స్వయంకృతంతో భారాస ప్రజలకు దూరం అవుతుందా? తెలంగాణలో బిజేపి కి ఆశ్రయం ఇస్తుంది ఎవరు ? బిజేపికి సహకరిస్తే ఆత్మహత్యాసదృశ్యమే

On
స్వయంకృతంతో భారాస ప్రజలకు దూరం అవుతుందా?  తెలంగాణలో బిజేపి కి ఆశ్రయం ఇస్తుంది ఎవరు ?  బిజేపికి సహకరిస్తే ఆత్మహత్యాసదృశ్యమే

4th page article 04-042024

పరనిందతో తమ ప్రాభవాన్ని పదిలపరుచుకోలేరు

వ్యాపార, పారిశ్రామికవేత్తలతో పార్టీలు నిలవవు

భారాస నిర్లక్ష్య వైఖరే బిజేపికి బలం వ్యాపారాలే రాజకీయ పరమావధి కాకూడదు?

-సిహెచ్ వి ప్రభాకర్ రావు, సీనియర్ జర్నలిస్ట్. 9391533339

 కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలలో బాలహీనపడిన చోట సాధారణంగా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. ముఖ్యమగా ఉత్తర భారతంలోని బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్ లలో కాగణరెస్ నామ మాత్రం కావడానికి కారణం అక్కడి ప్రాంతీయ నాయకుల, ప్రజల ఆకానసఖ్యలను కాంగ్రెస్ పార్టీ గుర్తించక పోవడమే ప్రధాన కారణం. దక్షిణాన కర్ణాటకలో దేవ గౌడ నాయకత్వంలోని జే ది ఎస్ ఉన్నా, ఐ కర్ణాటకలోని ఒక ప్రాంతానికే పరిమితం కావడంతో, అక్కడ బిజేపి తన స్థానాన్ని పదిల పరుచుకోండి. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా, ప్రాంతీయ పార్టీలులు బలంగా లేవంటే అక్కడ బిజేపి తన ఉనికినిని చాటుకోవాడమే కాకుండా, బలంగా ఎదుగుతుంది. తమిళనాదువ నాగరేశ్ 1960-70 దశకంలో కనుమరుగు కాగా, కేరళ లో యునైటెడ్ ఫ్రంట్ లో భాగంగా మిగిలింది. ఇక తెలుగు రాష్ట్రాలలో తెలుగు దేశం పార్టీ ఆవిర్భావంతో కాంగ్రెస్ కు పెద్ద దెబ్బే తగిలింది. కాలనీ బిజేపి తెలుగుదేశం పార్టీతో పెట్టు పెట్టుకోవడంతో, ఇక్కడ అది తోక పార్టీగానే మిగిలిపోయింది.

ప్రత్యేక తెలంగాణ ఇస్తామన్నా, బిజేపిని ఉత్తరాది బనియా పార్టీగా గుర్తింపుఉన్న బిజేపి,  తెలుగు వారికి తెలంగాణ ప్రత్యేక ఉద్యమం కొంత చోటు ఇచ్చింది. అప్పటి తెరాస తో పోవటు లేకున్నా, వయమ పక్షయభావాలున్న వారికి, ఆ పార్టీల ప్రభావం ఉన్న ఉత్తర తెలంగాణలో భూస్వాములకు, పెత్తందార్లకు అనుకూలంగా, నక్సలైట్లకు వ్యతిరేకంగా పోరాడి ,ప్రభుత్వానికి అనుకూలంగా ఉండడం వల్ల గ్రామీణ ప్రాంతాలలోకి చొచ్చుక పోయింది. భారస ఉద్యమం తరువాత పక్కా రాజకీయ పార్టీగా మారిపోవడం, కాంగ్రెస్ రాష్ట్రంలో బలహీనపడడం తో ఆ శూన్యాన్ని బిజేపి పూరించే ప్రయత్నం చేస్తుంది. అదీకాక, కేంద్రంలో అధికారంలో ఉండడంతో, ఆ పార్టీకి ఆర్థిక పరిపుష్టి కలగడం, అధికార యంత్రాంగంపై పట్టు దొరకడంతో, తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలలో తెలుగు పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తూ, తెలుగు రాష్ట్రాలలో పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తుంది.

