స్వయంకృతంతో భారాస ప్రజలకు దూరం అవుతుందా? తెలంగాణలో బిజేపి కి ఆశ్రయం ఇస్తుంది ఎవరు ? బిజేపికి సహకరిస్తే ఆత్మహత్యాసదృశ్యమే

On
స్వయంకృతంతో భారాస ప్రజలకు దూరం అవుతుందా?  తెలంగాణలో బిజేపి కి ఆశ్రయం ఇస్తుంది ఎవరు ?  బిజేపికి సహకరిస్తే ఆత్మహత్యాసదృశ్యమే

4th page article 04-042024

పరనిందతో తమ ప్రాభవాన్ని పదిలపరుచుకోలేరు

వ్యాపార, పారిశ్రామికవేత్తలతో పార్టీలు నిలవవు

భారాస నిర్లక్ష్య వైఖరే బిజేపికి బలం వ్యాపారాలే రాజకీయ పరమావధి కాకూడదు?

-సిహెచ్ వి ప్రభాకర్ రావు, సీనియర్ జర్నలిస్ట్. 9391533339

 కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలలో బాలహీనపడిన చోట సాధారణంగా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. ముఖ్యమగా ఉత్తర భారతంలోని బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్ లలో కాగణరెస్ నామ మాత్రం కావడానికి కారణం అక్కడి ప్రాంతీయ నాయకుల, ప్రజల ఆకానసఖ్యలను కాంగ్రెస్ పార్టీ గుర్తించక పోవడమే ప్రధాన కారణం. దక్షిణాన కర్ణాటకలో దేవ గౌడ నాయకత్వంలోని జే ది ఎస్ ఉన్నా, ఐ కర్ణాటకలోని ఒక ప్రాంతానికే పరిమితం కావడంతో, అక్కడ బిజేపి తన స్థానాన్ని పదిల పరుచుకోండి. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా, ప్రాంతీయ పార్టీలులు బలంగా లేవంటే అక్కడ బిజేపి తన ఉనికినిని చాటుకోవాడమే కాకుండా, బలంగా ఎదుగుతుంది. తమిళనాదువ నాగరేశ్ 1960-70 దశకంలో కనుమరుగు కాగా, కేరళ లో యునైటెడ్ ఫ్రంట్ లో భాగంగా మిగిలింది. ఇక తెలుగు రాష్ట్రాలలో తెలుగు దేశం పార్టీ ఆవిర్భావంతో కాంగ్రెస్ కు పెద్ద దెబ్బే తగిలింది. కాలనీ బిజేపి తెలుగుదేశం పార్టీతో పెట్టు పెట్టుకోవడంతో, ఇక్కడ అది తోక పార్టీగానే మిగిలిపోయింది.

ప్రత్యేక తెలంగాణ ఇస్తామన్నా, బిజేపిని ఉత్తరాది బనియా పార్టీగా గుర్తింపుఉన్న బిజేపి,  తెలుగు వారికి తెలంగాణ ప్రత్యేక ఉద్యమం కొంత చోటు ఇచ్చింది. అప్పటి తెరాస తో పోవటు లేకున్నా, వయమ పక్షయభావాలున్న వారికి, ఆ పార్టీల ప్రభావం ఉన్న ఉత్తర తెలంగాణలో భూస్వాములకు, పెత్తందార్లకు అనుకూలంగా, నక్సలైట్లకు వ్యతిరేకంగా పోరాడి ,ప్రభుత్వానికి అనుకూలంగా ఉండడం వల్ల గ్రామీణ ప్రాంతాలలోకి చొచ్చుక పోయింది. భారస ఉద్యమం తరువాత పక్కా రాజకీయ పార్టీగా మారిపోవడం, కాంగ్రెస్ రాష్ట్రంలో బలహీనపడడం తో ఆ శూన్యాన్ని బిజేపి పూరించే ప్రయత్నం చేస్తుంది. అదీకాక, కేంద్రంలో అధికారంలో ఉండడంతో, ఆ పార్టీకి ఆర్థిక పరిపుష్టి కలగడం, అధికార యంత్రాంగంపై పట్టు దొరకడంతో, తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలలో తెలుగు పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తూ, తెలుగు రాష్ట్రాలలో పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తుంది.

