పి సి సి అధ్యక్షులుగా మహేష్ కుమార్
తెలంగాణ పీసీసీ కొత్త అధ్యక్షులుగా. మహేష్ కుమార్ గౌడ్
హైదారాబాద్ సెప్టెంబర్.06: తెలంగాణ పీసీసీ కొత్త అధ్యక్షులుగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీచేసింది.
గత 8 నెలలుగా కొత్త పీసీసీ అధ్యక్షుని నియామకం కొరకు జరిగిన చర్చల్లో చివరికి మహేష్ కుమార్ గౌడ్ వైపే ఏఐసీసీ మొగ్గింది.
ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగిన సంగతి తెలిసిందే. తెలంగాణకు కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించేందుకు కాంగ్రెస్ పార్టీకి 9 నెలల సమయం పట్టింది.
మహేశ్ కుమార్ గౌడ్ రాజకీయ నేపథ్యం..
బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ 1966 ఫిబ్రవరి 24న నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ మండలం, రహత్ నగర్లో జన్మించారు. గిరిరాజ్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. మహేష్ కుమార్ గౌడ్ గిరిరాజ్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న సమయంలో విద్యార్థి దశలో ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పని చేశాడు. ఆ తరువాత 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిచ్పల్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా చిన్న వయస్సులోనే పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మహేష్ కుమార్ 2013 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్గా పని చేశాడు.
మహేష్ కుమార్ 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్య ర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఆ తరువాత పీసీసీ కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా, పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పని చేసి 2018లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించిన ఆ ఎన్నికల్లో ఆ స్థానాన్ని అధిష్ఠానం మైనార్టీలకు కేటాయించడంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. మహేష్ కుమార్ 2018 సెప్టెంబర్ 18న రాష్ట్ర ఎన్నికల కమిటీలో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్గా నియమితులయ్యారు.
2021 జూన్ 26న పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, 2022 డిసెంబర్ 10న కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కార్యనిర్వాహక కమిటీలోప్రత్యేక ఆహ్వానితుడిగా, 2023 జూన్ 20న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీ-పీసీసీ) ఎన్నికల కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు. మహేష్ కుమార్ గౌడ్ 2023లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేయాలనీ భావించిన ఆ నియోజకవర్గం నుండి మాజీ మంత్రి షబ్బీర్ అలీని పార్టీ అభ్యర్థిగా నిలపడంతో ఆయన పోటీ నుంచి తప్పుకోగా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 2024 జనవరి 29న తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో రెండు స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఆయన పేరును కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. ఎమ్మెల్సీ పదవికి ఇతర పార్టీల నుండి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో మహేష్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ ఏడాది జనవరి 31న తెలంగాణ శాసనమండలి సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు మహేశ్ కుమార్ గౌడ్
గతంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ గా పనిచేసిన మధు యాష్కీ. ఈ పదవి కొరకు చివరి వరకు పోటీలో అన్నారు. కానీ ఆయన గత శాసన సభ ఎన్నికల్లో ఎల్ బి నగర్ నియోజక వర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారని, ఓడిన వారికి పదవి ఇస్తే, ఇంకా చాల మంది ఇతర పదవులకు పోటీపడతారని, అందుకే పక్కన పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది, మధు యాష్కీ కి ఇతర చోట స్థానం కల్పించి అవకాశం ఉందని చెప్పుకొంటున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల జిల్లాలో జరిగిన ప్రధాన ప్రమాదాలు, రాజకీయ–సామాజిక ఘటనలు
జగిత్యాల జిల్లా – ముఖ్య ఘటనలు (2025)(సంక్షిప్తంగా – తేదీలతో)
🔴 ప్రమాదాలు / దుర్ఘటనలు
జనవరి 6, 2025 – మెట్పల్లి సమీపంలో కారు–లారీ ఢీకొని ఇద్దరు మృతి.
జనవరి 18, 2025 – కోరుట్ల మండలంలో విద్యుత్ షాక్తో రైతు మృతి.
ఫిబ్రవరి 2, 2025 – జగిత్యాల పట్టణంలో అగ్ని... నూతన సంవత్సరానికి స్వాగతంగా నిరాశ్రయులకు దుప్పట్ల పంపిణీ చేసిన స్కై ఫౌండేషన్.
సికింద్రాబాద్ డిసెంబర్ 31 (ప్రజా మంటలు):
నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరాశ్రయులు, అనాధలకు మానవతా కార్యక్రమం నిర్వహించారు. విపరీతమైన చలితో ఇబ్బందులు పడుతున్న ఫుట్పాత్లపై నివసించే నిరాశ్రయుల్ని దృష్టిలో పెట్టుకుని అర్ధరాత్రి వేళ దుప్పట్ల పంపిణీ చేపట్టారు.
