హైదరాబాద్‌లో 2026 డిసెంబర్ 9 నాటికి 100% ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులు – సీఎం రేవంత్ రెడ్డి

డెస్క్ జర్నలిస్టులకు న్యాయం చేస్తాం

On
హైదరాబాద్‌లో 2026 డిసెంబర్ 9 నాటికి 100% ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులు – సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ మార్చ్ 08 (ప్రజా మంటలు):


దేశంలోని ఇతర మెట్రో నగరాలు ఎదుర్కొంటున్న సమస్యలు భవిష్యత్తులో హైదరాబాద్ నగరానికి రాకుండా ముందుగానే ప్రణాళికలు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.


అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని జ్యోతిరావు పూలే భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మహిళా జర్నలిస్టులను ముఖ్యమంత్రి సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరాభివృద్ధికి అందరి సహకారం అవసరమని పేర్కొన్నారు.

IMG-20260308-WA0011
దేశంలోని కొన్ని ప్రధాన నగరాలు ప్రస్తుతం తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయని ఆయన అన్నారు. ముంబయ్‌లో భారీ వర్షాలు పడితే నగరం అస్తవ్యస్తమవుతుందని, ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉందని చెప్పారు. బెంగుళూరులో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, చెన్నైలో వరదల సమయంలో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని గుర్తు చేశారు.


ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో హైదరాబాద్‌లో తలెత్తకూడదని ముందుగానే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్‌లో వాయు నాణ్యత ఆరెంజ్ స్థాయికి చేరిందని, భవిష్యత్తులో ఇది మరింత ప్రమాదకరంగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.


నగరంలో చెత్త సమస్య, దోమల సమస్య, మూసీ నదిలో కాలుష్యం వంటి అంశాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఢిల్లీలో యమునా నది అభివృద్ధి, ఉత్తరప్రదేశ్‌లో గంగా నది శుద్ధి, గుజరాత్‌లో సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుల మాదిరిగానే హైదరాబాద్‌లో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపడుతున్నామని చెప్పారు.


సుప్రీంకోర్టు, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాల ప్రకారం మూసీ నది వెంట బఫర్ జోన్ నిబంధనలు అమల్లో ఉన్నాయని తెలిపారు. నాలా ప్రాంతాల్లో 10 మీటర్లు, నదుల వద్ద 50 మీటర్ల బఫర్ జోన్ ఉండాలని నిబంధనలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో నిర్మాణాలు అనుమతించబడవని చెప్పారు.


మూసీ నది అభివృద్ధి కార్యక్రమం వల్ల ఇళ్లను కోల్పోయే వారికి ప్రభుత్వం తగిన నష్టపరిహారం అందిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. అవసరమైతే వారికి ప్రత్యామ్నాయ స్థలాలు కూడా కల్పిస్తామని చెప్పారు.


గాంధీ సరోవర్ ప్రాజెక్టు విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టుకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని కొందరు చెబుతున్నారని, కానీ గాంధీ విగ్రహం కోసం సుమారు 70 కోట్లు, విజ్ఞాన కేంద్రం మరియు అభివృద్ధి పనులకు మొత్తం 200 కోట్లు మాత్రమే ఖర్చవుతాయని వివరించారు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ నెల 13న ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెల్లడిస్తామని చెప్పారు.
కాలుష్య నియంత్రణలో భాగంగా హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులను పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే ప్రణాళికను ప్రభుత్వం రూపొందించిందన్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో సుమారు 2800 డీజిల్ బస్సులు ఉన్నాయని, వాటి స్థానంలో 2026 డిసెంబర్ 9 నాటికి 100 శాతం ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామని తెలిపారు. ఇప్పటికే 500 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించినట్లు చెప్పారు.


డీజిల్ బస్సులను నగరం బయట ప్రాంతాలకు తరలించి వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ఈవీ వాహనాలకు జీరో పన్ను విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. నగరంలో సుమారు రెండు లక్షల ఆటోలు ఉన్నాయని, వాటిని కూడా రెట్రోఫిటింగ్ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే ప్రణాళిక ఉందన్నారు. అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.