కేంద్రం అధికారంతో బిజేపి ఉనికి

కేంద్రంలో అధికారం ఉండడంతో ఆంధ్ర ప్రాంత కాంట్రాక్టర్ లను ప్రోత్సహించినా, ఆంధ్ర ప్రాంత ప్రజలలో బిజేపి స్థానం సంపాదించుకోలేకపోయింది. అక్కడా ఇకా తెలుగుదేశం పార్టెకి తోక పార్టీలనీ మిగిలిపోయింది. తెలంగాణలో మాత్రం, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో, ఎక్కడైతే గతంలో నక్సలైట్ల ప్రభావం అధికంగా ఉందో ఆయా ప్రాంతాలలో బిజేపి కొంత పుంజుకొనది. దీనికి ఖమ్మం జిల్లా మినహాయింపుగా చెప్పుకోవాలి. ఖమ్మం జిల్లా మొదటి నుండి వామపక్ష రాజకీయాలకు కేంద్రం అయినా, అక్కడి ప్రజల భావాలు, ఆంధ్ర ప్రాంత రాజకీయాలకు అనుగుణంగా ఉంటాయి. అక్కడి ప్రజలలో ఆంధ్రప్రాంత వలస నాయకులు ఎక్కువగా ఉండడం, జిల్లా చుట్టూ అంతా ఆంధ్ర ప్రాంతమే కావడంతో, అది మొదటి నుండి మిగతా తెలంగాణ ప్రజల భావాలతో కాకుండా, ఆంధతర ప్రాంత ప్రజల మానవ భావాలతో ఎక్కువగా కలిసిమెలిసి ఉంటుంది. అందుకే, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన రోజుల్లో కూడా, ఖమ్మం జిల్లాలో ఉద్యమ ప్రభావం అంతగా లేదు.

భారాస నిర్లక్ష్య వైఖరే బిజేపికి బలం

ప్రస్తుత పరిస్థితులలో బిజేపికీ ఉతమిస్తుంది భారాస పార్టీ వైఖరే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొన్నటిదాక స్తంబద్ధంగా ఉన్న కాంగ్రెస్, బి ఆర్ ఎస్ నియంతృత్వ పోకడల వల్ల ప్రజాలకన్నా, పార్టీ కింది స్థాయి నాయకుల కన్నా పెట్టుబడి దారులకు, పారిశ్రామిక వేత్తలకు, రియాలటర్లకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కింది స్థాయి మధ్యతరగతి వతలర్లు ఆ పార్టీకి దూరం అయ్యారు. ఈ అవకాశాన్ని గ్రామాస్తాయిలో ఇంకా కార్యకర్తలు ఉన్న కాంగ్రెస్ సరిగ్గా ఉపయోగించుకొని, బొటాయబోటి మెజారిటీతోనైనా, అధికారంలోకి వచ్చింది. డబ్బు సంపాదనే లక్ష్యంగా భారాస లో చేరిన రాజకీయ వ్యాపారవేత్తలు అందరూ ధికారం కోసం, తమ వ్యాపార లావాదేవీల కొనసాగింపు కొరకు మళ్ళీ అధికార పార్టీ అయిన కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇది వ్యాపారవేత్తల సహజ లక్షణం. వారివారి వ్యాపారాలు ఎలాంటి వొడిదోడుకులు లేకుండా కొనసాగలనే అధికార పార్టీ అండ తప్పని సారి.

అధికారం కోల్పోయిన భారాస పార్టీ ఇప్పటికీ క్షేత్ర స్థాయిలో ఉన్న కార్యకర్తల మోనో భావాలను గ్రహించలేకో. లేదా ఇంకా తమ అహంభావాన్ని విడవలేకో, పార్టీని ప్రక్షాళనం చేసే దిశలో కాకుండా, ఇంకా నాశనం చేసే దిశలో వెళుతున్నారు. కాంగ్రెస్ ను ఎదుర్కోవలంటే ముందు తాము బలంగా ఉండాలని, కనీసం ఊపిరితోనైనా ఉండాలనే వాస్తవాన్ని గ్రహించలేని భారాస, ఇంకా అధికార కాలంనాటి మత్తులోనే ఉన్నట్లు వ్యవహరిస్తున్నారు. అహదీకారం కోల్పోయి నాలుగు నెలలు కావస్తున్నా, పార్టీ ఓటమికి కారణాలను విశ్లేషించు కోవడానికి  పూర్తి స్థాయి సమావేశాలు నిర్వహించలేదు. కాంగ్రెస్ పార్టీ ని ఎలా అధికారంలో నుండి దించాలనే ప్రయత్నిస్తుంది తప్ప, క్షేత్ర స్థాయిలో తమను నమముక్కోని ఉన్న అసలైన కార్యకర్తలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, వారికి భరోసా కల్పించాల్సిన బాధ్యత పార్టీ అధినాయకత్వం ధే అనే భావనలో మాత్రం లేరనే విశ్లేషకులు భావిస్తున్నారు.

వ్యాపారాలే రాజకీయ పరమావధి కాకూడదు?

