వీరభద్ర మాల దీక్ష స్వీకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్

మొక్కు నెరవేర్చుకున్న మంత్రి

On
వీరభద్ర మాల దీక్ష స్వీకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్

నేటి నుండి 27 రోజులపాటు వీరభద్ర నక్షత్ర మాలలో మంత్రి పొన్నం ప్రభాకర్

భీమదేవరపల్లి ఆగస్టు 6 (ప్రజామంటలు ప్రతినిధి కాశిరెడ్డి ఆదిరెడ్డి) :

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో శ్రీ వీరభద్ర దేవాలయంలో రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ వీరభద్రుడి నక్షత్ర దీక్ష మాలను స్వీకరించారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా పిసిసి అధ్యక్షుని హోదాలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి తో పాటు, మంత్రి పొన్నం ప్రభాకర్ వీరభద్రుడుని దర్శించుకున్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వీరభద్ర నక్షత్ర దీక్ష చేపడతానని పొన్నం మొక్కుకున్నారు. వారి కోరిక నెరవేరడంతో పాటు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడమే కాకుండా, స్వామి ఆశీర్వాదంతో మంత్రి పదవి కూడా పొన్నం ను వరించింది.

 

*మొక్కు తీర్చుకున్న మంత్రి*

 

అసెంబ్లీ ఎలక్షన్స్ కి ముందు ప్రచారంలో భాగంగా భీమదేవరపల్లి మండలంలో పర్యటించిన సందర్భంలో మొదటగా కొత్తకొండ వీరభద్ర స్వామిని దర్శించుకున్నారు. ఆ సమయంలో తనకు టికెట్ తో పాటు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వీరభద్ర నక్షత్ర దీక్షను తీసుకుంటానని మొక్కుకున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, పొన్నం మంత్రి కావడం చకా చకా జరిగిపోయాయి. తాను కోరుకున్న కోరికలు నెరవేరడంతో, శ్రావణమాసంలో వీరభద్ర దీక్ష తీసుకొని మాల వేసుకున్నారు.

 

*శ్రీ వీరభద్ర దీక్ష విశిష్టత*

 

 

శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరం భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర ఆలయంలో 27 రోజులపాటు నక్షత్రమాల ఉంటుంది. అత్యంత ప్రాచుర్యం కలిగిన వీరభద్రుడి మాల వేసుకోవడం సకల సౌభాగ్యాలకు మంచిదని నక్షత్ర దీక్ష వ్యవస్థాపక గురుస్వామి, ఆలయ అర్చకులు మొగిలిపాలెం రాంబాబు అన్నారు.

 

*ఈ సందర్భంగా మంత్రి పున్నం ప్రభాకర్ మాట్లాడుతూ...*

 

ఈ దీక్ష స్వప్రయోజనాల కొరకు కాకుండా రాష్ట్ర ప్రజలు, నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో పసిడి సిరులు కురువాలని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల సమస్యల పరిష్కారానికి, తన వంతు కృషి చేస్తూ, తన పనిలో ఆ భగవంతుడు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

 

ప్రతి ఒక్కరూ దైవచింతను అలవర్చుకొని, మానసిక ప్రశాంతతను పొందాలని అన్నారు. మంగళవారం కొత్తకొండ వీరభద్రుని సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

 

 

*దేవుడి మహిమ మీద విశ్వాసం ఉంది..*

 

- మంత్రి పొన్నం ప్రభాకర్

 

భక్తుల ఆకాంక్షలకు, విశ్వాసాలకు అనుగుణంగా, ఈ దీక్ష నా ఒక్కడి మంచి కొరకే కాకుండా, సర్వేజనా సుఖినోభవంతు స్ఫూర్తితో రైతులు వ్యవసాయం, ప్రతి ఒక్కరూ పాడి పంటలతో సస్యశ్యామలంగా, బాగుండాలని ఈ దీక్ష తీసుకోవడం జరిగిందని అన్నారు. ఈ నియోజకవర్గానికి సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేలా, వీరభద్రుడు ధైర్యాన్ని, మనో బలాన్ని ఇవ్వాలని కోర మీసాల స్వామిని వేడుకున్నట్లు తెలిపారు.

 

*నక్షత్ర దీక్ష తీసుకున్న స్వాములకు నిత్య అన్నదాన కార్యక్రమం*

 

 రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ నక్షత్ర దీక్ష మాలను తీసుకొని మూడు రోజులపాటు వీరభద్ర స్వామి దేవాలయం వద్దనే ఉంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నక్షత్ర దీక్ష స్వాములకు అల్పాహారము, అన్నదాన కార్యక్రమం 27 రోజులపాటు పొన్నం సతీమణి పొన్నం మంజుల నిర్వహించుచున్నారు.