కాలుష్యానికి కారణమయ్యే రెడ్, ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమలను నగరం బయటకు తరలించే ప్రక్రియ కూడా కొనసాగుతోందన్నారు.
తెలంగాణ రాష్ట్రం దేశ జనాభాలో కేవలం 2.5 శాతం మాత్రమే ఉన్నప్పటికీ దేశ జీడీపీలో 5 శాతం వాటా కలిగి ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. అప్పటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటా 10 శాతానికి చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

డెస్క్ జర్నలిస్టులకు న్యాయం చేస్తాం
ఈ లక్ష్య సాధనలో మహిళల పాత్ర కీలకమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మహిళా జర్నలిస్టులకు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు ఇస్తుందని, మీడియా సంస్థల్లో మహిళల రక్షణ కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. డెస్క్ జర్నలిస్టుల గుర్తింపులో కూడా ఎవరికీ అన్యాయం జరగదని చెప్పారు.
సమాజంలో మహిళల పట్ల ఉన్న వివక్షను తొలగించాలంటే వారికి సమాన అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితే దేశం కూడా ఆర్థికంగా బలపడుతుందని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజహరుద్దీన్, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఐ అండ్ పీఆర్ కమిషనర్ సీహెచ్ ప్రియాంకతో పాటు పెద్ద సంఖ్యలో మహిళా జర్నలిస్టులు పాల్గొన్నారు.

 

 

Join WhatsApp

More News...

Local News 

సీనియర్ సిటిజెన్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం.   సందర్భంగా  సన్మానాలు                            

సీనియర్ సిటిజెన్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం.   సందర్భంగా  సన్మానాలు                                 జగిత్యాల మార్చి 8:తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఆదివారం తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అస్సోసియేషన్ సమావేశ మందిరంలో జరిగిన ఈ వేడుకల్లో జిల్లాలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహిళలను సన్మానించారు.   ధర్మపురి...
Read More...
State News 

హైదరాబాద్‌లో 2026 డిసెంబర్ 9 నాటికి 100% ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులు – సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌లో 2026 డిసెంబర్ 9 నాటికి 100% ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులు – సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ మార్చ్ 08 (ప్రజా మంటలు): దేశంలోని ఇతర మెట్రో నగరాలు ఎదుర్కొంటున్న సమస్యలు భవిష్యత్తులో హైదరాబాద్ నగరానికి రాకుండా ముందుగానే ప్రణాళికలు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని జ్యోతిరావు పూలే భవన్‌లో జరిగిన...
Read More...
State News 

మెట్రో ఛానల్ వద్ద మమతా బెనర్జీ ధర్నా – సింగూర్ ఉద్యమం జ్ఞాపకాలతో ఎన్నికల సమరానికి సంకేతం

మెట్రో ఛానల్ వద్ద మమతా బెనర్జీ ధర్నా – సింగూర్ ఉద్యమం జ్ఞాపకాలతో ఎన్నికల సమరానికి సంకేతం బెంగాల్ రాజకీయాలపై ప్రత్యేక కథనం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి Mamata Banerjee మరోసారి కోల్‌కతాలోని Metro Channel వద్ద ధర్నా చేపట్టడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సాధారణంగా రాజకీయ పార్టీలు నిరసనలు నిర్వహించే ప్రదేశంగా ఈ స్థలం ప్రసిద్ధి పొందింది. కానీ మమతా బెనర్జీ రాజకీయ జీవితంలో ఈ ప్రదేశానికి ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది....
Read More...
Local News  Crime 

రేచపల్లి లో  బావిలో బాలుడి మృతదేహం

రేచపల్లి లో  బావిలో బాలుడి మృతదేహం జగిత్యాల రూరల్, మార్చ్ 08 (ప్రజా మంటలు):     రేచపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిన్నోజి రమేశ్ – జ్యోస్న దంపతుల కుమారుడు పవన్ తేజ (10) సమీపంలోని బావిలో మృతదేహంగా కనిపించాడు.పవన్ తేజ ఈ నెల 3వ తేదీన హోలీ ఆడుకోవడానికి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ...
Read More...
Local News  State News 

జగిత్యాల అభివృద్ధే నా లక్ష్యం – ఎంపీ అరవింద్ విమర్శలకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కౌంటర్

జగిత్యాల అభివృద్ధే నా లక్ష్యం – ఎంపీ అరవింద్ విమర్శలకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కౌంటర్ జగిత్యాల మార్చ్ 07 (ప్రజా మంటలు): జగిత్యాల అభివృద్ధే తన ప్రధాన ఎజెండా అని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. కేంద్రీయ విద్యాలయం విషయంలో కాలయాపన చేస్తున్నారని ఎంపీ అరవింద్ చేసిన ఆరోపణలకు ఆయన ఘాటుగా స్పందించారు.జగిత్యాల పట్టణంలోని మోతే రోడ్డు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో...
Read More...
Crime  State News 

హింస ద్వారా సమస్యలకు పరిష్కారం సాధ్యం కాదు: సీఎం రేవంత్ రెడ్డి

హింస ద్వారా సమస్యలకు పరిష్కారం సాధ్యం కాదు: సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ మార్చ్ 07 (ప్రజా మంటలు): హింస ద్వారా సమస్యలకు పరిష్కారం సాధ్యం కాదని, ప్రజాస్వామ్య మార్గంలోనే సమాజంలో మార్పు సాధ్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు.లొంగిపోయిన మావోయిస్టులకు ప్రాణరక్షణతో పాటు ఆర్థిక సహాయం, పునరావాసం కల్పిస్తామని తెలిపారు. కేంద్ర...
Read More...
Local News 