రాజకీయ అవగాహనతో కాకుండా, తమ వ్యాపార అవగాహనతో, ఆర్థిక లావాదేవిలే ప్రధానంగా ఇన్నాళ్ళూ కొనసాగిన భారాస రాజకీయాలనే ఇంకా కొనసాగించాలనుకోవడం, నాయకుల తీరుపై ఎలాంటి విమర్శలు, సమీక్షలు చేసుకోకుండా, ప్రజల వ్యతిరేకతను కూడగట్టుకొన్న కోటరీ కె ఇంకా పెద్దపీట వేయడంతో, ప్రజా, ధన బలం ఉన్న  నాయకఉలు అటు అధికార పార్టీ అయిన కాంగ్రెస్ లోకో, మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వస్తునాదనే నమ్మకంతో బిజేపి లోకి వెళ్లిపోతున్నా, వారిని కట్టడి చేయడంలో భారాస అధినాయకత్వం విఫలం అయింది. ఇన్నాళ్ళూ ఎవరిపై కోపంతో, ద్వేషంతో ఉన్నారో వారినే మళ్ళీ ముందు పెట్టి రాజకీయయాలను నడపాలని చూడదమే భారసా చేస్తున్న పెద్ద తప్పుగా భావిస్తున్నారు.

కుటుంబ పార్టీగా నారిందని, ఆర్థిక, వ్యాపార బలం ఉన్న వారికే కోటరీ ప్రాధాన్యత ఇస్తుందనే వాదనలను ;వినిపించిన, కొంతమంది పార్టీ నాయకుల,పార్టీ వ్యతిరేకుల ప్రచారాన్ని, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టే విధంగా భారాస అధినేత కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకొన్నట్లు ప్రజలు గ్రహించలేదు. అదీ కాకుండా, ఇంకా అన్నీ విషయాలలో వారికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు వారి చర్యలు తెలుపుతున్నాయి.  పార్టీలో అందరూ వలస నాయకులు వెళ్లిపోయినా, ఉద్యమ కాలంనాటి సహాచారులను అందరినీ కూడదీసుకోవడానికి బదులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి బిజేపితో కలిసి భారాస జప్రాయత్నిస్తుందనే ప్రచాలానికి ఊతమిచ్చే విధంగా వ్యవహరించడంతో, భారాస ను ప్రజలు శంకిస్తున్నారు. ప్రభుత్వం ఉంటే ఏమిటి, కూలితే ఏమిటి? తిరిగి అధికారంలోకి రావడానికి, అననికంటే ముందు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం గౌరవప్రదమైన సీట్లను గెలవడానికి కృషి చేయాల్సిన పార్టీ, ఇంకా మీనా మేషాలు లెక్కించడం, గతంలో చేసిన తప్పులే మళ్ళీమల్లి చేయడంతో, ఒక విధంగా ప్రజలు విసిగిపోయారు.

 

బిజేపికి సహకరిస్తే ఆత్మహత్యాసదృశ్యమే

బిజేపి పార్టీకి ఏవిధంగా సహకరించినా, అది ఆయా పార్టీలకు ఆత్మహత్యాసదృశ్యం అయిందనేది చరిత్ర. బిజేపి పార్టీ తన ఉనికిని పెంచుకోవడానికి, తానే ఏకైక పార్టీగా నిలవడానికి ప్రయత్నించడం తప్పు కాదు. ఎవరైనా అదే చేస్తారు. అన్ని రాష్ట్రాలలో తనతో పొత్తుపెట్టుకొన్న చిన్నచిన్న పార్టీల ఉనికిని మాయం చేసిన చరిత్ర బిజేపి పార్టీది.  ఈ వాస్తవాన్నికాదని, కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి బజపకీ పరోక్షంగా సహకరిస్తే, చివరికి నష్టపోయేది భారాస పార్టీ కాదు తెలంగాణలోని ప్రజాలనే వాస్తవాన్ని భారాస గ్రహించాలి. భారాస ఖాళీ చేసిన రాజకీయ స్థాననాన్ని ఆక్రమించేది బిజేపి. మొగుడు కొట్టిందని కాకుండా, తోటి కోడలు నవ్విందనే  పాత సామెతలా వ్యవహరిసే నష్టం ప్రజాలకే కాదు భారాస ఉనికికే.

  

Tags
Join WhatsApp

More News...

