ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కణిక కొమురయ్య -జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కణిక కొమురయ్య -జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
జగిత్యాల జులై 4 (ప్రజా మంటలు) ;
భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కణిక కొమురయ్య జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు.
గురువారం కలెక్టరేట్ సమీకృత సముదాయంలో దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తొలిసారిగా నూతన ప్రజాస్వామిక విప్లవ మార్గంలో సాయుధ పోరాట జెండాను చేబూని దేశానికి వేగుచుక్కగా తెలంగాణ నిలిచిందని, ఆఅ వీరోచిత రైతాంగ సాయుధ పోరాటంలో అడుగుపెట్టి భూమికోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం జరిగిన పోరులో రజాకార్ల ముష్కరుల తుపాకి తూటాలకు నెలకొరిగిన సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని, అతని జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని సాయుధ పోరాట అమరుడు దొడ్డి కొమురయ్య త్యాగం మరవలేనిదని, ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పి. రాంబాబు, రఘువరన్,కలెక్టరేట్ ఏ.ఓ.హనుమంత రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఉద్యమకారులకు న్యాయం చేయని కేసీఆర్ ప్రభుత్వం

ప్లాస్టిక్ బ్యాగ్ లు వద్దు..క్లాత్ బ్యాగులు ముద్దు

మెటుపల్లి లో దొడ్డి కొమురయ్య 79 వ వర్ధంతి

6 లక్షల మంది భక్తులు బల్కంపేట అమ్మవారిని దర్శించుకున్నారు - పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ

బహుముఖ ప్రజ్ఞాశాలి, వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శి పట్టాభిరామ్

ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే 2025 వేడుకలు

బన్సీలాల్ పేట లో వెలుగు చూసిన బోనాల చెక్కుల గోల్ మాల్

డెంగ్యూ పాజిటివ్ కేసు..అప్రమత్తమైన అధికారులు

రేపటి నుంచి వారం పాటు శ్రీసాయి సప్తాహ ఉత్సవాలు

ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయి చదువుకి శ్రీ సత్యసాయి సేవా సమితి ఆర్థిక చేయూత

రాయికల్ మండల కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

సేవా భారతి ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలు.
