తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ అమర వీరుల త్యాగఫలం - జిల్లా కలెక్టర్ యస్మిన్ భాష
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ అమర వీరుల త్యాగఫలం జగిత్యాలలో ఘనంగా రాష్ట్రావిర్భవ వేడుకలు జిల్లా కలెక్టర్ యస్మిన్ భాష
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ అమర వీరుల త్యాగఫలం
- జగిత్యాలలో ఘనంగా రాష్ట్రావిర్భవ వేడుకలు
- జిల్లా కలెక్టర్ యస్మిన్ భాష
జగిత్యాల జూన్ 02 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటితో పదేండ్లు నిండాయి. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసువులు బాసిన అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పిస్స్తూ, ఎందరెందరో అమర వీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈ రోజు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తుందని, ఈ సందర్భంగా అమరుల కుటుంబాలకు, ఉద్యమ కారులకు, స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాలుపంచుకున్న చిన్నా పెద్దలందరికీ.. పేరుపేరునా నమస్కారాలు తెలుపుకొంటున్నాని జిల్లా కలెక్టర్ యస్మిన్ భాష అన్నారు.
ఇంకా, తెలంగాణ రాష్ట్రం గొప్ప చరిత్ర, సాంప్రదాయ కళలు మరియు విభిన్నమైన వంటకాలకు ప్రసిద్ధి చెందింది.తెలంగాణలో అనేక చారిత్రక ప్రదేశాలు మరియు స్మారక చిహ్నాలు కూడా ఎన్నో ఉన్నాయి.
తెలంగాణలో విభిన్న జనాభా కలిగియుండి, వివిధ వర్గాలు మరియు వివిధ ప్రాంతాల ప్రజలు సామరస్యంతో జీవిస్తున్నరాణి, తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా, రాష్ట్ర గొప్పతనం, వారసత్వం, చరిత్ర మరియు రాష్ట్ర గుర్తింపును జరుపుకోవడానికి, రాష్ట్రవ్యాప్తంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామనీ కలెక్టర్ యస్మిన్ భాషా అన్నారు.
కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రతివారంలో రెండు రోజులు ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారులకు చెప్పుకునే అవకాశం కల్పించామని, వచ్చిన ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి, సంబంధిత అధికారులకు పంపించి, సత్వర పరిష్కారం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నామనీ, మహిళల సంక్షేమం మరియు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి పరచడానికి పెద్దపీట వేసి వారిని ముందుకు తీసుకువెళ్తున్నామని, ఈ కార్యక్రమంలో భాగంగా 1,22,000 పిల్లల ఏకరూప దుస్తులు కుట్టించే పనులను స్వయం సహాయక గ్రూప్ మహిళలకు అందజేస్తూ, మహిళా స్వశక్తికరణకు బాటలు వేస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. అన్ని పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. జూన్ లో పాఠశాలల ప్రారంభానికి ముందే జిల్లాలో నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, యునిఫార్మ్ పంపిణి చేయడం జరుగుతుంది. పాఠశాలల్లో అవసరమైన పనులన్నీ గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా అమ్మ ఆదర్శ పాఠశాలల కార్యక్రమం కింద జిల్లాలో 591 పాఠశాలల్లో విద్యుత్ సరఫరా, త్రాగునీరు, చిన్న, పెద్ద మరమ్మతులు, టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా ఉండాలనే లక్ష్యంతో రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి కోసం ఆర్థికంగా బలపరుస్తూ రైతుల సమస్యలను పరిష్కరించడానికి రైతు వేదికల నుండి వీడియో కాన్ఫరెన్స్
ద్వారా రైతులు నేరుగా రాష్ట్ర అధికారులతో మరియు వ్యవసాయ నిపుణులతో మాట్లాడే అవకాశం కల్పించామని తెలీపారు.
యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి జిల్లాలో అవసరమైన శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. శాంతి భద్రతలకు కృషి చేస్తున్న గౌరవ జిల్లా న్యాయమూర్తులకు, జిల్లా ఎస్.పి మరియు పోలిస్ యంత్రాంగానికి, జగిత్యాల జిల్లా ప్రజలకు, రాష్ట్ర సాధనలో భాగస్వామ్యమైన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, మేధావులు, కవులు, కళాకారులు, విద్యార్థులు, యువత, మహిళలు మరియు జర్నలిస్టులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వివిధ వర్గాల వారికి మరోసారి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ నా హృదయపూర్వక శుభాకాంక్షలు చెబుతూ, అభినందనలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
తొలగించిన IAS పూజా ఖేడ్కర్ తల్లిదండ్రులు సహా ఐదుగురు అచేతనం
పుణే, జనవరి 11:పదవి నుంచి తొలగించబడిన IAS ట్రైనీ అధికారి పూజా ఖేడ్కర్ తల్లిదండ్రులు సహా మరో ముగ్గురు పుణేలోని వారి బంగ్లాలో అచేతన స్థితిలో కనిపించడం కలకలం రేపింది. బానెర్–ఆంధ్ ప్రాంతంలోని నివాసంలో జరిగిన ఈ ఘటనలో నిద్ర మందులు కలిపి వారిని అచేతనం చేసి దొంగతనం చేసినట్లు అనుమానం వ్యక్తమవుతోంది.
