పి సి సి అధ్యక్షులుగా మహేష్ కుమార్
తెలంగాణ పీసీసీ కొత్త అధ్యక్షులుగా. మహేష్ కుమార్ గౌడ్
హైదారాబాద్ సెప్టెంబర్.06: తెలంగాణ పీసీసీ కొత్త అధ్యక్షులుగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీచేసింది.
గత 8 నెలలుగా కొత్త పీసీసీ అధ్యక్షుని నియామకం కొరకు జరిగిన చర్చల్లో చివరికి మహేష్ కుమార్ గౌడ్ వైపే ఏఐసీసీ మొగ్గింది.
ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగిన సంగతి తెలిసిందే. తెలంగాణకు కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించేందుకు కాంగ్రెస్ పార్టీకి 9 నెలల సమయం పట్టింది.
మహేశ్ కుమార్ గౌడ్ రాజకీయ నేపథ్యం..
బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ 1966 ఫిబ్రవరి 24న నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ మండలం, రహత్ నగర్లో జన్మించారు. గిరిరాజ్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. మహేష్ కుమార్ గౌడ్ గిరిరాజ్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న సమయంలో విద్యార్థి దశలో ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పని చేశాడు. ఆ తరువాత 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిచ్పల్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా చిన్న వయస్సులోనే పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మహేష్ కుమార్ 2013 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్గా పని చేశాడు.
మహేష్ కుమార్ 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్య ర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఆ తరువాత పీసీసీ కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా, పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పని చేసి 2018లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించిన ఆ ఎన్నికల్లో ఆ స్థానాన్ని అధిష్ఠానం మైనార్టీలకు కేటాయించడంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. మహేష్ కుమార్ 2018 సెప్టెంబర్ 18న రాష్ట్ర ఎన్నికల కమిటీలో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్గా నియమితులయ్యారు.
2021 జూన్ 26న పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, 2022 డిసెంబర్ 10న కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కార్యనిర్వాహక కమిటీలోప్రత్యేక ఆహ్వానితుడిగా, 2023 జూన్ 20న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీ-పీసీసీ) ఎన్నికల కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు. మహేష్ కుమార్ గౌడ్ 2023లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేయాలనీ భావించిన ఆ నియోజకవర్గం నుండి మాజీ మంత్రి షబ్బీర్ అలీని పార్టీ అభ్యర్థిగా నిలపడంతో ఆయన పోటీ నుంచి తప్పుకోగా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 2024 జనవరి 29న తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో రెండు స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఆయన పేరును కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. ఎమ్మెల్సీ పదవికి ఇతర పార్టీల నుండి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో మహేష్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ ఏడాది జనవరి 31న తెలంగాణ శాసనమండలి సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు మహేశ్ కుమార్ గౌడ్
గతంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ గా పనిచేసిన మధు యాష్కీ. ఈ పదవి కొరకు చివరి వరకు పోటీలో అన్నారు. కానీ ఆయన గత శాసన సభ ఎన్నికల్లో ఎల్ బి నగర్ నియోజక వర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారని, ఓడిన వారికి పదవి ఇస్తే, ఇంకా చాల మంది ఇతర పదవులకు పోటీపడతారని, అందుకే పక్కన పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది, మధు యాష్కీ కి ఇతర చోట స్థానం కల్పించి అవకాశం ఉందని చెప్పుకొంటున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
విజయకాంత్.డీఎండీకే పార్టీ డీఎంకే కూటమిలో తొలిసారి చేరిక
చెన్నై, ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు):
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటి వరకు ఎప్పుడూ డీఎంకే కూటమిలో చేరని డీఎండీకే, తొలిసారిగా డీఎంకే నేతృత్వంలోని కూటమిలో చేరింది. అన్నాడీఎంకే కూటమి నుంచి వైదొలిగిన డీఎండీకే, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో భాగంగా పోటీ చేయనుంది.
పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు... ఏఐ ని ప్రజాస్వామ్యీకరించాలి – గ్లోబల్ సౌత్కు సాధికారత సాధనంగా మారాలి
న్యూఢిల్లీ ఫిబ్రవరి 19:
కృత్రిమ మేధ (ఏఐ)ని ప్రజాస్వామ్యీకరించాల్సిన అవసరం ఉందని, అది ప్రత్యేకించి గ్లోబల్ సౌత్ దేశాలకు సమావేశం, సాధికారతకు మాధ్యమంగా మారాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
ఏఐ ఇంపాక్ట్ కాన్క్లేవ్లో మాట్లాడిన ప్రధాని, ఏఐ అభివృద్ధి కొద్ది దేశాలు, కొద్ది సంస్థల చేతుల్లోనే కేంద్రీకృతం కాకూడదని స్పష్టం చేశారు. ఏఐ సాంకేతికతను... బడ్జెట్ సమావేశాల్లో హామీల అమలు చేయాలి – ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి
హైదరాబాద్, ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు):
ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో ఎన్నికల హామీల అమలుకు తగిన నిధులు కేటాయించాలని, ఆర్టీసీని తక్షణమే ప్రభుత్వంలో విలీనం చేయాలని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ రోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికులు... మూడు టీ20 మ్యాచ్ల్లో అభిషేక్ శర్మ వరుసగా డక్ అవుట్
అహ్మదాబాద్ ఫిబ్రవరి 18:
భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ వరుసగా మూడు అంతర్జాతీయ టీ20 మ్యాచ్ల్లో శూన్య పరుగులకే అవుట్ కావడం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఆయా మ్యాచ్ల వివరాలు ఇలా ఉన్నాయి:
1️⃣ భారత్ – అమెరికా
వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం
ఎవరి బౌలింగ్లో: షాడ్లీ వాన్ షాల్క్విక్
ఎన్ని బంతులు:... ముత్తాత సమాధి కోసం 19 ఏళ్ల అన్వేషణ.. ఇంగ్లండ్ నుంచి హైదరాబాద్కు బ్రిటిష్ పౌరుడు
సికింద్రాబాద్, ఫిబ్రవరి 18 (ప్రజా మంటలు):
130 ఏళ్ల క్రితం సికింద్రాబాద్లో మరణించిన తన ముత్తాత సమాధిని వెతుక్కుంటూ ఇంగ్లండ్కు చెందిన రాబిన్ డిక్సన్ హైదరాబాద్కు వచ్చారు. దాదాపు 19 ఏళ్ల అన్వేషణ ఎట్టకేలకు ఫలించడంతో, పూర్వీకుడి సమాధి వద్ద భావోద్వేగంతో నివాళులర్పించారు.
రాబిన్ డిక్సన్ తన కుటుంబ పాత దస్త్రాల ద్వారా తన ముత్తాత... చంచల్గూడా జైలు నుంచి విడుదలైన ఐబొమ్మ రవి
హైదరాబాద్, ఫిబ్రవరి 18 (ప్రజా మంటలు):
ఐబొమ్మ వ్యవహారంలో అరెస్టై సుమారు 90 రోజులుగా జైలులో ఉన్న ఐబొమ్మ రవి కు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.
బెయిల్ ఉత్తర్వుల నేపథ్యంలో రవిని చంచల్గూడా జైలు అధికారులు విడుదల చేశారు. ఐబొమ్మ వెబ్సైట్ నిర్వహణకు సంబంధించి రవిపై మొత్తం ఐదు... నేటి నుంచే రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం
హైదరాబాద్, ఫిబ్రవరి 18 (ప్రజా మంటలు):
పవిత్ర రంజాన్ నెలవంక భారత్లో నిన్న దర్శనమివ్వడంతో, ముస్లిం సోదరులు ఈరోజు (గురువారం) నుంచి రంజాన్ ఉపవాస దీక్షలను ప్రారంభించనున్నారు. నెల రోజుల పాటు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసాలు పాటిస్తూ, అల్లాహ్కు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు.
రంజాన్ మాసం ఇస్లాం మతంలో అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది.... నియోజకవర్గ సర్పంచులకు న్యాక్ కేంద్రంలో దిశా నిర్దేశం చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల ఫిబ్రవరి 18 ( ప్రజా మంటలు)తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి ఆద్వర్యం లో జగిత్యాల న్యాక్ కేంద్రం లో జగిత్యాల నియోజకవర్గ సర్పంచుల ఓరియంటేషన్ 5 రోజుల శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై సర్పంచులకు దిశానిర్దేశం చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ... మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్ – మార్చి 3 వరకు రిమాండ్
క్యాతనపల్లి, ఫిబ్రవరి 18 (ప్రజా మంటలు):
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను క్యాతనపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. మున్సిపల్ చైర్మన్ ఎంపిక సందర్భంగా జరిగిన గందరగోళంలో పోలీసులపై దాడి చేశారనే ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల సమాచారం ప్రకారం, చైర్మన్ ఎన్నికల సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు... బయోఏషియా–2026 వేదికగా హైదరాబాద్ను ప్రపంచ జీవవిజ్ఞాన రాజధానిగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ప్రజా మంటలు):
వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ గుర్తింపు పొందిన హైదరాబాద్ను ఇకపై ప్రపంచ జీవవిజ్ఞాన (Life Sciences) రాజధానిగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. BioAsia–2026 అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన ఈ పిలుపునిచ్చారు.
హైదరాబాద్ హైటెక్స్లో జరిగిన 23వ బయోఏషియా సదస్సును పరిశ్రమల శాఖ మంత్రి ... తెలంగాణలో మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ప్రజా మంటలు):
ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్రంలో మార్చి 16 నుంచి పాఠశాలలను ఒంటిపూటగా నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలకు వర్తించనుంది.
అధికారుల ప్రకారం ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. అనంతరం... ఆర్ఎన్ఐ గుర్తింపు ఉన్న పత్రికలకూ అక్రెడిటేషన్లు ఇవ్వాలి : మంత్రి పొంగులేటిని కలిసిన టీడబ్ల్యూజేఎఫ్ నేతలు
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ప్రజా మంటలు):
ఆర్ఎన్ఐ, పీఆర్ జీఐ రిజిస్ట్రేషన్ కలిగిన చిన్న, మధ్య తరహా పత్రికలకు అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మామిడి సోమయ్య డిమాండ్ చేశారు.
మంగళవారం సచివాలయంలో రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి... 