సభ్యత్వ నమోదు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి - బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల ఆగస్ట్ 29( ప్రజా మంటలు) :
భారతీయ జనతా పార్టీ జగిత్యాల్ పట్టణ, జగిత్యాల రూరల్,మరియు అర్బన్ మండల సభ్యత్వ నమోదు వర్క్ షాప్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలకు దిశా నిర్దేశించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా. బోగ శ్రావణి
ఈ సందర్భంగా డాక్టర్ బోగ శ్రావణి మాట్లాడుతూ...
బిజెపి కార్యకర్త ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని డాక్టర్ బోగ శ్రావణి కార్యకర్తలకు సూచించారు. ప్రతి ఆరు సంవత్సరలకు సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని, సభ్యత్వ నమోదు చేయడం కార్యకర్త తన హక్కుగా భావించాలని తెలియజేశారు.
ఇప్పుడు సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు ఆరు సంవత్సరాల వరకు మళ్లీ సభ్యత్వం తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని కావున ప్రతి కార్యకర్త ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున సభ్యత్వం చేయించాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.
సెప్టెంబర్ 1వ తేదీ నుండి సభ్యత్వ నమోదు ప్రక్రియ దేశవ్యాప్తంగా ప్రారంభమవుతుంది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని వారి సభ్యత్వాన్ని నమోదు చేసుకుంటారు, నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను తెలియజేస్తూ ప్రతి పోలింగ్ బూత్ లో 200 పైచిలుకు సభ్యత్వాలు అయ్యే విధంగా బీజేపీ కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. నరేంద్ర మోడీ పరిపాలన పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని, మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బిజెపికి వచ్చిన ఓట్లు, సీట్లు దానికి నిదర్శమని గుర్తు చేశారు.
11 కోట్ల పైచిలుకు సభ్యత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా బిజెపి ఉన్నదని, గతంలో కంటే ఎక్కువ సభ్యత్వం నమోదు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాగిల సత్యనారాయణ, జగిత్యాల పట్టణ అధ్యక్షులు రంగు గోపాల్,జగిత్యాల రూరల్ మండల అధ్యక్షులు నలువాల తిరుపతి,పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముదరాజు, జిల్లా కార్యదర్శి పెద్ద గంగన్న, జిల్లా కోశాధికారి సుంకేట దశరథ రెడ్డి, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సాంబారి కళావతి, పట్టణ ఇంచార్జ్ మ్యాదరి అశోక్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఇట్టినేని రమేష్, కౌడు వెంకన్న, జిల్లా అధికార ప్రతినిధి కుర్మా రమేష్ మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని ఆయన నివాసం లో కలిసిన నూతనంగా ఎన్నికైన తపస్ రాష్ట్ర అధ్యక్షులు.
జగిత్యాల జనవరి 15 (ప్రజా మంటలు)తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ రాష్ట్ర అధ్యక్షుడిగా వొడ్నాల రాజశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయిన సందర్భంలో జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని వారి నివాసం లో మర్యాద పూర్వకంగా కలిసిన వోడ్నా ల రాజశేఖర్ .ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి శాలువా తో సత్కరించారు జగిత్యాల... ధనుర్మాస కొఠారి ఉత్సవాలలో భాగంగా ఘనంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రథోత్సవము
నిజామాబాద్ జనవరి 15 (ప్రజా మంటలు) నిజామాబాద్ లోని బ్రహ్మపురిలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ రథోత్సవం గురువారం మధ్యాహ్నం నిర్వహించారు. .ప్రతి ఏట సంక్రాంతి పర్వదినం నాడు స్వామివారి రథోత్సవం నిర్వహిస్తారు . రథము చక్రం గుడి నుండి బయలుదేరి గాజులపేట, పెద్ద బజారు, మీదుగా ఆలయం చేరుకుంది .... జగిత్యాల కురుమ సంఘం ఆధ్వర్యంలో బీరయ్య, అక్క మహంకాళికి బోనాల సమర్పణ
జగిత్యాల జనవరి 15 (ప్రజా మంటలు) జగిత్యాల కురుమ సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా బీరయ్య ,అక్క మహంకాళి మాతకు కుల బాంధవులు గురువారం బోనాల సమర్పించారు .కొత్తగా వచ్చిన ధాన్యంతో స్వామివారికి బోనాలను నివేదించారు.
