మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ తల్లి అనసూయ మృతి మృతికి పలువురి సంతాపం
On
మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ తల్లి అనసూయ మృతి
మృతికి పలువురి సంతాపం
జగిత్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 15 (ప్రజామంటలు): లంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ తల్లి అనసూయ మృతి పట్ల జగిత్యాల జిల్లా సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు ఎన్న0 కిషన్ రెడ్డి, పాత్రికేయులు శ్రీనివాస్, సంజీవరాజు, చంద్రశేఖర్, రోజా, లింగారెడ్డి, రవీందర్ రావు, కాంతారావు సంతాపం తెలిపారు.
కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ తల్లి హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అనసూయ (86) అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. మధుయాష్కీ కుటుంబానికి కిషన్ రెడ్డి తో పాటు పాత్రికేయులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Tags