వీరభద్ర మాల దీక్ష స్వీకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్

మొక్కు నెరవేర్చుకున్న మంత్రి

On
వీరభద్ర మాల దీక్ష స్వీకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్

నేటి నుండి 27 రోజులపాటు వీరభద్ర నక్షత్ర మాలలో మంత్రి పొన్నం ప్రభాకర్

భీమదేవరపల్లి ఆగస్టు 6 (ప్రజామంటలు ప్రతినిధి కాశిరెడ్డి ఆదిరెడ్డి) :

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో శ్రీ వీరభద్ర దేవాలయంలో రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ వీరభద్రుడి నక్షత్ర దీక్ష మాలను స్వీకరించారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా పిసిసి అధ్యక్షుని హోదాలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి తో పాటు, మంత్రి పొన్నం ప్రభాకర్ వీరభద్రుడుని దర్శించుకున్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వీరభద్ర నక్షత్ర దీక్ష చేపడతానని పొన్నం మొక్కుకున్నారు. వారి కోరిక నెరవేరడంతో పాటు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడమే కాకుండా, స్వామి ఆశీర్వాదంతో మంత్రి పదవి కూడా పొన్నం ను వరించింది.

 

*మొక్కు తీర్చుకున్న మంత్రి*

 

అసెంబ్లీ ఎలక్షన్స్ కి ముందు ప్రచారంలో భాగంగా భీమదేవరపల్లి మండలంలో పర్యటించిన సందర్భంలో మొదటగా కొత్తకొండ వీరభద్ర స్వామిని దర్శించుకున్నారు. ఆ సమయంలో తనకు టికెట్ తో పాటు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వీరభద్ర నక్షత్ర దీక్షను తీసుకుంటానని మొక్కుకున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, పొన్నం మంత్రి కావడం చకా చకా జరిగిపోయాయి. తాను కోరుకున్న కోరికలు నెరవేరడంతో, శ్రావణమాసంలో వీరభద్ర దీక్ష తీసుకొని మాల వేసుకున్నారు.

 

*శ్రీ వీరభద్ర దీక్ష విశిష్టత*

 

 

శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరం భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర ఆలయంలో 27 రోజులపాటు నక్షత్రమాల ఉంటుంది. అత్యంత ప్రాచుర్యం కలిగిన వీరభద్రుడి మాల వేసుకోవడం సకల సౌభాగ్యాలకు మంచిదని నక్షత్ర దీక్ష వ్యవస్థాపక గురుస్వామి, ఆలయ అర్చకులు మొగిలిపాలెం రాంబాబు అన్నారు.

 

*ఈ సందర్భంగా మంత్రి పున్నం ప్రభాకర్ మాట్లాడుతూ...*

 

ఈ దీక్ష స్వప్రయోజనాల కొరకు కాకుండా రాష్ట్ర ప్రజలు, నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో పసిడి సిరులు కురువాలని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల సమస్యల పరిష్కారానికి, తన వంతు కృషి చేస్తూ, తన పనిలో ఆ భగవంతుడు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

 

ప్రతి ఒక్కరూ దైవచింతను అలవర్చుకొని, మానసిక ప్రశాంతతను పొందాలని అన్నారు. మంగళవారం కొత్తకొండ వీరభద్రుని సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

 

 

*దేవుడి మహిమ మీద విశ్వాసం ఉంది..*

 

- మంత్రి పొన్నం ప్రభాకర్

 

భక్తుల ఆకాంక్షలకు, విశ్వాసాలకు అనుగుణంగా, ఈ దీక్ష నా ఒక్కడి మంచి కొరకే కాకుండా, సర్వేజనా సుఖినోభవంతు స్ఫూర్తితో రైతులు వ్యవసాయం, ప్రతి ఒక్కరూ పాడి పంటలతో సస్యశ్యామలంగా, బాగుండాలని ఈ దీక్ష తీసుకోవడం జరిగిందని అన్నారు. ఈ నియోజకవర్గానికి సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేలా, వీరభద్రుడు ధైర్యాన్ని, మనో బలాన్ని ఇవ్వాలని కోర మీసాల స్వామిని వేడుకున్నట్లు తెలిపారు.

