స్వయంకృతంతో భారాస ప్రజలకు దూరం అవుతుందా? తెలంగాణలో బిజేపి కి ఆశ్రయం ఇస్తుంది ఎవరు ? బిజేపికి సహకరిస్తే ఆత్మహత్యాసదృశ్యమే

On
స్వయంకృతంతో భారాస ప్రజలకు దూరం అవుతుందా?  తెలంగాణలో బిజేపి కి ఆశ్రయం ఇస్తుంది ఎవరు ?  బిజేపికి సహకరిస్తే ఆత్మహత్యాసదృశ్యమే

4th page article 04-042024

పరనిందతో తమ ప్రాభవాన్ని పదిలపరుచుకోలేరు

వ్యాపార, పారిశ్రామికవేత్తలతో పార్టీలు నిలవవు

భారాస నిర్లక్ష్య వైఖరే బిజేపికి బలం వ్యాపారాలే రాజకీయ పరమావధి కాకూడదు?

-సిహెచ్ వి ప్రభాకర్ రావు, సీనియర్ జర్నలిస్ట్. 9391533339

 కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలలో బాలహీనపడిన చోట సాధారణంగా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. ముఖ్యమగా ఉత్తర భారతంలోని బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్ లలో కాగణరెస్ నామ మాత్రం కావడానికి కారణం అక్కడి ప్రాంతీయ నాయకుల, ప్రజల ఆకానసఖ్యలను కాంగ్రెస్ పార్టీ గుర్తించక పోవడమే ప్రధాన కారణం. దక్షిణాన కర్ణాటకలో దేవ గౌడ నాయకత్వంలోని జే ది ఎస్ ఉన్నా, ఐ కర్ణాటకలోని ఒక ప్రాంతానికే పరిమితం కావడంతో, అక్కడ బిజేపి తన స్థానాన్ని పదిల పరుచుకోండి. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా, ప్రాంతీయ పార్టీలులు బలంగా లేవంటే అక్కడ బిజేపి తన ఉనికినిని చాటుకోవాడమే కాకుండా, బలంగా ఎదుగుతుంది. తమిళనాదువ నాగరేశ్ 1960-70 దశకంలో కనుమరుగు కాగా, కేరళ లో యునైటెడ్ ఫ్రంట్ లో భాగంగా మిగిలింది. ఇక తెలుగు రాష్ట్రాలలో తెలుగు దేశం పార్టీ ఆవిర్భావంతో కాంగ్రెస్ కు పెద్ద దెబ్బే తగిలింది. కాలనీ బిజేపి తెలుగుదేశం పార్టీతో పెట్టు పెట్టుకోవడంతో, ఇక్కడ అది తోక పార్టీగానే మిగిలిపోయింది.

ప్రత్యేక తెలంగాణ ఇస్తామన్నా, బిజేపిని ఉత్తరాది బనియా పార్టీగా గుర్తింపుఉన్న బిజేపి,  తెలుగు వారికి తెలంగాణ ప్రత్యేక ఉద్యమం కొంత చోటు ఇచ్చింది. అప్పటి తెరాస తో పోవటు లేకున్నా, వయమ పక్షయభావాలున్న వారికి, ఆ పార్టీల ప్రభావం ఉన్న ఉత్తర తెలంగాణలో భూస్వాములకు, పెత్తందార్లకు అనుకూలంగా, నక్సలైట్లకు వ్యతిరేకంగా పోరాడి ,ప్రభుత్వానికి అనుకూలంగా ఉండడం వల్ల గ్రామీణ ప్రాంతాలలోకి చొచ్చుక పోయింది. భారస ఉద్యమం తరువాత పక్కా రాజకీయ పార్టీగా మారిపోవడం, కాంగ్రెస్ రాష్ట్రంలో బలహీనపడడం తో ఆ శూన్యాన్ని బిజేపి పూరించే ప్రయత్నం చేస్తుంది. అదీకాక, కేంద్రంలో అధికారంలో ఉండడంతో, ఆ పార్టీకి ఆర్థిక పరిపుష్టి కలగడం, అధికార యంత్రాంగంపై పట్టు దొరకడంతో, తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలలో తెలుగు పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తూ, తెలుగు రాష్ట్రాలలో పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తుంది.

