికులు సమస్యలపై పెద్ద ఎత్తున తరలి వచ్చిన వారిని చూస్తేనే సమస్య ఎంత పెద్దగా ఉంది అర్థం అవుతుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నికల్లో చెప్పినట్టు 4 అంశాల పై నిర్ణయం తీసుకోవడం జరిగిందని,అందులో మొదటిది తెలంగాణ ప్రభుత్వం పక్షాన ప్రజా భవన్ లో ప్రవాసి ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందను అన్నారు
ఇంకా, రాష్ట్రం నుండి గల్ఫ్ దేశాలకు పెద్ద ఎత్తున ఉపాధి నిమిత్తం వెళ్ళారు.వారి సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందనీ అన్నారు.
గల్ఫ్ ప్రమాదంలో చనిపోయిన వారికి 5 లక్షల ఎక్ఫ్ గ్రెషీయ ఇవ్వడానికి ఇప్పటికే జీవో జారీ చేసుకున్నాం. గల్ఫ్ కార్మికుల కుటుంబాల పిల్లల చదువులకు ఇబ్బందులు లేకుండా గురుకులాల్లో సీట్లు కల్పిస్తున్నాం..
గల్ఫ్ కార్మికుల కోసం ఉత్తర తెలంగాణ ప్రాంతం నుండి ప్రాతినిద్యం వహిస్తున్న ఎమ్మెల్యేలతో అడ్వైజరి కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది..
నా నియోజకవర్గం లో జాబ్ మేళా పెడితే 9 వేల మంది వచ్చారు.విదేశాల్లో ఉపాధి అవకాశాల కోసం పోయేవరికి అక్కడి చట్టాలు తెలియడం లేదు..
వారికి ఇక్కడి కంపెనీలపై అవగాహన కల్పించాలి..వాటిపై విస్తృత సమాచారం అందించాలి..సంస్థను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలి.
ప్రజలను మోసం చేస్తూ విదేశాలకు పంపించి అక్కడ ఇబ్బందులు పడేలా చేస్తున్నారు.అలాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి.ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. అక్కడ శిక్షణ పొంది విదేశాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలను సంకల్పించారు.
ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో ఈ ప్రజావాణి తీసుకురావడానికి కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్పై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
హైదరాబాద్ మే 28 (ప్రజా మంటలు):
తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు నిరంతర హై-స్పీడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అందించేందుకు అమెండెడ్ భారత్నెట్ ప్రోగ్రామ్ (ABP) అమలుపై ముఖ్యమంత్రి A. Revanth Reddy కేంద్ర సమాచార శాఖ మంత్రి Jyotiraditya Scindiaతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ మంత్రి Duddilla Sridhar Babu... తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తుపై మహారాష్ట్రతో చర్చలకు తెలంగాణ అడుగు
హైదరాబాద్, మే 28 (ప్రజా మంటలు):
తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తు, నిర్మాణ అంశాలపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి A. Revanth Reddy మహారాష్ట్ర ముఖ్యమంత్రి Devendra Fadnavis కు లేఖ రాశారు. తెలంగాణ ప్రతినిధి బృందంతో సమావేశానికి సమయం కేటాయించాలని, త్వరలో అనుకూల తేదీ... ఒకే ఒక లోకం” మూవీ మే 29న గ్రాండ్ రిలీజ్.. హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహణ
హైదరాబాద్ మే 27:
హైదరాబాద్లో “ఒకే ఒక లోకం” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ప్రకాశం బుల్స్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై కొరిటాల రోహిణి సమర్పణలో, కొరిటాల సాయిచౌదరి నిర్మించిన ఈ చిత్రానికి వై.విష్ణునారాయణ దర్శకత్వం వహించారు. సినిమా మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఫిల్మ్ ఛాంబర్లో జరిగిన కార్యక్రమంలో తెలుగు... సర్వేలతో సర్కార్ కాలయాపన – అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైందని టీఆర్ఎస్ నేతల విమర్శ
హైదరాబాద్, మే 27 (ప్రజా మంటలు):
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా సర్వేల పేరుతో కాలయాపన చేస్తోందని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) రాష్ట్ర నాయకులు విమర్శించారు. బంజారాహిల్స్లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర నాయకులు సయ్యద్ ఇస్మాయిల్, ఆర్వీఆర్ ప్రసాద్, లోక రవిచంద్ర ప్రభుత్వ పనితీరుపై... లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన కల్వకుంట్ల కవిత – భూ బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి
