కాంగ్రెస్ నేతలకు షుగర్ ఫ్యాక్టరీ ఒక ఎన్నికల స్టంట్. చెవిలో పువ్వులు పెట్టే విధంగా జీవన్ రెడ్డీ మాటలు.
- ఎంపి అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి.
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9348422113/9963349493).
జగిత్యాల జిల్లామార్చి 26(ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణ బి యల్ యన్ గార్డెన్స్ లో జగిత్యాల రూరల్,అర్బన్ మండల ముఖ్య కార్యకర్తల మరియు జగిత్యాల పట్టణ దేవి శ్రీ గార్డెన్స్ లో జగిత్యాల పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశానీకి హాజరై కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడుతూ..... నిజామాబాద్ పార్లమెంట్ లో గులాబీ జెండా ఎగరేయాలని,పార్లమెంట్ లో తెలంగాణ వాణి నీ వినిపించాలంటే బి అర్ ఎస్ గెలవాలని,కాంగ్రెస్ బీజేపీ డూప్లికేట్ పార్టీలు అని,అరచేతిలో స్వర్గం చూపే పార్టీ కాంగ్రెస్,బి అర్ ఎస్ పార్టీ నీ ఎన్నికల్లో ఎదుర్కోలేక నే తప్పుడు కేసులు,అరవింద్ ఒక సోషల్ మీడియా యాక్టర్ అని,ప్రజల చెవిలో పువ్వులు పెట్టే విధంగా జీవన్ రెడ్డి మాటలు, గెలిప్తే ఈప్రాంత అభివృద్ధికి కృషి చేస్తా బి అర్ ఎస్ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి , జిల్లా పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యా సాగర్ రావు ,జిల్లా పరిషత్ చైర్మన్ దావా వసంత సురేష్ ,మాజీ మంత్రి రాజేశం గౌడ్.ఈ కార్యక్రమంలో పట్టణ,మండల పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్, బాల ముకుందం,ఎంపీపీ సంధ్యారాణి సురేందర్ నాయక్, జడ్పీటీసీ మహేష్,వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,మాజీ ఎ యం సి ఛైర్మెన్ రాధ రవీందర్ రెడ్డీ,దశరథ రెడ్డి,శీలం ప్రియాంక ప్రవీణ్,యూత్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి, కత్రోజ్ గిరి,మహిళ అధ్యక్షురాలు కచ్చు లత,
మాజీ సర్పంచులు,కౌన్సిలర్ లు,ఎంపీటీసీ లు, నాయకులు,యూత్ నాయకులు,మహిళ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మేల్యే డా.సంజయ్ మాట్లాడుతూ.... జగిత్యాల పట్టనము,రూరల్ మండలం లో బి అర్ ఎస్ పార్టీ కి మెజారిటీ ఇచ్చి ఇక్కడి నాయకులు గెలుపు లో ప్రముఖ పాత్ర వహించారు...
పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ వెన్నంటి ఉంటా...
రాజకీయం నా వృత్తి వైద్యం నా ప్రవృత్తి అని అన్నారు...
వేరే పార్టీ లకు వెళ్ళే ఆలోచన లేదని,వట్టి పుకార్లు మాత్రమే అని,కెసిఆర్ నాయకత్వం లో పనిచేసి ఎంపి స్థానం గెలిపిస్తం అని అన్నారు...
ప్రతి పక్ష నాయకుడు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు కోసం ముఖ్యమంత్రి నీ కలవడం పరిపాటి అని అన్నారు. కాళేశ్వరం దండగా అన్న నాయకులు నేడు 30 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయే పరిస్తితికి కారణం...
మిషన్ భగీరథ ద్వారా 30 సం,రాలు మూలకు పడ్డ ధరూర్ క్యాంపు ట్యాంక్ ను బాగు చేసుకున్నాం...
