వీరభద్ర మాల దీక్ష స్వీకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్

మొక్కు నెరవేర్చుకున్న మంత్రి

On
వీరభద్ర మాల దీక్ష స్వీకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్

నేటి నుండి 27 రోజులపాటు వీరభద్ర నక్షత్ర మాలలో మంత్రి పొన్నం ప్రభాకర్

భీమదేవరపల్లి ఆగస్టు 6 (ప్రజామంటలు ప్రతినిధి కాశిరెడ్డి ఆదిరెడ్డి) :

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో శ్రీ వీరభద్ర దేవాలయంలో రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ వీరభద్రుడి నక్షత్ర దీక్ష మాలను స్వీకరించారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా పిసిసి అధ్యక్షుని హోదాలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి తో పాటు, మంత్రి పొన్నం ప్రభాకర్ వీరభద్రుడుని దర్శించుకున్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వీరభద్ర నక్షత్ర దీక్ష చేపడతానని పొన్నం మొక్కుకున్నారు. వారి కోరిక నెరవేరడంతో పాటు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడమే కాకుండా, స్వామి ఆశీర్వాదంతో మంత్రి పదవి కూడా పొన్నం ను వరించింది.

 

*మొక్కు తీర్చుకున్న మంత్రి*

 

అసెంబ్లీ ఎలక్షన్స్ కి ముందు ప్రచారంలో భాగంగా భీమదేవరపల్లి మండలంలో పర్యటించిన సందర్భంలో మొదటగా కొత్తకొండ వీరభద్ర స్వామిని దర్శించుకున్నారు. ఆ సమయంలో తనకు టికెట్ తో పాటు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వీరభద్ర నక్షత్ర దీక్షను తీసుకుంటానని మొక్కుకున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, పొన్నం మంత్రి కావడం చకా చకా జరిగిపోయాయి. తాను కోరుకున్న కోరికలు నెరవేరడంతో, శ్రావణమాసంలో వీరభద్ర దీక్ష తీసుకొని మాల వేసుకున్నారు.

 

*శ్రీ వీరభద్ర దీక్ష విశిష్టత*

 

 

శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరం భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర ఆలయంలో 27 రోజులపాటు నక్షత్రమాల ఉంటుంది. అత్యంత ప్రాచుర్యం కలిగిన వీరభద్రుడి మాల వేసుకోవడం సకల సౌభాగ్యాలకు మంచిదని నక్షత్ర దీక్ష వ్యవస్థాపక గురుస్వామి, ఆలయ అర్చకులు మొగిలిపాలెం రాంబాబు అన్నారు.

 

*ఈ సందర్భంగా మంత్రి పున్నం ప్రభాకర్ మాట్లాడుతూ...*

 

ఈ దీక్ష స్వప్రయోజనాల కొరకు కాకుండా రాష్ట్ర ప్రజలు, నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో పసిడి సిరులు కురువాలని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల సమస్యల పరిష్కారానికి, తన వంతు కృషి చేస్తూ, తన పనిలో ఆ భగవంతుడు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

 

ప్రతి ఒక్కరూ దైవచింతను అలవర్చుకొని, మానసిక ప్రశాంతతను పొందాలని అన్నారు. మంగళవారం కొత్తకొండ వీరభద్రుని సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

 

 

*దేవుడి మహిమ మీద విశ్వాసం ఉంది..*

 

- మంత్రి పొన్నం ప్రభాకర్

 

భక్తుల ఆకాంక్షలకు, విశ్వాసాలకు అనుగుణంగా, ఈ దీక్ష నా ఒక్కడి మంచి కొరకే కాకుండా, సర్వేజనా సుఖినోభవంతు స్ఫూర్తితో రైతులు వ్యవసాయం, ప్రతి ఒక్కరూ పాడి పంటలతో సస్యశ్యామలంగా, బాగుండాలని ఈ దీక్ష తీసుకోవడం జరిగిందని అన్నారు. ఈ నియోజకవర్గానికి సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేలా, వీరభద్రుడు ధైర్యాన్ని, మనో బలాన్ని ఇవ్వాలని కోర మీసాల స్వామిని వేడుకున్నట్లు తెలిపారు.

 

*నక్షత్ర దీక్ష తీసుకున్న స్వాములకు నిత్య అన్నదాన కార్యక్రమం*

 

 రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ నక్షత్ర దీక్ష మాలను తీసుకొని మూడు రోజులపాటు వీరభద్ర స్వామి దేవాలయం వద్దనే ఉంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నక్షత్ర దీక్ష స్వాములకు అల్పాహారము, అన్నదాన కార్యక్రమం 27 రోజులపాటు పొన్నం సతీమణి పొన్నం మంజుల నిర్వహించుచున్నారు.

