వీరభద్ర మాల దీక్ష స్వీకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్
మొక్కు నెరవేర్చుకున్న మంత్రి
నేటి నుండి 27 రోజులపాటు వీరభద్ర నక్షత్ర మాలలో మంత్రి పొన్నం ప్రభాకర్
భీమదేవరపల్లి ఆగస్టు 6 (ప్రజామంటలు ప్రతినిధి కాశిరెడ్డి ఆదిరెడ్డి) :
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో శ్రీ వీరభద్ర దేవాలయంలో రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ వీరభద్రుడి నక్షత్ర దీక్ష మాలను స్వీకరించారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా పిసిసి అధ్యక్షుని హోదాలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి తో పాటు, మంత్రి పొన్నం ప్రభాకర్ వీరభద్రుడుని దర్శించుకున్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వీరభద్ర నక్షత్ర దీక్ష చేపడతానని పొన్నం మొక్కుకున్నారు. వారి కోరిక నెరవేరడంతో పాటు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడమే కాకుండా, స్వామి ఆశీర్వాదంతో మంత్రి పదవి కూడా పొన్నం ను వరించింది.
*మొక్కు తీర్చుకున్న మంత్రి*
అసెంబ్లీ ఎలక్షన్స్ కి ముందు ప్రచారంలో భాగంగా భీమదేవరపల్లి మండలంలో పర్యటించిన సందర్భంలో మొదటగా కొత్తకొండ వీరభద్ర స్వామిని దర్శించుకున్నారు. ఆ సమయంలో తనకు టికెట్ తో పాటు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వీరభద్ర నక్షత్ర దీక్షను తీసుకుంటానని మొక్కుకున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, పొన్నం మంత్రి కావడం చకా చకా జరిగిపోయాయి. తాను కోరుకున్న కోరికలు నెరవేరడంతో, శ్రావణమాసంలో వీరభద్ర దీక్ష తీసుకొని మాల వేసుకున్నారు.
*శ్రీ వీరభద్ర దీక్ష విశిష్టత*
శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరం భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర ఆలయంలో 27 రోజులపాటు నక్షత్రమాల ఉంటుంది. అత్యంత ప్రాచుర్యం కలిగిన వీరభద్రుడి మాల వేసుకోవడం సకల సౌభాగ్యాలకు మంచిదని నక్షత్ర దీక్ష వ్యవస్థాపక గురుస్వామి, ఆలయ అర్చకులు మొగిలిపాలెం రాంబాబు అన్నారు.
*ఈ సందర్భంగా మంత్రి పున్నం ప్రభాకర్ మాట్లాడుతూ...*
ఈ దీక్ష స్వప్రయోజనాల కొరకు కాకుండా రాష్ట్ర ప్రజలు, నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో పసిడి సిరులు కురువాలని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల సమస్యల పరిష్కారానికి, తన వంతు కృషి చేస్తూ, తన పనిలో ఆ భగవంతుడు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
ప్రతి ఒక్కరూ దైవచింతను అలవర్చుకొని, మానసిక ప్రశాంతతను పొందాలని అన్నారు. మంగళవారం కొత్తకొండ వీరభద్రుని సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
*దేవుడి మహిమ మీద విశ్వాసం ఉంది..*
- మంత్రి పొన్నం ప్రభాకర్
భక్తుల ఆకాంక్షలకు, విశ్వాసాలకు అనుగుణంగా, ఈ దీక్ష నా ఒక్కడి మంచి కొరకే కాకుండా, సర్వేజనా సుఖినోభవంతు స్ఫూర్తితో రైతులు వ్యవసాయం, ప్రతి ఒక్కరూ పాడి పంటలతో సస్యశ్యామలంగా, బాగుండాలని ఈ దీక్ష తీసుకోవడం జరిగిందని అన్నారు. ఈ నియోజకవర్గానికి సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేలా, వీరభద్రుడు ధైర్యాన్ని, మనో బలాన్ని ఇవ్వాలని కోర మీసాల స్వామిని వేడుకున్నట్లు తెలిపారు.
