తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ అమర వీరుల త్యాగఫలం   - జిల్లా కలెక్టర్ యస్మిన్ భాష  

On
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ అమర వీరుల త్యాగఫలం   - జిల్లా కలెక్టర్ యస్మిన్ భాష  

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ అమర వీరుల త్యాగఫలం    జగిత్యాలలో ఘనంగా రాష్ట్రావిర్భవ వేడుకలు జిల్లా కలెక్టర్ యస్మిన్ భాష  

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ అమర వీరుల త్యాగఫలం 

 - జగిత్యాలలో ఘనంగా రాష్ట్రావిర్భవ వేడుకలు

- జిల్లా కలెక్టర్ యస్మిన్ భాష  

జగిత్యాల జూన్ 02  : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటితో పదేండ్లు నిండాయి. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసువులు బాసిన అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పిస్స్తూ, ఎందరెందరో అమర వీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈ రోజు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తుందని, ఈ సందర్భంగా అమరుల కుటుంబాలకు, ఉద్యమ కారులకు, స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాలుపంచుకున్న చిన్నా పెద్దలందరికీ.. పేరుపేరునా నమస్కారాలు తెలుపుకొంటున్నాని జిల్లా కలెక్టర్ యస్మిన్ భాష అన్నారు. 

ఇంకా, తెలంగాణ రాష్ట్రం గొప్ప చరిత్ర, సాంప్రదాయ కళలు మరియు విభిన్నమైన వంటకాలకు ప్రసిద్ధి చెందింది.తెలంగాణలో అనేక చారిత్రక ప్రదేశాలు మరియు స్మారక చిహ్నాలు కూడా ఎన్నో ఉన్నాయి. 
తెలంగాణలో విభిన్న జనాభా కలిగియుండి, వివిధ వర్గాలు మరియు వివిధ ప్రాంతాల ప్రజలు సామరస్యంతో జీవిస్తున్నరాణి, తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా, రాష్ట్ర గొప్పతనం, వారసత్వం, చరిత్ర మరియు రాష్ట్ర గుర్తింపును జరుపుకోవడానికి, రాష్ట్రవ్యాప్తంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామనీ కలెక్టర్ యస్మిన్ భాషా అన్నారు. 
కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రతివారంలో రెండు రోజులు ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారులకు చెప్పుకునే అవకాశం కల్పించామని, వచ్చిన ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి, సంబంధిత అధికారులకు పంపించి, సత్వర పరిష్కారం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నామనీ, మహిళల సంక్షేమం మరియు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి పరచడానికి పెద్దపీట వేసి వారిని ముందుకు తీసుకువెళ్తున్నామని, ఈ కార్యక్రమంలో భాగంగా 1,22,000 పిల్లల ఏకరూప దుస్తులు కుట్టించే పనులను స్వయం సహాయక గ్రూప్  మహిళలకు అందజేస్తూ, మహిళా స్వశక్తికరణకు బాటలు వేస్తున్నామని తెలిపారు. 

ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. అన్ని పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. జూన్ లో పాఠశాలల ప్రారంభానికి ముందే జిల్లాలో నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, యునిఫార్మ్ పంపిణి చేయడం జరుగుతుంది. పాఠశాలల్లో అవసరమైన పనులన్నీ గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా అమ్మ ఆదర్శ పాఠశాలల కార్యక్రమం కింద జిల్లాలో 591 పాఠశాలల్లో విద్యుత్ సరఫరా, త్రాగునీరు, చిన్న, పెద్ద మరమ్మతులు, టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా ఉండాలనే లక్ష్యంతో రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి కోసం ఆర్థికంగా బలపరుస్తూ రైతుల సమస్యలను పరిష్కరించడానికి రైతు వేదికల నుండి వీడియో కాన్ఫరెన్స్ 
ద్వారా రైతులు నేరుగా రాష్ట్ర అధికారులతో మరియు వ్యవసాయ నిపుణులతో మాట్లాడే అవకాశం కల్పించామని తెలీపారు. 

యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి జిల్లాలో అవసరమైన శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. శాంతి భద్రతలకు కృషి చేస్తున్న గౌరవ జిల్లా న్యాయమూర్తులకు, జిల్లా ఎస్.పి మరియు పోలిస్ యంత్రాంగానికి, జగిత్యాల జిల్లా ప్రజలకు, రాష్ట్ర సాధనలో భాగస్వామ్యమైన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, మేధావులు, కవులు, కళాకారులు, విద్యార్థులు, యువత, మహిళలు మరియు జర్నలిస్టులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వివిధ వర్గాల వారికి మరోసారి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ నా హృదయపూర్వక శుభాకాంక్షలు చెబుతూ, అభినందనలు తెలిపారు.

Tags
Join WhatsApp

More News...