 

*నక్షత్ర దీక్ష తీసుకున్న స్వాములకు నిత్య అన్నదాన కార్యక్రమం*

 

 రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ నక్షత్ర దీక్ష మాలను తీసుకొని మూడు రోజులపాటు వీరభద్ర స్వామి దేవాలయం వద్దనే ఉంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నక్షత్ర దీక్ష స్వాములకు అల్పాహారము, అన్నదాన కార్యక్రమం 27 రోజులపాటు పొన్నం సతీమణి పొన్నం మంజుల నిర్వహించుచున్నారు.

 

*27 రోజుల దీక్ష*

 

వీరభద్ర మాల స్వీకరించిన భక్తులు 11 రోజులు లేదా 27 రోజులు మాల వేసుకుని దీక్షలో ఉంటారు. ఆగస్టు 6 నుండి సెప్టెంబర్ 2 వ, తేదీ వరకు దీక్ష ఉంటుంది. మంత్రి పొన్నంతోపాటు 100 మందికి పైగా స్వాములు మంగళవారం మాల వేసుకుని నక్షత్ర దీక్ష తీసుకున్నారు.

 

*కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు*

 

హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల, మండలాల కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరైనారు. ఆలయ ఈవో కిషన్ రావు, మాజీ చైర్మన్ మాడిశెట్టి కుమారస్వామి, ముల్కనూర్, వేలేర్ ఎస్సైలు సాయిబాబు, సురేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిట్టంపల్లి ఐలయ్య, బొజ్జపురి అశోక్ ముఖర్జీ, కేతిరి లక్ష్మారెడ్డి, కొలుగూరి రాజు, ఊసకోయిల ప్రకాష్, ఆదరి రవీందర్, చంద్రశేఖర్ గుప్తా, మంగ రామచంద్రం, కొడకండ్ల సుదర్శన్ రెడ్డి, డబ్బా శంకర్, నరేందర్ గౌడ్, చిట్కురి అనిల్, జక్కుల అనిల్, ఊరడి జయపాల్ రెడ్డి, సత్తిరెడ్డి, కోటేశ్వర్ రెడ్డి, దేవరాజు శంకర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

ప్రముఖ విద్యావేత్త, సామాజిక సేవా తత్పరుడు కాసుగంటి సుధాకర్ రావు సేవలు నేటి తరానికి స్ఫూర్తి

ప్రముఖ విద్యావేత్త, సామాజిక సేవా తత్పరుడు కాసుగంటి సుధాకర్ రావు సేవలు నేటి తరానికి స్ఫూర్తి జగిత్యాల జనవరి 24 (ప్రజా మంటలు)ప్రముఖ విద్యావేత్త,సామాజిక వేత్త,పారిశ్రామిక వేత్త సరస్వతీ శిశు మందిర్, శ్రీవాణి జూనియర్ కళాశాల ఛైర్మెన్ కాసుగంటి సుధాకర్ రావు  ప్రథమ మాసికం( సంస్మరణ   ) కార్యక్రమానికి పద్మనాయక కళ్యాణ మండపానికి హాజరై వారి చిత్రపటానికి నివాళులర్పించి వారు చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఎందరో నిరుద్యోగులకు ఉపాధి కల్పించి వ్యవసాయ...
Read More...
Crime  State News 

నాంపల్లి రోడ్‌లో ఫర్నిచర్ షాప్ భవనంలో అగ్నిప్రమాదం

నాంపల్లి రోడ్‌లో ఫర్నిచర్ షాప్ భవనంలో అగ్నిప్రమాదం హైదరాబాద్, జనవరి 24 (ప్రజా మంటలు): హైదరాబాద్ నాంపల్లి రోడ్‌లోని ఓ బహుళ అంతస్తుల ఫర్నిచర్ షాప్ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా మొత్తం ఆరుగురు మంటల్లో చిక్కుకుని తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఫర్నిచర్ షాప్‌కు చెందిన సెల్లార్‌లో ముందుగా అగ్ని...
Read More...
Filmi News 