*నక్షత్ర దీక్ష తీసుకున్న స్వాములకు నిత్య అన్నదాన కార్యక్రమం*
రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ నక్షత్ర దీక్ష మాలను తీసుకొని మూడు రోజులపాటు వీరభద్ర స్వామి దేవాలయం వద్దనే ఉంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నక్షత్ర దీక్ష స్వాములకు అల్పాహారము, అన్నదాన కార్యక్రమం 27 రోజులపాటు పొన్నం సతీమణి పొన్నం మంజుల నిర్వహించుచున్నారు.
*27 రోజుల దీక్ష*
వీరభద్ర మాల స్వీకరించిన భక్తులు 11 రోజులు లేదా 27 రోజులు మాల వేసుకుని దీక్షలో ఉంటారు. ఆగస్టు 6 నుండి సెప్టెంబర్ 2 వ, తేదీ వరకు దీక్ష ఉంటుంది. మంత్రి పొన్నంతోపాటు 100 మందికి పైగా స్వాములు మంగళవారం మాల వేసుకుని నక్షత్ర దీక్ష తీసుకున్నారు.
*కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు*
హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల, మండలాల కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరైనారు. ఆలయ ఈవో కిషన్ రావు, మాజీ చైర్మన్ మాడిశెట్టి కుమారస్వామి, ముల్కనూర్, వేలేర్ ఎస్సైలు సాయిబాబు, సురేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిట్టంపల్లి ఐలయ్య, బొజ్జపురి అశోక్ ముఖర్జీ, కేతిరి లక్ష్మారెడ్డి, కొలుగూరి రాజు, ఊసకోయిల ప్రకాష్, ఆదరి రవీందర్, చంద్రశేఖర్ గుప్తా, మంగ రామచంద్రం, కొడకండ్ల సుదర్శన్ రెడ్డి, డబ్బా శంకర్, నరేందర్ గౌడ్, చిట్కురి అనిల్, జక్కుల అనిల్, ఊరడి జయపాల్ రెడ్డి, సత్తిరెడ్డి, కోటేశ్వర్ రెడ్డి, దేవరాజు శంకర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మెట్పల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం – దంపతులు మృతి, ఒకరి పరిస్థితి విషమం
మెటుపల్లి డిసెంబర్ 27 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ శివారులో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు ఎదురుగా వచ్చిన లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.
ఈ ప్రమాదంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందగా, కారులో ఉన్న మరో వ్యక్తి తీవ్రంగా... గాంధీ వద్ద అక్రమ పార్కింగ్ వాహనాల తొలగింపు
సికింద్రాబాద్, డిసెంబర్ 27 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి, మెట్రో స్టేషన్, ఎంసీహెచ్ బస్ షెల్టర్ ప్రాంతాల్లో అక్రమంగా పార్కింగ్ చేసిన 12 వాహనాలకు ఫైన్ వేసి, అక్కడి నుంచి తొలగించారు. అలాగే ఏండ్ల తరబడిగా గాంధీ మెట్రో స్టేషన్, ఆసుపత్రి మెయిన్ గేట్, ఫుట్ పాత్ ప్రాంతాల్లో తిష్ట వేసుకొని ఉన్న యాచకులను
3... డబుల్ బెడ్రూం లబ్ధిదారుల సమస్యలపై జిల్లా కలెక్టర్కు హనుమండ్ల జయశ్రీ వినతి
జగిత్యాల డిసెంబర్ 27 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించి మౌలిక వసతుల లేమితో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తాజా మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు.
డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ, అవసరమైన మౌలిక... పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి ప్రాజెక్టుల నిర్లక్ష్యంపై కల్వకుంట్ల కవిత ఘాటు విమర్శలు
నాగర్ కర్నూల్, డిసెంబర్ 27 (ప్రజా మంటల):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించి పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితిని తీవ్రంగా విమర్శించారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని పలు ప్రాంతాలను సందర్శించిన ఆమె, సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.