హైదరాబాద్, మే 26 (ప్రజా మంటలు):
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మంగళవారం హైదరాబాద్లోని లోక్ భవన్లో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి వెలుగుమట్ల ఇళ్ల కూల్చివేత బాధితులు, ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితులు, పరిగి మండలం కడ్లాపూర్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రభావితుల సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.ఈ సమావేశంలో ధర్మ... ట్రాఫిక్ సిబ్బంది ఆరోగ్య రక్షణకు ప్రత్యేక చర్యలు ట్రాఫిక్ సిబ్బందికి కూలింగ్ గాగుల్స్, వాటర్ ఫ్లాస్క్స్ పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల మే 25(ప్రజా మంటలు) జిల్లాలో పెరుగుతున్న ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది ఆరోగ్య రక్షణ కోసం జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా స్థానిక ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ట్రాఫిక్ సిబ్బందికి కూలింగ్ గాగుల్స్ మరియు వాటర్... శాంతి కళ్యాణంతో ఘనంగా ముగిసిన విష్ణు పురాణ ప్రవచన సప్తాహం
జగిత్యాల మే 24 ( ప్రజా మంటలు)జిల్లా కేంద్రం కృష్ణ నగర్ లోని ఉమా శంకర్ గార్డెన్స్ లో గత వారం రోజులుగా ప్రముఖ పౌరాణిక వేద పండితులు బుర్రా భాస్కర శర్మ చే అంగ రంగ వైభవంగా జరిగిన శ్రీ మహా విష్ణు పురాణం ప్రవచనం సమాప్తి సందర్బంగా శ్రీ లక్ష్మి నారాయణుల... చదువుతోనే చక్కటి జీవితం జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్
జగిత్యాల మే 24 (ప్రజా మంటలు)చదువుతోనే సమాజంలో గుర్తింపు, చక్కటి జీవితం లభిస్తుందని జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్ అన్నారు పట్టణంలోని ఎల్ ఎల్ గార్డెన్స్ లో జరిగిన గౌడ ప్రొఫెషనల్ అండ్ అఫీషియల్స్ అసోసియేషన్ (గోప) జగిత్యాల జిల్లా కమిటీ నిర్వహించిన ప్రతిభ పురస్కారాల అవార్డ్స్ మహోత్సవంలో ఆయన ముఖ్య... భాగవత ప్రవచకునికి భాగవత చూర్ణిక అందజేత
జగిత్యాల మే 24 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని గీత భవన్ లో ఖండవల్లి ఆదిత్య శర్మచే శ్రీమద్ భాగవత సప్తాహం కొనసాగుతుండగా ఆదివారం ఉదయము కీ"శే " సరాబు మందిరం వెంకటేశ్వర శర్మచే తెలుగులో అనువదించబడిన భాగవత సప్తాహ చూర్ణిక పుస్తకాలను వెంకటేశ్వర శర్మ కుమారుడు భారవిశర్మ పురాణ ప్రవచకులు ఆదిత్య శర్మకు అందజేశారు. ... ఆరవ రోజు కొనసాగుతున్న విష్ణు పురాణం
జగిత్యాల మే 23(ప్రజా మంటలు) జిల్లా కేoద్రం కృష్ణా నగర్ లోని ఉమా శంకర్ గార్డెన్స్ లో, ప్రముఖ పౌరాణిక, వేద, పండితులు, మంచిర్యాల వాస్తవ్యులు, బహ్మ శ్రీ బుర్రా భాస్కర శర్మ చే, ఎంతో వైభవంగా ,జరుగుతున్న విష్ణు పురాణం శనివారం 6వ రోజు కు చేరింది. సామూహిక శ్రీ విష్ణు స హస్ర... క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి జ్ఞాపికలు, అందజేసిన అదనపు కలెక్టర్ బి రాజా గౌడ్
జగిత్యాల మే 23(ప్రజా మంటలు)జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించిన “99 రోజుల యాక్షన్ ప్లాన్ – ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” ముగింపు కార్యక్రమం జిల్లా యువజన మరియు క్రీడల శాఖ స్వామి వివేకానంద ఇండోర్ మినీ స్టేడియంలో ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య... తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయాలు - 23.05.2026
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
హైదరాబాద్ 23 మే (ప్రజా మంటలు) :
తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయాలు మరియు హైలైట్స్.
1. రాష్ట్రంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
మొత్తం 2 లక్షల 50 వేల మంది పేద కుటుంబాల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి... 