పి సి సి అధ్యక్షులుగా మహేష్ కుమార్
తెలంగాణ పీసీసీ కొత్త అధ్యక్షులుగా. మహేష్ కుమార్ గౌడ్
హైదారాబాద్ సెప్టెంబర్.06: తెలంగాణ పీసీసీ కొత్త అధ్యక్షులుగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీచేసింది.
గత 8 నెలలుగా కొత్త పీసీసీ అధ్యక్షుని నియామకం కొరకు జరిగిన చర్చల్లో చివరికి మహేష్ కుమార్ గౌడ్ వైపే ఏఐసీసీ మొగ్గింది.
ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగిన సంగతి తెలిసిందే. తెలంగాణకు కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించేందుకు కాంగ్రెస్ పార్టీకి 9 నెలల సమయం పట్టింది.
మహేశ్ కుమార్ గౌడ్ రాజకీయ నేపథ్యం..
బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ 1966 ఫిబ్రవరి 24న నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ మండలం, రహత్ నగర్లో జన్మించారు. గిరిరాజ్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. మహేష్ కుమార్ గౌడ్ గిరిరాజ్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న సమయంలో విద్యార్థి దశలో ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పని చేశాడు. ఆ తరువాత 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిచ్పల్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా చిన్న వయస్సులోనే పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మహేష్ కుమార్ 2013 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్గా పని చేశాడు.
మహేష్ కుమార్ 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్య ర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఆ తరువాత పీసీసీ కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా, పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పని చేసి 2018లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించిన ఆ ఎన్నికల్లో ఆ స్థానాన్ని అధిష్ఠానం మైనార్టీలకు కేటాయించడంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. మహేష్ కుమార్ 2018 సెప్టెంబర్ 18న రాష్ట్ర ఎన్నికల కమిటీలో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్గా నియమితులయ్యారు.
2021 జూన్ 26న పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, 2022 డిసెంబర్ 10న కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కార్యనిర్వాహక కమిటీలోప్రత్యేక ఆహ్వానితుడిగా, 2023 జూన్ 20న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీ-పీసీసీ) ఎన్నికల కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు. మహేష్ కుమార్ గౌడ్ 2023లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేయాలనీ భావించిన ఆ నియోజకవర్గం నుండి మాజీ మంత్రి షబ్బీర్ అలీని పార్టీ అభ్యర్థిగా నిలపడంతో ఆయన పోటీ నుంచి తప్పుకోగా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 2024 జనవరి 29న తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో రెండు స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఆయన పేరును కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. ఎమ్మెల్సీ పదవికి ఇతర పార్టీల నుండి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో మహేష్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ ఏడాది జనవరి 31న తెలంగాణ శాసనమండలి సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు మహేశ్ కుమార్ గౌడ్
గతంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ గా పనిచేసిన మధు యాష్కీ. ఈ పదవి కొరకు చివరి వరకు పోటీలో అన్నారు. కానీ ఆయన గత శాసన సభ ఎన్నికల్లో ఎల్ బి నగర్ నియోజక వర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారని, ఓడిన వారికి పదవి ఇస్తే, ఇంకా చాల మంది ఇతర పదవులకు పోటీపడతారని, అందుకే పక్కన పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది, మధు యాష్కీ కి ఇతర చోట స్థానం కల్పించి అవకాశం ఉందని చెప్పుకొంటున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మహనీయుల ఆశయాలు కొనసాగించాలి
జగిత్యాల ఏప్రిల్ 5(ప్రజా మంటలు)ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు
జగిత్యాల పట్టణంలోని మంచినీళ్ళ బావి దగ్గర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్, జిల్లా... జ్ఞాన స్కూల్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు
.జగిత్యాల ఏప్రిల్ 5 ( ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ విద్యా ప్రయాణంలో ఒక ముఖ్యమైన దశను పూర్తి చేసిన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ హరి చరణ్ రావు మాట్లాడుతూ... సంత్ రవిదాస్ క్యాలెండర్ ఆవిష్కరణ
""
