మళ్లీ అమ్మాయి పుట్టిందని తుప్పల్లో పడేసిన తల్లి క్షేమంగా బయటపడ్డ పసికందు

On
మళ్లీ అమ్మాయి పుట్టిందని తుప్పల్లో పడేసిన తల్లి  క్షేమంగా బయటపడ్డ పసికందు

మళ్లీ అమ్మాయి పుట్టిందని తుప్పల్లో పడేసిన తల్లి

క్షేమంగా బయటపడ్డ పసికందు

 

రాజమండ్రి ఏప్రిల్‌ 15 (ప్రజామంటలు): మగ సంతానం పై ఉన్న మమకారం ఓ తల్లిని మానవత్వం లేకుండా చేసింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన అప్పుడే పుట్టిన పసికందును ఇరవై అడుగుల ఎత్తు నుంచి తుప్పల్లోకి విసిరేసింది. ఆ తర్వాత తప్పు తెలుసుకుని కన్నీరు మున్నేరుగా విలపిస్తుంది. ఈ హృదయ విధారకరమైన సంఘటన తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో చోటుచేసుకుంది. ఇటువంటి సంఘటన గతంలో ఎక్కడ ఎప్పుడు జరిగి ఉండకపోవచ్చు. స్థానికులు, బంధువులు, వైద్యులు తెలిపిన ఈ సంఘటన వివరాలు ఎలా ఉన్నాయి.

        వేమగిరి గణపతినగరం ప్రాంతానికి చెందిన తాపీ పనులు చేసే కుటుంబంలో వరుసగా ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. వారు ముగ్గురు కూడా ప్రస్తుతం స్కూల్‌ కి వెళ్తున్నారు. అయితే తల్లికి మాత్రం మగసంతానంపై మమకారం వెంటాడుతూనే ఉంది. అందుకనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేసుకున్నట్లు నమ్మించి ఆ తర్వాత గర్భం దాల్చింది. ఈ విషయాన్ని ఎవరికీ తెలియనీయలేదు. అబ్బాయి పుడితే అందరికి చెబుదాం. అమ్మాయి పుడితే ఎవరికి తెలియకుండా మాయం చేద్దామని ఉద్దేశం ఉంది.బంధుమిత్రులకు చుట్టుపక్కల ఎవరికి ఈ విషయం తెలియనివ్వలేదు.  చివరికి భర్తకు కూడా అనుమానం రాకుండా మసులుకుంది. పొట్ట పెరుగుతుందని భర్త అడిగితే ఈ మధ్యన ఎక్కువగా తినడం వల్ల పెరుగుతుందని నమ్మబలికింది. స్థానిక వైద్య సిబ్బందికి,  అంగన్వాడీలకు గర్భిణీ అనే సమాచారాన్ని ఇవ్వలేదు. అందుకు కావలసిన వైద్య సేవలు కూడా పొందలేదు.  ఈ పరిస్థితుల్లో ఆదివారం పురిటి నొప్పులు వచ్చాయి. అది గమనించిన  ఆ తల్లి భర్తను పిల్లలను చర్చకు పంపించింది.తనకు తానే పురుడు పోసుకుంది. అందుబాటులో ఉన్న కత్తిపీటతో ప్రేగును కత్తిరించింది. అమ్మాయి పుట్టిందని గమనించిన వెంటనే ముందుగా అనుకున్న పథకం ప్రకారం నైటిలో ఆ బిడ్డను చుట్టేసి 20 అడుగుల ఎత్తులో నుంచి తుప్పల్లోకి విసిరేసింది. అక్కడ చెత్త చెదరంతో పాటు పందులు సంచరిస్తూ ఉంటాయి.అక్కడ నుంచి ఆమె ఇంటికి వెళ్ళి పోయి స్నానం చేసి ఎవరికి అనుమానం రాకుండా మచులుకుంది.

         అయితే ఆ తుప్పల నుంచి ఏడుపు వినిపిస్తుండటంతో చుట్టుపక్కల వారు అక్కడకి వెళ్ళి చూడగా ముద్దులొలికే పండంటి ఆడశిసువు కనబడిరది. కాలుకి చిన్న రాపిడిగాయం తప్ప అంతా క్షేమంగా ఉంది. అయితే ఆ అమ్మాయి ఎవరనేది అందులోనూ చర్చ మొదలైంది. బయటనుండి ఎవరో అక్కడకు వచ్చి పాడేసే అవకాశం లేనందున అక్కడి వారి పిల్లే అయివుతుందని నిద్దారణకు వచ్చి ఆరా తీయడం మొదలు పెట్టారు.

