వైభవంగా ఉగ్ర నరసింహ డోలోత్సవం భక్తులతో కిటకిటలాడిన ధర్మపురి క్షేత్రం

On
వైభవంగా ఉగ్ర నరసింహ డోలోత్సవం భక్తులతో కిటకిటలాడిన ధర్మపురి క్షేత్రం

వైభవంగా ఉగ్ర నరసింహ డోలోత్సవం
భక్తులతో కిటకిటలాడిన ధర్మపురి క్షేత్రం

 (రామ కిష్టయ్య సంగన భట్ల)

ధర్మపురి మార్చ్ 25 (ప్రజా మంటలు) : ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీనరసింహ, వేంకటేశ్వర బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా సోమ వారం సాయంత్రం శ్రీ ఉగ్ర నారసింహుని తెప్పోత్సవ, డోలోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించారు. సాయంత్రం క్షేత్ర సనాతన సాంప్రదాయ పద్దతిలో ఉగ్రనారసింహ స్వామి ప్రధానాలయం నుండి వేదమంత్రోచ్ఛాటనల, మంగళ వాద్యాలతో, భక్తజనం తోడు రాగా స్వామి ఉత్సవ మూర్తులను జయజయ ధ్వనాలతో ఊరేగించి, బ్రహ్మ పుష్కరిణి లోనికి కోనేరు ఉత్తర ద్వారం గుండా వేంచేపు చేయగా, అప్పటికే కోనేటిలో సోపానాలపై ఆసీనులై వేచియున్న భక్తజనం తమ ఇష్ట దైవాన్ని ఘనంగా స్వాగతించారు. అజ్ఞాత భక్తునిచే ప్రత్యేక నూతన నిర్మిత, బహూకృత హంస రూపు బల్లకట్టుపై స్వామిని ఆసీనులజేసి కోనేటి నీటిపై అయిదు ప్రదక్షిణలు నిర్వహించారు.

 

బ్రహ్మపుష్కరిణి సోపానాలపై నున్న భక్త జన సమూహం ప్రదక్షిణలను మెట్లపై నుండి అనుసరించారు. బుక్కా, గులాలు ఇత్యాది పూజా ద్రవ్యాలు ఉత్సవ మూర్తులపై చల్లి భక్తి శ్రద్దలతో కైమోడ్పులిడి ప్రార్ధించారు. అనంతరం కోనేరు మధ్య భాగానగల వేదికపైనున్న భోగ మటపంలోని ఊయలలో స్వామిని అసీనుల గావించి డోలోత్సవం విర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య భక్తులు ఇరుకైన మార్గం గుండా ప్రవేశించి మొక్కులు తీర్చుకున్నారు. స్వామి డోలు ఊగుచుండగా దర్శించిన భక్తులకు వేద పండితులు చతుర్వేద మంత్ర పఠనాలతో ఆశీస్సులు అంద చేశారు. జయజయ ధ్వానాలు మిన్నంటగా, పూజా ద్రవ్యాలను చల్లి భక్తులు తమ ఇష్ట దైవాన్ని కొలిచారు. అర్చకులు శ్రీనివాసాచార్య, వంశీ, విజయ్, అరుణ్ లచే భక్తులు తులసీ కంకణాలను కట్టించు కున్నారు.

 

ఆధ్యాత్మిక ప్రాసంగికులు, ప్రముఖ గాయకులు జగదీశ్ శర్మ నరసింహ శతక పద్యాలు వినిపించారు. దేవ స్థానం ఈఓ శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు జక్కు రవీందర్, సభ్యులు, సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ నేతృత్వంలో ఏర్పాట్లు చేయగా ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాం నరసింహా రెడ్డి, ఎస్ ఐ ఉదయ్ కుమార్ నేతృత్వంలో జగిత్యాల జిల్లాలోని ప్రత్యేక పోలీసు బృందాలు, హోంగార్డులు, ఎలాంటి అవాంఛనీయాలు చోటు చేసుకోకుండా బందోబస్తు చర్యలు చేపట్టారు. ప్రత్యేక బస్సుల ద్వారా భక్తులను గమ్యాలకు చేర్చారు. 

ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల జెడ్పీ చైర్ పర్సన్, దావ వసంత, కరీంనగర్ డీ సీ ఎం ఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ధర్మపురి  మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తమ్మ, వైస్ ఇందారపు రామయ్య, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, దేవస్థాన అర్చకులు, సిబ్బంది, భక్తులు దర్శనాలు చేసుకున్నారు.

 

Tags
Join WhatsApp

More News...

State News 

ఆదిలాబాద్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు – సీఎం రేవంత్ రెడ్డి

ఆదిలాబాద్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు – సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ డిసెంబర్ 04 (ప్రజా మంటలు): ఆదిలాబాద్ జిల్లాను రాష్ట్రంలోనే అత్యంత అభివృద్ధి చెందిన జిల్లా‌గా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల భాగంగా ఆదిలాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో మాట్లాడారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు...
Read More...

IndiGo సంక్షోభం: దేశవ్యాప్తంగా 175 ఫ్లైట్లు రద్దు — బెంగళూరులో ఒక్కరోజులో 73 రద్దు

IndiGo సంక్షోభం: దేశవ్యాప్తంగా 175 ఫ్లైట్లు రద్దు — బెంగళూరులో ఒక్కరోజులో 73 రద్దు బెంగళూరు, డిసెంబర్ 04 (ప్రజా మంటలు): దేశంలో అతి పెద్ద ఎయిర్‌లైన్ అయిన ఇండిగోలో కొనసాగుతున్న సిబ్బంది కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. డిసెంబర్ 4 ఉదయం నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 175 ఇండిగో ఫ్లైట్లు రద్దయ్యాయి. వీటిలో బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక్కరోజులోనే 73 ఫ్లైట్లు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర...
Read More...

చెరువులు, ఫ్లైఓవర్, ఎస్టీపీ—ప్రజా సమస్యలపై కవిత ఘాటు వ్యాఖ్యలు

చెరువులు, ఫ్లైఓవర్, ఎస్టీపీ—ప్రజా సమస్యలపై కవిత ఘాటు వ్యాఖ్యలు హైదరాబాద్/మేడ్చల్–మల్కాజిగిరి (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జనం బాట కార్యక్రమంలో భాగంగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో పలు ప్రాంతాలను సందర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దగ్గరగా పరిశీలించి, ప్రభుత్వం మరియు ప్రజా ప్రతినిధుల వైఖరిపై ఘాటుగా వ్యాఖ్యానించారు.   రామంతపూర్: ఐలమ్మ విగ్రహానికి నివాళులు – చెరువు పరిశీలన కవిత రామంతపూర్ ఇందిరానగర్‌లోని చాకలి...
Read More...

ఘనంగా ముగిసిన గురు చరిత్ర పారాయణం

ఘనంగా ముగిసిన గురు చరిత్ర పారాయణం     జగిత్యాల డిసెంబర్ 4 (ప్రజా మంటలు)దత్త జయంతి పురస్కరించుకొని స్థానిక షిరిడి సాయి మందిరంలో గత వారం రోజులుగా కొనసాగుతున్న గురు చరిత్ర పారాయణం గురువారం ముగిసింది. ప్రముఖ పౌరాణిక పండితులు సభాపతి బ్రహ్మశ్రీ తిగుళ్ల విశు శర్మ, రాజేశ్వర శర్మ, వైదిక  కార్యక్రమ  క్రతువు నిర్వహించారు. సామూహిక పంచామృత అభిషేకం, అష్టోత్తర శతనామార్చన,...
Read More...