 

*27 రోజుల దీక్ష*

 

వీరభద్ర మాల స్వీకరించిన భక్తులు 11 రోజులు లేదా 27 రోజులు మాల వేసుకుని దీక్షలో ఉంటారు. ఆగస్టు 6 నుండి సెప్టెంబర్ 2 వ, తేదీ వరకు దీక్ష ఉంటుంది. మంత్రి పొన్నంతోపాటు 100 మందికి పైగా స్వాములు మంగళవారం మాల వేసుకుని నక్షత్ర దీక్ష తీసుకున్నారు.

 

*కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు*

 

హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల, మండలాల కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరైనారు. ఆలయ ఈవో కిషన్ రావు, మాజీ చైర్మన్ మాడిశెట్టి కుమారస్వామి, ముల్కనూర్, వేలేర్ ఎస్సైలు సాయిబాబు, సురేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిట్టంపల్లి ఐలయ్య, బొజ్జపురి అశోక్ ముఖర్జీ, కేతిరి లక్ష్మారెడ్డి, కొలుగూరి రాజు, ఊసకోయిల ప్రకాష్, ఆదరి రవీందర్, చంద్రశేఖర్ గుప్తా, మంగ రామచంద్రం, కొడకండ్ల సుదర్శన్ రెడ్డి, డబ్బా శంకర్, నరేందర్ గౌడ్, చిట్కురి అనిల్, జక్కుల అనిల్, ఊరడి జయపాల్ రెడ్డి, సత్తిరెడ్డి, కోటేశ్వర్ రెడ్డి, దేవరాజు శంకర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Crime 

జగిత్యాల జిల్లాలో పోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష

జగిత్యాల జిల్లాలో పోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష జగిత్యాల: జూలై 29  (ప్రజా మంటలు): జగిత్యాల రూరల్ మండలానికి చెందిన ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోక్సో కేసులో నిందితుడు రాజేష్‌కు జగిత్యాల పోక్సో ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే నిందితుడికి ₹6,500 జరిమానా కూడా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.అదేవిధంగా బాధిత...
Read More...
State News 

నంది మేడారం పంప్‌హౌస్‌లో నాలుగు బాహుబలి పంపులు ప్రారంభం

నంది మేడారం పంప్‌హౌస్‌లో నాలుగు బాహుబలి పంపులు ప్రారంభం కరీంనగర్, జూలై 29  (ప్రజా మంటలు):   కాళేశ్వరం ద్వారా 12,600 క్యూసెక్కుల నీటి ఎత్తిపోతలుఎడతెరిపి వర్షాల నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2 పరిధిలోని పెద్దపల్లి జిల్లా నంది మేడారం పంప్‌హౌస్‌లో నాలుగు బాహుబలి పంపులను అధికారులు బుధవారం ప్రారంభించారు. ఒక్కో పంపు ద్వారా 3,150 క్యూసెక్కుల చొప్పున మొత్తం నాలుగు పంపులతో 12,600 క్యూసెక్కుల...
Read More...
State News 

కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో రాష్ట్ర మంత్రుల గిరి ప్రదక్షిణ

కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో రాష్ట్ర మంత్రుల గిరి ప్రదక్షిణ సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు పండాలని వరుణ పూజలుకొండగట్టు, జూలై 29 (ప్రజా మంటలు): గురు పౌర్ణమి సందర్భంగా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో రాష్ట్ర ప్రజల సుభిక్షం కోసం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్,...
Read More...
Local News 

పదోన్నతి పొందిన ఎస్‌.ఐ వెంకటేశ్వర్లకు ఎస్పీ శుభాకాంక్షలు

పదోన్నతి పొందిన ఎస్‌.ఐ వెంకటేశ్వర్లకు ఎస్పీ శుభాకాంక్షలు    జగిత్యాల జూలై 29 ( ప్రజా మంటలు)టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహించి ఎస్‌.ఐ గా పదోన్నతి పొందిన వెంకటేశ్వర్లు జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ ని మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  వెంకటేశ్వర్లుకు ఎస్‌ఐ హోదాకు సంబంధించిన స్టార్ చిహ్నాన్ని అలంకరించి పదోన్నతి శుభాకాంక్షలు తెలిపారు....
Read More...
Local News 

చదువునే ఆయుధంగా మలుచుకొని ఉన్నత స్థితికి ఎదగాలి.  జిల్లా అదనపు కలెక్టర్ రాజా గౌడ్. 

చదువునే ఆయుధంగా మలుచుకొని ఉన్నత స్థితికి ఎదగాలి.    జిల్లా అదనపు కలెక్టర్ రాజా గౌడ్.  జగిత్యాల, జులై 29(ప్రజా మంటలు) చదువునే ఆయుధంగా మలుచుకుని విద్యార్థులు ఉన్నత స్థితికి ఎదగాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజా గౌడ్ అన్నారు.   మహిళ శిశు సంక్షేమ శాఖ జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో జిల్లా బాలల సంరక్షణ కేంద్రాల తనిఖీ కమిటీ చైర్మన్, అదనపు కలెక్టర్ బి. రాజాగౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని...
Read More...
State News 

