కాంగ్రెస్ నేతలకు షుగర్ ఫ్యాక్టరీ ఒక ఎన్నికల స్టంట్. చెవిలో పువ్వులు పెట్టే విధంగా జీవన్ రెడ్డీ మాటలు.
- ఎంపి అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి.
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9348422113/9963349493).
జగిత్యాల జిల్లామార్చి 26(ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణ బి యల్ యన్ గార్డెన్స్ లో జగిత్యాల రూరల్,అర్బన్ మండల ముఖ్య కార్యకర్తల మరియు జగిత్యాల పట్టణ దేవి శ్రీ గార్డెన్స్ లో జగిత్యాల పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశానీకి హాజరై కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడుతూ..... నిజామాబాద్ పార్లమెంట్ లో గులాబీ జెండా ఎగరేయాలని,పార్లమెంట్ లో తెలంగాణ వాణి నీ వినిపించాలంటే బి అర్ ఎస్ గెలవాలని,కాంగ్రెస్ బీజేపీ డూప్లికేట్ పార్టీలు అని,అరచేతిలో స్వర్గం చూపే పార్టీ కాంగ్రెస్,బి అర్ ఎస్ పార్టీ నీ ఎన్నికల్లో ఎదుర్కోలేక నే తప్పుడు కేసులు,అరవింద్ ఒక సోషల్ మీడియా యాక్టర్ అని,ప్రజల చెవిలో పువ్వులు పెట్టే విధంగా జీవన్ రెడ్డి మాటలు, గెలిప్తే ఈప్రాంత అభివృద్ధికి కృషి చేస్తా బి అర్ ఎస్ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి , జిల్లా పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యా సాగర్ రావు ,జిల్లా పరిషత్ చైర్మన్ దావా వసంత సురేష్ ,మాజీ మంత్రి రాజేశం గౌడ్.ఈ కార్యక్రమంలో పట్టణ,మండల పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్, బాల ముకుందం,ఎంపీపీ సంధ్యారాణి సురేందర్ నాయక్, జడ్పీటీసీ మహేష్,వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,మాజీ ఎ యం సి ఛైర్మెన్ రాధ రవీందర్ రెడ్డీ,దశరథ రెడ్డి,శీలం ప్రియాంక ప్రవీణ్,యూత్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి, కత్రోజ్ గిరి,మహిళ అధ్యక్షురాలు కచ్చు లత,
మాజీ సర్పంచులు,కౌన్సిలర్ లు,ఎంపీటీసీ లు, నాయకులు,యూత్ నాయకులు,మహిళ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మేల్యే డా.సంజయ్ మాట్లాడుతూ.... జగిత్యాల పట్టనము,రూరల్ మండలం లో బి అర్ ఎస్ పార్టీ కి మెజారిటీ ఇచ్చి ఇక్కడి నాయకులు గెలుపు లో ప్రముఖ పాత్ర వహించారు...
పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ వెన్నంటి ఉంటా...
రాజకీయం నా వృత్తి వైద్యం నా ప్రవృత్తి అని అన్నారు...
వేరే పార్టీ లకు వెళ్ళే ఆలోచన లేదని,వట్టి పుకార్లు మాత్రమే అని,కెసిఆర్ నాయకత్వం లో పనిచేసి ఎంపి స్థానం గెలిపిస్తం అని అన్నారు...
ప్రతి పక్ష నాయకుడు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు కోసం ముఖ్యమంత్రి నీ కలవడం పరిపాటి అని అన్నారు. కాళేశ్వరం దండగా అన్న నాయకులు నేడు 30 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయే పరిస్తితికి కారణం...
మిషన్ భగీరథ ద్వారా 30 సం,రాలు మూలకు పడ్డ ధరూర్ క్యాంపు ట్యాంక్ ను బాగు చేసుకున్నాం...
900 మీటర్లు యావర్ రోడ్డు వెడల్పు చేశాం,అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేశాం అని అన్నారు...
4500 డబల్ బెడ్ రూం ఇండ్ల ను నిర్మించామని అన్నారు...
కొన్ని మౌలిక సదుపాయాలు కల్పన మిగిలి ఉందని,నిదులు కూడా మంజూరు అయ్యాయని అన్నారు..
కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పిల్లర్ రిపేర్ చేయకపోవడం వల్ల నేడు వేసవిలో నీటి కొరత వచ్చే పరిస్తితి ఉంది అని అన్నారు...
