బీమా సంస్థ పాలసీదారులకు గోవర్ధనుడు ధీమా.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల ఆగస్టు 30( ప్రజా మంటలు)
భీమా సంస్థ పాలసీదారులకు గోవర్ధనుడు దీమా అని వక్తలు కొనియాడారు. జగిత్యాల ఎల్ఐసి కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా పదవీ విరమణ పొందిన బండ పెల్లి గోవర్ధన్ కు కార్యాలయ సిబ్బంది, ఎల్ఐసి ఏజెంట్లు ఘనంగా సత్కరించి వీడ్కోలు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఎల్ఐసి సీనియర్ బ్రాంచ్ మేనేజర్ బలరామకృష్ణ, ఏ డి ఎం రవీందర్ లు మాట్లాడుతూ.... బండపల్లి గోవర్ధన్ మొట్టమొదట అసిస్టెంట్ గా జగిత్యాల లోనే ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి తిరిగి పదవి విరమణ కూడా జగిత్యాల బ్రాంచ్ లోనే కావడం విశేషం అన్నారు.
39 సంవత్సరాలు పాటు వివిధ హోదాల్లో ఉద్యోగ నిర్వహణ తో పాటు వివిధ హోదాల్లో సేవలు అందించిన మృదుస్వభావి, స్నేహశీలి గోవర్ధన్ సంస్థకు, పాలసీదారులకు చేసిన సేవలు అగణితమన్నారు.
సహచర ఉద్యోగులు పలువురు మాట్లాడుతూ..... బండపల్లి గోవర్ధన్ పాలసీదారులకు ఏజెంట్లకు అందుబాటులో ఉంటూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ సేవలందించేవాడని ఆయన సేవలను కొనియాడారు. అంతే కాకుండా యూనియన్ లో వివిధ హోదాలో ఉంటూ ఆయన అందించిన సేవల పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
విశ్రాంత ఉద్యోగిగా మారిన తర్వాత కూడా పెన్షన్ దారుల సమస్యల పరిష్కారానికి చేదోడు వాదోడుగా ఉండాలని యూనియన్ ప్రెసిడెంట్ లక్ష్మీ రాజం గోవర్ధన్ ను కోరారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, మిత్రులు గోవర్ధన్ దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీమా సంస్థ ఉద్యోగులు ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరు తొలగింపు దారుణం
సికింద్రాబాద్, డిసెంబర్ 17 (ప్రజామంటలు) :
ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగిస్తూ ‘వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ గా పేరు మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లును పీసీసీ వైస్ప్రెసిడెంట్, సనత్నగర్ కాంగ్రెస్ ఇంచార్జి డా. కోట నీలిమ తీవ్రంగా ఖండించారు. గాంధీజీ ఆలోచనలు, విలువల... అడ్డగుట్టలో అయ్యప్ప స్వామి పడిపూజ
సికింద్రాబాద్, డిసెంబర్ 17 (ప్రజా మంటలు):
సికింద్రాబాద్ అడ్డగుట్ట డివిజన్ ఇంద్రలక్ష్మీనగర్లో కాంగ్రెస్ నాయకుడు గంట రాజు సాగర్ నివాసంలో సాయంత్రం అయ్యప్ప స్వామి పడిపూజ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శరణుఘోషలతో కాలనీ మారుమోగగా, హరిహరపుత్ర అయ్యప్ప స్వామి కృపకటాక్షాలు ప్రాంత ప్రజలపై ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని భక్తులు ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో పెద్ద... పెన్షనర్లకు సత్వరసేవలు అందిస్తాం. అసిస్టెంట్ ట్రెజరీ అధికారి ఎస్ .మధు కుమార్.
