మళ్లీ అమ్మాయి పుట్టిందని తుప్పల్లో పడేసిన తల్లి క్షేమంగా బయటపడ్డ పసికందు

On
మళ్లీ అమ్మాయి పుట్టిందని తుప్పల్లో పడేసిన తల్లి  క్షేమంగా బయటపడ్డ పసికందు

మళ్లీ అమ్మాయి పుట్టిందని తుప్పల్లో పడేసిన తల్లి

క్షేమంగా బయటపడ్డ పసికందు

 

రాజమండ్రి ఏప్రిల్‌ 15 (ప్రజామంటలు): మగ సంతానం పై ఉన్న మమకారం ఓ తల్లిని మానవత్వం లేకుండా చేసింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన అప్పుడే పుట్టిన పసికందును ఇరవై అడుగుల ఎత్తు నుంచి తుప్పల్లోకి విసిరేసింది. ఆ తర్వాత తప్పు తెలుసుకుని కన్నీరు మున్నేరుగా విలపిస్తుంది. ఈ హృదయ విధారకరమైన సంఘటన తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో చోటుచేసుకుంది. ఇటువంటి సంఘటన గతంలో ఎక్కడ ఎప్పుడు జరిగి ఉండకపోవచ్చు. స్థానికులు, బంధువులు, వైద్యులు తెలిపిన ఈ సంఘటన వివరాలు ఎలా ఉన్నాయి.

        వేమగిరి గణపతినగరం ప్రాంతానికి చెందిన తాపీ పనులు చేసే కుటుంబంలో వరుసగా ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. వారు ముగ్గురు కూడా ప్రస్తుతం స్కూల్‌ కి వెళ్తున్నారు. అయితే తల్లికి మాత్రం మగసంతానంపై మమకారం వెంటాడుతూనే ఉంది. అందుకనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేసుకున్నట్లు నమ్మించి ఆ తర్వాత గర్భం దాల్చింది. ఈ విషయాన్ని ఎవరికీ తెలియనీయలేదు. అబ్బాయి పుడితే అందరికి చెబుదాం. అమ్మాయి పుడితే ఎవరికి తెలియకుండా మాయం చేద్దామని ఉద్దేశం ఉంది.బంధుమిత్రులకు చుట్టుపక్కల ఎవరికి ఈ విషయం తెలియనివ్వలేదు.  చివరికి భర్తకు కూడా అనుమానం రాకుండా మసులుకుంది. పొట్ట పెరుగుతుందని భర్త అడిగితే ఈ మధ్యన ఎక్కువగా తినడం వల్ల పెరుగుతుందని నమ్మబలికింది. స్థానిక వైద్య సిబ్బందికి,  అంగన్వాడీలకు గర్భిణీ అనే సమాచారాన్ని ఇవ్వలేదు. అందుకు కావలసిన వైద్య సేవలు కూడా పొందలేదు.  ఈ పరిస్థితుల్లో ఆదివారం పురిటి నొప్పులు వచ్చాయి. అది గమనించిన  ఆ తల్లి భర్తను పిల్లలను చర్చకు పంపించింది.తనకు తానే పురుడు పోసుకుంది. అందుబాటులో ఉన్న కత్తిపీటతో ప్రేగును కత్తిరించింది. అమ్మాయి పుట్టిందని గమనించిన వెంటనే ముందుగా అనుకున్న పథకం ప్రకారం నైటిలో ఆ బిడ్డను చుట్టేసి 20 అడుగుల ఎత్తులో నుంచి తుప్పల్లోకి విసిరేసింది. అక్కడ చెత్త చెదరంతో పాటు పందులు సంచరిస్తూ ఉంటాయి.అక్కడ నుంచి ఆమె ఇంటికి వెళ్ళి పోయి స్నానం చేసి ఎవరికి అనుమానం రాకుండా మచులుకుంది.

         అయితే ఆ తుప్పల నుంచి ఏడుపు వినిపిస్తుండటంతో చుట్టుపక్కల వారు అక్కడకి వెళ్ళి చూడగా ముద్దులొలికే పండంటి ఆడశిసువు కనబడిరది. కాలుకి చిన్న రాపిడిగాయం తప్ప అంతా క్షేమంగా ఉంది. అయితే ఆ అమ్మాయి ఎవరనేది అందులోనూ చర్చ మొదలైంది. బయటనుండి ఎవరో అక్కడకు వచ్చి పాడేసే అవకాశం లేనందున అక్కడి వారి పిల్లే అయివుతుందని నిద్దారణకు వచ్చి ఆరా తీయడం మొదలు పెట్టారు.

           ఇంతలో అందరితో పాటు భర్త అక్కడికి వచ్చి చూస్తే ఆ పిల్లకు చుట్టి ఉన్న నైటీ తన భార్యదని గుర్తించాడు.ఆ నైటీ ఆధారంగా ఇంటికెళ్లి భార్యను నిలదీసాడు. దీంతో జరిగిన విషయం ఒప్పుకొని ఆ తల్లి కన్నీరు మున్నీరుగా వెల్లపించడం మొదలుపెట్టింది. మగ సంతానంపై ఉన్న మమకారంతో ఇలా చేశానని గగ్గోలు పెట్టింది.వెంటనే తల్లి బిడ్డను కడియం ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అయితే వారు అక్కడి నుంచి రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం అక్కడ తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు, బంధువులు తెలిపారు. ఈ సంఘటన సోమవారం నుంచి ఈ ప్రాంతంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Tags
Join WhatsApp

More News...