 

*27 రోజుల దీక్ష*

 

వీరభద్ర మాల స్వీకరించిన భక్తులు 11 రోజులు లేదా 27 రోజులు మాల వేసుకుని దీక్షలో ఉంటారు. ఆగస్టు 6 నుండి సెప్టెంబర్ 2 వ, తేదీ వరకు దీక్ష ఉంటుంది. మంత్రి పొన్నంతోపాటు 100 మందికి పైగా స్వాములు మంగళవారం మాల వేసుకుని నక్షత్ర దీక్ష తీసుకున్నారు.

 

*కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు*

 

హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల, మండలాల కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరైనారు. ఆలయ ఈవో కిషన్ రావు, మాజీ చైర్మన్ మాడిశెట్టి కుమారస్వామి, ముల్కనూర్, వేలేర్ ఎస్సైలు సాయిబాబు, సురేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిట్టంపల్లి ఐలయ్య, బొజ్జపురి అశోక్ ముఖర్జీ, కేతిరి లక్ష్మారెడ్డి, కొలుగూరి రాజు, ఊసకోయిల ప్రకాష్, ఆదరి రవీందర్, చంద్రశేఖర్ గుప్తా, మంగ రామచంద్రం, కొడకండ్ల సుదర్శన్ రెడ్డి, డబ్బా శంకర్, నరేందర్ గౌడ్, చిట్కురి అనిల్, జక్కుల అనిల్, ఊరడి జయపాల్ రెడ్డి, సత్తిరెడ్డి, కోటేశ్వర్ రెడ్డి, దేవరాజు శంకర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

తపస్ జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గ సభ్యులను అభినందించిన  జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ 

తపస్ జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గ సభ్యులను అభినందించిన  జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్  జగిత్యాల డిసెంబర్ 28 (ప్రజా మంటలు)తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షునిగా బోయినపల్లి ప్రసాద్ రావు ప్రధాన కార్యదర్శిగా కొక్కుల రాజేష్ ఎన్నికగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవగా నూతన కార్యవర్గ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్...
Read More...

లక్ష్మీపూర్ హత్య కేసు చేదించిన పోలీసులు వివరాలు వెల్లడించిన డీఎస్పీ రఘు చందర్

లక్ష్మీపూర్ హత్య కేసు చేదించిన పోలీసులు వివరాలు వెల్లడించిన డీఎస్పీ రఘు చందర్ జగిత్యాల డిసెంబర్ 28 (ప్రజా మంటలు) జగిత్యాల రూరల్ మండలం లక్ష్మిపూర్ గ్రామంలో హత్యకు గురైన బుర్ర మహేందర్ అనే వ్యక్తి హత్య కేసును ఛేదించారు పోలీసులు...  ప్రేమ పేరుతో మోసం చేయడంతో పాటు వీడియోలు బయట పెడతానని మహేందర్ వేధింపులకు గురి చేయడంతోనే అక్క చెల్లెలుతో పాటు కుటుంబ సభ్యులు కలిసి హత్యకు పాల్పడినట్లు...
Read More...

కాసుగంటి సుధాకర్ రావు పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

కాసుగంటి సుధాకర్ రావు పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ హైదరాబాద్ డిసెంబర్ 28 (ప్రజా మంటలు) ప్రముఖ విద్యావేత్త , శ్రీ సరస్వతిశిశు మందిర్ ,శ్రీవాణి సహకార జూనియర్ కళాశాల,గోదావరి వ్యాలీ వ్యవస్థాపకులు కాసుగంటి సుధాకర్ రావు అనారోగ్యం తో హైదరాబాదులో  మరణించగా జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ సుధాకర్ రావు  పార్థివ దేహానికి నివాళులు అర్పించి,వారి కుమారుడు కాసుగంటి జగదీష్ చందర్ రావును,...
Read More...
Local News  State News 

సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి – మార్త సత్యనారాయణ

సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి – మార్త సత్యనారాయణ కాగజ్ నగర్, డిసెంబర్ 28 (ప్రజా మంటలు): రాష్ట్రవ్యాప్తంగా సీనియర్ సిటిజన్లపై జరుగుతున్న వేధింపులు, నిర్లక్ష్య ఘటనలు ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో, వారి రక్షణ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర కార్యదర్శి మార్త సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వృద్ధుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో...
Read More...
Local News  State News 

ఎస్‌సి రెసిడెన్షియల్ హాస్టల్‌ నిర్వహణపై హెచ్‌ఆర్‌సీ ఆగ్రహం

ఎస్‌సి రెసిడెన్షియల్ హాస్టల్‌ నిర్వహణపై హెచ్‌ఆర్‌సీ ఆగ్రహం సికింద్రాబాద్, డిసెంబర్ 28 ( ప్రజామంటలు) : రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట్–నాదర్‌గుల్–కందుకూర్ ఎస్‌సి రెసిడెన్షియల్ హాస్టల్‌లో నెలకొన్న దారుణ పరిస్థితులపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని ఫిర్యాదుతో హెచ్‌ఆర్‌సీ కేసు నం. 8122/2025 నమోదు చేసి విచారణ చేపట్టింది.హాస్టల్‌లో మురుగు పొంగిపొర్లడం, తలుపులు–కిటికీలు లేని...
Read More...
Local News 