అత్యంత వైభవంగా ‘100 డేస్ లవ్ స్టోరీ’ ట్రైలర్ విడుదల

అత్యంత వైభవంగా ‘100 డేస్ లవ్ స్టోరీ’ ట్రైలర్ విడుదల హైదరాబాద్, జనవరి 24: శ్రీ సాయి శివ ప్రియ క్రియేషన్స్ పతాకంపై పురిపండ వి. వెంకటరమణ మూర్తి శర్మ నిర్మాతగా, విజయమిత్ర దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘100 డేస్ లవ్ స్టోరీ’. ‘అతి ప్రేమ భయానకం’ అనే క్యాప్షన్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను శుక్రవారం ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా విడుదల చేశారు....
Read More...
National 

బడ్జెట్ పార్లమెంట్ 28 నుండి, సమావేశాలకు ముందు రోజు అఖిలపక్ష సమావేశం

బడ్జెట్ పార్లమెంట్ 28 నుండి, సమావేశాలకు ముందు రోజు అఖిలపక్ష సమావేశం న్యూఢిల్లీ జనవరి 24 (ప్రజా మంటలు): పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జనవరి 27న అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. సంప్రదాయం ప్రకారం, సమావేశాలు ప్రారంభమయ్యే ముందు అన్ని రాజకీయ పార్టీలతో కేంద్రం చర్చలు జరపనుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 28 నుంచి ప్రారంభమవుతాయి. ఈ సమావేశాలు రెండు దశలుగా ఏప్రిల్...
Read More...
National  Entertainment   State News 

ఫిబ్రవరి 3 నుంచి ప్రజల కోసం రాష్ట్రపతి భవన్, అమృత్ ఉద్యాన్

ఫిబ్రవరి 3 నుంచి ప్రజల కోసం రాష్ట్రపతి భవన్, అమృత్ ఉద్యాన్ న్యూఢిల్లీ జనవరి 24, (ప్రజా మంటలు):ఢిల్లీ వాసులు, పర్యాటకులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ఉన్న ప్రసిద్ధ అమృత్ ఉద్యాన్ (Amrit Udyan) ఫిబ్రవరి 3 నుంచి సాధారణ ప్రజల సందర్శనకు తెరవనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ ఉద్యాన్ మార్చి 31 వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ప్రతి ఏడాది...
Read More...
National  International   State News 

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభం ప్రభావం డాలర్ కుదేలు… భారత్‌లో ₹1.56 లక్షలకు చేరిన బంగారం ధర

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభం ప్రభావం డాలర్ కుదేలు… భారత్‌లో ₹1.56 లక్షలకు చేరిన బంగారం ధర లండన్ / న్యూఢిల్లీ జనవరి 24(ప్రజా మంటలు): గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, యూరోపియన్ దేశాలపై టారిఫ్ హెచ్చరికలు ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో తీవ్ర అనిశ్చితిని పెంచాయి. ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు పరుగులు తీయడంతో బంగారం ధరలు 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత అత్యుత్తమ...
Read More...
State News 

భండారు విజయ కథా సంపటాల పరిచయ సభ

భండారు విజయ కథా సంపటాల పరిచయ సభ హైదరాబాద్, జనవరి 24 (ప్రజా మంటలు): హైదరాబాద్ విమెన్ రైటర్స్ మరియు హస్మిత ప్రచురణ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో, రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాలులో జనవరి 23 సాయంత్రం భండారు విజయ సంపాదకత్వంలో రూపొందిన ‘పరిష్కృత’ (కథా సంకలనం) మరియు ఆమె స్వీయ కథా సంపుటి ‘సహజాత’ పుస్తకాల పరిచయ...
Read More...

