ఆదర్శ పాఠశాల కమిటీల ఏర్పాటు బాధ్యతలు వివరాలపై సమీక్ష
ఆదర్శ పాఠశాల కమిటీల ఏర్పాటు బాధ్యతలు వివరాలపై సమీక్ష
జగిత్యాల ఏప్రిల్ 15( ప్రజామంటలు): జిల్లా కలెక్టర్ సమీకృత కార్యాలయంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఆధ్వర్యంలో అమ్మ ఆదర్శ పాఠశాల’ కమిటీల ఏర్పాటు, కమిటీల బాధ్యతలు, చేపట్టే పనుల వివరాల గురించి సమావేశం ఏర్పాటు చేయనైనది. ఇట్టి సమావేశంలో పాఠశాలల్లో మొదటగా ప్రాధాన్యత గల పనులను గుర్తించి అన్ము ఆదర్శ పాఠశాల కమిటీ అనుమతితో తీర్మాణం చేసి కలెక్టర్ అనుమతితో పనులు చేపట్టాలని సంబంధిత మండల ఎంపీడీవోల .ఇంజనీర్ల కమిటీ తీర్మాణం మేరకు త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సూచిస్తూ త్రాగునీరుకు, టాయిలెట్స్ కు, విద్యుత్ సౌకర్యాలు . మరియు చిన్న, పెద్ద మరమ్మత్తులకు వెంటనే త్వరితగతిన పూర్తి చేయాలని తెల్పినారు. ప్రతి 200 ఎంపీడీవో ఎంపీవో ఎంఈఓ ఏఈ ఏపీఎం హెచ్ఎం కమిటీ ప్రెసిడెంట్సు సమావేశమై ఏయే కార్యక్రమాలు చేపట్టులో తీర్మాణం చేశారు. ఇట్టి సమావేశంలో డిఆర్ డిఓ సీఈఓ డీఈవో డిపిఓ, ఎంపీడీవోలు ఎంపీ ఓ సీఈలు ఎంఈఓ లు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.