900 మీటర్లు యావర్ రోడ్డు వెడల్పు చేశాం,అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేశాం అని అన్నారు...
4500 డబల్ బెడ్ రూం ఇండ్ల ను నిర్మించామని అన్నారు...
కొన్ని మౌలిక సదుపాయాలు కల్పన మిగిలి ఉందని,నిదులు కూడా మంజూరు అయ్యాయని అన్నారు..
కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పిల్లర్ రిపేర్ చేయకపోవడం వల్ల నేడు వేసవిలో నీటి కొరత వచ్చే పరిస్తితి ఉంది అని అన్నారు...
పంటలు ఎండితే కాంగ్రెస్ ప్రభుత్వం కారణం అని అన్నారు.
ఎంపి అభ్యర్థి బాజీ రెడ్డి మాట్లాడుతూ....
ప్రజలకు ఏమి చేయని అరవింద్ కు ఎందుకు ఓటు వేయాలి.
అరవింద్ మండలంలో ఏ ప్రాంతం లో తిరిగాడు,ప్రజల కష్టాలు చూసారా,కనీసం నిదులు మంజూరు చేశారా అని ప్రశ్నించారు...
ఎంపి నీ చేసింది ప్రజలకు ఆ ప్రాంతం అభివృద్ధి చేయాలని,అంతే కానీ కెసిఆర్ ,కవిత నీ తిట్టడానికి కాదు అని అన్నారు..
షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తమని శ్రీదర్ బాబు,జీవన్ రెడ్డి అంటున్నారు.అని,ఫ్యాక్టరీ పాత డోర్ లు తెరవడం తప్ప వారు చేసేది ఏమీ లేదు అని ఎద్దేవా చేశారు.ప్రజలకు చెవిలో పువ్వులు పెట్టే విధంగా జీవన్ రెడ్డీ మాటలు...వారికి షుగర్ ఫ్యాక్టరీ గురించి మొత్తం తెలుసు..గతంలో వారు సభ్యులు గా ఉన్నారు.
మోసపూరిత మాటలు చెప్పే నాయకుల పట్ల నాయకులు,ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ గా ఉండి ప్రశ్నించే గొంతుక అని చెప్పి నిరుద్యోగుల ను మోసం చేశారు అని అన్నారు.ఇందిరమ్మ రాజ్యం లో రుణ మాఫీ చేస్తామని రేవంత్ హామీ ఇచ్చి,రైతులను మోసం చేస్తున్నారు అని అన్నారు.మేదిగడ్డ పిల్లర్ కుంగితే రిపేర్ చేసుడు మాని,
ఇసుక అమ్మకం చేయవచ్చు అని, నీరు లేకపంటలు పండక పోతే బోనస్ ఇచ్చుడు తప్పుతది అని కాంగ్రెస్ వక్ర పూరిత ఆలోచన..అరచేతిలో స్వర్గం చూపే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీది...
