స్వయంకృతంతో భారాస ప్రజలకు దూరం అవుతుందా? తెలంగాణలో బిజేపి కి ఆశ్రయం ఇస్తుంది ఎవరు ? బిజేపికి సహకరిస్తే ఆత్మహత్యాసదృశ్యమే

పరనిందతో తమ ప్రాభవాన్ని పదిలపరుచుకోలేరు
వ్యాపార, పారిశ్రామికవేత్తలతో పార్టీలు నిలవవు
భారాస నిర్లక్ష్య వైఖరే బిజేపికి బలం వ్యాపారాలే రాజకీయ పరమావధి కాకూడదు?
-సిహెచ్ వి ప్రభాకర్ రావు, సీనియర్ జర్నలిస్ట్. 9391533339
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలలో బాలహీనపడిన చోట సాధారణంగా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. ముఖ్యమగా ఉత్తర భారతంలోని బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్ లలో కాగణరెస్ నామ మాత్రం కావడానికి కారణం అక్కడి ప్రాంతీయ నాయకుల, ప్రజల ఆకానసఖ్యలను కాంగ్రెస్ పార్టీ గుర్తించక పోవడమే ప్రధాన కారణం. దక్షిణాన కర్ణాటకలో దేవ గౌడ నాయకత్వంలోని జే ది ఎస్ ఉన్నా, ఐ కర్ణాటకలోని ఒక ప్రాంతానికే పరిమితం కావడంతో, అక్కడ బిజేపి తన స్థానాన్ని పదిల పరుచుకోండి. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా, ప్రాంతీయ పార్టీలులు బలంగా లేవంటే అక్కడ బిజేపి తన ఉనికినిని చాటుకోవాడమే కాకుండా, బలంగా ఎదుగుతుంది. తమిళనాదువ నాగరేశ్ 1960-70 దశకంలో కనుమరుగు కాగా, కేరళ లో యునైటెడ్ ఫ్రంట్ లో భాగంగా మిగిలింది. ఇక తెలుగు రాష్ట్రాలలో తెలుగు దేశం పార్టీ ఆవిర్భావంతో కాంగ్రెస్ కు పెద్ద దెబ్బే తగిలింది. కాలనీ బిజేపి తెలుగుదేశం పార్టీతో పెట్టు పెట్టుకోవడంతో, ఇక్కడ అది తోక పార్టీగానే మిగిలిపోయింది.
ప్రత్యేక తెలంగాణ ఇస్తామన్నా, బిజేపిని ఉత్తరాది బనియా పార్టీగా గుర్తింపుఉన్న బిజేపి, తెలుగు వారికి తెలంగాణ ప్రత్యేక ఉద్యమం కొంత చోటు ఇచ్చింది. అప్పటి తెరాస తో పోవటు లేకున్నా, వయమ పక్షయభావాలున్న వారికి, ఆ పార్టీల ప్రభావం ఉన్న ఉత్తర తెలంగాణలో భూస్వాములకు, పెత్తందార్లకు అనుకూలంగా, నక్సలైట్లకు వ్యతిరేకంగా పోరాడి ,ప్రభుత్వానికి అనుకూలంగా ఉండడం వల్ల గ్రామీణ ప్రాంతాలలోకి చొచ్చుక పోయింది. భారస ఉద్యమం తరువాత పక్కా రాజకీయ పార్టీగా మారిపోవడం, కాంగ్రెస్ రాష్ట్రంలో బలహీనపడడం తో ఆ శూన్యాన్ని బిజేపి పూరించే ప్రయత్నం చేస్తుంది. అదీకాక, కేంద్రంలో అధికారంలో ఉండడంతో, ఆ పార్టీకి ఆర్థిక పరిపుష్టి కలగడం, అధికార యంత్రాంగంపై పట్టు దొరకడంతో, తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలలో తెలుగు పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తూ, తెలుగు రాష్ట్రాలలో పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తుంది.