మధ్యప్రదేశ్‌ ఉజ్జయినిలో చెలరేగిన హింస – నిషేధాజ్ఞలు విధించిన పోలీసులు

మధ్యప్రదేశ్‌ ఉజ్జయినిలో చెలరేగిన హింస – నిషేధాజ్ఞలు విధించిన పోలీసులు ఉజ్జయిని జనవరి 23 (ప్రజా మంటలు): మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినిలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఓ వీఎచ్‌పీ (VHP) నాయకుడిపై జరిగిన దాడి అనంతరం పరిస్థితి ఉద్రిక్తంగా మారి అల్లర్లు చెలరేగినట్లు సమాచారం. ఆందోళనకారులు పలుచోట్ల బస్సులకు నిప్పు పెట్టడంతో పాటు ఇళ్లపై రాళ్లు రువ్వినట్లు అధికారులు తెలిపారు. హింస తీవ్రత పెరగడంతో పోలీసులు భారీగా...
Read More...
National 

శ్రీనగర్‌లో మంచుపాతం రవాణా, విద్యుత్ అంతరాయం

శ్రీనగర్‌లో మంచుపాతం  రవాణా, విద్యుత్ అంతరాయం శ్రీనగర్‌ జనవరి 23: శ్రీనగర్‌ నగరం మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో తాజాగా మంచు కురిసింది. పర్వతాలు పూర్తిగా మంచుతో కప్పబడి అందంగా కనిపిస్తున్నాయి. డాల్ లేక్‌ సరస్సు కూడా శీతాకాలపు అందాన్ని ప్రతిబింబిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తోంది.   మంచు పరిస్థిత శ్రీనగర్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు స్థాయిలో మంచు పడింది. ఎత్తైన ప్రాంతాల్లో మాత్రం...
Read More...
Local News  State News 

కేటీఆర్‌, హరీష్ రావులకు సంఘీభావం తెలిపిన దావ వసంత సురేష్

కేటీఆర్‌, హరీష్ రావులకు సంఘీభావం తెలిపిన దావ వసంత సురేష్ హైదరాబాద్, జనవరి 23 (ప్రజా మంటలు): సిట్ విచారణ అనంతరం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావును జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, జిల్లా బీఆర్ఎస్ పార్టీ...
Read More...

పద్మశాలి సేవా సంఘం అభివృద్ధి  కొరకు నిధులు కోరుతూ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కలిసిన కాంగ్రెస్ అధ్యక్షుడు నందయ్య

పద్మశాలి సేవా సంఘం అభివృద్ధి  కొరకు నిధులు కోరుతూ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కలిసిన కాంగ్రెస్ అధ్యక్షుడు నందయ్య జగిత్యాల జనవరి 23 ( ప్రజా మంటలు)జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని,జిల్లా అధ్యక్షులు గాజంగి నందయ్య  ని కలిసిన జగిత్యాల పద్మశాలి సేవా సంఘం సభ్యులు.  జగిత్యాల పట్టణంలో పద్మశాలి సేవా సంఘం అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేయాలని మరియు పద్మశాలి విద్యార్థుల సంక్షేమం కోసం హాస్టల్,సంఘానికి కళ్యాణ
Read More...
Local News  State News 

సీఎం రేవంత్ నిజాయితీపరుడైతే బీఆర్ఎస్ నేతలు జైలుకెళ్తారు : ఎంపీ అరవింద్

సీఎం రేవంత్ నిజాయితీపరుడైతే బీఆర్ఎస్ నేతలు జైలుకెళ్తారు : ఎంపీ అరవింద్ బిఆర్ఎస్ కు మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులే లేరు? జగిత్యాల, జనవరి 23 (ప్రజా మంటలు): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజంగా నిజాయితీపరుడైతే గత పాలనలో అవినీతికి పాల్పడ్డ బీఆర్ఎస్ నేతలు తప్పకుండా జైలుకు వెళ్లాల్సి ఉంటుందని బీజేపీ ఎంపీ అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లేదంటే ప్యాకేజీలకు లొంగుతాడా? లేక ధైర్యంగా చర్యలు తీసుకుంటాడా? అనే...
Read More...