మళ్లీ అమ్మాయి పుట్టిందని తుప్పల్లో పడేసిన తల్లి క్షేమంగా బయటపడ్డ పసికందు
మళ్లీ అమ్మాయి పుట్టిందని తుప్పల్లో పడేసిన తల్లి
క్షేమంగా బయటపడ్డ పసికందు
రాజమండ్రి ఏప్రిల్ 15 (ప్రజామంటలు): మగ సంతానం పై ఉన్న మమకారం ఓ తల్లిని మానవత్వం లేకుండా చేసింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన అప్పుడే పుట్టిన పసికందును ఇరవై అడుగుల ఎత్తు నుంచి తుప్పల్లోకి విసిరేసింది. ఆ తర్వాత తప్పు తెలుసుకుని కన్నీరు మున్నేరుగా విలపిస్తుంది. ఈ హృదయ విధారకరమైన సంఘటన తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో చోటుచేసుకుంది. ఇటువంటి సంఘటన గతంలో ఎక్కడ ఎప్పుడు జరిగి ఉండకపోవచ్చు. స్థానికులు, బంధువులు, వైద్యులు తెలిపిన ఈ సంఘటన వివరాలు ఎలా ఉన్నాయి.
వేమగిరి గణపతినగరం ప్రాంతానికి చెందిన తాపీ పనులు చేసే కుటుంబంలో వరుసగా ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. వారు ముగ్గురు కూడా ప్రస్తుతం స్కూల్ కి వెళ్తున్నారు. అయితే తల్లికి మాత్రం మగసంతానంపై మమకారం వెంటాడుతూనే ఉంది. అందుకనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్నట్లు నమ్మించి ఆ తర్వాత గర్భం దాల్చింది. ఈ విషయాన్ని ఎవరికీ తెలియనీయలేదు. అబ్బాయి పుడితే అందరికి చెబుదాం. అమ్మాయి పుడితే ఎవరికి తెలియకుండా మాయం చేద్దామని ఉద్దేశం ఉంది.బంధుమిత్రులకు చుట్టుపక్కల ఎవరికి ఈ విషయం తెలియనివ్వలేదు. చివరికి భర్తకు కూడా అనుమానం రాకుండా మసులుకుంది. పొట్ట పెరుగుతుందని భర్త అడిగితే ఈ మధ్యన ఎక్కువగా తినడం వల్ల పెరుగుతుందని నమ్మబలికింది. స్థానిక వైద్య సిబ్బందికి, అంగన్వాడీలకు గర్భిణీ అనే సమాచారాన్ని ఇవ్వలేదు. అందుకు కావలసిన వైద్య సేవలు కూడా పొందలేదు. ఈ పరిస్థితుల్లో ఆదివారం పురిటి నొప్పులు వచ్చాయి. అది గమనించిన ఆ తల్లి భర్తను పిల్లలను చర్చకు పంపించింది.తనకు తానే పురుడు పోసుకుంది. అందుబాటులో ఉన్న కత్తిపీటతో ప్రేగును కత్తిరించింది. అమ్మాయి పుట్టిందని గమనించిన వెంటనే ముందుగా అనుకున్న పథకం ప్రకారం నైటిలో ఆ బిడ్డను చుట్టేసి 20 అడుగుల ఎత్తులో నుంచి తుప్పల్లోకి విసిరేసింది. అక్కడ చెత్త చెదరంతో పాటు పందులు సంచరిస్తూ ఉంటాయి.అక్కడ నుంచి ఆమె ఇంటికి వెళ్ళి పోయి స్నానం చేసి ఎవరికి అనుమానం రాకుండా మచులుకుంది.
అయితే ఆ తుప్పల నుంచి ఏడుపు వినిపిస్తుండటంతో చుట్టుపక్కల వారు అక్కడకి వెళ్ళి చూడగా ముద్దులొలికే పండంటి ఆడశిసువు కనబడిరది. కాలుకి చిన్న రాపిడిగాయం తప్ప అంతా క్షేమంగా ఉంది. అయితే ఆ అమ్మాయి ఎవరనేది అందులోనూ చర్చ మొదలైంది. బయటనుండి ఎవరో అక్కడకు వచ్చి పాడేసే అవకాశం లేనందున అక్కడి వారి పిల్లే అయివుతుందని నిద్దారణకు వచ్చి ఆరా తీయడం మొదలు పెట్టారు.