కేంద్రం అధికారంతో బిజేపి ఉనికి
కేంద్రంలో అధికారం ఉండడంతో ఆంధ్ర ప్రాంత కాంట్రాక్టర్ లను ప్రోత్సహించినా, ఆంధ్ర ప్రాంత ప్రజలలో బిజేపి స్థానం సంపాదించుకోలేకపోయింది. అక్కడా ఇకా తెలుగుదేశం పార్టెకి తోక పార్టీలనీ మిగిలిపోయింది. తెలంగాణలో మాత్రం, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో, ఎక్కడైతే గతంలో నక్సలైట్ల ప్రభావం అధికంగా ఉందో ఆయా ప్రాంతాలలో బిజేపి కొంత పుంజుకొనది. దీనికి ఖమ్మం జిల్లా మినహాయింపుగా చెప్పుకోవాలి. ఖమ్మం జిల్లా మొదటి నుండి వామపక్ష రాజకీయాలకు కేంద్రం అయినా, అక్కడి ప్రజల భావాలు, ఆంధ్ర ప్రాంత రాజకీయాలకు అనుగుణంగా ఉంటాయి. అక్కడి ప్రజలలో ఆంధ్రప్రాంత వలస నాయకులు ఎక్కువగా ఉండడం, జిల్లా చుట్టూ అంతా ఆంధ్ర ప్రాంతమే కావడంతో, అది మొదటి నుండి మిగతా తెలంగాణ ప్రజల భావాలతో కాకుండా, ఆంధతర ప్రాంత ప్రజల మానవ భావాలతో ఎక్కువగా కలిసిమెలిసి ఉంటుంది. అందుకే, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన రోజుల్లో కూడా, ఖమ్మం జిల్లాలో ఉద్యమ ప్రభావం అంతగా లేదు.
భారాస నిర్లక్ష్య వైఖరే బిజేపికి బలం
ప్రస్తుత పరిస్థితులలో బిజేపికీ ఉతమిస్తుంది భారాస పార్టీ వైఖరే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొన్నటిదాక స్తంబద్ధంగా ఉన్న కాంగ్రెస్, బి ఆర్ ఎస్ నియంతృత్వ పోకడల వల్ల ప్రజాలకన్నా, పార్టీ కింది స్థాయి నాయకుల కన్నా పెట్టుబడి దారులకు, పారిశ్రామిక వేత్తలకు, రియాలటర్లకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కింది స్థాయి మధ్యతరగతి వతలర్లు ఆ పార్టీకి దూరం అయ్యారు. ఈ అవకాశాన్ని గ్రామాస్తాయిలో ఇంకా కార్యకర్తలు ఉన్న కాంగ్రెస్ సరిగ్గా ఉపయోగించుకొని, బొటాయబోటి మెజారిటీతోనైనా, అధికారంలోకి వచ్చింది. డబ్బు సంపాదనే లక్ష్యంగా భారాస లో చేరిన రాజకీయ వ్యాపారవేత్తలు అందరూ ధికారం కోసం, తమ వ్యాపార లావాదేవీల కొనసాగింపు కొరకు మళ్ళీ అధికార పార్టీ అయిన కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇది వ్యాపారవేత్తల సహజ లక్షణం. వారివారి వ్యాపారాలు ఎలాంటి వొడిదోడుకులు లేకుండా కొనసాగలనే అధికార పార్టీ అండ తప్పని సారి.
