పెండింగ్ కేసుల పై ప్రతేక దృష్టి సారించాలి : జిల్లా ఎస్పీ శ్రీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్.

- పటిష్ట మైన ప్రణాళికతో రానున్న లోక్ సభ ఎన్నికల నిర్వహణ.

On
పెండింగ్ కేసుల పై ప్రతేక దృష్టి సారించాలి : జిల్లా ఎస్పీ శ్రీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్.

జగిత్యాల మార్చి 29 (ప్రజా మంటలు) : 

నేర విచారణ మరింత సమర్ధవంతంగా చేయడంతో పాటు కేసులను సత్వరం పరిష్కరించే విధంగా పోలీస్ అధికారులంతా సమర్ధవంతంగా పని చేయాలని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ సూచించారు.

 జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నేర విచారణ మరింత సమర్ధవంతంగా, అన్ని స్థాయిలలో అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ ముందుకు సాగాలని అన్నారు.పోలీసు స్టేషన్లలో నమోదయ్యే ప్రతీ కేసు వివరాలను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు పొందుపరచాలని తెలిపారు.

దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డీఎస్పీ లు, సి.ఐ లు తమ పరిధిలో ఉండే పోలీస్ స్టేషన్ లలో నమోదైన వివిధ రకాల కేసులు యొక్క స్థితిగతులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సంబంధిత ఎస్.ఐలకు కేసుల దర్యాప్తు కు సంభందించి సూచనలు ఇవ్వాలని సూచించారు.

పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయధికారులతో సమన్వయం పాటిస్తూ భాదితులకు న్యాయం చేకూరేలా పనిచేయాలని కోరారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు, వాహన తనిఖీలు నిర్వహించాలని,బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే ప్రాంతాల పై నిఘా ఉంచాలని వారి పై కేస్ లు నమోదు చేయాలని అన్నారు.

బ్లాక్ స్పాట్స్(రోడ్డు ప్రమాదాల ప్రమాదాలు అధికముగా జరుగు ప్రదేశాలు) గుర్తించి పంచాయతీ రాజ్ మరియు ఆర్&బి ప్రబుత్వ శాఖల సమన్వయంతో ప్రమాదాల నివరణ పై దృష్టి సారించాలని అన్నారు.

రాష్ట్ర, జిల్లాల సరిహద్దుల నుండి వచ్చే గంజాయి, సరఫరా చేసే వ్యక్తులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి రవాణా ను పకడ్బందీగా నియంత్రించాలన్నారు. జిల్లాలో గంజాయి,మత్తు పదార్థాలు పూర్తి స్థాయిలో నిర్ములించేందుకు జిల్లా పోలీస్ యంత్రంగం ప్రత్యేక ప్రణాళికలను ఏర్పాటు చేసుకొని మండలాల్లో, గ్రామాల్లో నిత్యం తనిఖీలు నిర్వహిస్తు ముందుకు సాగుతుంది అన్నారు.

వివిధ జిల్లాల వారీగా నుండి జిల్లాకు వచ్చే గంజాయి మూలలను,కీలక వ్యక్తులను గుర్తించి వారి పై కఠిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో,కలశాలలో గంజాయ ,మత్తు పధార్థాలకు అలవాటు పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. గంజాయి, మరే ఇతర మత్తు పదార్థాలు అమ్ముతున్నట్లు రవాణా చేస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్ కి లేదా డయల్100 కు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

ప్రాసిక్యూషన్ లో భాగంగా కోర్టు వారు జారిచేసిన నాన్ బెయిలబుల్ వారెంట్లను నిందితులపై లేదా తప్పించుకుని తిరుగుతున్న నేరస్తులపై అమలుపరచడానికి అధికారులు అందరూ కృషి చేయాలని సూచించారు.

నాన్ బెయిలబుల్ వారెంట్లను త్వరగా ఎగ్జిక్యూట్ చేయడం వల్ల కేసు విచారణ విజయవంతంగా పూర్తి అయి సకాలంలో బాధితులకు న్యాయం జరుగుటకు ఆస్కారం వుంటుంది అన్నారు.

జిల్లాలో పటిష్టమైన ప్రణాళికతో ప్రశాంత వాతావరణంలో రాబోవు లోక్ సభ ఎన్నికలు జరిగేలా ప్రతీ ఒక్క అధికారి ఇతర శాఖల సమన్వయంతో కలిసి పని చేయాలనీ సూచించారు.

జిల్లాకు అక్రమంగా డబ్బు, మద్యం, ఇతర వస్తువులు రానీయకుండా పకడ్బందీగా చెక్ పోస్టు ల నిర్వహణ ఉండాలనీ అన్నారు.