పంటలు ఎండితే కాంగ్రెస్ ప్రభుత్వం కారణం అని అన్నారు.
ఎంపి అభ్యర్థి బాజీ రెడ్డి మాట్లాడుతూ....
ప్రజలకు ఏమి చేయని అరవింద్ కు ఎందుకు ఓటు వేయాలి.
అరవింద్ మండలంలో ఏ ప్రాంతం లో తిరిగాడు,ప్రజల కష్టాలు చూసారా,కనీసం నిదులు మంజూరు చేశారా అని ప్రశ్నించారు...
ఎంపి నీ చేసింది ప్రజలకు ఆ ప్రాంతం అభివృద్ధి చేయాలని,అంతే కానీ కెసిఆర్ ,కవిత నీ తిట్టడానికి కాదు అని అన్నారు..
షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తమని శ్రీదర్ బాబు,జీవన్ రెడ్డి అంటున్నారు.అని,ఫ్యాక్టరీ పాత డోర్ లు తెరవడం తప్ప వారు చేసేది ఏమీ లేదు అని ఎద్దేవా చేశారు.ప్రజలకు చెవిలో పువ్వులు పెట్టే విధంగా జీవన్ రెడ్డీ మాటలు...వారికి షుగర్ ఫ్యాక్టరీ గురించి మొత్తం తెలుసు..గతంలో వారు సభ్యులు గా ఉన్నారు.
మోసపూరిత మాటలు చెప్పే నాయకుల పట్ల నాయకులు,ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ గా ఉండి ప్రశ్నించే గొంతుక అని చెప్పి నిరుద్యోగుల ను మోసం చేశారు అని అన్నారు.ఇందిరమ్మ రాజ్యం లో రుణ మాఫీ చేస్తామని రేవంత్ హామీ ఇచ్చి,రైతులను మోసం చేస్తున్నారు అని అన్నారు.మేదిగడ్డ పిల్లర్ కుంగితే రిపేర్ చేసుడు మాని,
ఇసుక అమ్మకం చేయవచ్చు అని, నీరు లేకపంటలు పండక పోతే బోనస్ ఇచ్చుడు తప్పుతది అని కాంగ్రెస్ వక్ర పూరిత ఆలోచన..అరచేతిలో స్వర్గం చూపే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీది...
కాంగ్రెస్,బిజెపి లకు నాయకులు లేకా బి అర్ ఎస్ నుండి పార్టీ పిరాయించిన వారికి టికెట్ ఇస్తున్నారు.మాజీ ఎంపి కవిత నిజామాబాద్ పార్లమెంట్ కి ఎం చేసింది, ఎన్ని నిదులు మంజూరు చేసింది ప్రజలకు తెలుసు.ఎన్నికల్లో బి అర్ ఎస్ పార్టీ నీ ఎదుర్కొలేక నే రేవంత్,మోడీ ఇద్దరూ అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు...కాంగ్రెస్,బిజెపి రెండు డూప్లికేట్ పార్టీలు.మోడీ, రాహుల్ ఇద్దరు ఢిల్లీలో కొట్లాడితే, రేవంత్ రెడ్డి మాత్రం బడే బాయి చోటే భాయ్ అని మోడీ నీ అంటున్నారు అని ప్రజలు గమనించాలని అన్నారు.నన్ను గెలిపిస్తే ఈ ప్రాంతం తరపున ప్రశ్నించే గొంతుక అవుతా,ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తా అని అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్

మేడిపల్లి గ్రామ శివారులో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్.

శ్రీ వీర బ్రహ్మేంద్ర ఆలయ వార్షికోత్సవము- కల్యాణ వేడుకలు

మైనార్టీ నేతలతో కార్పొరేటర్ సమావేశం

సదర్మట్ ప్రాజెక్టు భూ సేకరణ.

బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాలకు మొండి చేయి. బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు,పూర్వ జెడ్పీ చైర్ పర్సన్

వైభవంగా ధర్మపురీశుల రథోత్సవ వేడుకలు

అంబరాన్ని అంటిన రవీంద్ర ప్లే స్కూల్ దర్పణ్ - 2K25 సంబరాలు

హరిహర క్షేత్రంలో అంబరాన్ని స్పృశించిన భక్తి పారవశ్యం

ఎస్బి బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భముగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయము లో సి ఏం చిత్ర పటానికి పాలాభిషేకం

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి -. జిల్లా విద్యాధికారి రాము.

టెన్త్ విద్యార్థులకు పది పరీక్షలపై అవెర్నెస్ కార్యక్రమం