ఈ సందర్భంగా స్కై ఫౌండేషన్ ఫౌండర్ & ప్రెసిడెంట్ డాక్టర్ వై.... టి.పి.టి.ఎఫ్ నూతన సంవత్సర(2026) కాలమణిని ఆవిష్కరించిన జగిత్యాల శాసనసభ్యులు ఎం.సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 31 (ప్రజా మంటలు)ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో శ్రీ సాయి సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల-వైద్యులు సూద కళ్యాణ్ కుమార్, బిల్డర్&సర్వేయర్ వెయ్య గంగయ్య గార్ల సౌజన్యంతో రూపొందించిన టీ.పీ.టీ.ఎఫ్ జగిత్యాల జిల్లాశాఖ టేబుల్ మరియు వాల్ క్యాలెండర్ లను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆవిష్కరించడం జరిగినది.
ఈ సందర్భంగా
ఈ... #Draft: Add Your Title
తపోవన్ హై స్కూల్ ఆధ్వర్యంలో ఇంగ్లీష్ కార్నివల్_ పాల్గొన్న ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం, జగిత్యాల 31 (ప్రజా మంటలు)ఇంగ్లీష్ భాష మీద అవగాహన కొరకు ఏర్పాటుచేసిన కార్యక్రమం ఇంగ్లీష్ కార్నివల్. గ్లోబల్ లాంగ్వేజ్ అయినా ఇంగ్లీష్ భాష మీద పట్టు ఎలా సాధించాలి ? ఎలా నేర్చుకోవాలి అనే అవగాహన కొరకు బుధవారం నాడు... జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు - జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల డిసెంబర్ 31 (ప్రజా మంటలు)జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్
జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. నూతన సంవత్సరం జిల్లా ప్రజలందరికీ ఆరోగ్యం, సుఖసంతోషాలు, శాంతి, సమృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ... ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి న జగిత్యాల జిల్లా ఆరోగ్య శాఖ అధికారి సుజాత
జగిత్యాల డిసెంబర్ 31 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా ఆరోగ్యశాఖ అధికారిగా నియామకమైన సుజాత జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాస్ ఉన్నారు. ఏపి డిప్యూటీ సిఎం కొండగట్టు పర్యటన ఏర్పాట్లు పరిశీలన* *డిప్యూటీ సిఎం పర్యటన విజయవంతం చేయాలి - జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్*
*జగిత్యాల డిసెంబర్ 31 (ప్రజామంటలు)
జనవరి 3న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మరియు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ లు పరిశీలించారు.
డిప్యూటీ సిఎం పర్యటన సందర్భంగా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, సభా... ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 31 (ప్రజా మంటలు)ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా హెలిప్యాడ్ ప్రాంతం, వాహనాల పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్ రూట్లు, బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన ముఖ్య ప్రదేశాలు తదితర... పదవి విరమణ పొందిన ఏ ఆర్ ఎస్ ఐ సయ్యద్ తకీద్దీన్ కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు
జగిత్యాల డిసెంబర్ 31 (ప్రజా మంటలు)
పోలీస్ శాఖలో గత 30 సంవత్సరాలుగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందుతున్న ఏ ఆర్ ఎస్ ఐ సయ్యద్ తకీద్దీన్ ను బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అశోక్ కుమార్ పూలమాల వేసి శాలువ లతో ఘనంగా సన్మానించారు.
సుధీర్ఘ కాలంగా పోలీస్ శాఖ లో... ధర్మపురిలో మాతా–శిశు ఆసుపత్రి ప్రారంభించకపోవడంపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం
ధర్మపురి, డిసెంబర్ 31 (ప్రజా మంటలు):
ధర్మపురి పట్టణంలో రూ.8.50 కోట్ల వ్యయంతో నిర్మించిన 50 పడకల మాతా–శిశు సంరక్షణ కేంద్రాన్ని ఇప్పటికీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోవడంపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆసుపత్రి ఎదుట నిన్న నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా... అసెంబ్లీలో పెన్షనర్ల బకాయిల విడుద ప్రకటించాలి: హరి అశోక్ కుమార్
జగిత్యాల (రూరల్) డిసెంబర్ 31 (ప్రజా మంటలు):
అసెంబ్లీ ఎన్నికల హామీల మేరకు పెన్షనర్ల పెండింగ్ బకాయిల విడుదల, పీఆర్సీ అమలు, పాత పెన్షన్ పథకం పునరుద్ధరణను అసెంబ్లీలో ప్రకటించాలని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు.
జిల్లాలో టీ.పి.సి.ఏ. ఆధ్వర్యంలో జరిగిన జాతీయ పెన్షనర్ల పక్షోత్సవాల్లో... బీర్పూర్ మండలంలో రోళ్లవాగు–అరగుండాల ప్రాజెక్టు ను పరిశీలించిన జీవన్ రెడ్డి
రైతులు, మత్స్యకారులకు అండగా నిలుస్తాం : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల రూరల్, డిసెంబర్ 31 (ప్రజా మంటలు):
బీర్పూర్ మండలంలోని రోళ్లవాగు–అరగుండాల ప్రాజెక్టును మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించిన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, తక్షణ పరిష్కార చర్యలపై అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర... 