ఇంతలో అందరితో పాటు భర్త అక్కడికి వచ్చి చూస్తే ఆ పిల్లకు చుట్టి ఉన్న నైటీ తన భార్యదని గుర్తించాడు.ఆ నైటీ ఆధారంగా ఇంటికెళ్లి భార్యను నిలదీసాడు. దీంతో జరిగిన విషయం ఒప్పుకొని ఆ తల్లి కన్నీరు మున్నీరుగా వెల్లపించడం మొదలుపెట్టింది. మగ సంతానంపై ఉన్న మమకారంతో ఇలా చేశానని గగ్గోలు పెట్టింది.వెంటనే తల్లి బిడ్డను కడియం ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అయితే వారు అక్కడి నుంచి రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం అక్కడ తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు, బంధువులు తెలిపారు. ఈ సంఘటన సోమవారం నుంచి ఈ ప్రాంతంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు
జగిత్యాల జనవరి 07 (ప్రజా మంటలు):
తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ని శ్రీ గాయత్రీ అనాధ వృద్దాశ్రమంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా హరి అశోక్ కుమార్ సంక్రాంతి పర్వదినం విశిష్టతను తెలిపి,,వయో వృద్ధుల చట్టం పై... తెలంగాణ సమగ్రాభివృద్ధికి జాగృతి బ్లూప్రింట్ సిద్ధం: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ జనవరి 07 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం తెలంగాణ జాగృతి బ్లూప్రింట్ రూపొందిస్తోంది. ఈ దిశగా “పుష్కరకాల తెలంగాణ రాష్ట్రం – సంపూర్ణ అధ్యయనం” సహా 30కి పైగా అంశాలపై ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. ఎడ్యుకేషన్, హెల్త్, ఎంప్లాయిమెంట్, రైతులు, ఎస్సీ–ఎస్టీ–బీసీ–ఎంబీసీ సాధికారత, మహిళలు, యువత, మైనార్టీలు, గల్ఫ్ కార్మికులు,... ఎంఐఎం బలోపేతానికి సమన్వయంతో పని చేయాలి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్.
జగిత్యాల జనవరి 7 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా, టౌన్ కార్యవర్గాల ఏకగ్రీవ ఎన్నిక.
ఎంఐఎం బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ అన్నారు. బుధవారం పట్టణంలోని రాయల్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన జగిత్యాల జిల్లా,
ఈ... చీఫ్ మినిస్టర్స్ కప్–2వ ఎడిషన్ 2025 పోస్టర్ ఆవిష్కరణ
హైదరాబాద్ జనవరి 07 (ప్రజా మంటలు):
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ నెలలో నిర్వహించనున్న చీఫ్ మినిస్టర్స్ కప్ – 2వ ఎడిషన్ 2025 క్రీడా పోటీల పోస్టర్ను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించారు.
ఈ క్రీడా పోటీలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల 8... 69వ SGF రాష్ట్ర స్థాయి అండర్–17 హాకీ పోటీలకు జ్యోతి విద్యార్థులు ఎంపిక
జగిత్యాల, జనవరి 07 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలోని జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీకి చెందిన విద్యార్థులు 69వ SGF రాష్ట్ర స్థాయి అండర్–17 హాకీ పోటీలకు ఎంపికై పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు.