ఈ యొక్క సమావేశంలో ఏ ఎస్ పి శివం ఉపాధ్యాయ ఐపీఎస్ గారు , డీఎస్పీలు రఘు చందర్,ఉమామహేశ్వర రావు,రంగా రెడ్డి డిసిఆర్బి , సీసీఎస్ ,ఎస్బి, ఐటి కోర్ ఇన్స్పెక్టర్ లు శ్రీనివాస్, లక్ష్మీనారాయణ,నాగేశ్వర రావు, రఫీక్ ఖాన్, మరియు సి.ఐ లు, ఎస్.ఐ డి సి ఆర్ బి , ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కుల కోసం ఏ త్యాగానికైనా సిద్ధం_ స్థానిక సంస్థల్లో ఆధిపత్యం చెలాయించాలని చూస్తే మెడలు పట్టి గెంటేయాలి మాజీ మంత్రి జీవన్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కుల కోసం ఏ త్యాగానికైనా సిద్ధం_ స్థానిక సంస్థల్లో ఆధిపత్యం చెలాయించాలని చూస్తే మెడలు పట్టి గెంటేయాలి మాజీ మంత్రి జీవన్ రెడ్డి    జగిత్యాల జనవరి 4( ప్రజా మంటలు) స్థానిక సంస్థల్లో ఆదిపత్యం చెలాయించాలని చూస్తే మెడలు పట్టి గెంటాయాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి.    జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో జగిత్యాల పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి, డీ సీ సీ అధ్యక్షుడు గాజంగి...
Read More...
Local News 

ఫుట్ పాత్ అనాధలకు ఔషధాలు, దుస్తుల పంపిణీ

ఫుట్ పాత్ అనాధలకు ఔషధాలు, దుస్తుల పంపిణీ సికింద్రాబాద్,  జనవరి 04 (ప్రజా మంటలు): హైదరాబాద్ నగరంలోని రోడ్ల పక్కన ఫుట్‌పాత్‌లపై జీవనం సాగిస్తున్న నిరాశ్రయులు, అనాథలకు స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం దుస్తులు, ఔషధాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వివిధ రుగ్మతులతో బాధపడుతున్న వారికి మందులు అందించడంతో పాటు ప్రమాదాలకు గురైన వారికి ప్రాథమిక చికిత్స చేశారు.ఈ కార్యక్రమంలో స్కై ఫౌండేషన్...
Read More...

బన్సీలాల్ పేటలో క్రీడోత్సవం రిజిస్ట్రేషన్లు ప్రారంభం

బన్సీలాల్ పేటలో క్రీడోత్సవం రిజిస్ట్రేషన్లు ప్రారంభం సికింద్రాబాద్, జనవరి 04 (ప్రజా మంటలు):  ప్రధానమంత్రి సంసద్ మహోత్సవం 2025–26లో భాగంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రేరణతో, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు సికింద్రాబాద్ పార్లమెంట్ మహా క్రీడోత్సవం కింద బన్సీలాల్‌పేట్ డివిజన్‌లో క్రీడా రిజిస్ట్రేషన్ ప్రారంభోత్సవం నిర్వహించారు. డివిజన్ బీజేపీ అధ్యక్షులు రామంచ మహేష్ అధ్యక్షతన జరిగిన ఈ...
Read More...

మేడిపల్లి వద్ద ఆర్టీసీ బస్సు–తవేరా ఢీ పలువురికి గాయాలు

మేడిపల్లి వద్ద ఆర్టీసీ బస్సు–తవేరా ఢీ  పలువురికి గాయాలు మెట్టుపల్లి, జనవరి 4 (ప్రజా మంటలు – దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడిపల్లి గ్రామం వద్ద ఆర్టీసీ బస్సు మరియు తవేరా వాహనం ఢీకొన్న ఘటనలో పలువురు గాయపడ్డారు. మెట్టుపల్లి నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు (TS 16 UC 3599) ఆదివారం తెల్లవారుజామున సుమారు 4:45 గంటలకు మేడిపల్లి...
Read More...

నిరుపేద కుటుంబానికి వైద్య సాయం...  4 లక్షల ఎల్ ఓ సి అందజేత...

నిరుపేద కుటుంబానికి వైద్య సాయం...  4 లక్షల ఎల్ ఓ సి అందజేత...   చిగురుమామిడి జనవరి 4 (ప్రజా మంటలు):   చిగురుమామిడి మండల కేంద్రానికి చెందిన చెరుకు వంశీ (18) అనే యువకుడు గత కొంతకాలంగా మూత్ర పిండాల వ్యాధితో బాధ పడుతున్నాడు. రెండు కిడ్నీలు పూర్తిగా పని చేయక పోవడం వల్ల కిడ్నీ మార్పిడి చేయాల్సిన అవసరం ఉంది. తన తల్లి కిడ్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న స్థానిక...
Read More...
Comment  International  

వెనిజులా పై అమెరికా దాడి: చట్టమా? లేక సామ్రాజ్యవాద దౌర్జన్యమా?

