తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ అమర వీరుల త్యాగఫలం   - జిల్లా కలెక్టర్ యస్మిన్ భాష  

On
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ అమర వీరుల త్యాగఫలం   - జిల్లా కలెక్టర్ యస్మిన్ భాష  

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ అమర వీరుల త్యాగఫలం    జగిత్యాలలో ఘనంగా రాష్ట్రావిర్భవ వేడుకలు జిల్లా కలెక్టర్ యస్మిన్ భాష  

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ అమర వీరుల త్యాగఫలం 

 - జగిత్యాలలో ఘనంగా రాష్ట్రావిర్భవ వేడుకలు

- జిల్లా కలెక్టర్ యస్మిన్ భాష  

జగిత్యాల జూన్ 02  : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటితో పదేండ్లు నిండాయి. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసువులు బాసిన అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పిస్స్తూ, ఎందరెందరో అమర వీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈ రోజు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తుందని, ఈ సందర్భంగా అమరుల కుటుంబాలకు, ఉద్యమ కారులకు, స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాలుపంచుకున్న చిన్నా పెద్దలందరికీ.. పేరుపేరునా నమస్కారాలు తెలుపుకొంటున్నాని జిల్లా కలెక్టర్ యస్మిన్ భాష అన్నారు. 

ఇంకా, తెలంగాణ రాష్ట్రం గొప్ప చరిత్ర, సాంప్రదాయ కళలు మరియు విభిన్నమైన వంటకాలకు ప్రసిద్ధి చెందింది.తెలంగాణలో అనేక చారిత్రక ప్రదేశాలు మరియు స్మారక చిహ్నాలు కూడా ఎన్నో ఉన్నాయి. 
తెలంగాణలో విభిన్న జనాభా కలిగియుండి, వివిధ వర్గాలు మరియు వివిధ ప్రాంతాల ప్రజలు సామరస్యంతో జీవిస్తున్నరాణి, తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా, రాష్ట్ర గొప్పతనం, వారసత్వం, చరిత్ర మరియు రాష్ట్ర గుర్తింపును జరుపుకోవడానికి, రాష్ట్రవ్యాప్తంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామనీ కలెక్టర్ యస్మిన్ భాషా అన్నారు. 
కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రతివారంలో రెండు రోజులు ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారులకు చెప్పుకునే అవకాశం కల్పించామని, వచ్చిన ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి, సంబంధిత అధికారులకు పంపించి, సత్వర పరిష్కారం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నామనీ, మహిళల సంక్షేమం మరియు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి పరచడానికి పెద్దపీట వేసి వారిని ముందుకు తీసుకువెళ్తున్నామని, ఈ కార్యక్రమంలో భాగంగా 1,22,000 పిల్లల ఏకరూప దుస్తులు కుట్టించే పనులను స్వయం సహాయక గ్రూప్  మహిళలకు అందజేస్తూ, మహిళా స్వశక్తికరణకు బాటలు వేస్తున్నామని తెలిపారు. 

ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. అన్ని పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. జూన్ లో పాఠశాలల ప్రారంభానికి ముందే జిల్లాలో నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, యునిఫార్మ్ పంపిణి చేయడం జరుగుతుంది. పాఠశాలల్లో అవసరమైన పనులన్నీ గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా అమ్మ ఆదర్శ పాఠశాలల కార్యక్రమం కింద జిల్లాలో 591 పాఠశాలల్లో విద్యుత్ సరఫరా, త్రాగునీరు, చిన్న, పెద్ద మరమ్మతులు, టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా ఉండాలనే లక్ష్యంతో రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి కోసం ఆర్థికంగా బలపరుస్తూ రైతుల సమస్యలను పరిష్కరించడానికి రైతు వేదికల నుండి వీడియో కాన్ఫరెన్స్ 
ద్వారా రైతులు నేరుగా రాష్ట్ర అధికారులతో మరియు వ్యవసాయ నిపుణులతో మాట్లాడే అవకాశం కల్పించామని తెలీపారు. 

యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి జిల్లాలో అవసరమైన శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. శాంతి భద్రతలకు కృషి చేస్తున్న గౌరవ జిల్లా న్యాయమూర్తులకు, జిల్లా ఎస్.పి మరియు పోలిస్ యంత్రాంగానికి, జగిత్యాల జిల్లా ప్రజలకు, రాష్ట్ర సాధనలో భాగస్వామ్యమైన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, మేధావులు, కవులు, కళాకారులు, విద్యార్థులు, యువత, మహిళలు మరియు జర్నలిస్టులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వివిధ వర్గాల వారికి మరోసారి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ నా హృదయపూర్వక శుభాకాంక్షలు చెబుతూ, అభినందనలు తెలిపారు.