కేంద్రం అధికారంతో బిజేపి ఉనికి

కేంద్రంలో అధికారం ఉండడంతో ఆంధ్ర ప్రాంత కాంట్రాక్టర్ లను ప్రోత్సహించినా, ఆంధ్ర ప్రాంత ప్రజలలో బిజేపి స్థానం సంపాదించుకోలేకపోయింది. అక్కడా ఇకా తెలుగుదేశం పార్టెకి తోక పార్టీలనీ మిగిలిపోయింది. తెలంగాణలో మాత్రం, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో, ఎక్కడైతే గతంలో నక్సలైట్ల ప్రభావం అధికంగా ఉందో ఆయా ప్రాంతాలలో బిజేపి కొంత పుంజుకొనది. దీనికి ఖమ్మం జిల్లా మినహాయింపుగా చెప్పుకోవాలి. ఖమ్మం జిల్లా మొదటి నుండి వామపక్ష రాజకీయాలకు కేంద్రం అయినా, అక్కడి ప్రజల భావాలు, ఆంధ్ర ప్రాంత రాజకీయాలకు అనుగుణంగా ఉంటాయి. అక్కడి ప్రజలలో ఆంధ్రప్రాంత వలస నాయకులు ఎక్కువగా ఉండడం, జిల్లా చుట్టూ అంతా ఆంధ్ర ప్రాంతమే కావడంతో, అది మొదటి నుండి మిగతా తెలంగాణ ప్రజల భావాలతో కాకుండా, ఆంధతర ప్రాంత ప్రజల మానవ భావాలతో ఎక్కువగా కలిసిమెలిసి ఉంటుంది. అందుకే, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన రోజుల్లో కూడా, ఖమ్మం జిల్లాలో ఉద్యమ ప్రభావం అంతగా లేదు.

భారాస నిర్లక్ష్య వైఖరే బిజేపికి బలం

ప్రస్తుత పరిస్థితులలో బిజేపికీ ఉతమిస్తుంది భారాస పార్టీ వైఖరే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొన్నటిదాక స్తంబద్ధంగా ఉన్న కాంగ్రెస్, బి ఆర్ ఎస్ నియంతృత్వ పోకడల వల్ల ప్రజాలకన్నా, పార్టీ కింది స్థాయి నాయకుల కన్నా పెట్టుబడి దారులకు, పారిశ్రామిక వేత్తలకు, రియాలటర్లకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కింది స్థాయి మధ్యతరగతి వతలర్లు ఆ పార్టీకి దూరం అయ్యారు. ఈ అవకాశాన్ని గ్రామాస్తాయిలో ఇంకా కార్యకర్తలు ఉన్న కాంగ్రెస్ సరిగ్గా ఉపయోగించుకొని, బొటాయబోటి మెజారిటీతోనైనా, అధికారంలోకి వచ్చింది. డబ్బు సంపాదనే లక్ష్యంగా భారాస లో చేరిన రాజకీయ వ్యాపారవేత్తలు అందరూ ధికారం కోసం, తమ వ్యాపార లావాదేవీల కొనసాగింపు కొరకు మళ్ళీ అధికార పార్టీ అయిన కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇది వ్యాపారవేత్తల సహజ లక్షణం. వారివారి వ్యాపారాలు ఎలాంటి వొడిదోడుకులు లేకుండా కొనసాగలనే అధికార పార్టీ అండ తప్పని సారి.

