చరిత్రలో, చరిత్రతో కలిసి నిలిచిన జగిత్యాల మహోన్నత చరిత్రకారుడు, విద్యా శిఖరం
డా॥ జైశెట్టి రమణయ్యగారి జీవితం – విశ్లేషణాత్మక అవలోకనం
- సిహెచ్ వి ప్రభాకర్ రావు. సీనియర్ జర్నలిస్ట్
🔹 ప్రారంభ జీవితం మరియు నేపథ్యం
డా॥ జైశెట్టి రమణయ్యగారు 9 మే 1938న జగిత్యాలలో జన్మించారు. నిండు జీవితం అనుభవించి, 88 ఏళ్ల వయసులో, శ్రీరామనవమి, మార్చ్ 27, 2026 రోజున పరమపదించారు. నడిచే గ్రంథాలయంగా చెప్పుకొనే రమణయ్య గారి మరణం జగిత్యాల విద్యావేత్తలకు, సమాజాసేవకులకు తీరని లోటు. నిజాం పాలనలో పుట్టి, స్వాతంత్య్రానంతర భారతదేశ మార్పులను అనుభవిస్తూ ఎదిగిన తొలి తరం విద్యావంతుల్లో ప్రముఖులు. సామాన్య కుటుంబంలో జన్మించిన ఆయన చిన్ననాటి నుంచే కష్టాలను ఎదుర్కొంటూ విద్యను ఆశ్రయించి జీవితాన్ని నిర్మించుకున్నారు.
🔹 విద్య ద్వారా సాధించిన అద్భుత ఎదుగుదల
పదిహేడవ యేట సింగిల్ టీచర్గా ఉద్యోగ జీవితం ప్రారంభించిన ఆయన, ఆర్థిక పరిమితుల మధ్యనే చదువును కొనసాగించారు. MA, B.Ed, M.Phil, Ph.D. వంటి ఉన్నత విద్యలను సాధించి లెక్చరర్, రీడర్ స్థాయికి ఎదిగారు. ఒకేసారి ఉపాధ్యాయుడిగా, విద్యార్థిగా, కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ సాధించిన ఈ ప్రయాణం అసాధారణమైనది.
🔹 చరిత్రకారుడిగా విశిష్ట కృషి
రమణయ్యగారు ఉత్తర తెలంగాణ చరిత్ర పరిశోధనలో విశేష కృషి చేశారు. దేవాలయాలు, శిలాశాసనాలు, పురావస్తు ఆధారాలను సేకరించి చారిత్రక విశేషాలను వెలుగులోకి తీసుకువచ్చారు. “దక్షిణ భారతదేశంలో దేవాలయాలు”, “కరీంనగర్ జిల్లా చరిత్ర, సంస్కృతి” వంటి పుస్తకాలు ఆయన పరిశోధనా ప్రతిభకు నిదర్శనం. మొత్తం 20కి పైగా చరిత్ర గ్రంథాలను రచించారు.
🔹 డైరీలు – చారిత్రక సంపదగా మారిన జీవితం
అరవై సంవత్సరాల పాటు నిరంతరంగా డైరీలు రాయడం ఆయన ప్రత్యేకత. ఈ డైరీలు వ్యక్తిగత జీవితానికి మాత్రమే కాకుండా సమకాలీన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాలను కూడా నమోదు చేశాయి. ఇవే ఆయన “స్వంత ఎదుగుదల” స్వీయ చరిత్రకు పునాది అయ్యాయి. ఎనిమిది దశాబ్దాల జగిత్యాల చరిత్రకు, ఆయన డైరీలు ప్రత్యక్ష సాక్షాలు.
🔹 విజయాలు మరియు పురస్కారాలు
రమణయ్యగారు అనేక గౌరవాలు అందుకున్నారు. 1961లో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా రజత పతకం అందుకున్నారు. “వాసవీ నవరత్న”, “పౌరరత్న” వంటి బిరుదులు పొందారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ చరిత్రకారుడిగా గుర్తింపు పొందారు. అంతేకాక, తన ఖర్చులతో 500 మందికి పైగా ప్రతిభావంతులను సత్కరించడం ఆయన సేవా మనసును తెలియజేస్తుంది.
🔹 వ్యక్తిత్వం మరియు ప్రభావం
ఆయన గొప్ప వక్త, ఆదర్శ ఉపాధ్యాయుడు. వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. వారిలో కొందరు ఉన్నత పదవులు, న్యాయమూర్తులు, రాజకీయ నాయకులుగా ఎదిగారు. విద్యార్థులతో సాన్నిహిత్యం, సమాజంపై చైతన్యం కలిగించడం ఆయన ప్రత్యేకత.