అర్చకుల పట్ల అమర్యాద సరికాదు – ఈవోపై చర్యలు తీసుకోవాలి

అర్చకుల పట్ల అమర్యాద సరికాదు – ఈవోపై చర్యలు తీసుకోవాలి జగిత్యాల, జనవరి 25 (ప్రజా మంటలు): హిందూ మతానికి మూల స్తంభాలుగా, భక్తునికి భగవంతునికి మధ్య వారధులుగా అర్చకులు ఉంటారని భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ ఏసీఎస్ రాజు అన్నారు. జగిత్యాలలోని భారత్ సురక్ష సమితి కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో సామాజిక సమరసతా వేదిక...
Read More...
National  Comment  International  

జింబాబ్వేలో భూస్వాధీనాల బాధిత తెల్లజాతి రైతులు: పరిహారం కోసం అమెరికా జోక్యం కోరుతున్నారా?

జింబాబ్వేలో భూస్వాధీనాల బాధిత తెల్లజాతి రైతులు: పరిహారం కోసం అమెరికా జోక్యం కోరుతున్నారా? జింబాబ్వేలో 2000వ దశకంలో అప్పటి ప్రభుత్వం చేపట్టిన హింసాత్మక భూస్వాధీన విధానాల వల్ల వేలాది మంది తెల్లజాతి రైతులు తమ భూములు, ఉపాధి కోల్పోయారు. ఈ రైతులకు పరిహారం చెల్లిస్తామని జింబాబ్వే ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటికీ పూర్తి స్థాయిలో చెల్లింపులు జరగలేదు. ఈ నేపథ్యంలో, బాధిత రైతులు ఇప్పుడు అమెరికా ప్రభుత్వ జోక్యాన్ని కోరుతున్నారు....
Read More...

ట్రంప్ ఆస్తులపై న్యూయార్క్ కోర్టు జప్తు చర్యలు

ట్రంప్ ఆస్తులపై న్యూయార్క్ కోర్టు జప్తు చర్యలు న్యూయార్క్ జనవరి 25: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ఆస్తులను న్యూయార్క్ కోర్టు జప్తు చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. ట్రంప్ సంస్థలపై నమోదైన భారీ ఆర్థిక మోసం కేసులో కోర్టు పెద్ద మొత్తంలో జరిమానా విధించింది. అధికారంలో ఉన్న దేశాధ్యక్షుని ఆస్తులు జప్తు చేయాలని కోర్ట్ ప్రకటించడం అమెరికా చరిత్రలోనే...
Read More...
National  State News 

మామల్లపురంలో విజయ్ పార్టీ కార్యకర్తల సమావేశం

మామల్లపురంలో విజయ్ పార్టీ కార్యకర్తల సమావేశం చెన్నై / మామల్లపురం జనవరి 25: తమిళనాడులోని మామల్లపురం (మహాబలిపురం)లో నిర్వహిస్తున్న తన పార్టీ కార్యకర్తల సమావేశంలో సినీ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ పాల్గొంటున్నారు. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణతో పాటు రాబోయే ఎన్నికల వ్యూహాలపై విస్తృతంగా చర్చ జరగనుంది. తాజాగా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన విజయ్, పార్టీని రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేయడంపై...
Read More...
National  State News 

జాగ్రత్త! వందేమాతరం గౌరవంలో చిన్న తప్పుకు కూడా భారీ మూల్యం చెల్లించాలి

జాగ్రత్త! వందేమాతరం గౌరవంలో చిన్న తప్పుకు కూడా భారీ మూల్యం చెల్లించాలి న్యూఢిల్లీ జనవరి 25 (ప్రజా మంటలు): భారతదేశంలో త్వరలోనే **జాతీయ గీతం ‘వందేమాతరం’**కు సంబంధించిన నియమాలు మారే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు జన గణ మన (జాతీయ గీతం) సమయంలో మాత్రమే కఠిన ప్రోటోకాల్‌, చట్టపరమైన బాధ్యతలు ఉండేవి. అయితే ఇకపై కేంద్ర ప్రభుత్వం వందేమాతరానికి కూడా అదే స్థాయి గౌరవం, చట్టబద్ధత కల్పించేందుకు సిద్ధమవుతున్నట్లు...
Read More...
Crime  State News 

నిజామాబాద్‌లో గంజాయి ముఠా దాడి: మహిళా కానిస్టేబుల్ సౌమ్య పరిస్థితి విషమం

నిజామాబాద్‌లో గంజాయి ముఠా దాడి: మహిళా కానిస్టేబుల్ సౌమ్య పరిస్థితి విషమం నిజామాబాద్, జనవరి 25 (ప్రజా మంటలు): నిజామాబాద్ జిల్లాలో గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నంలో మహిళా కానిస్టేబుల్ సౌమ్యపై గంజాయి ముఠా దారుణంగా దాడి చేసింది. కారులో గంజాయి తరలిస్తున్న ముఠాను ఆపేందుకు ప్రయత్నించిన సమయంలో నిందితులు సౌమ్యను ఢీకొట్టి, ఆమె కడుపు మీద నుంచి కారు నడిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో...
Read More...