అలరించిన ఫెమి–9 ఉమెన్స్ క్లబ్ ఫ్యాషన్ షో 

అలరించిన ఫెమి–9 ఉమెన్స్ క్లబ్ ఫ్యాషన్ షో  సికింద్రాబాద్, డిసెంబర్ 28 (ప్రజామంటలు): ర్యాంప్ వాక్ కేవలం ఫ్యాషన్ కోసమే కాకుండా మహిళల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యం, ఆలోచనల్లో మార్పుకు నాంది పలుకుతుందని చీఫ్ గెస్ట్ మిసెస్ తెలంగాణ క్రౌన్  సుధా నాయుడు అన్నారు. బేగంపేట ఫ్యామిలీ వరల్డ్‌లో ఫెమి–9 ఉమెన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్యూటీ ఫ్యాషన్ మీట్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా...
Read More...

జగిత్యాల ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా రాజేందర్ రెడ్డి ఘన విజయం. 

జగిత్యాల ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా రాజేందర్ రెడ్డి ఘన విజయం.  జగిత్యాల డిసెంబర్ 28 (ప్రజా మంటలు)టీయూడబ్ల్యూజే (ఐజేయు) అనుబంధ జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎల్లాల రాజేందర్ రెడ్డి ఘన విజయం సాధించినట్లు ఐజేయు జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎన్నికల అధికారి బెజ్జంకి సంపూర్ణ చారి తెలిపారు. ఆదివారం స్థానిక దేవిశ్రీ గార్డెన్లో నిర్వహించిన ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో రాజేందర్రెడ్డి తన సమీప ప్రత్యర్థి...
Read More...
Local News 

ఇబ్రహీంపట్నంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం

ఇబ్రహీంపట్నంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 28 (ప్రజా మంటలు): ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు గూడ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్య పోరాటం నుంచి ప్రజాస్వామ్య...
Read More...
Local News  Crime 

గొల్లపల్లి లో రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి

గొల్లపల్లి లో రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి గొల్లపల్లి, డిసెంబర్ 28 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం పాలయ్యారు. అబ్బాపూర్ గ్రామానికి చెందిన రెడపాక లింగయ్య – లచ్చవ్వ దంపతులు ద్విచక్ర వాహనంపై ఆదివారం తెల్లవారుజామున జగిత్యాల వైపు వెళ్తుండగా, ఎదురుగా జగిత్యాల నుంచి గొల్లపల్లి వైపు వస్తున్న తవేరా వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో...
Read More...
Local News 

ఎల్కతుర్తిలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం

ఎల్కతుర్తిలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం ఎల్కతుర్తి, డిసెంబర్ 28 (ప్రజా మంటలు): భారత జాతీయ కాంగ్రెస్ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కూడలిలో జరిగిన కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇంద్రసేన రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర్య పోరాటం...
Read More...
Filmi News  State News 

ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానల్ ఆధిపత్యం

ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానల్ ఆధిపత్యం హైదరాబాద్ డిసెంబర్ 28 (ప్రజా మంటలు):తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానల్ ఘన విజయం సాధించింది. మొత్తం 44 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానల్ 28 స్థానాలు కైవసం చేసుకోగా, మన ప్యానల్ 15 స్థానాల్లో విజయం సాధించింది. ఛాంబర్ ఎన్నికల్లో రెండు ప్యానెల్స్ పోటీపడ్డాయి. నిర్మాతలు అల్లు...
Read More...
Local News  State News 

ట్రిపుల్ ఆర్ బాధిత రైతులకు అండగా నిలుస్తా – కవిత

ట్రిపుల్ ఆర్ బాధిత రైతులకు అండగా నిలుస్తా – కవిత కల్వకుర్తి డిసెంబర్ 28 (ప్రజా మంటలు): జంగారెడ్డి గూడెం పరిధిలో ట్రిపుల్ ఆర్ (రీజినల్ రింగ్ రోడ్) కారణంగా భూములు కోల్పోతున్న రైతులకు అండగా నిలుస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు. జంగారెడ్డి గూడెం గ్రామంలో నిర్వహించిన సమావేశంలో నిర్వాసిత రైతులతో మాట్లాడిన ఆమె, భూసేకరణలో జరిగిన అన్యాయాలను తీవ్రంగా ఖండించారు. ట్రిపుల్ ఆర్...
Read More...