మళ్లీ అమ్మాయి పుట్టిందని తుప్పల్లో పడేసిన తల్లి క్షేమంగా బయటపడ్డ పసికందు

On
మళ్లీ అమ్మాయి పుట్టిందని తుప్పల్లో పడేసిన తల్లి  క్షేమంగా బయటపడ్డ పసికందు

మళ్లీ అమ్మాయి పుట్టిందని తుప్పల్లో పడేసిన తల్లి

క్షేమంగా బయటపడ్డ పసికందు

 

రాజమండ్రి ఏప్రిల్‌ 15 (ప్రజామంటలు): మగ సంతానం పై ఉన్న మమకారం ఓ తల్లిని మానవత్వం లేకుండా చేసింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన అప్పుడే పుట్టిన పసికందును ఇరవై అడుగుల ఎత్తు నుంచి తుప్పల్లోకి విసిరేసింది. ఆ తర్వాత తప్పు తెలుసుకుని కన్నీరు మున్నేరుగా విలపిస్తుంది. ఈ హృదయ విధారకరమైన సంఘటన తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో చోటుచేసుకుంది. ఇటువంటి సంఘటన గతంలో ఎక్కడ ఎప్పుడు జరిగి ఉండకపోవచ్చు. స్థానికులు, బంధువులు, వైద్యులు తెలిపిన ఈ సంఘటన వివరాలు ఎలా ఉన్నాయి.

        వేమగిరి గణపతినగరం ప్రాంతానికి చెందిన తాపీ పనులు చేసే కుటుంబంలో వరుసగా ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. వారు ముగ్గురు కూడా ప్రస్తుతం స్కూల్‌ కి వెళ్తున్నారు. అయితే తల్లికి మాత్రం మగసంతానంపై మమకారం వెంటాడుతూనే ఉంది. అందుకనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేసుకున్నట్లు నమ్మించి ఆ తర్వాత గర్భం దాల్చింది. ఈ విషయాన్ని ఎవరికీ తెలియనీయలేదు. అబ్బాయి పుడితే అందరికి చెబుదాం. అమ్మాయి పుడితే ఎవరికి తెలియకుండా మాయం చేద్దామని ఉద్దేశం ఉంది.బంధుమిత్రులకు చుట్టుపక్కల ఎవరికి ఈ విషయం తెలియనివ్వలేదు.  చివరికి భర్తకు కూడా అనుమానం రాకుండా మసులుకుంది. పొట్ట పెరుగుతుందని భర్త అడిగితే ఈ మధ్యన ఎక్కువగా తినడం వల్ల పెరుగుతుందని నమ్మబలికింది. స్థానిక వైద్య సిబ్బందికి,  అంగన్వాడీలకు గర్భిణీ అనే సమాచారాన్ని ఇవ్వలేదు. అందుకు కావలసిన వైద్య సేవలు కూడా పొందలేదు.  ఈ పరిస్థితుల్లో ఆదివారం పురిటి నొప్పులు వచ్చాయి. అది గమనించిన  ఆ తల్లి భర్తను పిల్లలను చర్చకు పంపించింది.తనకు తానే పురుడు పోసుకుంది. అందుబాటులో ఉన్న కత్తిపీటతో ప్రేగును కత్తిరించింది. అమ్మాయి పుట్టిందని గమనించిన వెంటనే ముందుగా అనుకున్న పథకం ప్రకారం నైటిలో ఆ బిడ్డను చుట్టేసి 20 అడుగుల ఎత్తులో నుంచి తుప్పల్లోకి విసిరేసింది. అక్కడ చెత్త చెదరంతో పాటు పందులు సంచరిస్తూ ఉంటాయి.అక్కడ నుంచి ఆమె ఇంటికి వెళ్ళి పోయి స్నానం చేసి ఎవరికి అనుమానం రాకుండా మచులుకుంది.

         అయితే ఆ తుప్పల నుంచి ఏడుపు వినిపిస్తుండటంతో చుట్టుపక్కల వారు అక్కడకి వెళ్ళి చూడగా ముద్దులొలికే పండంటి ఆడశిసువు కనబడిరది. కాలుకి చిన్న రాపిడిగాయం తప్ప అంతా క్షేమంగా ఉంది. అయితే ఆ అమ్మాయి ఎవరనేది అందులోనూ చర్చ మొదలైంది. బయటనుండి ఎవరో అక్కడకు వచ్చి పాడేసే అవకాశం లేనందున అక్కడి వారి పిల్లే అయివుతుందని నిద్దారణకు వచ్చి ఆరా తీయడం మొదలు పెట్టారు.

