పి సి సి అధ్యక్షులుగా మహేష్ కుమార్

On
 పి సి సి అధ్యక్షులుగా మహేష్ కుమార్

తెలంగాణ పీసీసీ కొత్త అధ్యక్షులుగా. మహేష్ కుమార్ గౌడ్

హైదారాబాద్ సెప్టెంబర్.06: తెలంగాణ పీసీసీ కొత్త అధ్యక్షులుగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీచేసింది.

గత 8 నెలలుగా కొత్త పీసీసీ అధ్యక్షుని నియామకం కొరకు జరిగిన చర్చల్లో చివరికి మహేష్ కుమార్ గౌడ్ వైపే ఏఐసీసీ మొగ్గింది. 

 ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్య‌క్షుడిగా కొన‌సాగిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ‌కు కొత్త పీసీసీ అధ్య‌క్షుడిని నియ‌మించేందుకు కాంగ్రెస్ పార్టీకి 9 నెల‌ల స‌మ‌యం ప‌ట్టింది.

మ‌హేశ్ కుమార్ గౌడ్ రాజ‌కీయ నేప‌థ్యం..

బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ 1966 ఫిబ్రవరి 24న నిజామాబాద్‌ జిల్లాలోని భీంగల్ మండలం, రహత్‌ నగర్‌లో జ‌న్మించారు. గిరిరాజ్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. మహేష్ కుమార్ గౌడ్ గిరిరాజ్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న సమయంలో విద్యార్థి దశలో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పని చేశాడు. ఆ తరువాత 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిచ్‌పల్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా చిన్న వయస్సులోనే పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మహేష్ కుమార్ 2013 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా పని చేశాడు.

మహేష్ కుమార్ 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్య ర్థిగా పోటీ చేసి ఓట‌మి చ‌విచూశారు. ఆ తరువాత పీసీసీ కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా, పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పని చేసి 2018లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించిన ఆ ఎన్నికల్లో ఆ స్థానాన్ని అధిష్ఠానం మైనార్టీలకు కేటాయించడంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. మహేష్ కుమార్ 2018 సెప్టెంబర్ 18న రాష్ట్ర ఎన్నికల కమిటీలో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్‌గా నియమితుల‌య్యారు.

2021 జూన్ 26న పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, 2022 డిసెంబర్ 10న కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కార్యనిర్వాహక కమిటీలోప్రత్యేక ఆహ్వానితుడిగా, 2023 జూన్ 20న తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీ-పీసీసీ) ఎన్నికల కమిటీలో సభ్యుడిగా నియమితుల‌య్యారు. మహేష్ కుమార్ గౌడ్ 2023లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేయాలనీ భావించిన ఆ నియోజకవర్గం నుండి మాజీ మంత్రి షబ్బీర్ అలీని పార్టీ అభ్యర్థిగా నిలపడంతో ఆయన పోటీ నుంచి తప్పుకోగా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 2024 జనవరి 29న తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో రెండు స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఆయన పేరును కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. ఎమ్మెల్సీ పదవికి ఇతర పార్టీల నుండి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో మహేష్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికైన‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ ఏడాది జనవరి 31న తెలంగాణ శాసనమండలి సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు మహేశ్ కుమార్ గౌడ్

గతంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ గా పనిచేసిన మధు యాష్కీ. ఈ పదవి కొరకు చివరి వరకు పోటీలో అన్నారు. కానీ ఆయన గత శాసన సభ ఎన్నికల్లో ఎల్ బి నగర్ నియోజక వర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారని, ఓడిన వారికి పదవి ఇస్తే, ఇంకా చాల మంది ఇతర పదవులకు పోటీపడతారని, అందుకే పక్కన పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది, మధు యాష్కీ కి ఇతర చోట స్థానం కల్పించి అవకాశం ఉందని చెప్పుకొంటున్నారు.

Tags
Join WhatsApp

More News...