అధికారం కోల్పోయిన భారాస పార్టీ ఇప్పటికీ క్షేత్ర స్థాయిలో ఉన్న కార్యకర్తల మోనో భావాలను గ్రహించలేకో. లేదా ఇంకా తమ అహంభావాన్ని విడవలేకో, పార్టీని ప్రక్షాళనం చేసే దిశలో కాకుండా, ఇంకా నాశనం చేసే దిశలో వెళుతున్నారు. కాంగ్రెస్ ను ఎదుర్కోవలంటే ముందు తాము బలంగా ఉండాలని, కనీసం ఊపిరితోనైనా ఉండాలనే వాస్తవాన్ని గ్రహించలేని భారాస, ఇంకా అధికార కాలంనాటి మత్తులోనే ఉన్నట్లు వ్యవహరిస్తున్నారు. అహదీకారం కోల్పోయి నాలుగు నెలలు కావస్తున్నా, పార్టీ ఓటమికి కారణాలను విశ్లేషించు కోవడానికి  పూర్తి స్థాయి సమావేశాలు నిర్వహించలేదు. కాంగ్రెస్ పార్టీ ని ఎలా అధికారంలో నుండి దించాలనే ప్రయత్నిస్తుంది తప్ప, క్షేత్ర స్థాయిలో తమను నమముక్కోని ఉన్న అసలైన కార్యకర్తలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, వారికి భరోసా కల్పించాల్సిన బాధ్యత పార్టీ అధినాయకత్వం ధే అనే భావనలో మాత్రం లేరనే విశ్లేషకులు భావిస్తున్నారు.

వ్యాపారాలే రాజకీయ పరమావధి కాకూడదు?

రాజకీయ అవగాహనతో కాకుండా, తమ వ్యాపార అవగాహనతో, ఆర్థిక లావాదేవిలే ప్రధానంగా ఇన్నాళ్ళూ కొనసాగిన భారాస రాజకీయాలనే ఇంకా కొనసాగించాలనుకోవడం, నాయకుల తీరుపై ఎలాంటి విమర్శలు, సమీక్షలు చేసుకోకుండా, ప్రజల వ్యతిరేకతను కూడగట్టుకొన్న కోటరీ కె ఇంకా పెద్దపీట వేయడంతో, ప్రజా, ధన బలం ఉన్న  నాయకఉలు అటు అధికార పార్టీ అయిన కాంగ్రెస్ లోకో, మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వస్తునాదనే నమ్మకంతో బిజేపి లోకి వెళ్లిపోతున్నా, వారిని కట్టడి చేయడంలో భారాస అధినాయకత్వం విఫలం అయింది. ఇన్నాళ్ళూ ఎవరిపై కోపంతో, ద్వేషంతో ఉన్నారో వారినే మళ్ళీ ముందు పెట్టి రాజకీయయాలను నడపాలని చూడదమే భారసా చేస్తున్న పెద్ద తప్పుగా భావిస్తున్నారు.

కుటుంబ పార్టీగా నారిందని, ఆర్థిక, వ్యాపార బలం ఉన్న వారికే కోటరీ ప్రాధాన్యత ఇస్తుందనే వాదనలను ;వినిపించిన, కొంతమంది పార్టీ నాయకుల,పార్టీ వ్యతిరేకుల ప్రచారాన్ని, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టే విధంగా భారాస అధినేత కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకొన్నట్లు ప్రజలు గ్రహించలేదు. అదీ కాకుండా, ఇంకా అన్నీ విషయాలలో వారికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు వారి చర్యలు తెలుపుతున్నాయి.  పార్టీలో అందరూ వలస నాయకులు వెళ్లిపోయినా, ఉద్యమ కాలంనాటి సహాచారులను అందరినీ కూడదీసుకోవడానికి బదులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి బిజేపితో కలిసి భారాస జప్రాయత్నిస్తుందనే ప్రచాలానికి ఊతమిచ్చే విధంగా వ్యవహరించడంతో, భారాస ను ప్రజలు శంకిస్తున్నారు. ప్రభుత్వం ఉంటే ఏమిటి, కూలితే ఏమిటి? తిరిగి అధికారంలోకి రావడానికి, అననికంటే ముందు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం గౌరవప్రదమైన సీట్లను గెలవడానికి కృషి చేయాల్సిన పార్టీ, ఇంకా మీనా మేషాలు లెక్కించడం, గతంలో చేసిన తప్పులే మళ్ళీమల్లి చేయడంతో, ఒక విధంగా ప్రజలు విసిగిపోయారు.

