మళ్లీ అమ్మాయి పుట్టిందని తుప్పల్లో పడేసిన తల్లి క్షేమంగా బయటపడ్డ పసికందు

On
మళ్లీ అమ్మాయి పుట్టిందని తుప్పల్లో పడేసిన తల్లి  క్షేమంగా బయటపడ్డ పసికందు

మళ్లీ అమ్మాయి పుట్టిందని తుప్పల్లో పడేసిన తల్లి

క్షేమంగా బయటపడ్డ పసికందు

 

రాజమండ్రి ఏప్రిల్‌ 15 (ప్రజామంటలు): మగ సంతానం పై ఉన్న మమకారం ఓ తల్లిని మానవత్వం లేకుండా చేసింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన అప్పుడే పుట్టిన పసికందును ఇరవై అడుగుల ఎత్తు నుంచి తుప్పల్లోకి విసిరేసింది. ఆ తర్వాత తప్పు తెలుసుకుని కన్నీరు మున్నేరుగా విలపిస్తుంది. ఈ హృదయ విధారకరమైన సంఘటన తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో చోటుచేసుకుంది. ఇటువంటి సంఘటన గతంలో ఎక్కడ ఎప్పుడు జరిగి ఉండకపోవచ్చు. స్థానికులు, బంధువులు, వైద్యులు తెలిపిన ఈ సంఘటన వివరాలు ఎలా ఉన్నాయి.

        వేమగిరి గణపతినగరం ప్రాంతానికి చెందిన తాపీ పనులు చేసే కుటుంబంలో వరుసగా ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. వారు ముగ్గురు కూడా ప్రస్తుతం స్కూల్‌ కి వెళ్తున్నారు. అయితే తల్లికి మాత్రం మగసంతానంపై మమకారం వెంటాడుతూనే ఉంది. అందుకనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేసుకున్నట్లు నమ్మించి ఆ తర్వాత గర్భం దాల్చింది. ఈ విషయాన్ని ఎవరికీ తెలియనీయలేదు. అబ్బాయి పుడితే అందరికి చెబుదాం. అమ్మాయి పుడితే ఎవరికి తెలియకుండా మాయం చేద్దామని ఉద్దేశం ఉంది.బంధుమిత్రులకు చుట్టుపక్కల ఎవరికి ఈ విషయం తెలియనివ్వలేదు.  చివరికి భర్తకు కూడా అనుమానం రాకుండా మసులుకుంది. పొట్ట పెరుగుతుందని భర్త అడిగితే ఈ మధ్యన ఎక్కువగా తినడం వల్ల పెరుగుతుందని నమ్మబలికింది. స్థానిక వైద్య సిబ్బందికి,  అంగన్వాడీలకు గర్భిణీ అనే సమాచారాన్ని ఇవ్వలేదు. అందుకు కావలసిన వైద్య సేవలు కూడా పొందలేదు.  ఈ పరిస్థితుల్లో ఆదివారం పురిటి నొప్పులు వచ్చాయి. అది గమనించిన  ఆ తల్లి భర్తను పిల్లలను చర్చకు పంపించింది.తనకు తానే పురుడు పోసుకుంది. అందుబాటులో ఉన్న కత్తిపీటతో ప్రేగును కత్తిరించింది. అమ్మాయి పుట్టిందని గమనించిన వెంటనే ముందుగా అనుకున్న పథకం ప్రకారం నైటిలో ఆ బిడ్డను చుట్టేసి 20 అడుగుల ఎత్తులో నుంచి తుప్పల్లోకి విసిరేసింది. అక్కడ చెత్త చెదరంతో పాటు పందులు సంచరిస్తూ ఉంటాయి.అక్కడ నుంచి ఆమె ఇంటికి వెళ్ళి పోయి స్నానం చేసి ఎవరికి అనుమానం రాకుండా మచులుకుంది.

         అయితే ఆ తుప్పల నుంచి ఏడుపు వినిపిస్తుండటంతో చుట్టుపక్కల వారు అక్కడకి వెళ్ళి చూడగా ముద్దులొలికే పండంటి ఆడశిసువు కనబడిరది. కాలుకి చిన్న రాపిడిగాయం తప్ప అంతా క్షేమంగా ఉంది. అయితే ఆ అమ్మాయి ఎవరనేది అందులోనూ చర్చ మొదలైంది. బయటనుండి ఎవరో అక్కడకు వచ్చి పాడేసే అవకాశం లేనందున అక్కడి వారి పిల్లే అయివుతుందని నిద్దారణకు వచ్చి ఆరా తీయడం మొదలు పెట్టారు.