వెనిజులా పై అమెరికా దాడి: చట్టమా? లేక సామ్రాజ్యవాద దౌర్జన్యమా? — సిహెచ్. వి. ప్రభాకర్ రావు     వెనిజులా పై అమెరికా చేసిన సైనిక–భద్రతా చర్యలు, ఆ దేశ అధ్యక్షుడిని, ఆయన భార్యను బలవంతంగా అమెరికాకు తీసుకెళ్లి క్రిమినల్ కేసులు నమోదు చేయడం ప్రపంచ రాజకీయ చరిత్రలో అత్యంత ప్రమాదకర మలుపుగా మారింది. ఇది ఒక సాధారణ “చట్ట అమలు చర్య” కాదు; ఒక సార్వభౌమ దేశంపై...
Read More...

బీసీల బందు కేసీఆర్ అయితే బీసీలకు రాబందు రేవంత్ రెడ్డి- దావ వసంత సురేష్ 

బీసీల బందు కేసీఆర్ అయితే బీసీలకు రాబందు రేవంత్ రెడ్డి- దావ వసంత సురేష్        జగిత్యాల జనవరి 3(ప్రజా మంటలు)పట్టణంలోని సావిత్రిబాయి పూలే పార్కులో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా బిఆర్ఎస్ నాయకులతో కలిసి సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా తొలి జడ్పి చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...* బిఆర్ఎస్ హయంలో బడుగు బలహీన వర్గాలకు...
Read More...

రాష్ట్ర మంత్రివర్యులు  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన టీఎన్జీవో నాయకులు

రాష్ట్ర మంత్రివర్యులు  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన టీఎన్జీవో నాయకులు జగిత్యాల జనవరి 3(ప్రజా మంటలు)టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి  ఆధ్వర్యంలో రాష్ట్ర ఎస్సి ఎస్టి వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు. మంత్రివర్యులు  అడ్లూరి లక్ష్మణ్ కుమార్  మాట్లాడుతూ టీఎన్జీవో ఉద్యోగులందరికీ నూతన సంవత్సర...
Read More...

డాక్టర్ అరిగేలా అభినవ్ కు అత్యుత్తమ పరిశోధన పత్రం అవార్డు

డాక్టర్ అరిగేలా అభినవ్ కు అత్యుత్తమ పరిశోధన పత్రం అవార్డు జగిత్యాల జనవరి 3 ( ప్రజా మంటలు)జగిత్యాల ముద్దుబిడ్డ డాక్టర్ అరిగేలా అభినవ్ కు అత్యుత్తమ పరిశోధన పత్రం అవార్డు లభించింది. హైదరాబాదులో నిర్వహించిన 22వ అప్రస్కాన్ 20 25 అసోసియేషన్ ఆఫ్ ప్లాస్టిక్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కాన్ఫరెన్స్లో జగిత్యాలకు చెందిన డాక్టర్ అభినవ్...
Read More...

కోరుట్ల పట్టణంలో రెస్టారెంట్లు మరియు టిఫిన్ సెంటర్లు లో తనిఖీలు.. జరిమానాలు విధించిన మున్సిపల్ అధికారులు

కోరుట్ల పట్టణంలో రెస్టారెంట్లు మరియు టిఫిన్ సెంటర్లు లో తనిఖీలు.. జరిమానాలు విధించిన మున్సిపల్ అధికారులు    కోరుట్ల జనవరి 3 (ప్రజా మంటలు) పట్టణంలో రెస్టారెంట్లు మరియు టిఫిన్ సెంటర్లు లో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు పట్టణంలో తనిఖీలు చేసిన మున్సిపల్ అధికారులు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రవీందర్ ఆదేశాల మేరకు పట్టణంలో గల రెస్టారెంట్లు, హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో  తనిఖీలు నిర్వహించి పరిశుభ్రత పాటించని, మరియు సింగిల్...
Read More...

అభయాంజనేయ స్వామి ఆలయంలో ధార్మిక సంస్థల సమావేశం

అభయాంజనేయ స్వామి ఆలయంలో ధార్మిక సంస్థల సమావేశం      జగిత్యాల జనవరి 3(ప్రజా మంటలు)  వివిధ ధార్మిక సంస్థల సమావేశము  అభయాంజనేయ స్వామి టెంపుల్ అరవింద నగర్ లో  జరిగింది దీనిలో భూమి, నీరు,వాయువు అగ్ని ఆకాశము పంచభూతాలను కాపాడుతూ  పర్యావరణo అసమతౌల్యం వల్ల జరిగే నష్టాలను అధిగమించుటకు పర్యావరణ సమస్యలను అధిగమించుటకు అందరూ అన్ని దేవాలయాలలో సింగల్ యూస్ ప్లాస్టిక్ వాడకూడదని నిర్ణయం
Read More...
Local News  State News 

ఆంజనేయుని దయతోనే నాకు పునర్జన్మ – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఆంజనేయుని దయతోనే నాకు పునర్జన్మ – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు, జనవరి 3 (ప్రజా మంటలు): ఆంజనేయ స్వామి దయతోనే తనకు పునర్జన్మ లభించిందని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కొండగట్టులో టిటిడి సహకారంతో నిర్మించనున్న వాయుపుత్ర సదన్ ధర్మశాల, దీక్ష విరమణ...
Read More...