వైభవంగా ఉగ్ర నరసింహ డోలోత్సవం భక్తులతో కిటకిటలాడిన ధర్మపురి క్షేత్రం
వైభవంగా ఉగ్ర నరసింహ డోలోత్సవం
భక్తులతో కిటకిటలాడిన ధర్మపురి క్షేత్రం
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి మార్చ్ 25 (ప్రజా మంటలు) : ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీనరసింహ, వేంకటేశ్వర బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా సోమ వారం సాయంత్రం శ్రీ ఉగ్ర నారసింహుని తెప్పోత్సవ, డోలోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించారు. సాయంత్రం క్షేత్ర సనాతన సాంప్రదాయ పద్దతిలో ఉగ్రనారసింహ స్వామి ప్రధానాలయం నుండి వేదమంత్రోచ్ఛాటనల, మంగళ వాద్యాలతో, భక్తజనం తోడు రాగా స్వామి ఉత్సవ మూర్తులను జయజయ ధ్వనాలతో ఊరేగించి, బ్రహ్మ పుష్కరిణి లోనికి కోనేరు ఉత్తర ద్వారం గుండా వేంచేపు చేయగా, అప్పటికే కోనేటిలో సోపానాలపై ఆసీనులై వేచియున్న భక్తజనం తమ ఇష్ట దైవాన్ని ఘనంగా స్వాగతించారు. అజ్ఞాత భక్తునిచే ప్రత్యేక నూతన నిర్మిత, బహూకృత హంస రూపు బల్లకట్టుపై స్వామిని ఆసీనులజేసి కోనేటి నీటిపై అయిదు ప్రదక్షిణలు నిర్వహించారు.
బ్రహ్మపుష్కరిణి సోపానాలపై నున్న భక్త జన సమూహం ప్రదక్షిణలను మెట్లపై నుండి అనుసరించారు. బుక్కా, గులాలు ఇత్యాది పూజా ద్రవ్యాలు ఉత్సవ మూర్తులపై చల్లి భక్తి శ్రద్దలతో కైమోడ్పులిడి ప్రార్ధించారు. అనంతరం కోనేరు మధ్య భాగానగల వేదికపైనున్న భోగ మటపంలోని ఊయలలో స్వామిని అసీనుల గావించి డోలోత్సవం విర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య భక్తులు ఇరుకైన మార్గం గుండా ప్రవేశించి మొక్కులు తీర్చుకున్నారు. స్వామి డోలు ఊగుచుండగా దర్శించిన భక్తులకు వేద పండితులు చతుర్వేద మంత్ర పఠనాలతో ఆశీస్సులు అంద చేశారు. జయజయ ధ్వానాలు మిన్నంటగా, పూజా ద్రవ్యాలను చల్లి భక్తులు తమ ఇష్ట దైవాన్ని కొలిచారు. అర్చకులు శ్రీనివాసాచార్య, వంశీ, విజయ్, అరుణ్ లచే భక్తులు తులసీ కంకణాలను కట్టించు కున్నారు.
ఆధ్యాత్మిక ప్రాసంగికులు, ప్రముఖ గాయకులు జగదీశ్ శర్మ నరసింహ శతక పద్యాలు వినిపించారు. దేవ స్థానం ఈఓ శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు జక్కు రవీందర్, సభ్యులు, సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ నేతృత్వంలో ఏర్పాట్లు చేయగా ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాం నరసింహా రెడ్డి, ఎస్ ఐ ఉదయ్ కుమార్ నేతృత్వంలో జగిత్యాల జిల్లాలోని ప్రత్యేక పోలీసు బృందాలు, హోంగార్డులు, ఎలాంటి అవాంఛనీయాలు చోటు చేసుకోకుండా బందోబస్తు చర్యలు చేపట్టారు. ప్రత్యేక బస్సుల ద్వారా భక్తులను గమ్యాలకు చేర్చారు.
ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల జెడ్పీ చైర్ పర్సన్, దావ వసంత, కరీంనగర్ డీ సీ ఎం ఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తమ్మ, వైస్ ఇందారపు రామయ్య, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, దేవస్థాన అర్చకులు, సిబ్బంది, భక్తులు దర్శనాలు చేసుకున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
“భారతం తటస్థం కాదు… శాంతి పక్షాన ఉంది” – ఉక్రెయిన్ యుద్ధంపై మోదీ–పుటిన్ కీలక సందేశం
రెడ్ కార్పెట్ స్వాగతం – రాజ్ఘాట్ నివాళలు
మోదీ–పుతిన్ కీలక సందేశాలు
23వ భారత్–రష్యా వార్షిక సమ్మిట్
న్యూఢిల్లీ, డిసెంబర్ 05 (ప్రజా మంటలు):రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుటిన్ భారత్ పర్యటన రెండో రోజు కీలక దశలోకి ప్రవేశించింది. ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ఉక్రెయిన్ యుద్ధం, రక్షణ సహకారం,... చెరువుల పరిరక్షణ, వైద్య సేవల లోపాలు సరిచేయండి : కవిత డిమాండ్
హైదరాబాద్, డిసెంబర్ 05 (ప్రజా మంటలు):
జాగృతి జనంబాటలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని సందర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక సమస్యలను పరిశీలించారు. షాపూర్ నగర్లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC) లో సేవల లోపాలను గుర్తించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పరికి చెరువు కబ్జాలపై ఘాటుగా స్పందించారు.... గాంధీనగర్ సర్పంచ్ ఏకగ్రీవం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు
గాంధీనగర్ సర్పంచ్ ఏకగ్రీవం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు
భీమదేవరపల్లి, డిసెంబర్ 5 (ప్రజామంటలు) :
గాంధీనగర్ గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన కేతిరి లక్ష్మారెడ్డి శుక్రవారం హైదరాబాద్లో రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ను మర్యాద పూర్వకంగా కలిసి అభివాదం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,... హయత్నగర్లో కిలాడీ లేడీ అరెస్ట్ – ఎనిమిది బ్లాక్మెయిల్ కేసులు
హైదరాబాద్ డిసెంబర్ 05 (ప్రజా మంటలు):
పురుషులను వ్యాపారం పేరుతో ట్రాప్ చేసి, సన్నిహితంగా ఉన్న సందర్భాలను రహస్యంగా చిత్రీకరించి, ఆ తర్వాత భారీ మొత్తాలు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న ఒక కిలాడీ లేడీని హయత్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల సమాచారం ప్రకారం, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ మహిళపై ఇప్పటికే ఎనిమిది... భీం రెడ్డి గూడెం , నాయకపు గూడెం, గ్రామపంచాయతీ ఏకగ్రీవ పాలకవర్గాలను అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
సారంగాపూర్ డిసెంబర్ 5(ప్రజా మంటలు)మండల భీం రెడ్డి గూడెం,నాయకపు గూడెం గ్రామపంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ పూర్తయి సర్పంచ్ ఉపసర్పంచ్ వార్డ్ సభ్యులకు ఒక్కో నామినేషన్ రాగా నూతన పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక శుక్రవారం జగిత్యాలలో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలవగా నూతన పాలకవర్గం సర్పంచ్... అంబేద్కర్ విగ్రహానికి నివాళులతో ముత్తారంలో ఉరడి భారతి ప్రచారానికి శ్రీకారం
అంబేద్కర్ విగ్రహానికి నివాళులతో ముత్తారంలో ఉరడి భారతి ప్రచారానికి శ్రీకారం
* అభయాంజనేయ ఆశీస్సులతో ప్రచార ప్రారంభం – సర్పంచ్ అభ్యర్థి ఊరడి భారతి జైపాల్ రెడ్డి
భీమదేవరపల్లి, డిసెంబర్ 5 (ప్రజామంటలు):
ముత్తారం గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఊరడి భారతి జైపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ఉదృతంగా ప్రారంభించారు. శుక్రవారం ఉదయం ఆయన కుటుంబ... ఆదిలాబాద్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు – సీఎం రేవంత్ రెడ్డి
ఆదిలాబాద్ డిసెంబర్ 04 (ప్రజా మంటలు):
ఆదిలాబాద్ జిల్లాను రాష్ట్రంలోనే అత్యంత అభివృద్ధి చెందిన జిల్లాగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల భాగంగా ఆదిలాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో మాట్లాడారు.
తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు... IndiGo సంక్షోభం: దేశవ్యాప్తంగా 175 ఫ్లైట్లు రద్దు — బెంగళూరులో ఒక్కరోజులో 73 రద్దు
బెంగళూరు, డిసెంబర్ 04 (ప్రజా మంటలు):
దేశంలో అతి పెద్ద ఎయిర్లైన్ అయిన ఇండిగోలో కొనసాగుతున్న సిబ్బంది కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. డిసెంబర్ 4 ఉదయం నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 175 ఇండిగో ఫ్లైట్లు రద్దయ్యాయి. వీటిలో బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక్కరోజులోనే 73 ఫ్లైట్లు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర... చెరువులు, ఫ్లైఓవర్, ఎస్టీపీ—ప్రజా సమస్యలపై కవిత ఘాటు వ్యాఖ్యలు
హైదరాబాద్/మేడ్చల్–మల్కాజిగిరి (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జనం బాట కార్యక్రమంలో భాగంగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో పలు ప్రాంతాలను సందర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దగ్గరగా పరిశీలించి, ప్రభుత్వం మరియు ప్రజా ప్రతినిధుల వైఖరిపై ఘాటుగా వ్యాఖ్యానించారు.
రామంతపూర్: ఐలమ్మ విగ్రహానికి నివాళులు – చెరువు పరిశీలన
కవిత రామంతపూర్ ఇందిరానగర్లోని చాకలి... ఘనంగా ముగిసిన గురు చరిత్ర పారాయణం
జగిత్యాల డిసెంబర్ 4 (ప్రజా మంటలు)దత్త జయంతి పురస్కరించుకొని స్థానిక షిరిడి సాయి మందిరంలో గత వారం రోజులుగా కొనసాగుతున్న గురు చరిత్ర పారాయణం గురువారం ముగిసింది. ప్రముఖ పౌరాణిక పండితులు సభాపతి బ్రహ్మశ్రీ తిగుళ్ల విశు శర్మ, రాజేశ్వర శర్మ, వైదిక కార్యక్రమ క్రతువు నిర్వహించారు.
సామూహిక పంచామృత అభిషేకం, అష్టోత్తర శతనామార్చన,... పలు వార్డుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 4( ప్రజా మంటలు)జగిత్యాల పట్టణ కొత్త బస్టాండ్ నుండి నర్సింగ్ కళాశాల రోడ్డులో 1 కోటి రూపాయలతో డ్రైనేజీ ,20వ వార్డులో 20 లక్షలతో డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన డిఈ ఆనంద్ కె డి సి... బాబ్రీ మసీదు వ్యాఖ్యలతో వివాదం – తృణమూల్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్పై సస్పెన్షన్
కోల్కతా, డిసెంబర్ 04 (ప్రజా మంటలు):
బెంగాల్లో బాబ్రీ మసీదు పునాది వేస్తామని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో తీవ్ర విమర్శలకు గురైన తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ పై పార్టీ కఠిన చర్యలు తీసుకుంది. భరత్పూర్ నియోజకవర్గానికి చెందిన ఈ ఎమ్మెల్యేను పార్టీ అధికారికంగా సస్పెండ్ చేసినట్లు TMC ప్రకటించింది.
హుమాయున్ కబీర్... 