హనుమాన్ చాలీసా పారాయణం లో పాల్గొన్న జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత
On
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)
జగిత్యాల ఏప్రిల్ 16 ( ప్రజా మంటలు )
జిల్లా కేంద్రం లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో గత శనివారం ప్రారంభమైన సామూహిక హనుమాన్ చాలిసా పారాయణం ఈరోజు 4, వ రోజుకు చే రింది. ఉత్సవ మూర్తిని ప్రత్యేకంగా అలంక రించిన వేధిక పై ప్రతిష్టించి అభిషేకం జరిపి, అలంకరణ చేశారు.
కాగా జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత సురేష్ పాల్గొని,హనుమాన్ చాలీసా పారాయణము చేసి, పూజలు చేసారు.
ఈ కార్య క్రమంలో ఆలయ అర్చకులు,అద్యక్షులు, కార్య వర్గము, భక్తులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారని, మీడియా ప్రతినిది తవుటు రామచంద్రం తెలిపారు.
Tags