Tags
Join WhatsApp

More News...

Today's Cartoon  State News 

Today's Cartoon

Today's Cartoon
Read More...
Local News 

TDF-USA అట్లాంటా సహకారంతో పరమల ప్రభుత్వ స్కూల్ భవనం ప్రారంభం

TDF-USA అట్లాంటా సహకారంతో పరమల ప్రభుత్వ స్కూల్ భవనం ప్రారంభం సికింద్రాబాద్, డిసెంబర్ 21 (ప్రజా మంటలు): తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (TDF) యూఎస్ఏ అట్లాంటా చాప్టర్ సౌజన్యంతో కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం పరమల గ్రామంలో నూతన ప్రభుత్వ పాఠశాల భవనం, అదనపు క్లాస్‌రూమ్స్‌ను ప్రారంభించారు. టిడిఎఫ్–మన తెలంగాణ బడి ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అందించిన ఆర్థిక సహాయంతో ఈ నిర్మాణాలు పూర్తయ్యాయి....
Read More...
Local News  State News 

గద్వాల జిల్లా ప్రజల సమస్యలపై కవిత ఘాటు ప్రశ్నలు

గద్వాల జిల్లా ప్రజల సమస్యలపై కవిత ఘాటు ప్రశ్నలు జోగులాంబ గద్వాల జిల్లా డిసెంబర్ 21(ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన జనం బాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు గద్వాల జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. బీచుపల్లి బ్రిడ్జి వద్ద జాగృతి నాయకులు, నడిగడ్డ హక్కుల పోరాట సమితి నేతలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం బీచుపల్లి...
Read More...
Local News 

తిమ్మాపూర్ జడ్పీ హైస్కూల్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

తిమ్మాపూర్ జడ్పీ హైస్కూల్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన ధర్మపురి డిసెంబర్ 21 (ప్రజా మంటలు): ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాధవరం కృష్ణారావు – ఆండాళ్ దేవి ల జ్ఞాపకార్థం వారి కుమారుడు మాధవరం విష్ణు ప్రకాశరావు (అమెరికన్ తెలుగు అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు) ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలలో...
Read More...
Local News 

గాంధీ పేరు మార్పుపై కాంగ్రెస్‌ నిరసనలు అర్థరహితం : బీజేపీ నేత  రాజేశ్వరి

గాంధీ పేరు మార్పుపై కాంగ్రెస్‌ నిరసనలు అర్థరహితం : బీజేపీ నేత  రాజేశ్వరి సికింద్రాబాద్, డిసెంబర్ 21 (ప్రజామంటలు): ఉపాధి హామీ పథకం పేరు మార్పును రాజకీయంగా మలిచి కాంగ్రెస్‌ నాయకులు చేస్తున్న నిరసనలు అర్థరహితమని బీజేపీ ఓబీసీ మోర్చా రజక సెల్‌ రాష్ట్ర కన్వీనర్‌ మల్లేశ్వరపు రాజేశ్వరి అన్నారు. ఆమె ఆదివారం సికింద్రాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ..పథకం పేరు మారిందని గాంధీని అవమానించారంటూ చేస్తున్న ఆరోపణలు సిగ్గుచేటన్నారు. ఉపాధి...
Read More...
Local News 

నిరాశ్రయులకు స్కై ఫౌండేషన్ వారిచే దుస్తులు పంపిణి

నిరాశ్రయులకు స్కై ఫౌండేషన్ వారిచే దుస్తులు పంపిణి సికింద్రాబాద్,  డిసెంబర్ 21 (ప్రజా మంటలు): హైదరాబాద్ నగరంలో రోడ్ల పక్కన ఫుట్ పాత్ ల మీద జీవనం  సాగిస్తున్న నిరాశ్రయులు, సంచారజాతుల కుటుంబాలకు స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుస్తులు కార్యక్రమము  నిర్వహించారు.   సామాజిక బాధ్యతతో నిరంతరం విభిన్న సేవ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. దుస్తులు అందుకున్న  నిరాశ్రయులు, సంచారజాతులవారు స్కై ఫౌండేషన్ కి కృతఙ్ఞతలు
Read More...
Local News 

ఎల్కతుర్తి మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా పుల్లూరి శ్రీధర్ రావు ఏకగ్రీవ ఎన్నిక 

ఎల్కతుర్తి మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా పుల్లూరి శ్రీధర్ రావు ఏకగ్రీవ ఎన్నిక  ఎల్కతుర్తి డిసెంబర్ 21 ప్రజా మంటలు  ఎల్కతుర్తి మండలంలోని నూతన సర్పంచుల ఐక్యతకు ప్రతీకగా సర్పంచ్ ల ఫోరం కమిటీని ఏర్పాటు చేయగా ఆ కమిటీ అధ్యక్షుడిగా వీరనారాయణపూర్ గ్రామానికి చెందిన పుల్లూరి శ్రీధర్ రావును సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎల్కతుర్తి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ భవన్ లో నిర్వహించిన సమావేశానికి, కాంగ్రెస్...
Read More...