కాంగ్రెస్,బిజెపి లకు నాయకులు లేకా బి అర్ ఎస్ నుండి పార్టీ పిరాయించిన వారికి టికెట్ ఇస్తున్నారు.మాజీ ఎంపి కవిత నిజామాబాద్ పార్లమెంట్ కి ఎం చేసింది, ఎన్ని నిదులు మంజూరు చేసింది ప్రజలకు తెలుసు.ఎన్నికల్లో బి అర్ ఎస్ పార్టీ నీ ఎదుర్కొలేక నే రేవంత్,మోడీ ఇద్దరూ అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు...కాంగ్రెస్,బిజెపి రెండు డూప్లికేట్ పార్టీలు.మోడీ, రాహుల్ ఇద్దరు ఢిల్లీలో కొట్లాడితే, రేవంత్ రెడ్డి మాత్రం బడే బాయి చోటే భాయ్ అని మోడీ నీ అంటున్నారు అని ప్రజలు గమనించాలని అన్నారు.నన్ను గెలిపిస్తే ఈ ప్రాంతం తరపున ప్రశ్నించే గొంతుక అవుతా,ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తా అని అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
డ్యూటీలో ఉన్న తమ్ముడికి రాఖీ కట్టిన అక్క
కరీంనగర్, ఆగస్టు 28 (ప్రజా మంటలు):
రక్షాబంధన్ సందర్భంగా కరీంనగర్ జిల్లాలో అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే సంఘటన చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న తమ్ముడి వద్దకు వెళ్లిన అక్క రోడ్డుపైనే బస్సును ఆపించి రాఖీ కట్టింది.గోదావరిఖని నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు డ్రైవర్ మెండ రాజు తిమ్మాపూర్ మండలం రేణికుంట... వైకుంఠ ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ మంత్రి గోడిసెల రాజేశం గౌడ్
హైదరాబాద్, ఆగస్టు 28 (ప్రజా మంటలు):
నాంపల్లిలోని రామ్ ప్రతాప్ పిట్టి భవన్లో ఉన్న లక్ష్మీనారాయణ స్వామి బాలాజీ మందిరంలో ప్రముఖ వ్యాపారవేత్త ప్రమోద్ అగర్వాల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైకుంఠ ఉత్సవాల్లో మాజీ సీనియర్ మంత్రి, మాజీ తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గోడిసెల రాజేశం గౌడ్ పాల్గొన్నారు. ఆగస్టు 25 నుంచి 30వ... వేతన చెల్లింపులో జాప్యంపై మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం
ఫారమ్–16 జారీ, జాప్యానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సిఫార్సు
హైదరాబాద్ ఆగస్ట్ 28 (ప్రజా మంటలు):
ఉద్యోగికి సకాలంలో వేతనం చెల్లించకపోవడం, ఆదాయపు పన్నుకు సంబంధించిన పత్రాలు అందించడంలో జాప్యం చేయడం మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించిన అంశమేనని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పష్టం చేసింది.... అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉపాకర్మ
జగిత్యాల ఆగస్టు 28(ప్రజా మంటలు)శ్రావణ పౌర్ణమి పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి శ్రీరామ మందిరం ఆవరణలో గల తిరుమల తిరుపతి దేవస్థానం ధ్యాన మందిరంలో ఉపాకర్మ కార్యక్రమం నిర్వహించారు. దేవతర్పణము ఋషితర్పణము పితృతర్పణాల అనంతరం హోమము నిర్వహించారు. .
నూతన యజ్ఞోపవీత ధారణ అనంతరం సభాపతి తిగుళ్ళ విశ్వనాథ శర్మ ఉపాకర్మ ప్రత్యేకత... గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉపాకర్మ వేడుకలు
జగిత్యాల ఆగస్టు 28 (ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో గల శ్రీ రామాలయంలో విద్యానగర్ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉపాకర్మ ఘనంగా నిర్వహించారు. హోమము తర్పణాలు నిర్వహించి నూతన యజ్ఞోపవీత ధారణ చేశారు.
కార్యక్రమంలో గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు కొలిచాల రవీందర్ వైదిక క్రతువు అన్యారంభట్ల నారాయణ... సోదర సోదరి అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్
జగిత్యాల ఆగస్టు 27 (ప్రజా మంటలు) రక్షాబంధన్ పండుగ శ్రావణమాసం పౌర్ణమిలో జరుపుకుంటాము. వైదికంగా జంధ్యాల పౌర్ణమిగా దీనినే రాఖీ పౌర్ణమి గా భావిస్తారు. రాఖీ పౌర్ణమి కి ప్రత్యేక విశిష్టత ఉంది. సోదరీలు తమ సోదరులకు రక్షాబంధనం చేసి తమ ఆత్మీయతను ఆవిష్కరిస్తారు.
