సభ్యత్వ నమోదు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి - బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల ఆగస్ట్ 29( ప్రజా మంటలు) :
భారతీయ జనతా పార్టీ జగిత్యాల్ పట్టణ, జగిత్యాల రూరల్,మరియు అర్బన్ మండల సభ్యత్వ నమోదు వర్క్ షాప్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలకు దిశా నిర్దేశించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా. బోగ శ్రావణి
ఈ సందర్భంగా డాక్టర్ బోగ శ్రావణి మాట్లాడుతూ...
బిజెపి కార్యకర్త ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని డాక్టర్ బోగ శ్రావణి కార్యకర్తలకు సూచించారు. ప్రతి ఆరు సంవత్సరలకు సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని, సభ్యత్వ నమోదు చేయడం కార్యకర్త తన హక్కుగా భావించాలని తెలియజేశారు.
ఇప్పుడు సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు ఆరు సంవత్సరాల వరకు మళ్లీ సభ్యత్వం తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని కావున ప్రతి కార్యకర్త ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున సభ్యత్వం చేయించాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.
సెప్టెంబర్ 1వ తేదీ నుండి సభ్యత్వ నమోదు ప్రక్రియ దేశవ్యాప్తంగా ప్రారంభమవుతుంది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని వారి సభ్యత్వాన్ని నమోదు చేసుకుంటారు, నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను తెలియజేస్తూ ప్రతి పోలింగ్ బూత్ లో 200 పైచిలుకు సభ్యత్వాలు అయ్యే విధంగా బీజేపీ కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. నరేంద్ర మోడీ పరిపాలన పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని, మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బిజెపికి వచ్చిన ఓట్లు, సీట్లు దానికి నిదర్శమని గుర్తు చేశారు.
11 కోట్ల పైచిలుకు సభ్యత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా బిజెపి ఉన్నదని, గతంలో కంటే ఎక్కువ సభ్యత్వం నమోదు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాగిల సత్యనారాయణ, జగిత్యాల పట్టణ అధ్యక్షులు రంగు గోపాల్,జగిత్యాల రూరల్ మండల అధ్యక్షులు నలువాల తిరుపతి,పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముదరాజు, జిల్లా కార్యదర్శి పెద్ద గంగన్న, జిల్లా కోశాధికారి సుంకేట దశరథ రెడ్డి, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సాంబారి కళావతి, పట్టణ ఇంచార్జ్ మ్యాదరి అశోక్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఇట్టినేని రమేష్, కౌడు వెంకన్న, జిల్లా అధికార ప్రతినిధి కుర్మా రమేష్ మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సాహితీవేత్త ,విద్యావేత్త ఎమ్ వి నరసింహారెడ్డి భౌతిక కాయానికి అంతిమ నివాళులు
జగిత్యాల జూన్ 10 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రం కు చెందిన ప్రముఖ సాహితీవేత్త విద్యావేత్త ఎంవీ నరసింహారెడ్డి సోమవారం సాయంత్రం మృతి చెందగా బుధవారం ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. నరసింహారెడ్డి కుమారులు శ్రీనివాస్ రెడ్డి శ్రీధర్ రెడ్డిలు చితికి నిప్పు అంటించి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
అంతిమయాత్రలో బంధువులు అభిమానులు శిష్యులు కళాశాల... రోటరీ క్లబ్, రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో కంటిదానం ,నేత్రదాన ప్రతిజ్ఞ అవగాహన
జగిత్యాల : జూన్ 10(ప్రజా మంటలు)
ప్రపంచ నేత్రదాన దినోత్సవం జూన్ 10, సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ - రోటరీ క్లబ్ జగిత్యాల ఆధ్వర్యంలో ఎల్.వి. ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ, హైదరాబాద్ వారి సహకారంతో బుధవారం పెన్షనర్స్ భవన్ (కోర్ట్ ప్రక్కన) “కంటి దానం – నేత్రదాన ప్రతిజ్ఞ, అవగాహన కార్యక్రమం”... స్వర్గీయ మంచాల రామేశం నేత్రాలను దానం చేసిన కుటుంబ సభ్యులు
జగిత్యాల జూన్ 10(ప్రజా మంటలు)స్వర్గీయ మంచాల రామేశం నేత్రాలను సేకరించిన ఎల్ వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ టెక్నీషియన్ కు జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.సునీల్ కుమార్, ఎం సి హెచ్ సూపరింటెండెంట్ డా. కృష్ణమూర్తి, రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ సిరిసిల్లశ్రీనివాస్, రోటరీసభ్యులు టీవి సూర్యం ద్వారా అందజేస్తున్న రామేశం కుమారుడు మంచాల... దేశంలో అత్యంత దీర్ఘకాలం ప్రధాని అవుతానని ఎప్పుడూ ఊహించలేదు: ఎన్డీఏ సమావేశంలో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, జూన్ 10 (ప్రజా మంటలు):
దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించి 12 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఢిల్లీలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) నాయకుల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, దేశంలో అత్యంత కాలం ప్రధాని పదవిలో కొనసాగుతానని తాను ఎప్పుడూ ఊహించలేదని వ్యాఖ్యానించారు.... నెహ్రూ 17 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించారు – చరిత్రను వక్రీకరించొద్దు: డాక్టర్. చిన్నారెడ్డి
హైదరాబాద్, జూన్ 10 (ప్రజా మంటలు):
జవహర్లాల్ నెహ్రూ కంటే ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కువ కాలం దేశాన్ని పాలించారని బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారం చారిత్రక వాస్తవాలకు విరుద్ధమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి విమర్శించారు. చరిత్రను వక్రీకరించడం దేశ ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని ఆయన పేర్కొన్నారు.
