గండి హన్మాండ్లు, ఓబులపూర్ చెక్ పోస్టులను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు ఎస్పీ వినోద్ కుమార్.
(సిరిసిల్ల.రాజేంద్ర శర్మ ౼9348422113)
జగిత్యాల ఏప్రిల్ 20 ( ప్రజా మంటలు )
ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని గండి హన్మడ్లు, ఓబులపూర్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను అదనపు ఎస్పీ గారు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ ..
ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు చెక్పోస్టులు కీలకపాత్ర నిర్వహించాలని అన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన అంతర్జిల్లా బోర్డర్ చెక్లను పకడ్బందీగా 24x7 వాహన తనిఖీలు చేసి జిల్లా లోనికి అక్రమ మార్గంలో ఎటువంటి మద్యం, డబ్బు, ప్రజల ప్రలోభ పెట్టే వస్తువులను జిల్లాకు రాకుండా వివిధ శాఖల సమన్వయంతో 24 గంటల పర్యవేక్షణలో చెక్ పోస్టులను నమోదు చేసినట్లు తెలిపారు.
అనంతరం వాహన తనిఖీలు చేసిన వాహన రిజిస్టర్ను పరిశీలించడంతో పాటు, ప్రత్యక్షంగా పోలీసు సిబ్బంది వాహనాల తనిఖీ తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. తనిఖీల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహారించడంతో పాటు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని సిబ్బందికి సూచించారు.