పాఠశాలకి చెందిన మేన్నేని సహస్ర (9వ తరగతి), కర్నె శ్రీనిధి (10వ తరగతి) విద్యార్థులు నవంబర్ 3న హుజురాబాద్లోని ప్రభుత్వ ఉన్నత... మహిళా సంఘం సభ్యులు చదవడం రాయడం నేర్చుకుని అందరికీ ఆదర్శంగా నిలవాలి_మెప్మా ఏవో బి.శ్రీనివాస్
కోరుట్ల జనవరి 07 (ప్రజా మంటలు):
*'అమ్మకు అక్షర మాల' కార్యక్రమం నిర్వహణ*మహిళా సంఘం సభ్యులు రాయడం చదవడం నేర్చుకుని ఆదర్శంగా నిలవాలని మెప్మా ఏవో శ్రీనివాస్ అన్నారు.స్వయం సహాయక మహిళా సంఘం సభ్యులకు చదవడం, వ్రాయడం నేర్చుకొనుటకు రూపొందించిన "అమ్మకు అక్షర మాల" కార్యక్రమం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా... మహిళా సంఘం సభ్యులు చదవడం రాయడం నేర్చుకుని అందరికీ ఆదర్శంగా నిలవాలి_మెప్మా ఏవో బి.శ్రీనివాస్
కోరుట్ల జనవరి 7 ( ప్రజా మంటలు) *అమ్మకు అక్షర మాల' కార్యక్రమం నిర్వహణమహిళా సంఘం సభ్యులు రాయడం చదవడం నేర్చుకుని ఆదర్శంగా నిలవాలని మెప్మా ఏవో శ్రీనివాస్ అన్నారు.స్వయం సహాయక మహిళా సంఘం సభ్యులకు చదవడం, వ్రాయడం నేర్చుకొనుటకు రూపొందించిన "అమ్మకు అక్షర మాల" కార్యక్రమం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా... ప్రధాని సంసద్ ఖేల్ మహోత్సవం–2026ను విజయవంతం చేయాలి :
సికింద్రాబాద్, జనవరి 7 (ప్రజామంటలు):
ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం–2026 ను సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో విజయవంతం చేయాలని బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ కన్వీనర్ టి. రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం బోయిగూడలోని గొల్ల కొమురయ్య కాలనీలో బీజేపీ బన్సీలాల్పేట్ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. .నియోజకవర్గంలో జరుగుతున్న... డ్రగ్స్, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి – జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
రాయికల్ జనవరి 7 ( ప్రజా మంటలు)డ్రగ్స్, మాదకద్రవ్యాల మహమ్మారిని సమాజం నుండి పూర్తిగా నిర్మూలించి భావితరాలకు ఆరోగ్యకరమైన, సురక్షితమైన భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.
రాయికల్
ఈ... సైబర్ నేరాలపై అవగాహన సదస్సు
ఇబ్రహీంపట్నం జనవరి 7 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
జగిత్యాల అశోక్ కుమార్ ఆదేశాల మేరకు బుధవారం రోజున ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల (కేజీబీవీ) విద్యార్థులకు సైబర్,డ్రగ్స్, ట్రాఫిక్ మరియు ఉమెన్ ట్రాఫికింగ్ లాంటి పలు అంశాల పైన అవగాహన సదస్సు ను ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. సర్పంచ్, ఉప సర్పంచ్,వార్డ్ సభ్యులకు శాలువాతో సన్మానం
గొల్లపల్లి జనవరి 07 (ప్రజా మంటలు):
కథలాపూర్ మండల కేంద్రంలో పద్మశాలి కమ్యూనిటీ భవనంలో బుధవారం జగిత్యాల్ జిల్లా పద్మశాలి కమ్యూనిటీ కార్యవర్గ సభ్యుడు పులి హరిప్రసాద్ ఆధ్వర్యంలో కథలాపూర్ మండలంలోని ఆయా గ్రామాలలోని సర్పంచ్ ఉప సర్పంచులు వార్డు సభ్యులు పద్మశాలి కమ్యూనిటీ సభ్యులను శాలువాతో ఘనంగా సన్మానించారు
ఈ కార్యక్రమంలో కథలాపూర్ మండల... జగిత్యాల మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగరవేయాలి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
జగిత్యాల జనవరి 7 ( ప్రజా మంటలు) జగిత్యాల మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగుర వేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
జిల్లా బి ఆర్ యస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్, జిల్లా బి ఆర్ యస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు , జిల్లా తొలి జడ్పీ... 