 

బిజేపికి సహకరిస్తే ఆత్మహత్యాసదృశ్యమే

బిజేపి పార్టీకి ఏవిధంగా సహకరించినా, అది ఆయా పార్టీలకు ఆత్మహత్యాసదృశ్యం అయిందనేది చరిత్ర. బిజేపి పార్టీ తన ఉనికిని పెంచుకోవడానికి, తానే ఏకైక పార్టీగా నిలవడానికి ప్రయత్నించడం తప్పు కాదు. ఎవరైనా అదే చేస్తారు. అన్ని రాష్ట్రాలలో తనతో పొత్తుపెట్టుకొన్న చిన్నచిన్న పార్టీల ఉనికిని మాయం చేసిన చరిత్ర బిజేపి పార్టీది.  ఈ వాస్తవాన్నికాదని, కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి బజపకీ పరోక్షంగా సహకరిస్తే, చివరికి నష్టపోయేది భారాస పార్టీ కాదు తెలంగాణలోని ప్రజాలనే వాస్తవాన్ని భారాస గ్రహించాలి. భారాస ఖాళీ చేసిన రాజకీయ స్థాననాన్ని ఆక్రమించేది బిజేపి. మొగుడు కొట్టిందని కాకుండా, తోటి కోడలు నవ్విందనే  పాత సామెతలా వ్యవహరిసే నష్టం ప్రజాలకే కాదు భారాస ఉనికికే.

  

Tags
Join WhatsApp

More News...

Local News 

హర్ ఘర్ తిరంగా – తిరంగా యాత్రలో భాగంగా మాజీ సైనికుడు దూరిశెట్టి కిరణ్ కుమార్‌ను సన్మానించిన  డా. బోగ శ్రావణి

హర్ ఘర్ తిరంగా – తిరంగా యాత్రలో భాగంగా మాజీ సైనికుడు దూరిశెట్టి కిరణ్ కుమార్‌ను సన్మానించిన  డా. బోగ శ్రావణి జగిత్యాల ఆగస్ట్ 7(ప్రజా మంటలు)భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం పిలుపు మేరకు నిర్వహిస్తున్న "హర్ ఘర్ తిరంగా – తిరంగా యాత్ర" కార్యక్రమంలో భాగంగా, భారత త్రివిధ దళాల్లో సేవలందించి పదవీ విరమణ పొందిన మాజీ సైనికుడు దూరిశెట్టి కిరణ్ కుమార్ ని బీజేపీ జగిత్యాల నియోజకవర్గ...
Read More...
Local News 

బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్ డా. బోగ శ్రావణి కి పోచమ్మ తల్లి బోనాల జాతర ఆహ్వాన పత్రిక అందజేత

బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్ డా. బోగ శ్రావణి కి పోచమ్మ తల్లి బోనాల జాతర ఆహ్వాన పత్రిక అందజేత    జగిత్యాల ఆగస్ట్ 7(ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలో మొట్టమొదటిసారిగా జగిత్యాల జిల్లా యూట్యూబర్స్ కళాకారుల ఆధ్వర్యంలో నిర్వహించనున్న పోచమ్మ తల్లి బోనాల జాతర మహోత్సవం సందర్భంగా ఆహ్వాన పత్రికను బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్ డా. బోగ శ్రావణికి బోనాల జాతర వర్కింగ్ కమిటీ సభ్యులు, జగిత్యాల జిల్లా కళాకారులు మర్యాదపూర్వకంగా అందజేశారు. ఈ సందర్భంగా...
Read More...
Local News 

తల్లిపాలే శిశువుకు తొలి వరం – మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్