           ఇంతలో అందరితో పాటు భర్త అక్కడికి వచ్చి చూస్తే ఆ పిల్లకు చుట్టి ఉన్న నైటీ తన భార్యదని గుర్తించాడు.ఆ నైటీ ఆధారంగా ఇంటికెళ్లి భార్యను నిలదీసాడు. దీంతో జరిగిన విషయం ఒప్పుకొని ఆ తల్లి కన్నీరు మున్నీరుగా వెల్లపించడం మొదలుపెట్టింది. మగ సంతానంపై ఉన్న మమకారంతో ఇలా చేశానని గగ్గోలు పెట్టింది.వెంటనే తల్లి బిడ్డను కడియం ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అయితే వారు అక్కడి నుంచి రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం అక్కడ తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు, బంధువులు తెలిపారు. ఈ సంఘటన సోమవారం నుంచి ఈ ప్రాంతంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Tags
Join WhatsApp

More News...

State News 

ఈనెల 22న హైదరాబాద్‌లో దళితుల ఆత్మగౌరవ భారీ ర్యాలీ

ఈనెల 22న హైదరాబాద్‌లో దళితుల ఆత్మగౌరవ భారీ ర్యాలీ సికింద్రాబాద్, అక్టోబర్ 15 (ప్రజామంటలు) : సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌ బి.ఆర్‌. గవాయి  మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ఈ నెల 22న హైదరాబాద్‌లో దళితుల ఆత్మగౌరవ భారీ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ప్రకటించారు. హైదరాబాద్‌ జిల్లా ఎంఆర్‌పీఎస్‌, ఎంఎస్‌పీ మరియు అనుబంధ సంఘాల అత్యవసర...
Read More...
Local News 

మీరు తినే ఆహారం మీ పెరుగుదల నాంది - ధర్మపురి సి సి పి ఓ వాణిశ్రీ

మీరు తినే ఆహారం మీ పెరుగుదల నాంది - ధర్మపురి సి సి పి ఓ వాణిశ్రీ జగిత్యాల అక్టోబర్ 15 (ప్రజా మంటలు): మీరు తినే ఆహారం మీ పెరుగుదల నాందిఅవుతుంది అను ఐ సి డి ఎస్ సి డి పి ఓ వాణిశ్రీ  అన్నారు.జిల్లాలోని ధర్మపురి ఐ సీ డి ఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ బి వాణిశ్రీ  ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవాలు బుధవారం రోజున సారంగపూర్ రైతు వేదికలో ఘనంగా...
Read More...
Local News 

బీసీల 42 శాతం రిజర్వేషన్లతో గ్రామీణ ప్రాంతాల ప్రజల మద్య చిచ్చు..

బీసీల 42 శాతం రిజర్వేషన్లతో గ్రామీణ ప్రాంతాల ప్రజల మద్య చిచ్చు.. తాము బీసీలకు వ్యతిరేకం కాదు..  రాజ్యాంగ బద్దంగా నిర్ణయాలు తీసుకోవాలి    సికింద్రాబాద్ లో రాష్ర్ట రెడ్డి జేఏసీ సమావేశం సికింద్రాబాద్, అక్టోబర్ 15 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ లో బుధవారం తెలంగాణ రాష్ట్ర రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయించడం మూలంగా గ్రామీణ...
Read More...
Local News 

"బిసి బంద్" విజయవంతం కొరకు ముందుకు రండి

బిసి కుల సంఘాల,నాయకులు (అంకం భూమయ్య)  గొల్లపల్లి అక్టోబర్ 15 (ప్రజా మంటలు):  బీసీ ల 42 శాతం రిజర్వేషన్ల సాధన కొరకు ఈనెల 18వ తేదీన రాష్ట్రవ్యాప్త బందును విజయవంతం చేయాలని గొల్లపల్లి మండలం లోని బిసి కుల సంఘాల, నాయకులు పిలుపునిచ్చారు. రాష్ట్ర బీసీ జేఏసీ నాయకులు ఆర్ కృష్ణయ్య పిలుపుమేరకు ఈనెల...
Read More...
Local News 

పోలీస్‌ కమేమొరేషన్‌ డే సందర్భంగా అవేర్నెస్ 

పోలీస్‌ కమేమొరేషన్‌ డే సందర్భంగా అవేర్నెస్  సికింద్రాబాద్  అక్టోబర్ 15 (ప్రజా మంటలు):  సికింద్రాబాద్‌ వారాసిగూడ లోని చిలకలగూడ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో బుధవారం శ్రీ బాలాజీ హైస్కూల్‌ విద్యార్థులకు పోలీస్‌ కమేమొరేషన్‌ డే సందర్భంగా విద్యార్థులకు పలు అంశాలపై అవేర్నెస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌ ప్రమాదాలు, ఈవ్‌ టీజింగ్‌, నిరాశ, ఆత్మహత్యల సమస్యలు, అలాగే డయల్ 1930...
Read More...
Local News  Crime 

కన్నతల్లి, తమ్ముళ్లపై దాడి చేసిన కేసులో  నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్ష

కన్నతల్లి, తమ్ముళ్లపై దాడి చేసిన కేసులో  నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్ష (అంకం భూమయ్య)   గొల్లపల్లి అక్టోబర్ 15 (ప్రజా మంటలు): కన్నతల్లి, తమ్ముల పై దాడి చేసిన కేసులో  నిందితుడు ఎర్ర అక్షయ్ కుమార్ కు 3సం  జైలు శిక్ష విదిస్తూ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీమతి ఏగి జానకి ధర్మపుర తీర్పు వెలువరించారు. వివరాల్లోకి వెళ్తే ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిదిలోని దొంతపూర్ గ్రామానికి...
Read More...
Local News 

