పెండింగ్ కేసుల పై ప్రతేక దృష్టి సారించాలి : జిల్లా ఎస్పీ శ్రీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్.
- పటిష్ట మైన ప్రణాళికతో రానున్న లోక్ సభ ఎన్నికల నిర్వహణ.
జగిత్యాల మార్చి 29 (ప్రజా మంటలు) :
నేర విచారణ మరింత సమర్ధవంతంగా చేయడంతో పాటు కేసులను సత్వరం పరిష్కరించే విధంగా పోలీస్ అధికారులంతా సమర్ధవంతంగా పని చేయాలని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ సూచించారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నేర విచారణ మరింత సమర్ధవంతంగా, అన్ని స్థాయిలలో అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ ముందుకు సాగాలని అన్నారు.పోలీసు స్టేషన్లలో నమోదయ్యే ప్రతీ కేసు వివరాలను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు పొందుపరచాలని తెలిపారు.
దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డీఎస్పీ లు, సి.ఐ లు తమ పరిధిలో ఉండే పోలీస్ స్టేషన్ లలో నమోదైన వివిధ రకాల కేసులు యొక్క స్థితిగతులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సంబంధిత ఎస్.ఐలకు కేసుల దర్యాప్తు కు సంభందించి సూచనలు ఇవ్వాలని సూచించారు.
పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయధికారులతో సమన్వయం పాటిస్తూ భాదితులకు న్యాయం చేకూరేలా పనిచేయాలని కోరారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు, వాహన తనిఖీలు నిర్వహించాలని,బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే ప్రాంతాల పై నిఘా ఉంచాలని వారి పై కేస్ లు నమోదు చేయాలని అన్నారు.
బ్లాక్ స్పాట్స్(రోడ్డు ప్రమాదాల ప్రమాదాలు అధికముగా జరుగు ప్రదేశాలు) గుర్తించి పంచాయతీ రాజ్ మరియు ఆర్&బి ప్రబుత్వ శాఖల సమన్వయంతో ప్రమాదాల నివరణ పై దృష్టి సారించాలని అన్నారు.
రాష్ట్ర, జిల్లాల సరిహద్దుల నుండి వచ్చే గంజాయి, సరఫరా చేసే వ్యక్తులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి రవాణా ను పకడ్బందీగా నియంత్రించాలన్నారు. జిల్లాలో గంజాయి,మత్తు పదార్థాలు పూర్తి స్థాయిలో నిర్ములించేందుకు జిల్లా పోలీస్ యంత్రంగం ప్రత్యేక ప్రణాళికలను ఏర్పాటు చేసుకొని మండలాల్లో, గ్రామాల్లో నిత్యం తనిఖీలు నిర్వహిస్తు ముందుకు సాగుతుంది అన్నారు.
వివిధ జిల్లాల వారీగా నుండి జిల్లాకు వచ్చే గంజాయి మూలలను,కీలక వ్యక్తులను గుర్తించి వారి పై కఠిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో,కలశాలలో గంజాయ ,మత్తు పధార్థాలకు అలవాటు పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. గంజాయి, మరే ఇతర మత్తు పదార్థాలు అమ్ముతున్నట్లు రవాణా చేస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్ కి లేదా డయల్100 కు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
ప్రాసిక్యూషన్ లో భాగంగా కోర్టు వారు జారిచేసిన నాన్ బెయిలబుల్ వారెంట్లను నిందితులపై లేదా తప్పించుకుని తిరుగుతున్న నేరస్తులపై అమలుపరచడానికి అధికారులు అందరూ కృషి చేయాలని సూచించారు.
నాన్ బెయిలబుల్ వారెంట్లను త్వరగా ఎగ్జిక్యూట్ చేయడం వల్ల కేసు విచారణ విజయవంతంగా పూర్తి అయి సకాలంలో బాధితులకు న్యాయం జరుగుటకు ఆస్కారం వుంటుంది అన్నారు.
జిల్లాలో పటిష్టమైన ప్రణాళికతో ప్రశాంత వాతావరణంలో రాబోవు లోక్ సభ ఎన్నికలు జరిగేలా ప్రతీ ఒక్క అధికారి ఇతర శాఖల సమన్వయంతో కలిసి పని చేయాలనీ సూచించారు.