           ఇంతలో అందరితో పాటు భర్త అక్కడికి వచ్చి చూస్తే ఆ పిల్లకు చుట్టి ఉన్న నైటీ తన భార్యదని గుర్తించాడు.ఆ నైటీ ఆధారంగా ఇంటికెళ్లి భార్యను నిలదీసాడు. దీంతో జరిగిన విషయం ఒప్పుకొని ఆ తల్లి కన్నీరు మున్నీరుగా వెల్లపించడం మొదలుపెట్టింది. మగ సంతానంపై ఉన్న మమకారంతో ఇలా చేశానని గగ్గోలు పెట్టింది.వెంటనే తల్లి బిడ్డను కడియం ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అయితే వారు అక్కడి నుంచి రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం అక్కడ తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు, బంధువులు తెలిపారు. ఈ సంఘటన సోమవారం నుంచి ఈ ప్రాంతంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Tags
Join WhatsApp

More News...

Local News 

జగిత్యాల పట్టణ మేరు సేవా సంఘం ఎన్నికలు మే నెల 17 న..

జగిత్యాల పట్టణ మేరు సేవా సంఘం ఎన్నికలు మే నెల 17 న.. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113) జగిత్యాల 21 ఏప్రిల్ (ప్రజా మంటలు) :  జగిత్యాల పట్టణ మేరు సేవా సంఘం ఎన్నికలు వచ్చె నెల 17 ఆదివారం రోజున నిర్వహిస్తున్నట్టు సంఘం ఎన్నికల కమిటీ కన్వీనర్ రాపర్తి. గంగాధర్, కో-కన్వీనర్ కొక్కు. శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగినది. ఈ సందర్బంగా కమిటీ...
Read More...
Spiritual   Social  State News 

మల్కాజ్‌గిరిలో బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం మరియు కృతజ్ఞత అభినందన సభ

మల్కాజ్‌గిరిలో బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం మరియు కృతజ్ఞత అభినందన సభ సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/ 9348322113.  హైదరాబాద్ 19 ఏప్రిల్ (ప్రజా మంటలు) :  మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని ఆనంద్ బాగ్, బృందావన్ గార్డెన్‌లో ఈరోజు బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం మరియు కృతజ్ఞత అభినందన సభ ఘనంగా నిర్వహించబడింది.  నేరేడ్మెట్ ప్రాంతంలో బ్రాహ్మణ భవన నిర్మాణం కోసం ఒక ఎకరం స్థలం (భూమి) కేటాయింపును...
Read More...
Local News 

హైకోర్టు జడ్జి శ్రీ రేణుక యార ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్

హైకోర్టు జడ్జి శ్రీ రేణుక యార ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్    కోరుట్ల ఏప్రిల్ 18(ప్రజా మంటలు)పట్టణానికి మంజూరు చేసిన అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ & జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టును ప్రారంభించేందుకు కోరుట్లకు విచ్చేసిన గౌరవ హైకోర్టు జడ్జి  రేణుక యార ని జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్,  మర్యాదపూర్వకంగా కలిసి  పూల బొకే ను అందజేశారు.
Read More...
Local News 

తొలి జెడ్పి చైర్ పర్సన్ నివాసానికి కేటీఆర్ హరీష్ రావు రాక స్వాగతం పలికిన మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత

తొలి జెడ్పి చైర్ పర్సన్ నివాసానికి కేటీఆర్ హరీష్ రావు రాక స్వాగతం పలికిన మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత   జగిత్యాల ఏప్రిల్ 18 (ప్రజా మంటలు)ఈనెల 20వ తేదీ కేసీఆర్ బహిరంగ సభ సందర్భంగా  సభ ప్రాంగణాన్ని పరిశీలించి అనంతరం జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్  నివాసానికి విచ్చేసిన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరియు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు కు...
Read More...
Crime  State News 

పోలీసుల నిర్బంధం నుంచి ఉద్యమకారులను విడిపించిన కల్వకుంట్ల కవిత

పోలీసుల నిర్బంధం నుంచి ఉద్యమకారులను విడిపించిన కల్వకుంట్ల కవిత హైదరాబాద్, ఏప్రిల్ 18 (ప్రజా మంటలు): కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం “చలో సెక్రటేరియట్”కు వెళ్లిన తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. 600 మందికి పైగా కార్యకర్తలను మెహదీపట్నం, నాంపల్లి, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు. ఈ సమాచారం తెలుసుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మెహదీపట్నం పోలీస్ స్టేషన్‌కు...
Read More...
Local News 

స్వయంకృత అపరాధమే మన దుఃఖాలకు మూలం  నంబి వేణుగోపాల ఆచార్య

స్వయంకృత అపరాధమే మన దుఃఖాలకు మూలం  నంబి వేణుగోపాల ఆచార్య    జగిత్యాల ఏప్రిల్ 17 (ప్రజా మంటలు) స్వయంకృత అపరాధమే మన దుఃఖాలకు మూలమని నంబి వేణుగోపాలఆచార్య కౌశిక అన్నారు .శుక్రవారం పోచమ్మ బస్తీలోని గీతా భవన్ లో సాయంత్రం హిందూ సమ్మేళన సమితి వారి ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న నంబి వేణుగోపాల ఆచార్య అనుగ్రహ భాషణం చేస్తూ మానవులు ప్రకృతిని ధ్వంసం...
Read More...
Local News 