అధికారం కోల్పోయిన భారాస పార్టీ ఇప్పటికీ క్షేత్ర స్థాయిలో ఉన్న కార్యకర్తల మోనో భావాలను గ్రహించలేకో. లేదా ఇంకా తమ అహంభావాన్ని విడవలేకో, పార్టీని ప్రక్షాళనం చేసే దిశలో కాకుండా, ఇంకా నాశనం చేసే దిశలో వెళుతున్నారు. కాంగ్రెస్ ను ఎదుర్కోవలంటే ముందు తాము బలంగా ఉండాలని, కనీసం ఊపిరితోనైనా ఉండాలనే వాస్తవాన్ని గ్రహించలేని భారాస, ఇంకా అధికార కాలంనాటి మత్తులోనే ఉన్నట్లు వ్యవహరిస్తున్నారు. అహదీకారం కోల్పోయి నాలుగు నెలలు కావస్తున్నా, పార్టీ ఓటమికి కారణాలను విశ్లేషించు కోవడానికి పూర్తి స్థాయి సమావేశాలు నిర్వహించలేదు. కాంగ్రెస్ పార్టీ ని ఎలా అధికారంలో నుండి దించాలనే ప్రయత్నిస్తుంది తప్ప, క్షేత్ర స్థాయిలో తమను నమముక్కోని ఉన్న అసలైన కార్యకర్తలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, వారికి భరోసా కల్పించాల్సిన బాధ్యత పార్టీ అధినాయకత్వం ధే అనే భావనలో మాత్రం లేరనే విశ్లేషకులు భావిస్తున్నారు.
వ్యాపారాలే రాజకీయ పరమావధి కాకూడదు?
రాజకీయ అవగాహనతో కాకుండా, తమ వ్యాపార అవగాహనతో, ఆర్థిక లావాదేవిలే ప్రధానంగా ఇన్నాళ్ళూ కొనసాగిన భారాస రాజకీయాలనే ఇంకా కొనసాగించాలనుకోవడం, నాయకుల తీరుపై ఎలాంటి విమర్శలు, సమీక్షలు చేసుకోకుండా, ప్రజల వ్యతిరేకతను కూడగట్టుకొన్న కోటరీ కె ఇంకా పెద్దపీట వేయడంతో, ప్రజా, ధన బలం ఉన్న నాయకఉలు అటు అధికార పార్టీ అయిన కాంగ్రెస్ లోకో, మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వస్తునాదనే నమ్మకంతో బిజేపి లోకి వెళ్లిపోతున్నా, వారిని కట్టడి చేయడంలో భారాస అధినాయకత్వం విఫలం అయింది. ఇన్నాళ్ళూ ఎవరిపై కోపంతో, ద్వేషంతో ఉన్నారో వారినే మళ్ళీ ముందు పెట్టి రాజకీయయాలను నడపాలని చూడదమే భారసా చేస్తున్న పెద్ద తప్పుగా భావిస్తున్నారు.
కుటుంబ పార్టీగా నారిందని, ఆర్థిక, వ్యాపార బలం ఉన్న వారికే కోటరీ ప్రాధాన్యత ఇస్తుందనే వాదనలను ;వినిపించిన, కొంతమంది పార్టీ నాయకుల,పార్టీ వ్యతిరేకుల ప్రచారాన్ని, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టే విధంగా భారాస అధినేత కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకొన్నట్లు ప్రజలు గ్రహించలేదు. అదీ కాకుండా, ఇంకా అన్నీ విషయాలలో వారికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు వారి చర్యలు తెలుపుతున్నాయి. పార్టీలో అందరూ వలస నాయకులు వెళ్లిపోయినా, ఉద్యమ కాలంనాటి సహాచారులను అందరినీ కూడదీసుకోవడానికి బదులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి బిజేపితో కలిసి భారాస జప్రాయత్నిస్తుందనే ప్రచాలానికి ఊతమిచ్చే విధంగా వ్యవహరించడంతో, భారాస ను ప్రజలు శంకిస్తున్నారు. ప్రభుత్వం ఉంటే ఏమిటి, కూలితే ఏమిటి? తిరిగి అధికారంలోకి రావడానికి, అననికంటే ముందు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం గౌరవప్రదమైన సీట్లను గెలవడానికి కృషి చేయాల్సిన పార్టీ, ఇంకా మీనా మేషాలు లెక్కించడం, గతంలో చేసిన తప్పులే మళ్ళీమల్లి చేయడంతో, ఒక విధంగా ప్రజలు విసిగిపోయారు.