🔹 గొప్పతనానికి మూల కారణం
స్వయంకృషి, క్రమశిక్షణ, జ్ఞానాసక్తి, సేవాభావం – ఇవే ఆయన గొప్పతనానికి కారణాలు. వ్యక్తిగత విజయాన్ని సమాజాభివృద్ధితో అనుసంధానం చేయడం ఆయన విశిష్ట లక్షణం. భారత ప్రధాని పివి నరసాయిమహారాయాఉ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి లాంటి వారితో పాటు తెలంగాణ ఉద్యమనేత, తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు తొ సన్నిహిత సంబందాలు ఉన్న మహనీయుడు. తెలంగాణ చరిత్రను ఎందరో ఉద్యమకారులకు పరిచయం చేసిన మహా మనీషి.
• ఉపాద్యాయులకు సన్మానాలు:
ఎంతగా ఎదిగినా, తన మూలాలను మారిచిపోకుండా, పదేళ్ళ బాలునితో పాటు, మహా మేధావుల వరకు అనాదరిని సందేఉశతి తో చూసిన గొప్ప వ్యక్తిత్వం ఆయనది. ఉపద్యాయునిగా జీవితం ప్రారంభించిన రమణయ్య, తనకు సమాజమాలో గౌరవం సంపాదించిపెట్టిన వృత్తిపట్ల నిజాయితీగా ఉంటూ, ఆ వృత్తిలో ఉన్న వారిని గౌరవించడానికి కంకనమ కట్టుకొన్నారు. తాను అధ్యాపక వృత్తి నుండి విశ్రాంతి పొందినా, నిబడ్డతతో దాదాపు రెండు దశాబ్దాలపాటు ప్రతి ఉపాధ్యాయ దినోత్సవం రోజున పదుల సంఖ్యలో ఉపాధ్యాయులను సన్మానించి, ఆదూయపక వృత్తి పట్ల, అధ్యపకులపట్ల తనకున్న గౌరవాన్ని తెలియజేశాడు.
డా॥ జైశెట్టి రమణయ్యగారి జీవితం ఒక సాధారణ వ్యక్తి అసాధారణ శిఖరాలను ఎలా అధిరోహించగలడో చూపించే ప్రేరణాత్మక గాథ. ఆయన రచనలు, సేవలు, విలువలు భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా నిలిచే అమూల్య సంపద.
More News...
<%- node_title %>
<%- node_title %>
చరిత్రలో, చరిత్రతో కలిసి నిలిచిన జగిత్యాల మహోన్నత చరిత్రకారుడు, విద్యా శిఖరం
- సిహెచ్ వి ప్రభాకర్ రావు. సీనియర్ జర్నలిస్ట్
🔹 ప్రారంభ జీవితం మరియు నేపథ్యండా॥ జైశెట్టి రమణయ్యగారు 9 మే 1938న జగిత్యాలలో జన్మించారు. నిండు జీవితం అనుభవించి, 88 ఏళ్ల వయసులో, శ్రీరామనవమి, మార్చ్ 27, 2026 రోజున పరమపదించారు. నడిచే గ్రంథాలయంగా చెప్పుకొనే రమణయ్య గారి మరణం జగిత్యాల విద్యావేత్తలకు,... అంగరంగ వైభవంగా శ్రీ రాములవారి పట్టాభిషేకం
జగిత్యాల మార్చి 28 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో గల సీతారామచంద్రస్వామి ఆలయం (ఎడ్లంగడి) లో శుక్రవారం సీతారామ కళ్యాణం ఘనంగా నిర్వహించగా శనివారం పట్టాభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు విషెస్ సంఖ్యలో పాల్గొన్నారు.
విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. ప్రత్యేక వేదికపై సీతారాముల పరివారం ఉత్సవమూర్తులను... జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు గా సంఘనబట్ల దినేష్ నియామకం
ధర్మపురి, మార్చ్ 28 (ప్రజా మంటలు):
ధర్మపురికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సంఘనబట్ల దినేష్కు కీలక పదవి దక్కింది. తెలంగాణ పబ్లిక్ లైబ్రరీల చట్టం, 1960 ప్రకారం ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ మేరకు, ఆయనను జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ (జిల్లా గ్రంథాలయ సమస్థ) చైర్మన్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.... జగిత్యాలలో హజ్ యాత్రికులకు వాక్సినేషన్ ప్రారంభం – ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పరిశీలన
జగిత్యాల మార్చ్ 28 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలోని మాతా శిశు హాస్పిటల్లో హజ్ యాత్రికులకు వాక్సినేషన్ కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలో జరుగుతున్న సేవలను పరిశీలిస్తూ, మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను సమీక్షించారు. ఇటీవల ప్రారంభించిన క్రిటికల్ కేర్ యూనిట్ హాస్పిటల్ను కూడా సందర్శించి... పోలాండ్ దేశ దేవుడు మన భారత దేశ రాజు. - అతనిని దూషిస్తే మరణ శిక్ష !!!
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/ 9348422113).
హైదరాబాద్ 27 మార్చి (ప్రజా మంటలు) :
పోలాండ్ కు భారతదేశం పై అంత మమకారం ఎందుకు?
