పి సి సి అధ్యక్షులుగా మహేష్ కుమార్
తెలంగాణ పీసీసీ కొత్త అధ్యక్షులుగా. మహేష్ కుమార్ గౌడ్
హైదారాబాద్ సెప్టెంబర్.06: తెలంగాణ పీసీసీ కొత్త అధ్యక్షులుగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీచేసింది.
గత 8 నెలలుగా కొత్త పీసీసీ అధ్యక్షుని నియామకం కొరకు జరిగిన చర్చల్లో చివరికి మహేష్ కుమార్ గౌడ్ వైపే ఏఐసీసీ మొగ్గింది.
ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగిన సంగతి తెలిసిందే. తెలంగాణకు కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించేందుకు కాంగ్రెస్ పార్టీకి 9 నెలల సమయం పట్టింది.
మహేశ్ కుమార్ గౌడ్ రాజకీయ నేపథ్యం..
బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ 1966 ఫిబ్రవరి 24న నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ మండలం, రహత్ నగర్లో జన్మించారు. గిరిరాజ్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. మహేష్ కుమార్ గౌడ్ గిరిరాజ్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న సమయంలో విద్యార్థి దశలో ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పని చేశాడు. ఆ తరువాత 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిచ్పల్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా చిన్న వయస్సులోనే పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మహేష్ కుమార్ 2013 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్గా పని చేశాడు.
మహేష్ కుమార్ 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్య ర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఆ తరువాత పీసీసీ కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా, పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పని చేసి 2018లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించిన ఆ ఎన్నికల్లో ఆ స్థానాన్ని అధిష్ఠానం మైనార్టీలకు కేటాయించడంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. మహేష్ కుమార్ 2018 సెప్టెంబర్ 18న రాష్ట్ర ఎన్నికల కమిటీలో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్గా నియమితులయ్యారు.
2021 జూన్ 26న పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, 2022 డిసెంబర్ 10న కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కార్యనిర్వాహక కమిటీలోప్రత్యేక ఆహ్వానితుడిగా, 2023 జూన్ 20న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీ-పీసీసీ) ఎన్నికల కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు. మహేష్ కుమార్ గౌడ్ 2023లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేయాలనీ భావించిన ఆ నియోజకవర్గం నుండి మాజీ మంత్రి షబ్బీర్ అలీని పార్టీ అభ్యర్థిగా నిలపడంతో ఆయన పోటీ నుంచి తప్పుకోగా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 2024 జనవరి 29న తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో రెండు స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఆయన పేరును కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. ఎమ్మెల్సీ పదవికి ఇతర పార్టీల నుండి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో మహేష్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ ఏడాది జనవరి 31న తెలంగాణ శాసనమండలి సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు మహేశ్ కుమార్ గౌడ్
గతంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ గా పనిచేసిన మధు యాష్కీ. ఈ పదవి కొరకు చివరి వరకు పోటీలో అన్నారు. కానీ ఆయన గత శాసన సభ ఎన్నికల్లో ఎల్ బి నగర్ నియోజక వర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారని, ఓడిన వారికి పదవి ఇస్తే, ఇంకా చాల మంది ఇతర పదవులకు పోటీపడతారని, అందుకే పక్కన పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది, మధు యాష్కీ కి ఇతర చోట స్థానం కల్పించి అవకాశం ఉందని చెప్పుకొంటున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇజ్రాయెల్ చర్యలను 'మానవత్వానికే విరుద్ధం'గా ఖండించిన యూదు ప్రముఖులు
జెరుసేలం అక్టోబర్ 24:
ఇజ్రాయెల్ ప్రభుత్వ చర్యలను “అమానుషం”గా పేర్కొంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ యూదులు తీవ్రంగా ఖండించారు. గాజాలో జరుగుతున్న దాడులను నిలిపివేయాలని, అంతర్జాతీయ సమాజం ఇజ్రాయెల్పై ఆంక్షలు విధించాలని వారు కోరారు.
ఈ మేరకు 450 మందికి పైగా యూదు మేధావులు, కళాకారులు, రాజకీయ నాయకులు, మాజీ ఇజ్రాయెల్ అధికారులు కలిసి ఓ... కఫాలా వ్యవస్థ రద్దు — ఉత్తర తెలంగాణ ప్రవాస కార్మికులకు కొత్త ఆశలు
పూర్తి అమలు కొరకు కొన్నాళ్ళు వేచిచూడాలా?
నిర్బంధ చాకిరి నుండి వేలాది మందికి విముక్తి
(సిహెచ్ వి ప్రభాకర్ రావు)
హైదరాబాద్, అక్టోబర్ 24:సౌదీ అరేబియా ప్రభుత్వము కాఫాలా (Kafala) వ్యవస్థను అధికారికంగా రద్దు చేయడం, భారతదేశం నుండి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ (నిజామాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, ఖమ్మం, మెదక్) జిల్లాల నుండి వేలాది... హైదరాబాద్లో బంగారం & వెండి ధరలపై తాజా సమాచారం
హైదరాబాద్, అక్టోబర్ 24 (ప్రజా మంటలు):
పసిడి ప్రియులకు మంచి సమాచారం – ఇటీవల కొద్దీ క్రమంగా దిగుముఖంగా ఉన్న బంగారం మరియు వెండి ధరలు ఈరోజు మళ్లీ మార్పులు చూపాయి. ముఖ్యంగా గ్రాము బంగారం ధరలు స్థిరంగా ఉన్నా, నాణ్యతలు మరియు క్యారెట్ల ప్రకారం వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. పెట్టుబడిదారులకు, ఉపభోక్తారకు ఇది గమనించదగ్గ సమయం... నేరేళ్ల వద్ద ఊడిపోయిన బస్సు చక్రం - తప్పిన ప్రమాదం
ధర్మపురి అక్టోబర్ 24 (ప్రజా మంటలు):
జగిత్యాల - ధర్మపురి ప్రధాన రహదారి పై నేరెళ్ల వద్ద ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుకు తప్పిన ప్రమాదం.పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడంతో బస్సు టైరు ఊడిపోయింది.డ్రైవర్ అప్రమత్తతో, బస్సును ఆపివేయడంతో, ప్రమాదం తప్పింది.
