రైతు రుణమాఫీ ప్రభుత్వ విధివిధానాలు బ్యాంకర్లు తప్పక పాటించాలి - జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
రైతు రుణమాఫీ ప్రభుత్వ విధివిధానాలు బ్యాంకర్లు తప్పక పాటించాలి
- జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల జులై 18 (ప్రజా మంటలు) :
జిల్లా స్థాయి బ్యాంకింగ్ అధికారుల మరియు అగ్రికల్చర్ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.
గురువారం కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్ లో ప్రభుత్వ, ప్రవేట్ బ్యాంకింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవలే ప్రభుత్వం క్రాప్ లోన్ రుణమాఫీకి సంబంధించి రుణం తీసుకున్న వారికి రుణమాఫీ వర్తింపచేయాలని, ప్రతి కుటుంబానికి ఒక్కరు మాత్రమే అర్హులని ప్రభుత్వం జి.ఓ జారీ చేసిందని, విధి విధానాలు తప్పక పాటించాలని నిర్లక్ష్యం వహించరాదని బ్యాంక్ అధికారులను ఆదేశించారు. 367 జి.ఓ క్రాప్ లోన్ కట్ఆఫ్ డేట్ లోపు ఉన్న ప్రతి రైతులకు రుణ మాఫీ కచ్చితంగా అమలు చేయాలని కోరారు. రైతులలో ప్రధానంగా కొందరు ఈ- కె వై సి కానీ వారు ఉన్నారని, వారికి కూడా ఇబ్బంది కలగకుండా ఈ- కె వై సి చేయించాలని కోరారు. మహిళా శక్తి క్యాంటీ న్లు కూడా మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. మన జిల్లాలో 300 మంది లబ్ధిదారులు రుణాలు రిజెక్ట్ కావడం జరిగిందని తెలిపారు. ప్రతి కుటుంబానికి రెండు లక్షల రుణమాఫీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆదేశించారు. అలాగే రైతు మిత్ర, కౌలు రైతు అర్హులు కాదాని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమములో జడ్పీ డిప్యూటీ సీఈఓ రఘువరన్, ఎల్.డి.యం. రాం కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి వాణి, డి ఆర్ డి ఓ సంపత్ రావు, బ్యాంక్ అధికారులు,వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

సికింద్రాబాద్ లో మెడికవర్ హాస్పిటల్స్ ప్రారంభం

ఉమేశ్ ఖండేల్వాల్ కు కన్నీటీ వీడ్కోలు

ఇందిరమ్మ రాజ్యంలో విద్య కోసం ఇక్కట్లా? విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ _జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్

ర్యాగింగ్ చట్ట రీత్యా నేరం దీని వల్ల భవిష్యత్తు నాశనం అవుతుంది: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

టీ చింగ్ మెటీరియల్ ద్వారా పాఠాలు సులభతరం అవుతాయి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

ఈవీఎం గోదాము తనిఖీ భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన : కలెక్టర్ బి. సత్యప్రసాద్

ఓజోన్ పరిరక్షణ కరపత్రం ఆవిష్కరణ

శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

పశువైద్యశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్

గోధుర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడికి ₹2 లక్షల నిదుల ప్రొసీడింగ్