బిజేపికి సహకరిస్తే ఆత్మహత్యాసదృశ్యమే
బిజేపి పార్టీకి ఏవిధంగా సహకరించినా, అది ఆయా పార్టీలకు ఆత్మహత్యాసదృశ్యం అయిందనేది చరిత్ర. బిజేపి పార్టీ తన ఉనికిని పెంచుకోవడానికి, తానే ఏకైక పార్టీగా నిలవడానికి ప్రయత్నించడం తప్పు కాదు. ఎవరైనా అదే చేస్తారు. అన్ని రాష్ట్రాలలో తనతో పొత్తుపెట్టుకొన్న చిన్నచిన్న పార్టీల ఉనికిని మాయం చేసిన చరిత్ర బిజేపి పార్టీది. ఈ వాస్తవాన్నికాదని, కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి బజపకీ పరోక్షంగా సహకరిస్తే, చివరికి నష్టపోయేది భారాస పార్టీ కాదు తెలంగాణలోని ప్రజాలనే వాస్తవాన్ని భారాస గ్రహించాలి. భారాస ఖాళీ చేసిన రాజకీయ స్థాననాన్ని ఆక్రమించేది బిజేపి. మొగుడు కొట్టిందని కాకుండా, తోటి కోడలు నవ్విందనే పాత సామెతలా వ్యవహరిసే నష్టం ప్రజాలకే కాదు భారాస ఉనికికే.
More News...
<%- node_title %>
<%- node_title %>
మాజీ సర్పంచులకు రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలి
జగిత్యాల, సెప్టెంబర్ 11 (ప్రజా మంటలు):
2023 ఎన్నికల మేనిఫెస్టోలో మాజీ సర్పంచులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లుగా అమలు చేయడం లేదని తెలంగాణ మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొడ్డు దేవయ్య విమర్శించారు. శుక్రవారం జగిత్యాల ప్రెస్క్లబ్లో జిల్లా స్థాయి మాజీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో... సీఎం ప్రజావాణి స్ఫూర్తిదాయకం: బీహార్ గ్రూప్-1 అధికారులు
బీహార్లోనూ ఇదే తరహా విధానం అమలు చేస్తాం
ప్రజల వినతులు స్వీకరించిన గద్వాల్ విజయలక్ష్మి
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (ప్రజా మంటలు):తెలంగాణలో అమలవుతున్న సీఎం ప్రజావాణి కార్యక్రమం తమకు స్ఫూర్తినిచ్చిందని బీహార్ రాష్ట్రానికి చెందిన గ్రూప్-1 అధికారుల బృందం పేర్కొంది. ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించడం, వాటిని సంబంధిత శాఖలకు పంపించడం, పరిష్కారాన్ని... గణేష్ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలి. టౌన్ సిఐ కరుణాకర్.
జగిత్యాల సెప్టెంబర్ 10 (ప్రజా మంటలు)
గణేష్ మండప నిర్వాహకులు రాబోయే గణేష్ ఉత్సవాలను ప్రజా జీవనానికి భంగం కలగకుండా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని టౌన్ సిఐ కరుణాకర్ తెలిపారు. విద్యుత్ తీగలకు దగ్గరగా గణేష్ మంటపాలను నిర్మించకుండా జాగ్రత్త పడాలని సూచించారు.
ట్రాఫిక్ అంతరాయం లేకుండా మంట పాలను ఏర్పాటు చేసుకోవాలని, గణేష్ మండపాల్లో భక్తి... ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ను కలిసిన ఉద్యొగ సంఘ నెతలు
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (ప్రజా మంటలు):
తెలంగాణ ఉద్యోగుల జేఏసీ (TGEJAC) చైర్మన్ వి. లచ్చి రెడ్డి, సెక్రటరీ జనరల్ ఒడ్నాల రాజశేఖర్ గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరారు.