ధర్మపురి నుంచి జగిత్యాల కు బయలుదేరిన బస్సులో సామర్ధ్యానికి మించి ప్రయాణికులు ఎక్కడంతో... కర్నూలు జిల్లాలో ఘోర విషాదం: దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు – 32 మంది మృతి?
కర్నూలు అక్టోబర్ 24:
కర్నూలు జిల్లా చిన్నటెకూరు సమీపంలో ఈరోజు తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి. కావేరి ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు జాతీయ రహదారి 44పై దగ్ధమైంది. ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికులలో 33 మంది సజీవదహనమయ్యారని అధికారులు తెలిపారు.
స్థలం: చిన్నటెకూరు, కర్నూలు జిల్లా
సమయం: తెల్లవారుజామున... హైకోర్టు తీర్పు తర్వాతే స్థానిక ఎన్నికలు - మంత్రివర్గ నిర్ణయం
హైదరాబాద్ అక్టోబర్ 24 (ప్రజా మంటలు):
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రస్తుతం అమలులో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తి వేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించడానికి... ఇబ్రహీంపట్నంలో పోలీస్ అమరవీరుల మాస ఉత్సవాల్లో భాగంగా కొవ్వొత్తుల ర్యాలీ.
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 23 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
పోలీస్ అమరవీరుల మాస ఉత్సవాల్లో భాగంగా గౌరవ ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్,జగిత్యాల్ గారి ఆదేశానుసారం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ ఐ, ఏ. అనిల్ గారి ఆధ్వర్యంలో గురువారం రోజున ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో యువకులతో పాటుగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగినది.... బీర్పూర్ ను పర్యాటక ప్రాంతం గా అభివృద్ధి చేస్తా - ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
1 కోటి రూపాయల నిధులు మంజూరుకు తన వంతుగా కృషి చేస్తా
దేవాలయాల్లో రాజకీయాలకు స్థానం లేదు
సామాజిక సేవా కార్యక్రమాల తోనే ప్రజల్లో గుర్తింపు, సేవ చేయాలని లక్ష్యం తోనే రాజకీయాల్లోకి వచ్చాను
సారంగాపూర్ అక్టోబర్ 23 (ప్రజా మంటలు):
బీర్పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ట్రస్ట్ బోర్డ్ నూతన కార్యవర్గ... డీజీపీ ని కలిసిన మాజీ మంత్రి రాజేశం గౌడ్, వ్యాపారవేత్త ప్రమోద్ అగర్వాల్
హైదరాబాద్ అక్టోబర్ 22 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి)గా ఇటీవలే నియమితులైన బి. శివధర్ రెడ్డి ను మాజీ మంత్రి మరియు తెలంగాణ రాష్ట్ర తొలి ఆర్థిక సంఘం చైర్మన్ జి. రాజేశం గౌడ్, వ్యాపారవేత్త ప్రమోద్ అగర్వాల్ డిజిపి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ... అమెరికా ఆంక్షల ప్రభావం: రష్యా చమురు దిగుమతులను తగ్గిస్తున్న భారత్ ?
అమెరికా ఆంక్షలు 21 నవంబర్ నుంచి అమల్లోకి
న్యూఢిల్లీ అక్టోబర్ 23:భారత రిఫైనరీలు రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడితో పాటు, నవంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చే రోస్నెఫ్ట్ (Rosneft), లుకోయిల్ (Lukoil) కంపెనీలపై అమెరికా ఆంక్షలు ఈ నిర్ణయానికి... సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ స్థలం పరిశీలించిన సిఇ ఎండి ,షఫీమియా
(అంకం భూమయ్య)
గొల్లపల్లి అక్టోబర్ 23 (ప్రజా మంటలు):
గొల్లపెల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల స్థల పరిశీలన కొరకు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు గురువారం సాంఘీక మైనారిటీ పాఠశాల సిఇ ఎండి, షఫీమియా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి పై గాదరీ కిశోర్ వ్యాఖ్యల ఖండన - హెచ్చరిక కబర్ధార్.
చావు డబ్బు కొట్టి నిరసన వ్యక్తం చేసిన మాదిగ సంఘ నాయకులు...
(అంకం భూమయ్య)
గొల్లపల్లి అక్టోబర్ 23 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలో రాష్ట్ర మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమర్ ను అనుచిత వ్యాఖ్యలు చేసిన గాధరి కిషోర్ దిష్టిబొమ్మను డప్పులతో ఉరేగించి, దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా... 