గొల్లపల్లి లో వృద్దురాలిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న తహసీల్దార్ జమీర్
వృద్దురాలిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న తహసీల్దార్ జమీర్
గొల్లపెల్లి మండల కేంద్రం లో జలమయమైన ప్రధాన రహదారి
గొల్లపల్లి సెప్టెంబర్ 01 (ప్రజా మంటలు):
గొల్లపెల్లి మండలం లో ఆదివారం ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షానికి జనజీవనం స్థంభించింది. భారీ వర్షం ధాటికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. గ్రామాల్లో అంతర్గత రోడ్లు వరద నీటితో బురద మయమాయ్యాయి. మురికి కాల్వలు వరద నీటితో ఉప్పొంగి రోడ్ల పైకి పొంగి పోర్లయి. మురికి కాల్వలు వర్షం నీటితో పొంగి పోర్లడం తో స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఎడతెరిపి లేకుండ కురిసిన కుండపోత వర్షానికి, కాలువలు, వాగులు వంకలు, చెరువుల మత్తడులు, పలు గ్రామాల్లోని రహదారుల పై ఉన్న వంతెనలు వరద నీటితో పొంగిపోర్లయి. పై నుంచి వరద నీరు భారీగా వచ్చి చేరడం తో చెరువులు నిండు కున్నాయి.పలు గ్రామాల్లో పై నుంచి వచ్చిన వరద నీటితో ఇటీవల వేసిన వరి పంట కొట్టుకుపోయి రైతంగానికి కన్నీళ్లు మిగిల్చింది. పలు గ్రామాల్లో వర్షం ధాటికి మొక్కజొన్న పంట నెలవాలి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. చిల్వకోడూరు, గోవిందుపల్లె, దట్నూర్, చెందోలి, భీంరాజ్ పల్లె, లక్ష్మి పూర్, ఆత్మకూరు, దమ్మన్నపేట గొల్లపెల్లి, అబ్బపూర్, లోత్తునూరు తదితర గ్రామాల్లో పత్తి చేన్లలోకి వరద నీరు వచ్చి చేరి పత్తి పంట తీవ్రంగా దెబ్బ తిన్నది. మండల కేంద్రంలోని కేజీబివి పాఠశాల వసతి గృహం సమీపంలోకి పై నుంచి వరద నీరు వచ్చి చేరడం తో వసతి గృహం లోని నీరు కలుషి తమయినట్లు ప్రత్యేక అధికారి పద్మ, సిబ్బంది, విద్యార్థులు తహసీల్దార్ జమీర్ కు సమాచారం అందించారు. దింతో అక్కడికి చేరుకున్న తహసీల్దార్ పక్కనే ఉన్న ఊర చెరువును పరిశీలించారు. ఈ సందర్బంగా విద్యార్థినిలను ఒక్క రోజు ఇళ్లలోకి పంపించేందుకు ఉన్నంతధికారులకు సమాచారం అందించారు. అలాగే మండల కేంద్రం లో ఒక ఇంటిలోకి వర్షం నీరు వచ్చి చేరడం తో అందులో ఒంటరిగా నివాసం ఉంటున్నా నిరుపేద వృద్దురాలిని తహసీల్దార్ జమీర్ తన సొంత వాహనం లో బంధువుల ఇంటికి పంపించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ జమీర్, ఎంపిడివో రామ్ రెడ్డి సురేష్ రెడ్డి, కార్యదర్శి మధు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది ఆయా గ్రామాలను పరిశీలించిరు. ఎస్సై సతీష్ కుమార్ వెనుగు మట్ల, బొంకురు గ్రామాల్లోని సదజాల వాగును పరిశీలించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రూ.303 కోట్లను తేవడంలో కిషన్ రెడ్డి, ఈటల కృషి ఉంది

సీఎం కృషి తోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ 303 కోట్ల మంజూరు

మేడిపల్లి నూతన ఎస్ఐగా మాడ శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

ఘనంగా శ్రీసాయి నరసింహాస్వామి సేవ - నేడు గురుపౌర్ణమి -ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి

గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు.

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