ఒక... మహిళల భద్రతపై ప్రభుత్వం విఫలమైంది: కవిత
హైదరాబాద్, జూన్ 10 (ప్రజా మంటలు):
రాష్ట్రంలో మహిళలు, బాలికలపై పెరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై జరిగిన దారుణ ఘటన, మల్కాజిగిరిలో మహిళ హత్య రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు.
ఖమ్మం ఘటనలో నిందితుడికి కఠిన శిక్ష విధించాలని,... వడ్ల కొనుగోళ్లలో రూ.107 కోట్ల అవినీతి: మంత్రి లక్ష్మణ్ కుమార్కు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సవాల్
జగిత్యాల, జూన్ 10 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కొప్పుల ఈశ్వర ఆరోపించారు. ఈ అంశంపై జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నిర్వహించిన విలేకరుల సమావేశానికి ప్రతిస్పందిస్తూ ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.
మంత్రి లక్ష్మణ్ కుమార్ తరచూ “రాజీనామా చేస్తా”... మురళీధర్ దేశ్ పాండే మృతి పట్ల ప్రగాఢ సంతాపం
హైదరాబాద్, జూన్ 10 (ప్రజా మంటలు):
తెలంగాణ ఉద్యమకారుడు, సోషలిస్టు నాయకుడు, తెలంగాణ జానపద సకల కళాకారుల పరిరక్షణ జేఏసీ చైర్మన్ శ్రీ మురళీధర్ దేశ్ పాండే మరణం అత్యంత బాధాకరం.తెలంగాణ ఉద్యమ సమయంలో కళాకారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, వారి హక్కులు, గుర్తింపు, సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమైనది. తెలంగాణ... ఎం.వి నరసింహారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
జగిత్యాల జూన్ 9(ప్రజా మంటలు)జగిత్యాల ఎస్ కె ఎల్ ఎన్ ఆర్ బిఈడి కళాశాల కరెస్పాండెంట్, రచయిత ఎం.వి నరసింహారెడ్డి మరణించగా జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట రోటరీ క్లబ్ సభ్యులు మంచాల... అటుకుల్లో బొద్దింక..
కొత్తకొండ వైన్స్ సిట్టింగ్ రూమ్లో ఘోరం.. సాహితీవేత్త ఎం.వి. నరసింహారెడ్డి కన్నుమూత
జగిత్యాల, జూన్ 08 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త, రచయిత, విద్యావేత్త, ఎస్కేఎల్ఎన్ రావు బీఈడీ కళాశాల కరెస్పాండెంట్ ఎం.వి. నరసింహారెడ్డి సోమవారం రాత్రి, తన నివాసంలో కన్నుమూశారు. ఆయన మృతి సాహితీ, విద్యా రంగాలకు తీరని లోటుగా భావిస్తున్నారు.ఎం.వి. నరసింహారెడ్డి తెలుగు సాహిత్యానికి విశేష సేవలందించారు. నాలుగు వేదాలను... వరి కొయ్యలు కాల్చి పలువురి ప్రమాదానికి కారణమైన వారిపై ప్రజావాణిలో ఫిర్యాదు
జగిత్యాల జూన్ 8 (ప్రజా మంటలు)
జగిత్యాల రూరల్ మండలం తక్కలపల్లి గ్రామ శివారులో తుమ్మచెట్టు కు నిప్పంటుకొని అదే మార్గంలో వస్తున్న బైరి వేణు ,కడారి భరత్ లు గాయాలపాలు అయినారు. ఇట్టి విషయంపై జిల్లా కేంద్రం విజయపురి కాలనీకి చెందిన సంబుమహేష్( 29) తండ్రి మల్లయ్య సోమవారం తుమ్మచెట్టు కాలడానికి కారకులైన
మిట్టపల్లి... 