తల్లిపాలే శిశువుకు తొలి వరం – మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్    జగిత్యాల ఆగస్ట్ 7(ప్రజా మంటలు )పట్టణంలోని స్థానిక 43వ వార్డు వాణీనగర్ అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్  సమీండ్ల వాణి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు సంప్రదాయబద్ధంగా శ్రీమంతం, చిన్నారులకు అన్నప్రాశన, అక్షరాభ్యాసం కార్యక్రమాలను నిర్వహించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ సమీండ్ల...
Read More...
Local News 

విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి – మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్

విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి – మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్    జగిత్యాల ఆగస్ట్ 7(ప్రజా మంటలు)పట్టణంలోని నవ్య గర్ల్స్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన "పరిచయ్–2K26" ఫ్రెషర్స్ పార్టీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్‌పర్సన్  సమిండ్ల వాణి శ్రీనివాస్ విద్యార్థినులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ విద్య జీవితానికి బలమైన పునాది అని, ఈ దశలో విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలను...
Read More...
Local News 

సామాజిక న్యాయ తెలంగాణ కోసం టీఆర్ఎస్ సంకల్పం

సామాజిక న్యాయ తెలంగాణ కోసం టీఆర్ఎస్ సంకల్పం హైదరాబాద్, ఆగస్టు 06 (ప్రజా మంటలు): సామాజిక న్యాయ తెలంగాణ సాధన లక్ష్యంగా టీఆర్ఎస్ నిర్వహించిన **"సామాజిక న్యాయ సంకల్ప సభ"**లో పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత కీలక ప్రసంగం చేశారు. ఈ సభ దేశంలోని కోట్లాది మంది వెనుకబడిన వర్గాల జీవితాలను మార్చే ఉద్యమానికి నాంది అవుతుందని ఆమె పేర్కొన్నారు. తాను బీసీల కోసం...
Read More...
Local News 

ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయ సాధనే ఆయనకు నిజమైన నివాళి – మున్సిపల్ చైర్ పర్సన్  సమీండ్ల వాణి శ్రీనివాస్

ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయ సాధనే ఆయనకు నిజమైన నివాళి – మున్సిపల్ చైర్ పర్సన్  సమీండ్ల వాణి శ్రీనివాస్    జగిత్యాల ఆగస్ట్ 6(ప్రజా మంటలు) మున్సిపాలిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా కరీంనగర్ రోడ్‌లోని జయశంకర్ విగ్రహం వద్ద, గొల్లపల్లి రోడ్‌లోని విగ్రహం వద్ద, అలాగే మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర...
Read More...
Local News 

ధనం ఉంటే దాన స్వభావము ఉండాలి  బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేష్ శర్మ 

ధనం ఉంటే దాన స్వభావము ఉండాలి  బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేష్ శర్మ  కోరుట్ల ఆగస్టు 5 ( ప్రజా మంటలు)  సిరిసిల్ల రాజేంద్ర శర్మ 9348422113 ధనమున్న వ్యక్తికి దాన స్వభావం ఉండాలని అదేవిధంగా శక్తి ఉంటే క్షమాగుణం ఉండాలని శృంగేరి శారదా పీఠ ఆస్థాన పౌరాణికులు, మల్లాది చంద్రశేఖర శాస్త్రి శిష్యులు గర్రెపల్లి మహేష్ శర్మ అన్నారు. కోరుట్ల పట్టణములో సనాతన ధర్మ ప్రచార సమితి కోరుట్ల...
Read More...
Local News  State News 

తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపునకు మహారాష్ట్ర అనుమతులు ఇప్పించాలి: సీఎం రేవంత్ రెడ్డి

తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపునకు మహారాష్ట్ర అనుమతులు ఇప్పించాలి: సీఎం రేవంత్ రెడ్డి న్యూఢిల్లీ, ఆగస్టు 5 (ప్రజా మంటలు):ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు 150–152 మీటర్లకు పెంచేందుకు మహారాష్ట్ర అనుమతులు ఇప్పించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కోరారు. ఢిల్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన కేంద్ర మంత్రిని కలిశారు.148 మీటర్లతో పోలిస్తే 152...
Read More...
Local News 