కేంద్రం అధికారంతో బిజేపి ఉనికి

కేంద్రంలో అధికారం ఉండడంతో ఆంధ్ర ప్రాంత కాంట్రాక్టర్ లను ప్రోత్సహించినా, ఆంధ్ర ప్రాంత ప్రజలలో బిజేపి స్థానం సంపాదించుకోలేకపోయింది. అక్కడా ఇకా తెలుగుదేశం పార్టెకి తోక పార్టీలనీ మిగిలిపోయింది. తెలంగాణలో మాత్రం, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో, ఎక్కడైతే గతంలో నక్సలైట్ల ప్రభావం అధికంగా ఉందో ఆయా ప్రాంతాలలో బిజేపి కొంత పుంజుకొనది. దీనికి ఖమ్మం జిల్లా మినహాయింపుగా చెప్పుకోవాలి. ఖమ్మం జిల్లా మొదటి నుండి వామపక్ష రాజకీయాలకు కేంద్రం అయినా, అక్కడి ప్రజల భావాలు, ఆంధ్ర ప్రాంత రాజకీయాలకు అనుగుణంగా ఉంటాయి. అక్కడి ప్రజలలో ఆంధ్రప్రాంత వలస నాయకులు ఎక్కువగా ఉండడం, జిల్లా చుట్టూ అంతా ఆంధ్ర ప్రాంతమే కావడంతో, అది మొదటి నుండి మిగతా తెలంగాణ ప్రజల భావాలతో కాకుండా, ఆంధతర ప్రాంత ప్రజల మానవ భావాలతో ఎక్కువగా కలిసిమెలిసి ఉంటుంది. అందుకే, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన రోజుల్లో కూడా, ఖమ్మం జిల్లాలో ఉద్యమ ప్రభావం అంతగా లేదు.

భారాస నిర్లక్ష్య వైఖరే బిజేపికి బలం

ప్రస్తుత పరిస్థితులలో బిజేపికీ ఉతమిస్తుంది భారాస పార్టీ వైఖరే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొన్నటిదాక స్తంబద్ధంగా ఉన్న కాంగ్రెస్, బి ఆర్ ఎస్ నియంతృత్వ పోకడల వల్ల ప్రజాలకన్నా, పార్టీ కింది స్థాయి నాయకుల కన్నా పెట్టుబడి దారులకు, పారిశ్రామిక వేత్తలకు, రియాలటర్లకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కింది స్థాయి మధ్యతరగతి వతలర్లు ఆ పార్టీకి దూరం అయ్యారు. ఈ అవకాశాన్ని గ్రామాస్తాయిలో ఇంకా కార్యకర్తలు ఉన్న కాంగ్రెస్ సరిగ్గా ఉపయోగించుకొని, బొటాయబోటి మెజారిటీతోనైనా, అధికారంలోకి వచ్చింది. డబ్బు సంపాదనే లక్ష్యంగా భారాస లో చేరిన రాజకీయ వ్యాపారవేత్తలు అందరూ ధికారం కోసం, తమ వ్యాపార లావాదేవీల కొనసాగింపు కొరకు మళ్ళీ అధికార పార్టీ అయిన కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇది వ్యాపారవేత్తల సహజ లక్షణం. వారివారి వ్యాపారాలు ఎలాంటి వొడిదోడుకులు లేకుండా కొనసాగలనే అధికార పార్టీ అండ తప్పని సారి.

అధికారం కోల్పోయిన భారాస పార్టీ ఇప్పటికీ క్షేత్ర స్థాయిలో ఉన్న కార్యకర్తల మోనో భావాలను గ్రహించలేకో. లేదా ఇంకా తమ అహంభావాన్ని విడవలేకో, పార్టీని ప్రక్షాళనం చేసే దిశలో కాకుండా, ఇంకా నాశనం చేసే దిశలో వెళుతున్నారు. కాంగ్రెస్ ను ఎదుర్కోవలంటే ముందు తాము బలంగా ఉండాలని, కనీసం ఊపిరితోనైనా ఉండాలనే వాస్తవాన్ని గ్రహించలేని భారాస, ఇంకా అధికార కాలంనాటి మత్తులోనే ఉన్నట్లు వ్యవహరిస్తున్నారు. అహదీకారం కోల్పోయి నాలుగు నెలలు కావస్తున్నా, పార్టీ ఓటమికి కారణాలను విశ్లేషించు కోవడానికి  పూర్తి స్థాయి సమావేశాలు నిర్వహించలేదు. కాంగ్రెస్ పార్టీ ని ఎలా అధికారంలో నుండి దించాలనే ప్రయత్నిస్తుంది తప్ప, క్షేత్ర స్థాయిలో తమను నమముక్కోని ఉన్న అసలైన కార్యకర్తలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, వారికి భరోసా కల్పించాల్సిన బాధ్యత పార్టీ అధినాయకత్వం ధే అనే భావనలో మాత్రం లేరనే విశ్లేషకులు భావిస్తున్నారు.