పాశ్చాత్య ప్రభావంతో  లివ్-ఇన్ సంబంధాలు : విఫలం తర్వాత కేసులు

పాశ్చాత్య ప్రభావంతో  లివ్-ఇన్ సంబంధాలు : విఫలం తర్వాత కేసులు అలహాబాద్, జనవరి 24 ప్రత్యేక ప్రతినిధి):పాశ్చాత్య ఆలోచనల ప్రభావంతో యువత వివాహం లేకుండా లివ్-ఇన్ సంబంధాల్లోకి వెళ్తోందని, అలాంటి సంబంధాలు విఫలమైన తర్వాత అత్యాచారం వంటి కేసులు నమోదు అవుతున్నాయని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 'లైవ్ లా' లో ప్రచురించిన కథనం ప్రకారం, మహిళలకు అనుకూలంగా ఉన్న చట్టాల ఆధారంగా...
Read More...
National  State News 

డీఎంకే వైపు ఏఐఏడీఎంకే నేతల వలస

డీఎంకే వైపు ఏఐఏడీఎంకే నేతల వలస తమిళనాడులోని ముఖ్యమైన పార్టీల గుర్తులు చెన్నై, జనవరి 24 (ప్రత్యేక ప్రతినిధి): తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే వైపు ఏఐఏడీఎంకేకు చెందిన పలువురు మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చేరుతున్నారు. గత ఆరు నెలల్లో మాజీ మంత్రి–ఎంపీ అన్వర్ రాజా, మాజీ ఎంపీ వి. మైత్రేయన్, మాజీ ఎమ్మెల్యే కార్తిక్ తొండైమాన్ సహా,...
Read More...
National  International  

జపాన్‌లో ఎన్నిక‌ల సమరానికి సానే తకైచి పాంక్నిర్ణయం

జపాన్‌లో ఎన్నిక‌ల సమరానికి సానే తకైచి పాంక్నిర్ణయం టోక్యో జనవరి 24: జపాన్ అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP) నాయకురాలు మరియు 104వ ప్రధాన మంత్రి సానే తకైచి, గత అక్టోబర్‌లో పదవీ స్వీకరించినప్పటికీ, పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయం మేరకు ఫిబ్రవరి 8, 2026న దేశవ్యాప్త సాధారణ ఎన్నికలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. తకైచి...
Read More...

అంతర్జాతీయ భ్రూణ హత్యల నివారణ దినోత్సవ కరపత్ర ఆవిష్కరణ

అంతర్జాతీయ భ్రూణ హత్యల నివారణ దినోత్సవ కరపత్ర ఆవిష్కరణ   జగిత్యాల జనవరి 24 (ప్రజా మంటలు)అంతర్జాతీయ భృణహత్యల నివారణ దినోత్సవం పురస్కరించుకొని పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం రూపొందించిన, కరపత్రాలను,  ప్రముఖ పౌరాణిక పండితులు బుర్రా భాస్కర శర్మ, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత, జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ ఎన్.శ్రీనివాస్, ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బుర్రా భాస్కర శర్మ మాట్లాడుతూ          పురి...
Read More...
Local News  State News 

జీవన్ రెడ్డి మీద ఉన్న ప్రేమ బిజెపి కార్యకర్తలపై లేదా..? ఎంపీ అరవింద్ ఒంటెద్దు పోకడలు మానుకోవాలి.

జీవన్ రెడ్డి మీద ఉన్న ప్రేమ బిజెపి కార్యకర్తలపై లేదా..?  ఎంపీ అరవింద్ ఒంటెద్దు పోకడలు మానుకోవాలి. జగిత్యాల, జనవరి 24 (ప్రజా మంటలు) 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ లో పని చేసిన జీవన్ రెడ్డిని కాంగ్రెస్ నాయకత్వం ఇబ్బంది పెట్టడం తనకు బాధ కలిగిస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించడాన్ని జగిత్యాల బిజెపి సీనియర్ నేతలు తీవ్రంగా ఖండించారు. శనివారం బిజెపి సీనియర్ నేతలు సీపెళ్లి రవీందర్, అంకార్ సుధాకర్,...
Read More...
State News 

టీ-హబ్‌ స్టార్టప్‌ల కేంద్రంగానే కొనసాగాలి: సీఎం రేవంత్ రెడ్డి

టీ-హబ్‌ స్టార్టప్‌ల కేంద్రంగానే కొనసాగాలి: సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, జనవరి 24 (ప్రజా మంటలు): టీ-హబ్‌ను పూర్తిగా స్టార్టప్‌ల కేంద్రంగా మాత్రమే కొనసాగించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను టీ-హబ్‌కు మార్చనున్నారన్న వార్తలపై సీఎం వెంటనే స్పందించారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో ఫోన్‌లో మాట్లాడి స్పష్టమైన ఆదేశాలు...
Read More...