సమాచారం... ఇరాన్ లో ఇంటర్నెట్ సేవలు బంద్: ప్రపంచంతో తెగిన సంబంధాలు
టెహ్రాన్ జనవరి 11:
నిరసనలు తీవ్రమవుతున్న తరుణంలో, ఇరాన్ ప్రపంచంతో సంబంధాలను తెంచుకుంది.ఆర్థిక వ్యవస్థపై నిరసనలు వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇరాన్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి.
ఇరాన్లో ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రారంభమైన నిరసనలు నేషన్లవైడ్ స్థాయిలో విస్తరుతూ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను సృష్టిస్తున్నాయి. ప్రభుత్వం ఇంటర్నెట్, టెలిఫోన్ నెట్వర్క్లను పూర్తిగా నిలిపివేయడం వంటి చర్యలు... వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమాల్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
జగిత్యాల, జనవరి 11 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రంలో వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ వేర్వేరు ప్రాంతాల్లో పాల్గొన్నారు.
గోవింద్పల్లె సమీపంలో నిర్వహించిన జయంతి ఉత్సవాల్లో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ, వడ్డే... మంత్రి వాకిటి శ్రీహరి తో ముదిరాజ్ నేత భేటి
సికింద్రాబాద్, జనవరి 11 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్ ను ఆదివారం జాతీయ ముదిరాజ్ సమాజ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పొట్లకాయల వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ముదిరాజ్ రిజర్వేషన్ల అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని మంత్రి కి విజ్ఞప్తి చేశారు. అలాగే మంత్రి... జగిత్యాల మున్నూరు కాపు వర్తక–వ్యాపార సంఘం 2026 క్యాలెండర్ ఆవిష్కరణ
వేములవాడ, జనవరి 11 (ప్రజా మంటలు):
జగిత్యాల మున్నూరు కాపు వర్తక–వ్యాపార సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2026 సంవత్సర క్యాలెండర్ను వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ శ్రీ ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ మున్నూరు కాపు కులబాంధవులందరికీ నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంఘం అభివృద్ధికి... మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి –కార్యకర్తలకు ఎమ్మెల్యే సంజయ్ పిలుపు
రాయికల్, జనవరి 12 (ప్రజా మంటలు):
రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. రాయికల్ పట్టణంలోని ప్రగతి స్కూల్లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే... ఓసి జేఏసీ సింహ గర్జనకు తరలి వెళ్లిన జగిత్యాల ఓసి జేఏసీ నాయకులు
జగిత్యాల జనవరి 11 (ప్రజా మంటలు)
ఓసి ల సింహ గర్జన సభ సక్సెస్ కోసం జగిత్యాల నుండి ఓసి జెఏసి సభ్యులు ప్రత్యేక వాహనంలపై తరలి వెళ్లారు
ఓసి ఐకాస రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, ఓసి జేఏసీ జగిత్యాల జిల్లా కో ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ మహంకాళి రాజన్న కో కన్వీనర్... ఒకినోవా స్కూల్లో కరాటే బెల్టుల ప్రధానం
జగిత్యాల జనవరి 11 ( ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం ఒకేనోవా స్కూల్ ఆఫ్ కరాటే స్కూల్లో బెల్టుల ప్రధానం జరిగింది. అంతకుముందు కరాటే శిక్షణార్థులు తమ పర్ఫార్మెన్స్ చూపించారు. అనంతరం బెల్టుల ప్రధానం చేశారు. మాస్టర్ మర్రిపల్లి లింగయ్య, ఇన్స్ట్రక్టర్ తిరుమల నరేష్ కరాటే శిక్షణార్థులు పాల్గొన్నారు. గుండె జబ్బుల నివారణను మిషన్గా తీసుకుందాం : సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, జనవరి 11 (ప్రజా మంటలు):
గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో వాటి నివారణను ఒక మిషన్గా తీసుకొని ప్రభుత్వం, వైద్యులు, సమాజం అంతా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. విద్యార్థులకు సీపీఆర్ (Cardiopulmonary Resuscitation) శిక్షణ ఇవ్వడానికి కార్డియాలజిస్టులు స్వచ్ఛందంగా ముందుకు వస్తే దేశవ్యాప్తంగా... అఖిల బ్రాహ్మణ సేవా సంఘ నూతన సంవత్సర కాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల జనవరి 10 (ప్రజా మంటలు)జగిత్యాల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన సంవత్సరం సంబంధించిన క్యాలెండర్ను జగిత్యాల శాసనసభ్యులు దా సంజయ్ కుమార్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గాజంగి నందయ్య మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ తో కలిసి ఆవిష్కరించారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్... AIADMK–BJP కూటమిలో AMMK చేరికపై ఊహాగానాలు.
అమిత్ షా ఫోన్ కాల్ తర్వాత మారిన దినకరన్ వ్యూహం!
చెన్నై, జనవరి 11 (ప్రజా మంటలు):
తంజావూరులో జనవరి 5న జరిగిన AMMK జనరల్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం అనంతరం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపింది. AMMK ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ప్రసంగం మధ్యలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా... టీపీసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణకు కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణుల ఘన స్వాగతం
కరీంనగర్, జనవరి 10 (ప్రజా మంటలు):
టీపీసీసీ ఎస్సీ విభాగం చైర్మన్గా నియమితులైన మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తొలిసారిగా కరీంనగర్ జిల్లాకు విచ్చేయగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
జిల్లా సరిహద్దు బెజ్జంకి నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహిస్తూ నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కరీంనగర్... 