Local News  State News 

ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు కొనసాగించాలి

ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు కొనసాగించాలి హైదరాబాద్, డిసెంబర్ 18 (ప్రజా మంటలు): ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలని, లేదంటే ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మాజీ మంత్రి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి హెచ్చరించారు. మహాత్మా గాంధీ పేరును ఉపాధి హామీ పథకం నుంచి...
Read More...
Local News 

గొల్లపల్లి సర్పంచ్  నల్ల నీరజ సతీష్ రెడ్డి విజయోత్స ర్యాలీ 

గొల్లపల్లి సర్పంచ్  నల్ల నీరజ సతీష్ రెడ్డి విజయోత్స ర్యాలీ  గొల్లపల్లి డిసెంబర్ 18 (ప్రజా మంటలు- అంకం భూమయ్య)    గొల్లపల్లి మండల కేంద్రంలో ఇండిపెండెంట్ సర్పంచ్ విజయోత్స ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా నుండి నల్ల గుట్ట వరకు గొల్లపల్లి సర్పంచ్‌గా నన్ను గెలిపించిన సందర్భంగా   గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని సర్పంచ్ నల్ల నీరజ సతీష్ రెడ్డి గురువారం మండల కేంద్రంలో బారి ర్యాలీ గొల్లపల్లి...
Read More...

కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను మరిచిపోయింది - కవిత

కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను మరిచిపోయింది  - కవిత కొత్తగూడెం డిసెంబర్ 18 :ప్రజా మంటలు)::తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్తగూడెం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. రెండు రోజుల పాటు జిల్లాలో ప్రజల సమస్యలను తెలుసుకొని, బాధితులతో నేరుగా మాట్లాడి పరిష్కార దిశగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఇల్లందు: దర్గా–ఆలయ సందర్శన, మత సామరస్యానికి నిదర్శనం...
Read More...
State News 

వృద్ధుడి దప్పు మల్లయ్య పరిస్థితిపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సువో–మోటో కేసు

వృద్ధుడి దప్పు మల్లయ్య పరిస్థితిపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సువో–మోటో కేసు హైదరాబాద్ డిసెంబర్ 18 (ప్రజా మంటలు): తెలుగు దినపత్రికలో ప్రచురితమైన వార్తను ఆధారంగా చేసుకుని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ డా. షమీం అక్తర్ సువో–మోటోగా పరిగణనలోకి తీసుకున్నారు. రంగా రెడ్డి జిల్లా, కోతూర్ మండలం, మల్లాపూర్ గ్రామానికి చెందిన వృద్ధుడు దప్పు మల్లయ్య తన సంతానం నిర్లక్ష్యానికి గురై, ఆస్తి నుంచి...
Read More...

డిల్లీ హైకోర్టు తీర్పుతోనైనా బీజేపీ కి కనువిప్పు కలుగాలి... వేధింపుల రాజకీయం మానుకొని.. ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలి... ఉపాధి హామీ పథకానికి మహాత్మ గాంధీ పేరు తొలగించాలనే ప్రతిపాదన ఉపసంహరించుకోవాలి.. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి..

డిల్లీ హైకోర్టు తీర్పుతోనైనా బీజేపీ కి కనువిప్పు కలుగాలి...  వేధింపుల రాజకీయం మానుకొని.. ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలి...  ఉపాధి హామీ పథకానికి మహాత్మ గాంధీ పేరు తొలగించాలనే ప్రతిపాదన ఉపసంహరించుకోవాలి..  మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి.. జగిత్యాల డిసెంబర్ 18 (ప్రజా మంటలు)ఇందిరా భవన్ నుండి తహశీల చౌరస్తా వరకు కాంగ్రెస్ నాయకులూ,కార్యకర్తల ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు  తహసిల్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణుల బైఠాయించారు  నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో దశాబ్ద కాలంగా బీజేపీ ప్రభుత్వం కుట్ర పూరిత రాజకీయాలతో ఈడీ దాడులతో సోనియా...
Read More...

ఈ నెల 24 న పెన్షనర్ల నిరాహార దీక్షలు  రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ వెల్లడి.

ఈ నెల 24 న పెన్షనర్ల నిరాహార దీక్షలు   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ వెల్లడి.    జగిత్యాల డిసెంబర్ 18 (ప్రజా మంటలు) : జిల్లా కేంద్రాలలో ఈ నెల 24 న నిరాహార దీక్షలు చేపట్టాలని రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు జగిత్యాల జిల్లా రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ వెల్లడించింది.  గురువారం మధ్యాహ్నం 12 గంటలకు పెన్షనర్స్ భవన్ లో జిల్లా అధ్యక్షులు ఏ.నరేందర్ రావు అధ్యక్షతన సమావేశం జరిగింది.  ఈ...
Read More...