సభాపతి విషు శర్మచే కొనసాగుతున్న శ్రీ గణేశ వైభవం

సభాపతి విషు శర్మచే కొనసాగుతున్న శ్రీ గణేశ వైభవం   జగిత్యాల ఫిబ్రవరి 8 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రం కరీంనగర్ రోడ్ లోని శ్రీ లక్ష్మీ గణపతి మందిరంలో, 25వ,రజితోత్సవ, వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు మొదటి రోజు మూలమూర్తికి ఫల, పంచామృత,అభిషేకం, దుర్వార్చన, పల్లకి సేవ, గణేష వైభవం పై ప్రముఖ పౌరాణిక పండితులు,సభాపతి, బ్రహ్మశ్రీ తిగుళ్ల విషు శర్మ , అద్భుతమైన...
Read More...

జగిత్యాల 4,6,12,19 వార్డుల్లో ఇంటింట ప్రచార నిర్వహించిన మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావా   వసంత

జగిత్యాల 4,6,12,19 వార్డుల్లో ఇంటింట ప్రచార నిర్వహించిన మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావా   వసంత జగిత్యాల ఫిబ్రవరి 8 ( ప్రజా మంటలు)మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జగిత్యాల పట్టణంలోనీ 4వ వార్డులో బత్తిని ప్రణయ్ కు 6 వ వార్డ్ లో బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి నీలి ప్రతాప్ కు 12వ వార్డు పంతం అనురాధకు 19వ వార్డు భారతి సంతోష్ కు మద్దతుగా ఇంటింటా తిరిగి...
Read More...

హైదరాబాద్‌లో ముత్యాల హరివిల్లు సంగీత విభావరి – అలరించిన జగిత్యాల వాసి

హైదరాబాద్‌లో ముత్యాల హరివిల్లు సంగీత విభావరి – అలరించిన జగిత్యాల వాసి హైదరాబాద్, ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు): హైదరాబాద్‌లో జరిగిన సంగీత కార్యక్రమంలో జగిత్యాల వాసుల గళం వినిపించింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ప్రధాన అర్చకుడు నంబి సత్యనారాయణ చార్య, ఆదివారం హైదరాబాద్‌లోని శ్రీ ముఖ హాల్‌లో నిర్వహించిన ముత్యాల హరివిల్లు సంగీత విభావరి కార్యక్రమంలో పాల్గొని శ్రోతలను అలరించారు. ముళ్లపూడి...
Read More...

జగిత్యాల 39 40 వార్డుల్లో ప్రచారం నిర్వహించిన డా  బోగ శ్రావణి ప్రవీణ్

జగిత్యాల 39 40 వార్డుల్లో ప్రచారం నిర్వహించిన డా  బోగ శ్రావణి ప్రవీణ్ జగిత్యాల ఫిబ్రవరి 8 (ప్రజా మంటలు)మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల మున్సిపల్ 39వ వార్డ్ అభ్యర్థి సింగం పద్మ,40వ వార్డ్ అభ్యర్థి బోగ మౌనిక రాజ్ కుమార్  మద్దతుగా వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా బోగ శ్రావణి  ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పాత రమేష్,దూరిశెట్టి...
Read More...

జిల్లాల రద్దు లేదు, సింగరేణి మెడికల్ బోర్డు కొనసాగుతుంది: సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత

జిల్లాల రద్దు లేదు, సింగరేణి మెడికల్ బోర్డు కొనసాగుతుంది: సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత భూపాలపల్లి, ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు): కొన్ని జిల్లాలను రద్దు చేస్తారన్న ప్రచారం, సింగరేణి మెడికల్ బోర్డును రద్దు చేస్తారన్న వార్తలు పూర్తిగా తప్పుడు ప్రచారమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏ జిల్లాను తొలగించడమో, కొత్త జిల్లాను ఏర్పాటు చేయడమో ప్రభుత్వ పరిశీలనలో లేదని తేల్చి చెప్పారు. “ప్రజా పాలన –...
Read More...
Crime  State News 

ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం వెనుక భారీ కుట్ర : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం వెనుక భారీ కుట్ర : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు): ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం వెనుక భారీ కుట్ర ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ఒక క్రిమినల్, ఒక దొంగ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే పరిస్థితి ఎలా ఉంటుందో నిన్న రాజధాని నడిబొడ్డున జరిగిన ఫోరెన్సిక్ ల్యాబ్...
Read More...