ప్రతి జిల్లాకు ఓక వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలి* 

ప్రతి జిల్లాకు ఓక వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలి*  * జగిత్యాల, మార్చి 7(ప్రజా మంటలు) ప్రతి జిల్లా కు ఓక వెల్నెస్ సెంటర్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసి స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ కు అప్పగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కరబూజ రవీందర్ అన్నారు. శనివారం స్థానిక పెన్షనర్స్ భవన్ లో జిల్లా కార్యనిర్వాహక వర్గ...
Read More...
Local News 

రాష్ట్రస్థాయిలో ర్యాంకు సాధించిన విద్యార్థినిని అభినందించిన ఎమ్మెల్యే సంజయ్

రాష్ట్రస్థాయిలో ర్యాంకు సాధించిన విద్యార్థినిని అభినందించిన ఎమ్మెల్యే సంజయ్    జగిత్యాల:  మార్చి 7 (ప్రజా మంటలు)అఖిల భారత సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష – 2026 లో పాఠశాలకు చెందిన విద్యార్థిని ఆర్. శ్రేయాన్వి రాష్ట్ర స్థాయిలో 23వ ర్యాంక్ సాధించి పాఠశాలకు గౌరవాన్ని తీసుకొచ్చింది.ఈ విజయాన్ని పురస్కరించుకొని జగిత్యాల  ఎమ్మెల్యే  సంజయ్ కుమార్  విద్యార్థిని ఆర్. శ్రేయాన్విని అభినందించారు . ప్రతిభావంతులుగా...
Read More...
Local News 

యూపీఎస్సీ ఫలితాలలో సత్తా చాటిన జగిత్యాల జిల్లా విద్యార్థి

యూపీఎస్సీ ఫలితాలలో సత్తా చాటిన జగిత్యాల జిల్లా విద్యార్థి    జగిత్యాల మార్చి 7 ( ప్రజా మంటలు)748 ర్యాంక్ సాధించిన రాహుల్ ను సన్మానించిన గ్రామస్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు      *ఇటీవల విడుదలైన యూపీఎస్సీ 2025 --2026 ఫలితాలలో జగిత్యాల జిల్లాకు చెందిన రాహుల్  748 ర్యాంకు సాధించి సత్తా చాటాడు. *జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం హన్మజీపేట గ్రామానికి చెందిన పుదరి...
Read More...
Local News  State News 

సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 23వ ర్యాంక్ సాధించిన మానస స్కూల్ విద్యార్థిని శ్రేయాన్వి

సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 23వ ర్యాంక్ సాధించిన మానస స్కూల్ విద్యార్థిని శ్రేయాన్వి జగిత్యాల, మార్చ్ 07 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లాలో విద్యా రంగంలో మరో విశిష్ట విజయాన్ని మానస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ సాధించింది. అఖిల భారత సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష – 2026లో పాఠశాలకు చెందిన విద్యార్థిని ఆర్. శ్రేయాన్వి రాష్ట్ర స్థాయిలో 23వ ర్యాంక్ సాధించి పాఠశాలకు గౌరవాన్ని తీసుకొచ్చింది. ఈ విజయాన్ని...
Read More...
Local News 

2025 తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రకటన: ఉత్తమ నటుడిగా నాగ చైతన్య, ఉత్తమ నటిగా రష్మిక మందాన 

2025 తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రకటన: ఉత్తమ నటుడిగా నాగ చైతన్య, ఉత్తమ నటిగా రష్మిక మందాన  2025 తెలంగాణ Gaddar Awards విజేతల జాబితా హైదరాబాద్, మార్చ్ 07: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే గద్దర్ అవార్డులు – 2025 ను ప్రకటించింది. తెలుగు సినీ రంగంలో ప్రతిభ కనబరిచిన నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు ఈ అవార్డులు ప్రకటించారు. ప్రధాన అవార్డులుఉత్తమ నటుడు – నాగ చైతన్య (తండేల్‌)ఉత్తమ...
Read More...
Local News 

ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కోరుతూ బీసీ నాయకుల చే కలెక్టర్ కు వినతి

ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కోరుతూ బీసీ నాయకుల చే కలెక్టర్ కు వినతి    జగిత్యాల మార్చ్6( ప్రజా మంటలు)  జిల్లా కలెక్టర్ కి. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 8000 కోట్లను వెంటనే విడుదల చేయాలని చెల్లించాలని. వినతి పత్రం సమర్పించిన బీసీ నాయకులు    (తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 8000 కోట్లను వెంటనే చెల్లించాలని డిమాండ్.) తెలంగాణ రాష్ట్రంలో...
Read More...