మళ్లీ అమ్మాయి పుట్టిందని తుప్పల్లో పడేసిన తల్లి క్షేమంగా బయటపడ్డ పసికందు

On
మళ్లీ అమ్మాయి పుట్టిందని తుప్పల్లో పడేసిన తల్లి  క్షేమంగా బయటపడ్డ పసికందు

మళ్లీ అమ్మాయి పుట్టిందని తుప్పల్లో పడేసిన తల్లి

క్షేమంగా బయటపడ్డ పసికందు

 

రాజమండ్రి ఏప్రిల్‌ 15 (ప్రజామంటలు): మగ సంతానం పై ఉన్న మమకారం ఓ తల్లిని మానవత్వం లేకుండా చేసింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన అప్పుడే పుట్టిన పసికందును ఇరవై అడుగుల ఎత్తు నుంచి తుప్పల్లోకి విసిరేసింది. ఆ తర్వాత తప్పు తెలుసుకుని కన్నీరు మున్నేరుగా విలపిస్తుంది. ఈ హృదయ విధారకరమైన సంఘటన తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో చోటుచేసుకుంది. ఇటువంటి సంఘటన గతంలో ఎక్కడ ఎప్పుడు జరిగి ఉండకపోవచ్చు. స్థానికులు, బంధువులు, వైద్యులు తెలిపిన ఈ సంఘటన వివరాలు ఎలా ఉన్నాయి.

        వేమగిరి గణపతినగరం ప్రాంతానికి చెందిన తాపీ పనులు చేసే కుటుంబంలో వరుసగా ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. వారు ముగ్గురు కూడా ప్రస్తుతం స్కూల్‌ కి వెళ్తున్నారు. అయితే తల్లికి మాత్రం మగసంతానంపై మమకారం వెంటాడుతూనే ఉంది. అందుకనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేసుకున్నట్లు నమ్మించి ఆ తర్వాత గర్భం దాల్చింది. ఈ విషయాన్ని ఎవరికీ తెలియనీయలేదు. అబ్బాయి పుడితే అందరికి చెబుదాం. అమ్మాయి పుడితే ఎవరికి తెలియకుండా మాయం చేద్దామని ఉద్దేశం ఉంది.బంధుమిత్రులకు చుట్టుపక్కల ఎవరికి ఈ విషయం తెలియనివ్వలేదు.  చివరికి భర్తకు కూడా అనుమానం రాకుండా మసులుకుంది. పొట్ట పెరుగుతుందని భర్త అడిగితే ఈ మధ్యన ఎక్కువగా తినడం వల్ల పెరుగుతుందని నమ్మబలికింది. స్థానిక వైద్య సిబ్బందికి,  అంగన్వాడీలకు గర్భిణీ అనే సమాచారాన్ని ఇవ్వలేదు. అందుకు కావలసిన వైద్య సేవలు కూడా పొందలేదు.  ఈ పరిస్థితుల్లో ఆదివారం పురిటి నొప్పులు వచ్చాయి. అది గమనించిన  ఆ తల్లి భర్తను పిల్లలను చర్చకు పంపించింది.తనకు తానే పురుడు పోసుకుంది. అందుబాటులో ఉన్న కత్తిపీటతో ప్రేగును కత్తిరించింది. అమ్మాయి పుట్టిందని గమనించిన వెంటనే ముందుగా అనుకున్న పథకం ప్రకారం నైటిలో ఆ బిడ్డను చుట్టేసి 20 అడుగుల ఎత్తులో నుంచి తుప్పల్లోకి విసిరేసింది. అక్కడ చెత్త చెదరంతో పాటు పందులు సంచరిస్తూ ఉంటాయి.అక్కడ నుంచి ఆమె ఇంటికి వెళ్ళి పోయి స్నానం చేసి ఎవరికి అనుమానం రాకుండా మచులుకుంది.

         అయితే ఆ తుప్పల నుంచి ఏడుపు వినిపిస్తుండటంతో చుట్టుపక్కల వారు అక్కడకి వెళ్ళి చూడగా ముద్దులొలికే పండంటి ఆడశిసువు కనబడిరది. కాలుకి చిన్న రాపిడిగాయం తప్ప అంతా క్షేమంగా ఉంది. అయితే ఆ అమ్మాయి ఎవరనేది అందులోనూ చర్చ మొదలైంది. బయటనుండి ఎవరో అక్కడకు వచ్చి పాడేసే అవకాశం లేనందున అక్కడి వారి పిల్లే అయివుతుందని నిద్దారణకు వచ్చి ఆరా తీయడం మొదలు పెట్టారు.