పౌర్ణమి శుక్రవారం ఉన్నప్పటికీ తక్కువ సమయం ఉండడం అదేవిధంగా... ఉచిత పోలీస్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి.. జగిత్యాల రూరల్ సిఐ దామెర సుధాకర్.
జగిత్యాల, ఆగస్టు 27( ప్రజా మంటలు) ఉచిత పోలీస్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
కృషి పట్టుదల ఉంటే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతామని జగిత్యాల రూరల్ సిఐ దామెర సుధాకర్ అన్నారు.వాల్మీకి ఆవాసం సేవా భారతి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత పోలీసు శిక్షణ శిబిరాన్ని రూరల్ సీఐ సుధాకర్ సందర్శించి అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. ... మౌంట్ కార్మెల్ హైస్కూల్ లో ఘనంగా రక్ష బంధన్ వేడుకలు
జగిత్యాల ఆగస్ట్ 27(ప్రజా మంటలు)
ధరూర్ లోని *మౌంట్ కార్మెల్ హైస్కూల్* లో రక్ష బంధన్ వేడుకలు అత్యంత ఘనంగా సాంప్రదాయ పద్ధతిలో పాఠశాల యాజమాన్యం నిర్వహించారుఈ సందర్భంగా పాఠశాల బాలికలు పాఠశాలలోని బాలురకి రాఖీలు కట్టి *నువ్వు నాకూ రక్ష నేను నీకు రక్ష మనం దేశానికి రక్ష* అని నినదించారు.
పాఠశాల... ఘనంగా శ్రీదేవి భూదేవి సహిత శ్రీనివాసునీ కళ్యాణం జగిత్యాల ఆగస్టు 26 (ప్రజా మంటలు)
జిల్లా కేంద్రం కూరగాయల మార్కెట్ లోని శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో శ్రీదేవి భూదేవి సహిత శ్రీనివాసుని కళ్యాణం వైభవో పెతంగా ఘనంగా జరిగింది .ఉదయం నుండి భక్తులు తండోపతండాలుగా ఆలయానికి చేరుకొని స్వాములను దర్శించుకున్నారు. కళ్యాణానికి వందలాది మంది భక్తులు హాజరైనారు. అనంతరం వచ్చిన భక్తులందరికీ, నిర్వాహకులు అన్న ప్రసాదం అందించారు.... మా స్పోర్ట్స్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ (ఎంఎస్ ఆర్ డి ఎఫ్) ఆధ్వర్యంలో 200 మొక్కలు నాటే కార్యక్రమం
సారంగాపూర్ 26(ప్రజా మంటలు)పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా సారంగాపూర్ రంగపేట గ్రామంలో మా స్పోర్ట్స్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ (ఎం ఆర్ ఎస్ డి ఎఫ్) ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన 200 మొక్కలు నాటే కార్యక్రమం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో, విజయవంతంగా ముగిసింది. ఈ హరిత యజ్ఞంలో ఫారెస్ట్ అధికారులు, గ్రామ ప్రజలు, యువకులు... జగిత్యాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి: సీఎం రేవంత్రెడ్డిని కోరిన ఎమ్మెల్యే సంజయ్
హైదరాబాద్, ఆగస్టు 26 (ప్రజా మంటలు):
విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్కు చేరుకున్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డిని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
అర్బన్ హౌసింగ్ కాలనీలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన... కవి సాయంత్రం ఆధ్వర్యంలో పుస్తకాల ఆవిష్కరణ
సికింద్రాబాద్, ఆగస్ట్ 25 ( ప్రజా మంటలు):
మారుతున్న యాంత్రిక జీవన విధానం వల్ల తెలుగు భాష నిరాదరణకు గురి అవుతున్న సందర్భంలో కవి సాయంత్రం వంటి సాహిత్య సంస్థల కార్యక్రమాలు చూస్తుంటే తెలుగు భాషకు, సాహిత్యానికి పూర్వవైభవం రానున్నదని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు.
జనజాగృతి సంస్థలో... 