నల్లమల్లలో చెంచు గిరిజనుల జీవన పరిస్థితులపై మానవ హక్కుల కమిషన్ చైర్మన్ క్షేత్రస్థాయి పరిశీలన

నల్లమల్లలో చెంచు గిరిజనుల జీవన పరిస్థితులపై మానవ హక్కుల కమిషన్ చైర్మన్ క్షేత్రస్థాయి పరిశీలన విద్య, వైద్యం, సంక్షేమం, మౌలిక వసతులపై అధికారులతో సమగ్ర సమీక్ష – చెంచు కుటుంబాలతో ముఖాముఖిహైదరాబాద్, ఆగస్టు 5 (ప్రజా మంటలు): నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న చెంచు గిరిజనుల జీవన పరిస్థితులను తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్...
Read More...
Local News  State News 

పూర్తిస్థాయి పంచాయతీ కార్యదర్శి లేక గొల్లపల్లి అభివృద్ధి కుంటుపాటు

పూర్తిస్థాయి పంచాయతీ కార్యదర్శి లేక గొల్లపల్లి అభివృద్ధి కుంటుపాటు గొల్లపల్లికి రావాలంటేనే జంకుతున్న కార్యదర్శులు!రాజకీయ ఒత్తిళ్లే కారణమా..? గ్రామంలో గుసగుసలు? గొల్లపల్లి, ఆగస్టు 5 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ పూర్తిస్థాయి కార్యదర్శి లేక తీవ్ర పరిపాలనా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నెలకోసారి ఇన్‌చార్జి కార్యదర్శిని నియమిస్తూ కాలం గడుపుతుండటంతో గ్రామ అభివృద్ధి పనులు పూర్తిగా స్తంభించిపోయే పరిస్థితి...
Read More...
Local News 

ఐక్య ఉద్యమాలతోనే పీఆర్సీ సాధ్యం, అశాస్త్రీయమైన టెట్ పరీక్షను రద్దు చేయాలి : జిల్లా అధ్యక్షులు బైరం హరికిరణ్

ఐక్య ఉద్యమాలతోనే పీఆర్సీ సాధ్యం, అశాస్త్రీయమైన టెట్ పరీక్షను రద్దు చేయాలి : జిల్లా అధ్యక్షులు బైరం హరికిరణ్    జగిత్యాల ఆగస్టు 2 (ప్రజా మంటలు)రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ, పెన్షనర్ లకు  రావాల్సిన పి.ఆర్సి , డి.ఏ లు, పెండింగ్ బకాయిల సమస్యలు   ఐక్య ఉద్యమాలతోనే పరిష్కారమవుతాయని స్టేట్ టీచర్స్ యూనియన్ జగిత్యాల జిల్లా శాఖ సమావేశం తీర్మానించింది.  ఆదివారం జగిత్యాల పట్టణంలో   రామకృష్ణ డిగ్రీ కళాశాల సమావేశమందిరంలో  ఎస్టీయు తృతీయ కార్యవర్గ...
Read More...
Local News 

సహస్ర లింగాల దేవాలయంలో ఘనంగా సంకష్టహర చతుర్థి వేడుకలు మహాగణపతికి ప్రత్యేక అభిషేకాలు 

సహస్ర లింగాల దేవాలయంలో ఘనంగా సంకష్టహర చతుర్థి వేడుకలు మహాగణపతికి ప్రత్యేక అభిషేకాలు     జగిత్యాల ఆగస్టు 2 (ప్రజా మంటలు) రూరల్ పొలాస గ్రామం శివారులోని సహస్ర లింగాల దేవాలయంలో ఉదయం   సంకటహర చతుర్థి వేడుకలు మహాగణపతికి ప్రత్యేక అభిషేకాలు. ఈ సందర్భంగా సంకటహర చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం ఆలయంలోని సహస్ర లింగాలకు ప్రత్యేక పూజలను నిర్వహించి అనంతరం ఆలయంలోని సంకటహర చతుర్థి సందర్భంగా మహాగణపతికి పలు పంచామృతాభిషేకాలను...
Read More...