           ఇంతలో అందరితో పాటు భర్త అక్కడికి వచ్చి చూస్తే ఆ పిల్లకు చుట్టి ఉన్న నైటీ తన భార్యదని గుర్తించాడు.ఆ నైటీ ఆధారంగా ఇంటికెళ్లి భార్యను నిలదీసాడు. దీంతో జరిగిన విషయం ఒప్పుకొని ఆ తల్లి కన్నీరు మున్నీరుగా వెల్లపించడం మొదలుపెట్టింది. మగ సంతానంపై ఉన్న మమకారంతో ఇలా చేశానని గగ్గోలు పెట్టింది.వెంటనే తల్లి బిడ్డను కడియం ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అయితే వారు అక్కడి నుంచి రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం అక్కడ తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు, బంధువులు తెలిపారు. ఈ సంఘటన సోమవారం నుంచి ఈ ప్రాంతంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Tags
Join WhatsApp

More News...

Local News 

ట్రాఫిక్ నిబంధనల పై యమధర్మరాజు అవగాహన : ట్రాఫిక్ పోలీసులతో కలిసిరోడ్డు ప్రమాదాలపై అవేర్నెస్

ట్రాఫిక్ నిబంధనల పై యమధర్మరాజు అవగాహన : ట్రాఫిక్ పోలీసులతో కలిసిరోడ్డు ప్రమాదాలపై అవేర్నెస్ సికింద్రాబాద్, డిసెంబర్ 09 (ప్రజామంటలు) :  రోడ్డు ప్రమాదాల పై అవగాహన కలిగించేందుకు నార్త్ జోన్ ట్రాఫిక్ పోలీసులు వినూత్న రీతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అతివేగం, రాంగ్ పార్కింగ్, సిగ్నల్ జంపింగ్, ట్రిపుల్ రైడింగ్ వల్ల కలిగే రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేకంగా యమధర్మ రాజు వేషదారితో ట్రాఫిక్ కూడళ్ల వద్ద వాహనదారులకు అవగాహన కలిగిస్తున్నారు....
Read More...
Filmi News  State News 

చలనచిత్ర రంగ అభివృద్ధికి పూర్తి సహకారం — సీఎం రేవంత్ రెడ్డి

చలనచిత్ర రంగ అభివృద్ధికి పూర్తి సహకారం — సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ డిసెంబర్ 08 (ప్రజా మంటలు): తెలంగాణలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీలో స్టూడియోలు ఏర్పాటు చేసుకునే వారికి ప్రభుత్వము పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025 రెండో...
Read More...
State News 

రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ

రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ హైదరాబాద్ డిసెంబర్ 09 (ప్రజా మంటలు): భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025 సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను విర్చువల్‌గా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో...
Read More...
Local News 

గాంధీ ఆస్పత్రిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

గాంధీ ఆస్పత్రిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి సికింద్రాబాద్, డిసెంబర్ 09 (ప్రజా మంటలు):  సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీఆస్పత్రిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు.  పోలీసులు తెలిపిన వివరాలు.. గాంధీ ఎమర్జెన్సీ వార్డు వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్న దాదాపు 45-50 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తిని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది ఆసుపత్రిలో అడ్మిట్ చేయించారు. అయితే సదరు...
Read More...
Local News 

పోష్ యాక్ట్–2013పై అవగాహన ర్యాలీ

పోష్ యాక్ట్–2013పై అవగాహన ర్యాలీ సికింద్రాబాద్, డిసెంబర్ 09 (ప్రజామంటలు) : పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణకు కఠినంగా అమలు అవుతున్న పోష్ యాక్ట్–2013 గురించి అవగాహన కల్పించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ హైదరాబాద్ జిల్లా కమిటీ, యాక్షన్ ఎయిడ్, భరోసా సంయుక్తంగా మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించింది. న్యూ బోయిగూడ నుంచి గాంధీ ఆస్పత్రి ఎదురుగా...
Read More...
Local News 

రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను సందర్శించిన అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి.

రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను సందర్శించిన అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి. ఇబ్రహీంపట్నం డిసెంబర్ 9 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):   ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని మోడల్ స్కూల్ నందు గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై  రిసెప్షన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి సందర్శించినారు, మరియు అలాగే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని గండి హనుమాన్ చెక్ పోస్ట్ ని కూడా
Read More...

"అవినీతిని నిర్మూలిద్దాం- దేశాన్ని అభివృద్ధి చేద్దాం’’ 1064 టోల్ ఫ్రీ నెంబర్ తో అవినీతికి అడ్డుకట్ట జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

   జగిత్యాల డిసెంబర్ 9 (ప్రజా మంటలు)అవినీతి నిరోధక వారోత్సవాలు పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ   1064 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయడం ద్వారా అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చని   జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ ఛాంబర్ లో జిల్లా ఎస్పీ అశోక్...
Read More...
Local News 

ఆదం సంతోష్ ఆధ్వర్యంలో ఘనంగా సోనియమ్మ బర్త్ డే సెలబ్రేషన్స్..

ఆదం సంతోష్ ఆధ్వర్యంలో ఘనంగా సోనియమ్మ బర్త్ డే సెలబ్రేషన్స్.. సికింద్రాబాద్, డిసెంబర్ 09 (ప్రజామంటలు): అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన  సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా సికింద్రాబాద్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే, ఇంచార్జీ  అదం సంతోష్ కుమార్ ఆమెకు  హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కేక్‌ కటింగ్‌, పండ్ల పంపిణీ,...
Read More...
Local News 

బన్సీలాల్ పేట లో సోనియమ్మ 79వ జన్మదిన వేడుకలు

బన్సీలాల్ పేట లో సోనియమ్మ 79వ జన్మదిన వేడుకలు సికింద్రాబాద్, డిసెంబర్ 09 (ప్రజామంటలు): సికింద్రాబాద్, బన్సీలాల్‌పేట్ డివిజన్‌లోని జబ్బర్ కాంప్లెక్స్ లో కాంగ్రెస్ పార్లమెంటరీ చైర్‌పర్సన్  సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దీపక్ జాన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డివిజన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఐత చిరంజీవి ఆధ్వర్యంలో పటాకులు కాల్చారు....
Read More...
Local News 

ఎన్నికల కోడ్ నియమాల్లో  ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించుకోవాలి :ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి 

ఎన్నికల కోడ్ నియమాల్లో  ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించుకోవాలి :ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి  (అంకం భూమయ్య) గొల్లపల్లి డిసెంబర్ 09 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉండడంతో నిబంధనలు పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు ఎస్ఐ,కృష్ణ సాగర్ రెడ్డి మళవారం మండలంలోని రాఘవపట్నం ,గుంజపడుగు, వెలుగుమట్ల ,చందోలి, దమ్మన్నపేట  శ్రీరాములపల్లి గ్రామాలలో పర్యటించి ప్రజలకు ఎన్నికలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని అలాగే ఎన్నికల సమయంలో వాట్స్అప్...
Read More...

4,  21 వార్డులలో అభివృద్ధి పనులకు    భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

4,  21 వార్డులలో అభివృద్ధి పనులకు    భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల డిసెంబర్ 9 ( ప్రజా మంటలు) పట్టణ 21వ వార్డులో 15 లక్షలతో సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు భూమిపూజ చేసి,4వ వార్డులో చెరువు కట్ట పోచమ్మ ఆలయం దగ్గర 4 లక్షల తో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ అంతకుముందు వార్డు అభివ్రుద్ది...
Read More...

గండి హనుమాన్ చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన అదనపు ఎస్పీ  శేషాద్రిని రెడ్డి

గండి హనుమాన్ చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన అదనపు ఎస్పీ  శేషాద్రిని రెడ్డి జగిత్యాల డిసెంబర్ 9(ప్రజా మంటలు)సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు అదనపు ఎస్పీ శ్రీ శేషాద్రిని రెడ్డి  తెలిపారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా బార్డర్ వద్ద ఏర్పాటు చేసిన గండి హనుమాన్ చెక్‌పోస్ట్ ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ...
Read More...