నేరెళ్ల బాధితులకు న్యాయం చేయాలి -  కల్వకుంట్ల కవిత

నేరెళ్ల బాధితులకు న్యాయం చేయాలి -  కల్వకుంట్ల కవిత    సిరిసిల్ల జూలై 28(ప్రజా మంటలు):సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో జరిగిన పోలీసుల దాష్టీకం తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. బాధితుడు గంధం గోపాల్ కుటుంబాన్ని, ఇతర బాధితులను పరామర్శించిన ఆమె, గత ప్రభుత్వంలో తాను భాగస్వామిగా ఉన్నందుకు క్షమాపణ కోరారు. ఘటనకు బాధ్యులైన...
Read More...
State News 

హైద్రా గొప్ప పని చెస్తుంది - దాని చీఫ్ ను మార్చెదె లేదు - పీఎం రేవంత్

హైద్రా గొప్ప పని చెస్తుంది - దాని చీఫ్ ను మార్చెదె లేదు - పీఎం రేవంత్ హైదరాబాద్, జూలై 28: హైడ్రా (HYDRA) వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా చర్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఉందని, అక్రమ నిర్మాణాలు, చెరువులు, ప్రభుత్వ భూముల కబ్జాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. హైడ్రా ప్రభుత్వ తీసుకొచ్చిన అత్యంత పెద్ద పరిపాలనా సంస్కరణల్లో ఒకటని పేర్కొన్నారు.సీఎం...
Read More...
State News 

జగిత్యాల వైద్య రంగ అభివృద్ధికి కీలక నిర్ణయాలు

 జగిత్యాల వైద్య రంగ అభివృద్ధికి కీలక నిర్ణయాలు హైదరాబాద్, జూలై 28 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా వైద్య వ్యవస్థ అభివృద్ధిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, కోరుట్ల ఎమ్మల్యే  డా. సంహ పాల్గొని, జిల్లా వైద్య రంగానికి సంబంధించిన పలు కీలక...
Read More...
Filmi News  State News 

సినీ నటి పావలా శ్యామల కన్నుమూత.. తెలుగు చిత్రసీమలో విషాదం

సినీ నటి పావలా శ్యామల కన్నుమూత.. తెలుగు చిత్రసీమలో విషాదం హైదరాబాద్, జూలై 28 (ప్రజా మంటలు): ప్రముఖ సీనియర్ సినీ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల (73) మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం, వయోభారంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తీవ్రమైన గుండెపోటుకు గురికావడంతో వైద్యులు ప్రాణాలు కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు....
Read More...
Local News 

రైతు బజార్ లోనే కూరగాయల విక్రయాలు జరపాలి. టౌన్ సిఐ కరుణాకర్ 

రైతు బజార్ లోనే కూరగాయల విక్రయాలు జరపాలి.  టౌన్ సిఐ కరుణాకర్     జగిత్యాల జూలై 27 (ప్రజా మంటలు) కూరగాయలు విక్రయించే రైతులు రైతు బజార్ లోపలే తమ కూరగాయలను విక్రయించాలని టౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు. రైతు బజార్ ఎదుట రహదారికి రెండు వైపులా కూరగాయలు విక్రయించడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రజల ఫిర్యాదు మేరకు  జిల్లా ఎస్పీ ఆదేశాలతో సోమవారం టౌన్ సిఐ కరుణాకర్ ట్రాఫిక్...
Read More...
National 

బోర్నపల్లి–జగన్నాథ్‌పూర్ బ్రిడ్జిపై రాజకీయ దుమారం.. జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కౌంటర్

బోర్నపల్లి–జగన్నాథ్‌పూర్ బ్రిడ్జిపై రాజకీయ దుమారం.. జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కౌంటర్ జగిత్యాల, జూలై 27 (ప్రజా మంటలు): బోర్నపల్లి–జగన్నాథ్‌పూర్ బ్రిడ్జి నిర్మాణం అంశంపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఘాటుగా స్పందించారు. జగిత్యాల మోతే రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పలు అంశాలపై వివరణ ఇచ్చారు. మంత్రి లక్ష్మణ్ కుమార్‌ను హైదరాబాద్‌లో...
Read More...
Local News  State News 

ఎల్ నినో తో ఆందోళనలో ఉన్న రైతులను ఎరువుల బ్లాక్ మార్కెట్‌తో మరింత దోచుకుంటున్న ప్రభుత్వం. - దావ వసంత సురేష్.

ఎల్ నినో తో ఆందోళనలో ఉన్న రైతులను ఎరువుల బ్లాక్ మార్కెట్‌తో మరింత దోచుకుంటున్న ప్రభుత్వం. - దావ వసంత సురేష్. సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/ 9348422113.  జగిత్యాల 27 జూలై (ప్రజా మంటలు) :  జిల్లాలోని రైతులు యూరియా డిఏపి మరియు ఇతర ఎరువులు అధిక ధరలకు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న సందర్భంగా ఈరోజు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు బిఆర్ఎస్ నాయకులు మరియు రైతులతో కలిసి వినతి పత్రం ఇచ్చిన జగిత్యాల...
Read More...