మాస శివరాత్రి సందర్భంగా సహస్ర లింగాలకు సహస్ర వస్త్రాల అలంకరణ ప్రత్యేక పూజలు 

మాస శివరాత్రి సందర్భంగా సహస్ర లింగాలకు సహస్ర వస్త్రాల అలంకరణ ప్రత్యేక పూజలు     జగిత్యాల డిసెంబర్ 18 (ప్రజా మంటలు) రూరల్ పొలాస గ్రామంలోని సహస్ర లింగాల దేవాలయంలో మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు  ఈ సందర్భంగా గురువారం మాస శివరాత్రి పురస్కరించుకొని ఆలయాన్ని సర్వంగ సుందరంగా అలంకరించి సహస్ర లింగాలకు  అభిషేకాలు, ప్రత్యేక పూజలను నిర్వహించి సహస్ర లింగాలకు భక్తుల స్వహస్తాలతో అభిషేకించి చక్కగా వస్త్రాలతో అలంకరించి...
Read More...

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద పలువురుపై వెలుగటూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద పలువురుపై వెలుగటూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు    వెల్గటూర్ డిసెంబర్ 18 ( ప్రజా మంటలు)పోలీస్ స్టేషన్ పరిధిలోని పైడిపల్లి గ్రామంలో తేదీ 17 వ తేదీన జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓట్ల లెక్కింపు అనంతరం, ఎన్నికల్లో ఓడిపోయిన ఒక వ్యక్తి తన అనుచరులు మరియు కొందరు గ్రామస్తులతో కలిసి పోలింగ్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు...
Read More...

రాయికల్ మండలం పలు గ్రామపంచాయతీ సర్పంచి వార్డు సభ్యులను సత్కరించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

రాయికల్ మండలం పలు గ్రామపంచాయతీ సర్పంచి వార్డు సభ్యులను సత్కరించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్    రాయికల్ డిసెంబర్ 18 ( ప్రజా మంటలు)మండలం మాంఖ్యనాయక్ తండ సర్పంచ్ గా మాలోత్ తిరుపతి, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులు నూతనంగా ఎన్నికైనందున  మరియు ఓడ్డేలింగాపూర్ ఉపసర్పంచిగా బుక్యా శేఖర్ ఎన్నికైన సందర్భంగా జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలువగా వారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.....
Read More...

జగిత్యాల రూరల్ /బీర్పూర్/ సారంగాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన వారిని అభినందించి శాలువ తో

జగిత్యాల రూరల్ /బీర్పూర్/ సారంగాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన వారిని అభినందించి శాలువ తో   సత్కరించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్జగిత్యాల/ బీర్పూర్/ సారంగాపూర్ డిసెంబర్ 18 (ప్రజా మంటలు)జగిత్యాల రూరల్ మండలం తక్కల్లపల్లి గ్రామం వార్డు సభ్యులుగా ఎన్నికైన సందర్భంగా జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ని కలవగా వారిని శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు..బీర్పూర్ .....మండలం చర్లపల్లి గ్రామం సర్పంచ్ గా...
Read More...
National  Crime  State News 

1500 జనాభా గ్రామంలో 3 నెలల్లోనే 27 వేల జననాలు ఎలా నమోదయ్యాయి?

1500 జనాభా గ్రామంలో 3 నెలల్లోనే 27 వేల జననాలు ఎలా నమోదయ్యాయి? (ప్రజా మంటలు ప్రత్యేక కథనం) మహారాష్ట్రలో జనన ధ్రువపత్రాల భారీ స్కామ్‌:  ముంబై డిసెంబర్ 18:  మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలో ఒక చిన్న గ్రామం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేవలం 1500 మంది జనాభా మాత్రమే ఉన్న శేందుర్సనీ గ్రామ పంచాయతీలో మూడు నెలల వ్యవధిలోనే ఏకంగా 27,397 జననాలు నమోదవడం అధికారులను అవాక్కయ్యేలా...
Read More...
Local News  Comment  State News 

అతనేప్పటికీ చేరగని ,సుదీర్ఘ జ్ఞాపకమే

అతనేప్పటికీ చేరగని ,సుదీర్ఘ జ్ఞాపకమే యాది....      *అతనేప్పటికీ చేరగని ,సుదీర్ఘ జ్ఞాపకమే.              - అల్లె రమేష్         *మానేటి  మట్టి పరిమళం సుదీర్ఘ కవి, యేన్నం సత్యం ఇక లేరు             సిరిసిల్ల మనసంతా పరుచుకున్న మానేరు మట్టి పరిమాలాల్లో ఎదిగొచ్చిన సాహిత్య కారులు అనేకమంది ప్రవాహంలా సాహిత్యలో సాగిపోతు తమదైన ప్రత్యేకముద్ర వేశారు. యేన్నం సత్యం బహుశా ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన తెలుగు...
Read More...