జగిత్యాల ఏప్రిల్ 5 (ప్రజా మంటలు)సంత్ రవిదాస్ 650వ జయంతిని పురస్కరించుకుని సామాజిక సమరసతా వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక తహసిల్ చౌరస్తాలో గల మోచి సంఘంలో సంఘ నాయకుల సమక్షంలో సంతు రవిదాస్ క్యాలెండర్ ఆవిష్కరించి క్యాలెండర్ తో పాటు అతని బోధనలతో కూడిన పుస్తకాన్ని కూడా సభ్యులందరికీ పంచటం... సమానత్వ ఉద్యమానికి నిలువెత్తు ఉదాహరణ డా బాబు జగ్జీవన్ రామ్_జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల ఏప్రిల్ 5 ( ప్రజా మంటలు)
డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన జిల్లా ఎస్పీ
స్వాతంత్ర్య సమరయోధులు, సంఘ సంస్కర్త మరియు సమానత్వ ఉద్యమానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచిన గొప్ప నాయకుడు, భారత మాజీ ఉపప్రధానమంత్రి బాబూ జగ్జీవన్రామ్ జయంతిని పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా... జగిత్యాలలో నిజామాబాద్ రోడ్ పై వంతెన పనులు – ట్రాఫిక్ మళ్లింపు అమలు
జగిత్యాల, ఏప్రిల్ 05 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలోని నిజామాబాద్ హైవేలో హ్యాంగౌట్ హోటల్ సమీపంలో వంతెన నిర్మాణ పనులు ఏప్రిల్ 6 నుండి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సజావుగా కొనసాగేందుకు పోలీసులు మార్గ మళ్లింపులు అమలు చేస్తున్నారు.ముఖ్య మార్పులు ఇలా ఉన్నాయి:జగిత్యాల నుంచి నిజామాబాద్ వెళ్లే RTC బస్సులు,... గ్రామపంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ పై దాడి ముగ్గురు పై కేసు నమోదు
గొల్లపల్లి ఏప్రిల్ 05 (ప్రజా మంటలు):
బుగ్గారం మండలానికి చెందిన గ్రామ పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్న దూడ కిరణ్ ను కులం పేరుతో దూషణ మరియు ముగ్గురు దాడి చేశారని ఫిర్యాదు చేసిన డ్రైవర్, రాజశేఖర్, అమర్నాథ్, రోహన్ ముగ్గురిపై కేసు నమోదు, రాజశేఖర్ కి సంబంధించిన ఫ్లెక్సీ దూడ కిరణ్ తీ... ఒంటరితనం, వృద్ధాప్యంతో జీవితంపై విరక్తి… వృద్ధుడి ఆత్మహత్య
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 5 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్ గ్రామంలో ఒంటరితనం మరియు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన జంబుక ఆశన్న (78), తండ్రి గంగారం, ఎస్సీ మాల వర్గానికి చెందినవాడు.ఆశన్న గతంలో గ్రామ సుంకరి పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. 2025... బాబు జగ్జీవన్ సేవలు చిరస్మరనీయం -సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు
మెటుపల్లి ఏప్రిల్ 5 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ )
బాబు జాగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరనీయం అని మెట్ పల్లి సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. బార్ అసోసియేషన్ మరియు మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ 119 వ జయంతి
కార్మికుల... ప్రజా ప్రతినిధుల శిక్షణ బుగ్గారంలోనే పెట్టాలి - చుక్క శ్రీలత
బుగ్గారం, ఏప్రిల్ 05(ప్రజా మంటలు):బుగ్గారం మండల కేంద్రాన్ని పక్కనబెట్టి శేఖల్లలో వార్డ్ సభ్యులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని అన్ని గ్రామాల వార్డ్ సభ్యులు హాజరు కావాల్సిన ఈ శిక్షణను దూర ప్రాంతంలో ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బందులు, అసౌకర్యాలు తలెత్తుతున్నాయని స్థానిక ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.“ఇది... సింగరేణి సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమానికి సిద్ధం - తెలంగాణ జాగృతి హెచ్చరిక
హైదరాబాద్ ఏప్రిల్ 05 (ప్రజా మంటలు):
హైదరాబాద్లో తెలంగాణ జాగృతి, hms కార్మిక సంఘం ఇతర స.మతాలతో కలిసి, నిర్వహించిన “సేవ్ సింగరేణి” రౌండ్ టేబుల్ సమావేశంలో సింగరేణి సంస్థపై ప్రభుత్వ వైఖరిని కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. కార్మికుల నియామకాలపై విచారణ పేరుతో ఒత్తిడి చేయడం కంటే, ప్రభుత్వ అవినీతిపై విచారణ జరపాలని డిమాండ్... మీకు మంత్రి పదవి ఇస్తే పార్టీని వదిలి వెళ్లేవారా? డిసిసి అధ్యక్షుడు నందయ్య
జగిత్యాల ఏప్రిల్ 4 (ప్రజా మంటలు)మీకు మంత్రి పదవి ఇస్తే పార్టీని వదిలి వెళ్లేవారా అని సూటిగా ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నందయ్య జీవన్ రెడ్డిని ఉద్దేశించి
జిల్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజంగి నందయ్య విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డిపై విమర్శల అస్త్రాలు ఎక్కు పెట్టారు.కాంగ్రెస్... 2047 నాటికి తెలంగాణ టెక్స్టైల్ రాజధాని గా అభివృద్ధి - ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి.
(సిరిసిల్ల .రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
హైదరాబాద్ 03 ఏప్రిల్ (ప్రజా మంటలు) :
వస్త్ర పరిశ్రమ రంగంలో 2047 నాటికి తెలంగాణను దక్షిణాసియాలోనే గొప్ప టెక్స్టైల్ రాజధానిగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చెప్పారు.
టెక్స్టైల్ రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం నిర్దేశించుకున్న విజన్కు అనుగుణంగా ప్రపంచాన్ని మార్చగల వాతావరణాన్ని సృష్టించడంలో... 