State News 

జగిత్యాలలో కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు తీవ్రం.. సంజయ్ కుమార్‌పై జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు

జగిత్యాలలో కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు తీవ్రం.. సంజయ్ కుమార్‌పై జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు కాంగ్రెస్ వీడే పరిస్థితి ఎందుకు వచ్చింది? జీవన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్జగిత్యాల రాజకీయాలు హీట్.. ఎమ్మెల్యేపై మాజీ మంత్రి ఆగ్రహంకాంగ్రెస్‌లో చిచ్చు పెట్టిందెవరు? జీవన్ రెడ్డి బహిరంగ విమర్శలుజగిత్యాల మార్చ్ 27 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి తాటిపర్తి...
Read More...
Local News 

రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు మౌంట్ కార్మెల్ హైస్కూల్ విద్యార్థిని జి.శివాణి ఎంపిక.

రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు మౌంట్ కార్మెల్ హైస్కూల్ విద్యార్థిని జి.శివాణి ఎంపిక. జగిత్యాల 16 మార్చి (ప్రజా మంటలు) :  ఈ నెల 20 నుండి 22 వరకు హైదరాబాద్ వాక్సన్ యూనివర్శిటీ లో జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్స్ బాస్కెట్‌బాల్ పోటీలకి జగిత్యాల ధరూర్ లోని మౌంట్ కార్మెల్ హైస్కూల్ కి చెందిన జి.శివాణి  ఎంపిక కావడము జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థినిని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ జ్యోతిస్మరియ,...
Read More...
Local News 

ఇక కాంగ్రెస్ కు రామ్ రామ్  కారు ఎక్కనున్న  మాజీ మంత్రి జీవన్ రెడ్డి

ఇక కాంగ్రెస్ కు రామ్ రామ్  కారు ఎక్కనున్న  మాజీ మంత్రి జీవన్ రెడ్డి   ?జగిత్యాల మార్చి 16 ( ప్రజా మంటలు) మాజీ మంత్రి జీవన్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీకి రామ్ రామ్ చెప్పనున్నట్లు ప్రజల్లో చర్చలు జరుగుతున్నాయి. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎన్నో ఉత్తాన పతనాలను ఎదుర్కొని మొక్కవోని ధైర్యంతో కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి...
Read More...
Local News 

సంచార జాతుల సమగ్ర సర్వే పుస్తక ఆవిష్కరణ

సంచార జాతుల సమగ్ర సర్వే పుస్తక ఆవిష్కరణ జగిత్యాల మార్చి 16 ( ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని  9వ వార్డులో వార్డ్ కౌన్సిలర్ వానరాశి తిరుమలయ్య సహకారంతో జరిగిన ముందస్తు ఉగాది వేడుకల కార్యక్రమంలో భాగంగా సామాజిక సమరసత వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో" సంచార జాతులు-సమగ్ర సర్వే"పుస్తకావిష్కరణ చేయటం జరిగింది. సామాజిక సమరసత కార్యకర్తలు తెలంగాణ అన్ని ప్రాంతాల్లోని దాదాపు...
Read More...
Comment  State News 

జగిత్యాల రాజకీయాల్లో జీవన్ రెడ్డి కొత్త సంకేతాలు : అధిష్ఠానం మాట వినని జీవన్ రెడ్డి

జగిత్యాల రాజకీయాల్లో జీవన్ రెడ్డి కొత్త సంకేతాలు : అధిష్ఠానం మాట వినని జీవన్ రెడ్డి బీఆర్‌ఎస్‌/ బీజేపీ లోకి వెళితే పరిస్థితి? రాజకీయ భవిష్యత్తుపై అనిశ్చితి జగిత్యాల మార్చ్ 16 (ప్రజా మంటలు): జగిత్యాల రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలకుపైగా కాంగ్రెస్ పార్టీకి అంకితమై పనిచేసిన మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఆయన ఇంటి ముందు గతంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జాతీయ,...
Read More...
Local News 

ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి

ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి జగిత్యాల డిసెంబర్ 16 (ప్రజా మంటలు)గత నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన డిగ్రీ కళాశాల విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ జగిత్యాల పట్టణంలోని వివిధ డిగ్రీ కళాశాలకు చెందిన అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది సోమవారం రోజున జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో  వినతి పత్రం...
Read More...
Crime  State News 

కొడిమ్యాల మండలంలో మళ్లీ పెద్దపులి దాడి – రెండో రోజు మరో ఆవు బలి, భయాందోళనలో గ్రామస్తులు

కొడిమ్యాల మండలంలో మళ్లీ పెద్దపులి దాడి – రెండో రోజు మరో ఆవు బలి, భయాందోళనలో గ్రామస్తులు కొడిమ్యాల, మార్చి 16 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని గంగారం తండాలో మళ్లీ పెద్దపులి దాడి జరగడంతో గ్రామస్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వరుసగా రెండో రోజు పులి దాడి చేసి మరో ఆవును చంపింది.గ్రామానికి చెందిన రైతు తేజావాద్ మోతీలాల్‌కు చెందిన ఆవుపై సోమవారం పెద్దపులి దాడి చేసి చంపింది....
Read More...
Local News 

రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు మౌంట్ కార్మెల్ హైస్కూల్ విద్యార్థిని జి.శివాణి ఎంపిక

రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు మౌంట్ కార్మెల్ హైస్కూల్ విద్యార్థిని జి.శివాణి ఎంపిక జగిత్యాల మార్చి 16(ప్రజా మంటలు)ఈ నెల 20 నుండి 22 వరకు హైదరాబాద్ వాక్సన్ యూనివర్శిటీ లో జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్స్ బాస్కెట్‌బాల్ పోటీలకి జగిత్యాల ధరూర్ లోని  మౌంట్ కార్మెల్ హైస్కూల్ కి చెందిన జి.శివాణిఎంపిక కావడము జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థినిని పాఠశాల *ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ జ్యోతిస్మరియ, సిస్టర్స్ రెజిన,లిల్లీ,రాణి, వ్యాయామ...
Read More...
State News 

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై కవిత ఆగ్రహం – డిఫమేషన్ కేసు వేస్తా, మూసీ ప్రక్షాళనపై తీవ్ర విమర్శలు

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై కవిత ఆగ్రహం – డిఫమేషన్ కేసు వేస్తా, మూసీ ప్రక్షాళనపై తీవ్ర విమర్శలు .“హైడ్రాపై కవిత తీవ్ర ఆరోపణలు: పేదల ఇళ్లు కూల్చి పెద్దలను కాపాడుతున్నారా?”“మూసీ ప్రక్షాళనలో 1400 కోట్లు ఎలా పెరిగాయి? ప్రభుత్వం సమాధానం చెప్పాలి: కవిత”“హైడ్రా వీడియోలు వెంటనే తొలగించాలి.. లేదంటే కోర్టు!” – రంగనాథ్‌కు కవిత హెచ్చరిక“మూసీ ప్రక్షాళన పేరుతో ప్రజాధనం దోపిడీ జరుగుతోంది: కవిత సంచలన వ్యాఖ్యలు” వెలుగుమట్ల...
Read More...
Local News 

బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ,ధర్మసమాజ్ పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో కాన్సిరాం మహారాజ్  92వ జయంతి ఉత్సవాలు

బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ,ధర్మసమాజ్ పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో కాన్సిరాం మహారాజ్  92వ జయంతి ఉత్సవాలు    జగిత్యాల మార్చి 15) ప్రజా మంటలు)  జిల్లా  దేవిశ్రీ గార్డెన్ లో నిర్వహించడం జరిగింది .కాన్షిరం  కలలు కన్నా రాజ్యాన్ని తెలంగాణ గడ్డపై డాక్టర్ విశారదన్ మహరాజ్  నాయకత్వంలో సాధించి ఆయనకి ఘన నివాళులు అర్పిస్తాం అని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షుడు మానల కిషన్, ఇంచార్జి దువ్వక శివ మహారాజ్,...
Read More...
Local News 

ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వేడుకలు

ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వేడుకలు   జగిత్యాల మార్చి 15 ( ప్రజా మంటలు)జిల్లా కేంద్రం కూరగాయల మార్కెట్ లోని,,శ్రీ శ్రీనివాస, ఆంజనేయ,భవాని, శంకర, దేవాలయంలో, ప్రతి మాసం, వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రమైన శ్రవణా నక్షత్రం పురస్కరించుకొని, శ్రీదేవి,భూదేవి,సమేత శ్రీ శ్రీనివాసుని కళ్యాణం ఘనంగా జరిగింది.    ప్రతి శనివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు సత్సంగం...
Read More...
Local News 

జిల్లా కేంద్రంలో ఇంటర్మీడియట్ మూల్యాంకనం ప్రారంభం

జిల్లా కేంద్రంలో ఇంటర్మీడియట్ మూల్యాంకనం ప్రారంభం   జగిత్యాల మార్చి 14 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల లో 15 .03.2026 ఆదివారం నుండి మొదటి విడత మూల్యాంకనము ప్రారంభమవుతుందని క్యాంప్ ఆఫీసర్  బి నారాయణ తెలిపారు మొదటి విడతలో ఆంగ్లము,తెలుగు, హిందీ, గణితము మరియు రాజనీతి శాస్త్రము (సివిక్స్) మొదలైన సబ్జెక్టులలో మూల్యాంకనము...
Read More...