           ఇంతలో అందరితో పాటు భర్త అక్కడికి వచ్చి చూస్తే ఆ పిల్లకు చుట్టి ఉన్న నైటీ తన భార్యదని గుర్తించాడు.ఆ నైటీ ఆధారంగా ఇంటికెళ్లి భార్యను నిలదీసాడు. దీంతో జరిగిన విషయం ఒప్పుకొని ఆ తల్లి కన్నీరు మున్నీరుగా వెల్లపించడం మొదలుపెట్టింది. మగ సంతానంపై ఉన్న మమకారంతో ఇలా చేశానని గగ్గోలు పెట్టింది.వెంటనే తల్లి బిడ్డను కడియం ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అయితే వారు అక్కడి నుంచి రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం అక్కడ తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు, బంధువులు తెలిపారు. ఈ సంఘటన సోమవారం నుంచి ఈ ప్రాంతంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Tags
Join WhatsApp

More News...

బీర్పూర్ మండలం తుంగూరు గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం

బీర్పూర్ మండలం తుంగూరు గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం బీర్పూర్ డిసెంబర్ 22 (ప్రజా మంటలు)ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో  గెలుపొందిన నూతన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్ ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జగిత్యాల నియోజకవర్గం బీర్పూర్ మండలం తుంగూరు గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారోత్సవం ఘనంగా జరిగింది. సోమవారం  విజయం సాధించిన గ్రామపంచాయతీ సర్పంచ్లు ఉప సర్పంచ్ లు...
Read More...

హరిహరాలయంలో ఘనంగా మూలమూర్తికి అభిషేకం

హరిహరాలయంలో ఘనంగా మూలమూర్తికి అభిషేకం   జగిత్యాల డిసెంబర్ 22 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో పుష్య మాసము తొలి సోమవారం సాయంత్రం మూలమూర్తికి వివిధ ఫల రసాధులచే అభిషేకం నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణతో పాటు వేద ఆశీర్వచనం చేశారు ఇదిలా ఉండగా ఏ ఎస్ ఐ...
Read More...
Local News  State News 

రూ.3855.02 కోట్ల వ్యాపారానికి చేరుకున్న గాయత్రి బ్యాంకు : కొడిమ్యాల‌లో 68వ శాఖ ప్రారంభం

రూ.3855.02 కోట్ల వ్యాపారానికి చేరుకున్న గాయత్రి బ్యాంకు : కొడిమ్యాల‌లో 68వ శాఖ ప్రారంభం జగిత్యాల, డిసెంబర్ 23 (ప్రజా మంటలు): జగిత్యాల కేంద్రంగా పనిచేస్తున్నది. గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లిమిటెడ్ మరో కీలక మైలురాయిని చేరుకుంది. కొడిమ్యాల మండల కేంద్రంలో బ్యాంకు 68వ శాఖను జగిత్యాల జిల్లా కలెక్టర్ & మెజిస్ట్రేట్ బి. సత్యప్రసాద్ ఐఏఎస్ చేతుల మీదుగా సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా...
Read More...

కస్టడీ మృతిపై తీవ్ర ఆరోపణలు: విచారణకు ఆదేశించిన TGHRC

కస్టడీ మృతిపై తీవ్ర ఆరోపణలు: విచారణకు ఆదేశించిన TGHRC హైదరాబాద్ డిసెంబర్ 22 (ప్రజా మంటలు): కర్లా రాజేష్ కస్టడీ మృతికి సంబంధించి వచ్చిన తీవ్ర ఆరోపణలను తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) పరిగణనలోకి తీసుకుంది. SR నెం.4129, 4130 ఆఫ్‌ 2025 కేసుల్లో అక్రమ నిర్బంధం, కస్టడీలో చిత్రహింసలు, తప్పుడు కేసు నమోదు వల్లే రాజేష్ మృతి చెందినట్లు ఆరోపణలు ఉన్నాయని కమిషన్...
Read More...

ప్రజా సమస్యలను పట్టించుకొని కేసీఆర్‌ : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విమర్శలు

ప్రజా సమస్యలను పట్టించుకొని కేసీఆర్‌ : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విమర్శలు కరీంనగర్, డిసెంబర్ 22 (ప్రజా మంటలు): కరీంనగర్ ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సుడ ఛైర్మెన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. జూబ్లీహిల్స్‌తో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మార్పును కోరుతూ కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారని తెలిపారు. మాజీ సీఎం...
Read More...

ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు సమగ్ర విచారణ జరిపి పరిష్కారానికి చొరవ చూపాలి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు సమగ్ర విచారణ జరిపి పరిష్కారానికి చొరవ చూపాలి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాల డిసెంబర్ 22 (ప్రజా మంటలు) ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పలు సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు మండలాల నుండి ప్రజలు సమస్యలు విన్నవించుకోడానికి ప్రజావాణికి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పై సమగ్ర విచారణ చేపట్టి...
Read More...
Local News 

జగిత్యాలలో నూతన సర్పంచులకు జీవన్ రెడ్డి శుభాకాంక్షలు

జగిత్యాలలో నూతన సర్పంచులకు జీవన్ రెడ్డి శుభాకాంక్షలు జగిత్యాల, డిసెంబర్ 22 (ప్రజా మంటలు): జగిత్యాల నియోజకవర్గంలోని లక్ష్మిపూర్, నర్సింగపూర్, చల్గల్, దరూర్, సింగారవుపేట్, అల్లిపూర్, ఉప్పమడుగు, అయోధ్య, మహితపూర్ గ్రామాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులకు మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న జీవన్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామాలతో తనకు...
Read More...

సీపీఆర్ చేసి వృద్ధుడి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ హోం గార్డ్: అభినందించి రివార్డ్ అందజేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

సీపీఆర్ చేసి వృద్ధుడి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ హోం గార్డ్: అభినందించి రివార్డ్ అందజేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్   జగిత్యాల డిసెంబర్ 22 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి స్పృహ కోల్పోగా,  అతనికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ హోం గార్డ్ చంద్రశేఖర్ ను సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు. జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ శాలువతో సన్మానించి రివార్డును...
Read More...
Local News  State News 

గద్వాల్‌ జిల్లాలో అక్షరాస్యత, రోడ్లు, సాగునీటి వైఫల్యాలపై కవిత తీవ్ర విమర్శలు

గద్వాల్‌ జిల్లాలో అక్షరాస్యత, రోడ్లు, సాగునీటి వైఫల్యాలపై కవిత తీవ్ర విమర్శలు గద్వాల్, డిసెంబర్ 22 (ప్రజా మంటలు): జోగులాంబ గద్వాల్ జిల్లాలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విస్తృతంగా పర్యటించారు. సాగునీటి ప్రాజెక్టులు, విద్యా సంస్థలు, నిర్వాసితుల సమస్యలు, రైతుల ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించి ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు. రాజకీయ మార్పే పరిష్కారం “70 ఏళ్లుగా...
Read More...
Local News  State News 

యావర్ రోడ్డు విస్తరణ జరిగితేనే రాజకీయాల్లో కొనసాగుతా:?

యావర్ రోడ్డు విస్తరణ జరిగితేనే రాజకీయాల్లో కొనసాగుతా:? జగిత్యాల / హైదరాబాద్ డిసెంబర్ 22 ప్రజా మంటలు: జగిత్యాల నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక అయిన యావర్ రోడ్డు విస్తరణపై జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో సీఎం కార్యాలయంలో ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా యావర్ రోడ్డు విస్తరణ జరిగితేనే మళ్లీ రాజకీయాల్లో కొనసాగుతా అని ఎమ్మెల్యే...
Read More...
Today's Cartoon  State News 

Today's Cartoon

Today's Cartoon
Read More...
Local News 

TDF-USA అట్లాంటా సహకారంతో పరమల ప్రభుత్వ స్కూల్ భవనం ప్రారంభం

TDF-USA అట్లాంటా సహకారంతో పరమల ప్రభుత్వ స్కూల్ భవనం ప్రారంభం సికింద్రాబాద్, డిసెంబర్ 21 (ప్రజా మంటలు): తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (TDF) యూఎస్ఏ అట్లాంటా చాప్టర్ సౌజన్యంతో కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం పరమల గ్రామంలో నూతన ప్రభుత్వ పాఠశాల భవనం, అదనపు క్లాస్‌రూమ్స్‌ను ప్రారంభించారు. టిడిఎఫ్–మన తెలంగాణ బడి ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అందించిన ఆర్థిక సహాయంతో ఈ నిర్మాణాలు పూర్తయ్యాయి....
Read More...