ఈ సందర్భంగా ప్రధానంగా పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏల విడుదల, సీపీఎస్ రద్దు చేసి... మల్యాలలో వివాహిత ఆత్మహత్య.. కుమారుడి ఆచూకీ కోసం గాలింపు
మల్యాల, సెప్టెంబర్ 10 (ప్రజామంతలు):
మల్యాల మండలం ముత్యంపేట శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఓ వివాహిత తన చిన్న కుమారుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం చోటుచేసుకుంది.
మల్యాలకు చెందిన గుండేటి కవిత (36) తన భర్త దశరథంతో కలిసి నివసిస్తోంది. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. గురువారం గుడిపేట శివారులోని వ్యవసాయ... *కలెక్టరేట్ లో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్*
జగిత్యాల, సెప్టెంబర్ 10(ప్రజా మంటలు)
తెలంగాణ రైతాంగ పోరాటంలో వీరవనితగా గుర్తింపు పొందిన ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం జిల్లా కలెక్టరేట్ లో గురువారం జిల్లా బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ పాల్గొని, వీరనారి చాకలి ఐలమ్మచిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్... "ఫెడరల్ బ్యాంక్ "వారిచే మృత్తిక గణపతి ప్రతిమల వితరణ
ఈస్ట్ ఆనంద్ బాగ్ సెప్టెంబర్ 10( ప్రజా మంటలు)మేడ్చల్ మల్కాజ్గిరి లోని ఈస్ట్ ఆనంద్ బాగ్ లో గల "ఫెడరల్ బ్యాంక్" శ్రీ వినాయక చవితి పండుగను పురస్కరించుకొని సమకాలీన స్థితికి అనుకూలంగా ప్రకృతి పరిరక్షణ పేరిట మృత్తిక (మట్టి ) గణపతి ప్రతిమలను తమ బ్యాంకు ఖాతాదారులకు వితరణ చేయడానికి శ్రీకారం చుట్టారు.... #Draft: Add Your Titleఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో హరుష్ కు దక్కిన చోటు
కరీంనగర్ సెప్టెంబర్ 8 (ప్రజా మంటలు) "సాధనాత్ సాధ్యతే" సర్వం అన్నట్లు సాధన ద్వారా ఏదైనా సాధించవచ్చునని నిరూపించాడు కరీంనగర్ కు చెందిన 4వ తరగతి విద్యార్థి *టి హరుష్* *పరమ శివునికి చెందిన లింగాష్టక స్తోత్రాన్ని 53 సెకండ్లలో ఆలపించి గతంలో లింగాష్టకం పఠించిన వారి రికార్డును బద్దలు కొట్టాడు.
చిన్నతనము నుండే హరుష్... ధర్మపురి ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం రూ.200 కోట్ల తో అభివృద్ధి - రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
ఇన్గొల్లపల్లి సెప్టెంబర్ 07(ప్రజా మంటలు అంకం భూమయ్య):
ధర్మపురి శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.117 కోట్లు మంజూరు చేసిందని, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి మేరకు మరో రూ.80 కోట్లు కూడా మంజూరు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు... జగిత్యాలలో కాంగ్రెస్ హామీల అమలుపై బీఆర్ఎస్ ఆందోళన
జగిత్యాల, సెప్టెంబర్ 07 (ప్రజా మంటలు):
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను తక్షణమే అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జగిత్యాల నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించగా, జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి... అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ నిరసన
హైదరాబాద్, సెప్టెంబర్ 07, ప్రజా మంటలు: తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి వచ్చారు.
నల్ల టీషర్ట్లు ధరించి అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రయత్నించగా పోలీసులు అభ్యంతరం... ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి: కల్వకుంట్ల కవిత
హన్మకొండ, సెప్టెంబర్ 07, (ప్రజా మంటలు):
విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విద్యార్థులతో కలిసి హన్మకొండలో ర్యాలీ నిర్వహించారు.
హన్మకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి కలెక్టరేట్ వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ చేపట్టారు. అంతకుముందు అంబేద్కర్... 