యాక్సిడెంట్ కు గురైన వ్యక్తిని సిపిఆర్ చేసి ఆసుపత్రికి తరలించిన పోలీసులు

యాక్సిడెంట్ కు గురైన వ్యక్తిని సిపిఆర్ చేసి ఆసుపత్రికి తరలించిన పోలీసులు జగిత్యాల డిసెంబర్ 21 (ప్రజా మంటలు)  జిల్లా కేంద్రంలోని న్యూ బస్టాండ్ చౌరస్తా వద్ద ఆగి ఉన్న ఆటోకు TVS XL అనే టూ వీలర్ పైన వస్తున్నటువంటి వ్యక్తి ఆదివారం సాయంత్రం యాక్సిడెంట్ గురి కాగా అక్కడే డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీసులు యాక్సిడెంట్స్ ని గమనించి  అక్కడే డ్యూటీలో ఉన్న ట్రాఫిక్
Read More...

జిల్లా కోర్ట్ లో జాతీయ లోక్ ఆదాలత్,  అందరి సహకారంతోనే సత్ఫలితాలు : జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి

జిల్లా కోర్ట్ లో జాతీయ లోక్ ఆదాలత్,  అందరి సహకారంతోనే సత్ఫలితాలు : జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి జగిత్యాల డిసెంబర్ 21 (ప్రజా మంటలు)రాజీ మార్గమే రాజ మార్గమని, పంతాలకు పట్టింపులకు పోయి సమయం, డబ్బు వృదా చేసుకొవద్దనీ, ఆదివారంనాటి జాతీయ లోక్ ఆదాలత్ ను  సద్వినియోగం చేసుకుని, రాజీ కుదుర్చుకోవాలని తాము ఇచ్చిన పిలుపుమేరకు ఆదివారం ఉదయం 10-30 నుండి సాయంత్రం వరకు జిల్లా కోర్ట్ లో నిర్వహిస్తున్నజాతీయ లోక్...
Read More...

విద్యారంగం బలోపేతానికి ప్రజా ప్రభుత్వం కృషి  — టీఆర్టీఎఫ్ విద్యా సదస్సులో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

విద్యారంగం బలోపేతానికి ప్రజా ప్రభుత్వం కృషి  — టీఆర్టీఎఫ్ విద్యా సదస్సులో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైదరాబాద్ డిసెంబర్ 21 (ప్రజా మంటలు):   విద్యారంగం బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖామాత్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్ నాగోల్ లో తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్)  ఏర్పాటై ఎనిమిది దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్,...
Read More...
National  State News 

నదీ జలాల కోసం మరో ఉద్యమం అవసరం – పాలమూరు ద్రోహాన్ని మరచిపోం: కేసీఆర్

నదీ జలాల కోసం మరో ఉద్యమం అవసరం – పాలమూరు ద్రోహాన్ని మరచిపోం: కేసీఆర్ హైదరాబాద్, డిసెంబరు 21 (ప్రజా మంటలు ప్రత్యేక ప్రతినిధి): సమైక్యాంధ్ర పాలనలో మహబూబ్‌నగర్ జిల్లా తీవ్ర వివక్షకు గురైందని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పాలమూరు ప్రయోజనాలను కాలరాశాయని ఆయన ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నేతలతో నిర్వహించిన విస్తృత...
Read More...
Local News 

అక్రమ నిర్మాణాలు చేపట్టలేదు - న్యూ బోయిగూడ బస్తీవాసులు

అక్రమ నిర్మాణాలు చేపట్టలేదు - న్యూ బోయిగూడ బస్తీవాసులు సికింద్రాబాద్, డిసెంబర్ 21 (ప్రజామంటలు): జీహెచ్ఎమ్సీ బేగంపేట సర్కిల్–30 పరిధిలోని బన్సీలాల్ పేట డివిజన్ న్యూబోయిగూడలోని ఉప్పలమ్మ దేవాలయం పక్కన ఉన్న ప్రభుత్వ రహదారిపై ఎలాంటి అక్రమ నిర్మాణాలు జరగడం లేదని పలువురు బస్తీవాసులు పేర్కొన్నారు. 6-–5-–144 నంబర్ గల ఇంటి రెనోవేషన్ పనులు పూర్తిగా రిజిస్ట్రేషన్ పట్టా ఉన్న స్థల పరిధిలోనే జరుగుతున్నాయని జీబీ...
Read More...