బిజెపి అభ్యర్థులకు మద్దతుగా పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించిన డా బోగ శ్రావణి

బిజెపి అభ్యర్థులకు మద్దతుగా పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించిన డా బోగ శ్రావణి జగిత్యాల ఫిబ్రవరి 8 (ప్రజా మంటలు)మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల్ మున్సిపల్ 25 వ వార్డు అభ్యర్థి గుండేటి యశోద  ,41వ వార్డ్ అభ్యర్థి మ్యాన మహేష్ కు మద్దతుగా వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి  ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కొండ...
Read More...

ఎమ్మెల్సీ బలుమూరు వెంకట్ ,సారయ్య తో కలిసి పలు వార్డుల కార్నర్ మీటింగ్లో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్

ఎమ్మెల్సీ బలుమూరు వెంకట్ ,సారయ్య తో కలిసి పలు వార్డుల కార్నర్ మీటింగ్లో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్    జగిత్యాల ఫిబ్రవరి 8 (ప్రజా మంటలు)పట్టణ 12వ వార్డులో బోయినపల్లి ప్రశాంత్ రావు  37వ వార్డులో కల్లెడ సునీత రాజేంద్ర ప్రసాద్ 39వ  వార్డులో బొలుసాని శ్రీనివాస్,23వ వార్డు రంగు ఉష శ్రీ మహేష్ ,4వ వార్డు క్యాదసు నవీన్ కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్...
Read More...
Local News  State News 

ఫుట్‌పాత్‌ అనాధలకు 294వ అన్నదానం 

ఫుట్‌పాత్‌ అనాధలకు 294వ అన్నదానం  సికింద్రాబాద్,  ఫిబ్రవరి 08 (ప్రజామంటలు): హైదరాబాద్ నగరంలో ఫుట్‌పాత్‌లపై జీవనం సాగిస్తూ ఆకలితో అలమటిస్తున్న అనాథలు, నిరాశ్రయులు, సంచారజాతుల కుటుంబాలకు స్కై ఫౌండేషన్ మరోసారి సేవా హస్తం అందించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో సంస్థ ఆధ్వర్యంలో 294వ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది పేదలు భోజనం స్వీకరించారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు...
Read More...
Local News  State News 

గ్యారంటీల పేర మోసం చేసిన కాంగ్రెస్ ను ఓడించండి - కొప్పుల ఈశ్వర్

గ్యారంటీల పేర మోసం చేసిన కాంగ్రెస్ ను ఓడించండి - కొప్పుల ఈశ్వర్ ధర్మపురి, ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు): ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు 15, 4, 7, 9, 8, 1 వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 420 హామీలు, ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను...
Read More...

ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం మున్సిపల్ పరిధిలో ఓటరు కానీ వ్యక్తులు ఉండరాదు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  

ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం మున్సిపల్ పరిధిలో ఓటరు కానీ వ్యక్తులు ఉండరాదు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్   జగిత్యాల ఫిబ్రవరి 8 ( ప్రజా మంటలు)  ప్రచారం ముగిసిన అనంతరం సంబంధిత మున్సిపల్ పరిధిలో ఓటర్లు కాని వ్యక్తులు ఎవరూ ఉండరాదని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం, ప్రచార గడువు ముగిసిన తర్వాత ఇతర ప్రాంతాలకు చెందిన రాజకీయ కార్యకర్తలు, మద్దతుదారులు, ప్రచారకులు మున్సిపల్ పరిధిని తక్షణమే విడిచి వెళ్లాలని...
Read More...

జగిత్యాల 9వ వార్డులో బిజెపి అభ్యర్థిగా బొందు కూరి అనంతలక్ష్మి శ్రీనివాస్ ప్రచారం 

జగిత్యాల 9వ వార్డులో బిజెపి అభ్యర్థిగా బొందు కూరి అనంతలక్ష్మి శ్రీనివాస్ ప్రచారం  జగిత్యాల ఫిబ్రవరి 8 (ప్రజా మంటలు) మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల తొమ్మిదవ వార్డ్ బిజెపి అభ్యర్థిగా బొందుకూరి అనంతలక్ష్మి శ్రీనివాస్ ఇంటింట ప్రచారం చేశారు. ఈ సందర్భంగా తమ అమూల్యమైన ఓటు వేసి దీవించాలని ప్రజల్ని అభ్యర్థించారు. వార్డు అభివృద్ధిలో ముందుండి తన వంతు సేవలు అందిస్తానని తెలిపారు. ప్రచార కార్యక్రమంలో పలువురు...
Read More...