జిల్లాకు అక్రమంగా డబ్బు, మద్యం, ఇతర వస్తువులు రానీయకుండా పకడ్బందీగా చెక్ పోస్టు ల నిర్వహణ ఉండాలనీ అన్నారు.
ఈ యొక్క సమావేశంలో ఏ ఎస్ పి శివం ఉపాధ్యాయ ఐపీఎస్ గారు , డీఎస్పీలు రఘు చందర్,ఉమామహేశ్వర రావు,రంగా రెడ్డి డిసిఆర్బి , సీసీఎస్ ,ఎస్బి, ఐటి కోర్ ఇన్స్పెక్టర్ లు శ్రీనివాస్, లక్ష్మీనారాయణ,నాగేశ్వర రావు, రఫీక్ ఖాన్, మరియు సి.ఐ లు, ఎస్.ఐ డి సి ఆర్ బి , ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఏం చేశారని విజయోత్సవాలు జరుపుకుంటారు..? *కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజేశ్వరి విమర్శలు
సికింద్రాబాద్, నవంబర్ 23 ( ప్రజా మంటలు):
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ముఖంతో విజయోత్సవాలు జరుపుకుంటోంది, ఎలాంటి నెరవేర్చని హామీలతో ఎన్నికలను ఎదుర్కోవాలని చూస్తోంది అని బీజేపీ రాష్ట్ర నాయకురాలు మల్లేశ్వరపు రాజేశ్వరి ప్రశ్నించారు. మహాలక్ష్మి ఫ్రీ బస్సు మినహా ఇప్పటి వరకు ఒక్క గ్యారంటీ కూడా పూర్తిగా అమలు కాలేదని ఆమె విమర్శించారు.... గుజరాత్లో SIR పని ఒత్తిడితో నాలుగు రోజుల్లో నలుగురు BLO సిబ్బంది మృతి
వడోదరా / గుజరాత్, నవంబర్ 22 (ప్రజా మంటలు):
గుజరాత్లో Special Intensive Revision (SIR) కార్యక్రమం క్రమంలో Booth Level Officers (BLO) మరియు BLO అసిస్టెంట్లపై భారీ పని ఒత్తిడి నెలకొంది. ఈ ఒత్తిడిలోనే వడోదరాలో BLO అసిస్టెంట్ ఉషాబెన్ ఇంద్రసింగ్ సోలంకీ విధి నిర్వహణలో మృతి చెందారు. గత నాలుగు రోజుల్లో... అణు రంగంలో ప్రైవేట్ ప్రవేశానికి బిల్లు:: మరో 10 కీలక బిల్లులు సిద్ధం
న్యూ ఢిల్లీ, నవంబర్ 22 (ప్రజా మంటలు):
డిసెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే వింటర్ సెషన్లో కేంద్ర ప్రభుత్వం మొత్తం 10 కీలక బిల్లులను ప్రవేశపెట్టబోతోంది. వీటిలో దేశంలోని సివిల్ న్యూక్లియర్ రంగాన్ని ప్రైవేట్ కంపెనీలకు తెరవడాన్ని ప్రతిపాదించే బిల్లు ప్రధానంగా నిలుస్తోంది.
అదేవిధంగా, చండీగఢ్పై రాష్ట్రపతికి నేరుగా చట్టాలు, నిబంధనలు రూపొందించే అధికారం... అందెశ్రీ కీర్తి తెలంగాణ చరిత్రలో శాశ్వతం:రేవంత్ రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 22 (ప్రజా మంటలు):
తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన కవులు, కళాకారులలో అందెశ్రీ పేరు ఎన్నటికీ చెరిగిపోదని, రాష్ట్ర చరిత్రలో ఆయన స్థానం శాశ్వతమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రవీంద్రభారతిలో జరిగిన అందెశ్రీ స్మారక సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,వజ్రాలపై దశాబ్దాలు చర్చించినా కోహినూర్కు పోటీ లేకపోయినట్టే,... జగిత్యాల జిల్లా నూతన డీసీసీ అధ్యక్షునికి ఆత్మీయ సన్మానం
జగిత్యాల, నవంబర్ 22 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రకటించిన జిల్లా కమిటీ అధ్యక్షుల్లో భాగంగా జగిత్యాల జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా, మాజీ మంత్రి వర్గీయుడైన, గాజంగి నందయ్య నియమితులయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఇందిరా భవన్లో నందయ్యను ఘనంగా సన్మానించారు.... తెలంగాణ జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ప్రకటన
హైదరాబాద్ నవంబర్ 22 (ప్రజా మంటలు):
తెలంగాణలో డీసీసీ అధ్యక్షులను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రకటించింది. మొత్తం 36 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించింది.డీసీసీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సగానికి పైగా కేటాయించింది.