మల్యాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన  ఎస్పీ అశోక్ కుమార్

మల్యాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన  ఎస్పీ అశోక్ కుమార్ -విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి. (అంకం భూమయ్య)  గొల్లపల్లి అక్టోబర్ 15 (ప్రజా మంటలు):  మల్యాల పోలీస్ స్టేషన్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్బంగా ఎస్పీ పోలీస్ స్టేషన్ సందర్శించి స్టేషన్ లో నిర్వహిస్తున్న రికార్డులు, కేసు డైరీలను, రిజిష్టర్ లను పరిశీలించి, రికార్డులన్నీ సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అని చెక్ చేసి...
Read More...
Local News 

పోషణ్ మహా కార్యక్రమంలో - వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి

పోషణ్ మహా కార్యక్రమంలో - వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి ఐసిడిఎస్ సూపర్వైజర్ శోభారాణి ఇబ్రహీంపట్నం అక్టోబర్ 10 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా గ్రామ అంగన్వాడి కేంద్రాలలో, గ్రామ పంచాయతీ ఆవరణలో బుధవారం రోజున ఐ సి డి ఎస్ సూపర్వైజర్ శోభారాణి ఆధ్వర్యంలో పోషణ్ మహా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గర్భిణీలు బాలింతలు.పిల్లలు పౌష్టిక...
Read More...
Local News 

పాడి పశువుల కు గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించుకోవాలి

పాడి పశువుల కు గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించుకోవాలి ఇబ్రహీంపట్నం అక్టోబర్ 15 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని అన్ని గ్రామాల్లో బుధవారం (15 తేదీ) నుండి వచ్చే నెల నవంబర్ 13 వ తేదీ వరకు పశువులలకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయించుకోవాలని మండల పశు వైద్యాధికారి డా, శైలజ తెలిపారు. బుధవారం రోజున ఫకీర్ కొండాపూర్ గ్రామంలో...
Read More...
Local News 

జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో సలహా కమిటీ సమావేశం

జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో సలహా కమిటీ సమావేశం జగిత్యాల అక్టోబర్ 15 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రం కలెక్టరేట్ లోని డిఎంహెచ్ఓ ఆఫీస్ లో బుధవారం సాయంత్రం అడ్వైజరి కమిటీ సమావేశం, డిఎంహెచ్వో డాక్టర్ ప్రమోద్  ఆధ్వర్యంలో జరిగింది. పిసిపిఎన్డి టి యాక్ట్ అమలు విషయంలో జరుగుతున్న విషయాలను చర్చించడం జరిగింది. అనుమతులు లేకుండా నడుస్తున్న స్కానింగ్ సెంటర్ లపై  తప్పనిసరి చర్యలు తీసుకోవాలని,...
Read More...
Local News 

మల్యాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి సైబర్ నేరాల నివారణ పై ప్రజలకు అవగాహన కల్పించాలి 

మల్యాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి  సైబర్ నేరాల నివారణ పై ప్రజలకు అవగాహన కల్పించాలి  మల్యాల అక్టోబర్ 15 (ప్రజా మంటలు) జిల్లా ఎస్పీ అశోక్ పోలీస్ స్టేషన్ ను సందర్శించి స్టేషన్ లో నిర్వహిస్తున్న రికార్డులు, కేసు డైరీలను, రిజిష్టర్ లను పరిశీలించి, రికార్డులన్నీ సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అని చెక్ చేసి పోలీస్ స్టేషన్లో సిబ్బంది యొక్క పనితీరును తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ లో ఉన్న పెండింగ్ కేసులు...
Read More...
Local News 

యువత చెడు వ్యసనాలతో భవిష్యత్తుకు దూరం కారాదు_ విద్యార్థులు తల్లిదండ్రులకు; పేరుతెచ్చి  ఉన్నత శిఖరాలకు ఎదగాలి - ట్రాఫిక్ ఎస్సై మల్లేష్ 

యువత చెడు వ్యసనాలతో భవిష్యత్తుకు దూరం కారాదు_  విద్యార్థులు తల్లిదండ్రులకు; పేరుతెచ్చి  ఉన్నత శిఖరాలకు ఎదగాలి - ట్రాఫిక్ ఎస్సై మల్లేష్     జగిత్యాల అక్టోబర్ 15(ప్రజా  మంటలు)  పట్టణంలోని దేవిశ్రీ గార్డెన్ లో నేతాజీ ఓకేషనల్ జూనియర్ కాలేజ్ ఫ్రెషర్స్ డే సందర్బంగా ట్రాఫిక్ ఎస్సై మల్లేష్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలతో భవిష్యత్తుకు దూరం కారాదని విద్యార్థిని విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలకు ఎదుగి తల్లిదండ్రులకు పేరు తెచ్చి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు...
Read More...