వ్యాపారాలే రాజకీయ పరమావధి కాకూడదు?

రాజకీయ అవగాహనతో కాకుండా, తమ వ్యాపార అవగాహనతో, ఆర్థిక లావాదేవిలే ప్రధానంగా ఇన్నాళ్ళూ కొనసాగిన భారాస రాజకీయాలనే ఇంకా కొనసాగించాలనుకోవడం, నాయకుల తీరుపై ఎలాంటి విమర్శలు, సమీక్షలు చేసుకోకుండా, ప్రజల వ్యతిరేకతను కూడగట్టుకొన్న కోటరీ కె ఇంకా పెద్దపీట వేయడంతో, ప్రజా, ధన బలం ఉన్న  నాయకఉలు అటు అధికార పార్టీ అయిన కాంగ్రెస్ లోకో, మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వస్తునాదనే నమ్మకంతో బిజేపి లోకి వెళ్లిపోతున్నా, వారిని కట్టడి చేయడంలో భారాస అధినాయకత్వం విఫలం అయింది. ఇన్నాళ్ళూ ఎవరిపై కోపంతో, ద్వేషంతో ఉన్నారో వారినే మళ్ళీ ముందు పెట్టి రాజకీయయాలను నడపాలని చూడదమే భారసా చేస్తున్న పెద్ద తప్పుగా భావిస్తున్నారు.

కుటుంబ పార్టీగా నారిందని, ఆర్థిక, వ్యాపార బలం ఉన్న వారికే కోటరీ ప్రాధాన్యత ఇస్తుందనే వాదనలను ;వినిపించిన, కొంతమంది పార్టీ నాయకుల,పార్టీ వ్యతిరేకుల ప్రచారాన్ని, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టే విధంగా భారాస అధినేత కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకొన్నట్లు ప్రజలు గ్రహించలేదు. అదీ కాకుండా, ఇంకా అన్నీ విషయాలలో వారికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు వారి చర్యలు తెలుపుతున్నాయి.  పార్టీలో అందరూ వలస నాయకులు వెళ్లిపోయినా, ఉద్యమ కాలంనాటి సహాచారులను అందరినీ కూడదీసుకోవడానికి బదులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి బిజేపితో కలిసి భారాస జప్రాయత్నిస్తుందనే ప్రచాలానికి ఊతమిచ్చే విధంగా వ్యవహరించడంతో, భారాస ను ప్రజలు శంకిస్తున్నారు. ప్రభుత్వం ఉంటే ఏమిటి, కూలితే ఏమిటి? తిరిగి అధికారంలోకి రావడానికి, అననికంటే ముందు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం గౌరవప్రదమైన సీట్లను గెలవడానికి కృషి చేయాల్సిన పార్టీ, ఇంకా మీనా మేషాలు లెక్కించడం, గతంలో చేసిన తప్పులే మళ్ళీమల్లి చేయడంతో, ఒక విధంగా ప్రజలు విసిగిపోయారు.

 

బిజేపికి సహకరిస్తే ఆత్మహత్యాసదృశ్యమే

బిజేపి పార్టీకి ఏవిధంగా సహకరించినా, అది ఆయా పార్టీలకు ఆత్మహత్యాసదృశ్యం అయిందనేది చరిత్ర. బిజేపి పార్టీ తన ఉనికిని పెంచుకోవడానికి, తానే ఏకైక పార్టీగా నిలవడానికి ప్రయత్నించడం తప్పు కాదు. ఎవరైనా అదే చేస్తారు. అన్ని రాష్ట్రాలలో తనతో పొత్తుపెట్టుకొన్న చిన్నచిన్న పార్టీల ఉనికిని మాయం చేసిన చరిత్ర బిజేపి పార్టీది.  ఈ వాస్తవాన్నికాదని, కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి బజపకీ పరోక్షంగా సహకరిస్తే, చివరికి నష్టపోయేది భారాస పార్టీ కాదు తెలంగాణలోని ప్రజాలనే వాస్తవాన్ని భారాస గ్రహించాలి. భారాస ఖాళీ చేసిన రాజకీయ స్థాననాన్ని ఆక్రమించేది బిజేపి. మొగుడు కొట్టిందని కాకుండా, తోటి కోడలు నవ్విందనే  పాత సామెతలా వ్యవహరిసే నష్టం ప్రజాలకే కాదు భారాస ఉనికికే.