ఇక్కడ తెలంగాణ కొత్తగా ప్రకటించిన DCC అధ్యక్షుల జాబితా ను సులభంగా చదవగల టేబుల్ ఫార్మాట్లో అందిస్తున్నాను:
తెలంగాణ – జిల్లావారీ... ఇయ్యాల సికింద్రాబాద్ లో భారీ యూనిటీ మార్చ్ ర్యాలీ
సికింద్రాబాద్, నవంబర్ 22 (ప్రజామంటలు) :
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతిని పురస్కరించుకొని సికింద్రాబాద్ లో నేడు ఆదివారం ఉదయం భారీ యూనిటీ మార్చ్ ర్యాలీ నిర్వహించనున్నారు. శనివారం సీతాఫల్మండిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశలో బీజేపీ నాయకులు, జిల్లా యువజన శాఖ అధికారులు వివరాలు వెల్లడించారు.
ఉదయం 10 గంటలకు సీతాఫల్మండి... బీపీ పెరగడంతో నరాలు చిట్లి యువకుడు మృతి
ఇబ్రహీంపట్నం నవంబర్ 22 (ప్రజ మంటలు దగ్గుల అశోక్)
జగిత్యాలజిల్లా ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్ గ్రామానికి చెందిన చెని ప్రసాద్(38) s/o చెని చిన్న దేవయ్య కుమారుడు బీపీతో మెదడు లో నరాలు చితికి పోవడంతో గత నాలుగు రోజుల క్రితం నిజామాబాద్ ప్రైవేటు ఆసుపత్రిలో లో చేర్పించారు.ఎలాంటి ట్రీట్మెంట్ కి స్పందించకపోవడంతో నిన్న రాత్రి... గౌహతి టెస్ట్: దక్షిణాఫ్రికా తొలి రోజు 247 పరుగులు
గౌహతి నవంబర్ 22:
భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది.
ఓపెనర్లు ఐడెన్ మార్క్రామ్ మరియు రియాన్ రికల్డన్ జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు.
మార్క్రామ్ 38 పరుగులకు, రికల్డన్ 35 పరుగులకు... అమీర్పేట్లో రూ.25 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ హర్షం..
సికింద్రాబాద్, నవంబర్ 22 (ప్రజామంటలు):
అమీర్పేట్ డివిజన్లో రూ.25 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు రక్షించారని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ తెలిపారు. పార్కు కోసం దశాబ్దాల క్రితం కేటాయించిన 1500 గజాల స్థలాన్ని... కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో వెజిటేబుల్ డే సెలబ్రేషన్స్
సికింద్రాబాద్, నవంబర్ 22 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ భోలక్ పూర్ లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో శనివారం వెజిటేబుల్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. నర్సరీ,ఎల్ కేజీ, యూకేజీ చిన్నారి విద్యార్థులకు ఈ సందర్బంగా వెజిటేబుల్స్ ప్రాముఖ్యత గురించి వివరించారు.
దైనిందిన ఆహారంలో కూరగాయలను ఖచ్చితంగా తినాలని, వాటి వలన ఆరోగ్యం బాగుంటుందని, వెజిటేబుల్స్ లోని... కోరుట్ల తాళ్ళచెరువు ఫిల్టర్ బెడ్ పరిశీలించిన అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ )బి రాజా గౌడ్
కోరుట్ల నవంబర్ 22(ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా కోరుట్ల మండల కేంద్రంలోని తాళ్లచెరువు ఫిల్టర్ బెడ్ ను శనివారం పరిశీలించిన అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) బి.రాజ గౌడ్
పట్టణం లోని పట్టణ ప్రజలకు సకాలంలో నీరు అందించాలి. ఫిల్టర్ బెడ్ ను మరియు నీరు యొక్క స్వచ్ఛతను ఎప్పటికప్పుడు పరిశీలించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు.... 