పోలాండ్లో ఈ భారత రాజును దూషిస్తే మరణశిక్ష.
మన దేశపు రాజు, పోలాండ్ దేశపు దేవుడు శ్రీ శ్రీ రాజా సాహబ్ దిగ్విజయ్ సింగ్.
కానీ భారతీయులకు... ప్రముఖ చరిత్రకారుడు జైశెట్టి రమణయ్య మృతి.. కేసీఆర్, కవిత సంతాపం
జగిత్యాల, మార్చి 27 (ప్రజా మంటలు):
ప్రముఖ చరిత్రకారుడు, రిటైర్డ్ లెక్చరర్ జైశెట్టి రమణయ్య (85) అనారోగ్యంతో మరణించారు. ఆదివారం 29 వ తేదీన జగిత్యాల లలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ సభ్యులు మంచాలబీసీ... ఏప్రిల్ 25న కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటన – తెలంగాణ రాజకీయాల్లో కొత్త దిశ?
నిజామాబాద్, మార్చ్ 27 (ప్రజా మంటలు):
తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులకు నాంది పలుకుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన చేశారు. తమ సంస్థ అయిన తెలంగాణ జాగృతి త్వరలో రాజకీయ పార్టీగా మారబోతోందని వెల్లడించారు.ఏప్రిల్ 25న మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్ వేదికగా పార్టీ జెండా, అజెండాను అధికారికంగా ప్రకటించనున్నట్లు... టి జి ఆర్ ఎస్ ఏ జగిత్యాల జిల్లా అణిముత్యాలు దొంతి రాజేశ్వరి గీర్దావర్ మరియు పంగరాజేశం జిపిఓ కు ఘన సన్మానము
జగిత్యాల మార్చి 26 (ప్రజా మంటలు)
దొంత రాజేశ్వరి గిర్ధవర్ ఆర్చరికి ఘన సన్మానం
దొంత రాజేశ్వరి గిర్దావర్ వెల్గటూర్ మండలం ఓపెన్ మాస్టర్ గేమ్స్ 2025 లో నేషనల్ గేమ్స్ గోవా : బంగారు పథకం ఉత్తరఖాండు :బంగారు పథకం హిమాచల్ ప్రదేశ్ : బంగారు పథకం సౌత్ కొరియ : 2023 లో... మరణానంతరం కూడా ప్రాణదాతగా నిలిచిన మానవత్వానికి నిలువుటద్దం హెడ్ కానిస్టేబుల్ నల్లాల లక్ష్మీరాజం”*
*“
జగిత్యాల మార్చి 26 ప్రజా మంటలు) జిల్లా కోరుట్ల పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న నల్లాల లక్ష్మీరాజం ఆకస్మిక మరణం జిల్లా పోలీస్ శాఖకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
పోలీస్ అంటే కేవలం రక్షణ మాత్రమే కాదు
విధి నిర్వహణలోనే కాకుండా, మరణానంతరం కూడా తన అవయవాలను దానం చేసి మరో... జగిత్యాల నుండి బయలుదేరిన బస్సు మార్కాపురం వద్ద ప్రమాదం: 13 మందికి మృతి
మార్కాపురం, మార్చి 26 (ప్రజా మంటలు):
ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం 13 మంది ప్రాణాలను బలిగొంది. హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన సెమీ-స్లీపర్ బస్సు టిప్పర్ లారీని ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది.జగిత్యాల నుండి కనిగిరి/పామూరు వైపు సుమారు 40–45 మంది ప్రయాణికులతో బయలుదేరిన... లోక్ జనశక్తి (రామ్ విలాస్) పార్టీ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీకి సిద్ధం
న్యూ ఢిల్లీ, మార్చి 25 (ప్రజా మంటలు):
రాబోయే స్థానిక సంస్థల, కార్పొరేషన్ ఎన్నికల్లో లోక్ జనశక్తి (రామ్ విలాస్) పార్టీ తమ పార్టీ గుర్తుపై స్వతంత్రంగా పోటీ చేయనున్నట్లు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై జరిగిన చర్చల అనంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఈ విషయాన్ని... కాంగ్రెస్కు జీవన్ రెడ్డి రాజీనామా: జగిత్యాలలో భావోద్వేగ తుఫాన్, కార్యకర్తల సామూహిక రాజీనామాలు
జగిత్యాల, మార్చ్ 25 (ప్రజా మంటలు):
కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామా చేయడం జగిత్యాల రాజకీయాల్లో పెద్ద ప్రకంపనలు సృష్టించింది. నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకుంటూ తీసుకున్న ఈ నిర్ణయం పూర్తిగా భావోద్వేగభరితంగా మారింది.“ఇంకా ఎంతకాలం ఈ అవమానాలు.. ఈ మానసిక క్షోభ” అంటూ జీవన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం... 