  

Tags
Join WhatsApp

More News...

మహిళల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం_ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

మహిళల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం_  మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పెగడపల్లి నవంబర్ 25 ( ప్రజా మంటలు)మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి_ మహిళల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ అన్నారు. పెగడపల్లి మండల కేంద్రంలో ధర్మపురి నియోజకవర్గ వడ్డీలేని ఋణాల పంపిణీ కార్యక్రమం ప్రారంభంతో పాటు, ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్, కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న...
Read More...

ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ చీరల పంపిణీతో గ్రామాల్లో పండుగ వాతావరణం

ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ చీరల పంపిణీతో గ్రామాల్లో పండుగ వాతావరణం జగిత్యాల నవంబర్ 25 (ప్రజా మంటలు)ఇందిరమ్మ ఇళ్లు,ఇందిరమ్మ చీరల పంపిణీతో గ్రామాల్లో పండగ వాతావరణము నెలకొందని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు. ▪️ జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జగిత్యాల అర్బన్ మండలానికి చెందిన 21 మంది ఆడబిడ్డలకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలు అందజేసి,9మంది ఆడబిడ్డలకు మంజూరైన 9...
Read More...

రోడ్డుపై పశువులు ఇలా ప్రజలు  ,వాహనాలు వెళ్లడం ఎలా?

రోడ్డుపై పశువులు ఇలా ప్రజలు  ,వాహనాలు వెళ్లడం ఎలా? ? జగిత్యాల నవంబర్ 25 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కేంద్రంలో నానాటికి ట్రాఫిక్ పెరుగుతుంది. దీనికి కారణం రవాణా సౌకర్యాలు పెరిగి పోరుగు జిల్లాలు దగ్గర కావడంతో జగిత్యాల జిల్లా కేంద్రానికి పొరుగు జిల్లాల వాళ్ళు రావడం మరింత ట్రా "ఫికర్ " అయింది. వీటన్నిటికీ తోడు జిల్లాలో ఏ మూల చూసినా పశువులే...
Read More...

తెలంగాణా రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 పనుల్లో వేగం — ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షణ

తెలంగాణా రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 పనుల్లో వేగం — ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షణ హైదరాబాద్‌ నవంబర్ 25 (ప్రజా మంటలు): డిసెంబర్‌ 8, 9 తేదీల్లో ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న టెలంగాణా రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఈ అంతర్జాతీయ సమ్మిట్‌కు దేశ-విదేశాల నుండి భారీగా ప్రతినిధులు హాజరుకానుండగా, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వయంగా అన్ని...
Read More...

వరంగల్‌లో ‘నిత్య పెళ్లికూతురు’ ఘరానా మోసం — బంగారం, నగదుతో పరారైన మహిళ

వరంగల్‌లో ‘నిత్య పెళ్లికూతురు’ ఘరానా మోసం — బంగారం, నగదుతో పరారైన మహిళ వ‌రంగ‌ల్‌ నవంబర్ 25 (ప్రజా మంటలు): మ్యారేజ్ బ్యూరో ద్వారా పెళ్లి పేరుతో యువకులను మోసం చేసే నిత్య పెళ్లికూతురు ఘరానా మరోసారి బయటపడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నిమిషకవి ఇందిర (30) ఇదే తరహా మోసాలతో పలువురిని మభ్యపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే… వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామానికి...
Read More...

మధిరలో ఏసీబీ వలలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చందర్

మధిరలో ఏసీబీ వలలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చందర్ మధిర నవంబర్ 24 (ప్రజా మంటలు): మధిరలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌గా పని చేస్తున్న కె. చందర్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు. లంచం స్వీకరిస్తున్న సమయంలో డీఎస్పీ వై. రమేష్ నేతృత్వంలోని ఏసీబీ బృందం చందర్‌ను పట్టుకున్నట్టు తెలుస్తోంది. ➤ భవన కార్మికుడు మృతి – ఇన్సూరెన్స్ మొత్తం బిల్లు కోసం...
Read More...

ప్రజావాణి సమస్యలపై సమగ్ర విచారణ జరిపి త్వరగా పరిశీలించాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

ప్రజావాణి సమస్యలపై సమగ్ర విచారణ జరిపి త్వరగా పరిశీలించాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ జగిత్యాల నవంబర్ 24 (ప్రజా మంటలు)పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్    ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను  అదనపు...
Read More...

బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల కు రాజకీయ అధికారం దగ్గర చేయడమే మా లక్ష్యం రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్.

బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల కు రాజకీయ అధికారం దగ్గర చేయడమే మా లక్ష్యం  రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్.    జగిత్యాల నవంబర్ 24(ప్రజా మంటలు) బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు రాజకీయ అధికారం దగ్గరకు చేయడమే మా లక్ష్యం అన్నారు రాష్ట్రీయ లోకల్ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్అవినీతి రహిత సమాజం కోసం యువత రాజకీయాల్లోకి రావాలని రాష్ట్రీయ లోక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి...
Read More...

న్యూస్ రిపోర్టర్ షఫీ ని ఆసుపత్రిలో పరామర్శించిన జగిత్యాల తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత

న్యూస్ రిపోర్టర్ షఫీ ని ఆసుపత్రిలో పరామర్శించిన జగిత్యాల తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత ఐ  హైదరాబాద్ నవంబర్ 24(ప్రజా మంటలు)జగిత్యాల ఐ న్యూస్ రిపోర్టర్ షఫీ  అనారోగ్యంతో  బంజారాహిల్స్ లోని రెనోవ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా షఫీ ని ఆస్పత్రి లో పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన జిల్లా తొలి జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత సురేష్ మార్క్ ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపు రెడ్డి...
Read More...

ఐబొమ్మ రవి కన్ఫెషన్‌లో సంచలన వివరాలు వెల్లడి?

ఐబొమ్మ రవి కన్ఫెషన్‌లో సంచలన వివరాలు వెల్లడి? హైదరాబాద్ నవంబర్ 24 (ప్రజా మంటలు): ఐబొమ్మ బెట్టింగ్ వెబ్‌సైట్ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన రవి (ఐబొమ్మ రవి) అరెస్ట్ అనంతరం ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు బయటపడ్డాయి. రవిది చిన్నప్పటి నుంచే క్రిమినల్ మెంటాలిటీ అని విచారణ అధికారులు వెల్లడించారు. నేరాలకు పాల్పడేందుకు తన స్నేహితుల ఫేక్ ఐడెంటిటీ కార్డులను వినియోగించినట్లు...
Read More...
Local News  Crime 

పల్లె పకృతి వనంలో గంజాయి తొ పట్టుబడిన యువకులు 

పల్లె పకృతి వనంలో గంజాయి తొ పట్టుబడిన యువకులు  (అంకం భూమయ్య) గొల్లపల్లి నవంబర్ 24 (ప్రజా మంటలు):   బుగ్గారం మండలంలోని గోపులాపూర్ పల్లె ప్రక్రుతి వనం గంజాయి తో పట్టు బడ్డ యువకులు ఏ1 సురజ్ కుమార్,సం18  ఏ2. రాహుల్ కుమార్,బీహార్ రాష్ట్రం చెందిన  ఇద్దరు యువకులు  గంజాయి తాగుతూ పట్టుబడిన ఇద్దరీ వద్ద 60 గ్రాముల గంజాయి స్వాధీన పరుచుకొని ఎన్డిపిఎస్ సెక్షన్...
Read More...
Local News 

గాంధీ వైద్యులు, సిబ్బంది పోస్టల్‌సేవలను వినియోగించుకోవాలి 

గాంధీ వైద్యులు, సిబ్బంది పోస్టల్‌సేవలను వినియోగించుకోవాలి  సికింద్రాబాద్, నవంబర్ 24 (ప్రజామంటలు) : సికింద్రాబాద్‌గాంధీఆస్పత్రి వైద్యులు, సిబ్బంది పోస్టల్‌సేవలను వినియోగించు కోవాలని సికింద్రాబాద్‌డివిజన్‌సీనియర్‌సూపరింటెండెంట్, ఐపీఓఎస్‌అధికారిణి అనన్యప్రియ కోరారు. ఈమేరకు గాంధీ సూపరింటెండెంట్‌ప్రొఫెసర్‌వాణిని సోమవారం కలిసి పోస్టల్‌శాఖ అందిస్తున్న పోస్టల్‌ఖాతాలు, లైఫ్‌ఇన్సూరెన్స్, సుకన్య సమృద్ధి యోజన తదితర సేవలను వివరించారు. ఎక్కువ వడ్డీ ఇచ్చే ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ పోస్టల్‌శాఖ అని పేర్కొన్నారు....
Read More...