వట్టెం రిజర్వాయర్,... జీవో 252 సవరించాలని జగిత్యాల కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల ధర్నా
జగిత్యాల, డిసెంబర్ 27 (ప్రజా మంటల):
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెం.252లోని నిబంధనలు వేలాది మంది జర్నలిస్టుల ఉపాధికి ముప్పుగా మారాయని ఆరోపిస్తూ, శనివారం జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఈ జీవోను తక్షణమే సవరించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే హెచ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు... అంబారిపేట శ్రీవెంకటేశ్వర స్వామి వారి యుట్యూబ్ ఛానల్,భక్తి పాట ను ఆవిష్కరించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 27 (ప్రజా మంటలు)అర్బన్ మండల అంబారిపేట శ్రీవెంకటేశ్వర స్వామి వారి మీద రూపొందించిన భక్తి పాట ను, శ్రీ వెంకటేశ్వర భక్తి యూట్యూబ్ చానల్ నుజగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ భక్తి పాట రూపొందించడానికి కృషి చేసిన పాట రచన సిరికొండ... అల్లిపూర్ నూతన సర్పంచ్, ఉపసర్పంచ్లకు శుభాకాంక్షలు తెలిపిన తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్
జగిత్యాల (రూరల్),డిసెంబర్ 27 ప్ర(జా మంటలు):జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఎంబరీ గౌతమి, ఉపసర్పంచ్ వినయ్లతో పాటు వార్డు సభ్యులుగా ఎన్నికైన మహిళలు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దావ వసంత సురేష్ వారిని శాలువాలతో సత్కరించి... అంబారిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి యూట్యూబ్ ఛానల్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల (రూరల్) డిసెంబర్ 27 (ప్రజా మంటలు):
జగిత్యాల అర్బన్ మండలంలోని అంబారిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన భక్తి పాటను, అలాగే శ్రీ వెంకటేశ్వర భక్తి యూట్యూబ్ ఛానల్ను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగింది.
భక్తి పాట రూపకల్పనలో కీలకంగా పనిచేసిన... సారంగాపూర్లో మండలోజు వేణుగోపాల్ పదవీ విరమణ వేడుకలలో ఎమ్మెల్యే డా సంజయ్
సారంగాపూర్, డిసెంబర్ 27 – ప్రజా మంటలు:
సారంగాపూర్ మండలం రంగంపేట గ్రామ మండల పరిషత్ పాఠశాలలో నిర్వహించిన మండలోజు వేణుగోపాల్ పదవీ విరమణ మహోత్సవ కార్యక్రమానికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మండలోజు వేణుగోపాల్ – శోభ దంపతులను శాలువాతో సత్కరించి, పదవీ విరమణ... ఆరుసార్లు గెలిచి! మళ్ళీ రాజీనామా చేసి, గెలుస్తా దానం ప్రకటన
హైదరాబాద్, డిసెంబర్ 27 (ప్రజా మంటలు):
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపు కేసులు, డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో తాను పూర్తిగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేస్తూ, అవసరమైతే రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించారు.
శుక్రవారం... జగిత్యాల జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఆకుల శ్రీనివాస్ ఆకస్మిక మృతి
జగిత్యాల, డిసెంబర్ 27 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా వైద్యాధికారి (DMHO) డాక్టర్ ఆకుల శ్రీనివాస్ శనివారం ఉదయం అకస్మాత్తుగా మృతి చెందారు. ఆయన అకాల మరణం కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, వైద్య వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.ప్రజారోగ్య సేవల్లో అంకితభావంతో పనిచేసిన డాక్టర్ ఆకుల శ్రీనివాస్, విధి నిర్వహణలో నిబద్ధత, మానవీయత... 