పిల్లాపాపలతో పాటు పశుసంపద ,గొర్రెలు, మేకలు,పాడిపంటలతో చల్లంగా ఉండాలని మొక్కుకున్నారు .ఒగ్గు కళాకారుల డోలు చప్పులతో ఆలయానికి... తెలంగాణ ప్రభుత్వం–భారత ఆర్మీ మధ్య సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారం: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, జనవరి 15 (ప్రజా మంటలు):
తెలంగాణ ప్రభుత్వం, భారత ఆర్మీకి మధ్య ఉన్న వివిధ సమస్యలు నిరంతర చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పెండింగ్లో ఉన్న భూ సమస్యలు, ఇతర పరిపాలనా అంశాల సత్వర పరిష్కారానికి ఆర్మీ తరఫున ప్రత్యేక అధికారులను నియమించాలని ఆయన సూచించారు.
హైదరాబాద్... “ఒక్క క్లిక్… మీ కష్టార్జీతం మాయం!”
సికింద్రాబాద్, జనవరి 15 (ప్రజా మంటలు):
వాట్సాప్ గ్రూపులలో ఫోన్ పే పొంగల్ గిఫ్ట్ “5000 రూపాయలు నిజంగా వచ్చాయి” అనే ఆశ చూపించే తప్పుడు సందేశాలతో పాటు లింకులు పంపిస్తూ సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజల పొదుపును దోచుకుంటున్నారని స్కై ఫౌండేషన్ ప్రెసిడెంట్ & ఫౌండర్ డాక్టర్ వై. సంజీవ కుమార్ అన్నారు. డబ్బులు... మకర సంక్రాంతి వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్, జనవరి 15 (ప్రజా మంటలు):
మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం ఉదయం కరీంనగర్ నగరంలోని కోతిరాంపూర్ ప్రాంతంలో గల గిద్దె పెరుమాండ్ల దేవస్థానాన్ని సందర్శించారు.
ఉదయం 8:30 గంటలకు దేవస్థానానికి చేరుకున్న మంత్రి స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.... మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు: బీసీలకు 3 నగరాలు, 38 పురపాలికలు
హైదరాబాద్, జనవరి 15 (ప్రజా మంటలు):
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ దిశగా కీలక అడుగు పడింది. రాష్ట్ర పురపాలక శాఖ 10 నగరపాలక సంస్థలు, 121 పురపాలక సంఘాలకు సంబంధించి మేయర్లు, ఛైర్పర్సన్ల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా రిజర్వేషన్ల అమలులో పాటించాల్సిన మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది.... ధర్మపురిలో కాంగ్రెస్లో చేరికలు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సమక్షంలో బీఆర్ఎస్ నేతల పార్టీలో చేరిక
ధర్మపురి, జనవరి 15 (ప్రజా మంటలు):
ధర్మపురి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ధర్మపురి పట్టణ మున్సిపాలిటీ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్నతో పాటు మాజీ కౌన్సిలర్లు మయూరి వేణు, యూనుస్, సాంబు, స్తంభంకాడి రమేష్ సహా బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు మంత్రి... ఫిరాయింపు కేసుల్లో కీలక మలుపు: పోచారం, కాలే యాదయ్యకు స్పీకర్ క్లీన్ చిట్
హైదరాబాద్, జనవరి 15 (ప్రజా మంటలు):
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యలపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం తుది తీర్పు వెలువరించారు.
ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్... ‘జన నాయగన్’ కు ఎదురుదెబ్బ: నిర్మాత పిటిషన్ను స్వీకరించని సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, జనవరి 15 (ప్రజా మంటలు):
విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘జన నాయగన్’ సినిమా సర్టిఫికేషన్ అంశానికి సంబంధించి మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన స్టే ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది.
ఈ సినిమా నిర్మాతలు తమపై ఆర్థికంగా తీవ్ర ప్రభావం పడిందని, “తాము పూర్తిగా నష్టపోయాం... సంక్రాంతి సెలవుల్లో కర్ణాటక రాష్ట్ర పర్యటన చేసిన విద్యార్థులు
మెట్టుపల్లి, జనవరి 15 (ప్రజా మంటలు – దగ్గుల అశోక్)
సంక్రాంతి సెలవుల సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్లుల్ల విద్యార్థులు విద్యా, వైజ్ఞానిక, విహార యాత్రలో భాగంగా ఈ నెల 10 నుంచి ఆరు రోజుల పాటు కర్ణాటక రాష్ట్ర పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ చారిత్రక, సాంస్కృతిక వారసత్వ... జగిత్యాల శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఘనంగా శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణ వేడుకలు
జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత మధన వేణుగోపాలస్వామి ఆలయంలో బుధవారం సాయంత్రం అంగరంగ వైభవంగా శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణ వేడుకలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రత్యేక వేదికను అలంకరింపజేసి ఉత్సవ మూర్తులను వేదికపై ఉంచి కళ్యాణాన్ని... 