అన్నపూర్ణ మాత సేవ వారి అన్న ప్రసాద వితరణ లో పాల్గొన్న చైర్ పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ 

అన్నపూర్ణ మాత సేవ వారి అన్న ప్రసాద వితరణ లో పాల్గొన్న చైర్ పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్     జగిత్యాల ఏప్రిల్ 17(ప్రజా మంటలు)బీట్ చౌరస్తా లో నిర్వహించిన  అమావాస్య అన్నపూర్ణ మాత సేవ ఆధ్వర్యములో ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్  హాజరై భక్తులకు స్వయంగా వడ్డించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో సేవాభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.  కార్యక్రమములో...
Read More...
Local News 

ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి

ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి జగిత్యాల ఏప్రిల్ 17(ప్రజా మంటలు)టీజీఈజెఏసి జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో  నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయుల, కార్మిక , పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కమిటీ విస్తృతస్థాయి కార్యనిర్వాహక సమావేశం (తేది: 07-04-2026) లో తీసుకున్న తీర్మానాల మేరకు జెఏసి రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్  మరియు సెక్రటరీ...
Read More...
Local News 

సురభి గోషాలలో గో గ్రాసం పంపిణీ

సురభి గోషాలలో గో గ్రాసం పంపిణీ   జగిత్యాల రూరల్ ఏప్రిల్ 17 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రానికి సమీపంలోని తాటిపల్లి సురభి గోశాలలో గోవుల గ్రాసం గడ్డి, తవుడు, మేత  కోసం ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. జగిత్యాల వాస్తవ్యులైన ఊటూరి అశోక్ కుమార్, తాటికొండ శ్రీనివాస్, బాసెట్టి లవ కుమార్, ప్రతినెల అమావాస్య రోజు ఒక్కొక్కరివద్ద 100 చొప్పున, వసూలు చేసి...
Read More...
State News 

ప్రత్యేక తెలంగాణ అస్తిత్వాల పరిరక్షణకు ‘తెలంగాణ అస్తిత్వ వేదిక’ ఆవిర్భావం

ప్రత్యేక తెలంగాణ అస్తిత్వాల పరిరక్షణకు ‘తెలంగాణ అస్తిత్వ వేదిక’ ఆవిర్భావం    ఆవిర్భావ సభ వివరాలు:* 📅 తేదీ: ఏప్రిల్ 19, 2026 (ఆదివారం)* 🕙 సమయం: ఉదయం 10 గంటలకు* 📌 వేదిక: రవీంద్రభారతి    హైదరాబాద్, ఏప్రిల్ 17 (ప్రజా మంటలు):    తెలంగాణ భూమి కేవలం భౌగోళిక పరిమితి మాత్రమే కాకుండా వేల సంవత్సరాల సాంస్కృతిక, చారిత్రక, ఆధ్యాత్మిక అస్తిత్వాలకు ప్రతీకగా నిలిచిందని...
Read More...
State News 

మారోజు వీరన్న అనుచరుల మద్దతుతో జాగృతి పార్టీకి బలమైన ఊపు: కవిత

మారోజు వీరన్న అనుచరుల మద్దతుతో జాగృతి పార్టీకి బలమైన ఊపు: కవిత హైదరాబాద్, ఏప్రిల్ 17 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పడబోయే కొత్త రాజకీయ పార్టీకి మారోజు వీరన్న అనుచరులు, సీపీయూఎస్ఐ (CPUSI), దళిత బహుజన రాజ్యాధికార సంస్థ మద్దతు ప్రకటించాయి. జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను కలిసి సీపీయూఎస్ఐ కేంద్ర కమిటీ కార్యదర్శి కోదండం, రాష్ట్ర కార్యదర్శి వెంకన్న, దళిత...
Read More...
Local News 

జాతీయ వాగ్దేవి పురస్కారం అందుకున్న మహేశ్వర శర్మ

జాతీయ వాగ్దేవి పురస్కారం అందుకున్న మహేశ్వర శర్మ   రాయికల్ ఏప్రిల్ 16 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు కు చెందిన తెలుగు పండితులు చెరుకు మహేశ్వర శర్మ కు కందుకూరి వీరేశలింగం పంతులు స్మారక జాతీయ వాగ్దేవి పురస్కారాన్ని గురువారం ఆచార్య పద్మశ్రీ  కొలకనూరి ఇనాక్ ,  జాతీయ తెలుగు సారస్వత పరిషత్ కార్యనిర్వహక...
Read More...