జగిత్యాల డిసెంబర్ 17(ప్రజా మంటలు)పెన్షనర్లకు ట్రెజరీ శాఖ తరపున సత్వర సేవలు అందిస్తామని జిల్లా ట్రెజరీ అధికారి ఎస్.మధు కుమార్ అన్నారు.బుధవారం జిల్లా కేంద్రంలోని సీనియర్ సిటీజేన్స్ కేంద్రంలో తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో జాతీయ పెన్షనర్ల దినోత్సవం వేడుకలు రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలోఘనంగా... సోషల్ మీడియా స్టార్డమ్తో సర్పంచ్ పీఠం
భీమదేవరపల్లి, డిసెంబర్ 18 (ప్రజా మంటలు):
కలిసివచ్చిన అదృష్టం అంటే ఇదేనేమో. సోషల్ మీడియా ప్రభావం ఎన్నికల ఫలితాల్లో కీలకంగా మారిందనడానికి ఇది ఓ స్పష్టమైన ఉదాహరణ. లఘుచిత్రాల్లో నటిస్తూ అనేక మంది అభిమానులను సంపాదించుకున్న ఓ మహిళ ఇప్పుడు ఓ గ్రామానికి ప్రథమ పౌరురాలిగా నిలిచారు.
ఇటీవల తెలంగాణలో నిర్వహించిన తొలి విడత పంచాయతీ... సర్పంచుల అపాయింట్మెంట్ డే వాయిదా
డిసెంబర్ 22న బాధ్యతల స్వీకరణ
హైదరాబాద్, డిసెంబర్ 18 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు పదవి బాధ్యతలు స్వీకరించే అపాయింట్మెంట్ డే వాయిదా పడింది. ఈనెల 20న నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ శాఖ డిసెంబర్ 22కు మార్చింది.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచులు, వార్డు సభ్యులు... గాంధీ బస్ షెల్టర్ లో ప్రైవేట్ వాహనాలు..
సికింద్రాబాద్, డిసెంబ 17 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ఎంసీహెచ్ (మాతా,శిశు కేంద్రం) విభాగ భవనం సమీపంలో ఉన్న బస్ షెల్టర్ ప్రైవేట్ వాహనాలకు అడ్డగా మారింది. నిత్యం వివిద ప్రాంతాల నుంచి వందలాది మంది గర్బిణీలు, బాలింతలు, వారి సహాయకులు ఎంసీహెచ్ భవనానికి వైద్యానికి వస్తూ, పోతుంటారు. అయితే ఇక్కడి బస్ షెల్టర్... పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ కీలక తీర్పు
హైదరాబాద్, డిసెంబర్ 18 (ప్రజా మంటలు):
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి అనంతరం కాంగ్రెస్లో చేరిన ఐదుగురు ఎమ్మెల్యేలపై దాఖలైన పార్టీ ఫిరాయింపుల అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తోసిపుచ్చారు.
పార్టీ ఫిరాయించినట్లు స్పష్టమైన ఆధారాలు లేవని పేర్కొంటూ, ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన పిటిషన్లను కొట్టివేస్తూ స్పీకర్... ఘనంగా ధనుర్మాస ఉత్సవం ప్రారంభం
జగిత్యాల డిసెంబర్ 16 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవ వేడుకలు మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.
అమ్మవారికి పంచామృతాలతో అభిషేకము నిర్వహించి వివిధ పుష్పాలతో మాలలు అల్లి అలంకరించారు .సాయంత్రం మొదటి పాశురం సామూహికంగా... గ్రామపంచాయతీ ఎన్నికల్లో బి ఆర్ఎస్ మద్దతు తో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను అభినందించి సత్కరించిన జిల్లా అధ్యక్షులు మాజీ జెడ్పి చైర్పర్సన్
జగిత్యాల డిసెంబర్ 15 (ప్రజా మంటలు)జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జగిత్యాల నియోజకవర్గం లోని గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లను సన్మానించిన జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మరియు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...... మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పై మండిపడ్డ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ధర్మపురి డిసెంబర్ 16 (ప్రజా మంటలు) నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మీడియాతో మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూమాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గత 10 సంవత్సరాలలో చేసిన అరాచకాలు, అవినీతి త్వరలో ప్రజల ముందుంచుతాననిఅబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ మీ ప్రభుత్వం అన్నారు.
, మీ నాయకత్వమే., సంక్షేమ శాఖ మంత్రిగా... మూడవ విడత సర్పంచ్ ఎన్నికకు 853 మంది పోలీసులతో భారీ బందోబస్తు:జిల్లా ఎస్పి అశోక్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 16( ప్రజా మంటలు)
పోలింగ్ కేంద్రాల వద్ద 200 మీటర్ల వరకు 163 బి ఎన్ ఎస్ ఎస్(144 సెక్షన్ అమలు) విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదు
జిల్లాలో జరగనున్న మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా,నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా ఎస్పీ... 