పలు వార్డుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

పలు వార్డుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల డిసెంబర్ 4( ప్రజా మంటలు)జగిత్యాల పట్టణ కొత్త బస్టాండ్ నుండి నర్సింగ్ కళాశాల రోడ్డులో 1 కోటి రూపాయలతో డ్రైనేజీ ,20వ వార్డులో 20 లక్షలతో డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన డిఈ  ఆనంద్  కె డి సి...
Read More...
National 

బాబ్రీ మసీదు వ్యాఖ్యలతో వివాదం – తృణమూల్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్‌పై సస్పెన్షన్

బాబ్రీ మసీదు వ్యాఖ్యలతో వివాదం – తృణమూల్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్‌పై సస్పెన్షన్ కోల్కతా, డిసెంబర్ 04 (ప్రజా మంటలు): బెంగాల్‌లో బాబ్రీ మసీదు పునాది వేస్తామని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో తీవ్ర విమర్శలకు గురైన తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ పై పార్టీ కఠిన చర్యలు తీసుకుంది. భరత్పూర్ నియోజకవర్గానికి చెందిన ఈ ఎమ్మెల్యేను పార్టీ అధికారికంగా సస్పెండ్ చేసినట్లు TMC ప్రకటించింది. హుమాయున్ కబీర్...
Read More...
National 

బీహార్ BJP ఎమ్మెల్యే ప్ర‌మోద్ మహిళలపై అనుచిత వ్యాఖ్య

బీహార్ BJP ఎమ్మెల్యే ప్ర‌మోద్ మహిళలపై అనుచిత వ్యాఖ్య ప్రతిపక్షం తీవ్ర విమర్శలు పాట్నా డిసెంబర్ 04: బీహార్‌లోని మోతిహారి నుంచి BJP ఎమ్మెల్యే ప్ర‌మోద్ కుమార్ మహిళల గురించి తీవ్రంగా అవమానకర వ్యాఖ్యలు చేసిన వీడియో బయటకు వచ్చింది. ఢిల్లీకి చెందిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి తన పెంపుడు కుక్కతో కనిపించిన విషయంపై పత్రికారులు బుధవారం పాట్నాలో శాసనసభ బయట ప్రశ్నించగా,...
Read More...

ఏకగ్రీవ గ్రామాల పాలకవర్గ సర్పంచు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఏకగ్రీవ గ్రామాల పాలకవర్గ సర్పంచు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల డిసెంబర్ 4(ప్రజా మంటలు)రూరల్ మండలము చర్లపల్లి, బీర్పూర్ మండలం గోండు గూడెం గ్రామాలు గ్రామపంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ పూర్తయి సర్పంచ్ ఉపసర్పంచ్ వార్డ్ సభ్యులకు ఒక్కో నామినేషన్ రాగా నూతన పాలకవర్గం  ఏకగ్రీవంగా ఎన్నిక కాగా గురువారం జగిత్యాలలో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే  క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా...
Read More...

హైదరాబాద్‌లో సినిమా అవకాశాల పేరిట 9వ తరగతి విద్యార్థినిపై లైంగిక దాడి

 హైదరాబాద్‌లో సినిమా అవకాశాల పేరిట 9వ తరగతి విద్యార్థినిపై లైంగిక దాడి హైదరాబాద్, డిసెంబర్ 04 (ప్రజా మంటలు): సినిమా, సీరియల్ అవకాశాలు ఇస్తామని చెప్పి ఒక 13 ఏళ్ల 9వ తరగతి విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌ను కుదిపేసింది. ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ షాకింగ్ కేసులో ఇద్దరు సినిమా ఇండస్ట్రీ వ్యక్తులు మరియు బాలిక పెద్దమ్మ అరెస్టయ్యారు.   నిందితులు:బండి...
Read More...

MCC, MCMC మరియు సహాయ కేంద్రాలను (కంట్రోల్ రూమ్) వినియోగించుకోవాలి

MCC, MCMC మరియు సహాయ కేంద్రాలను (కంట్రోల్ రూమ్) వినియోగించుకోవాలి జగిత్యాల డిసెంబర్ 4(ప్రజా మంటలు) జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో  జిల్లా కలెక్టరేట్ లో మోడల్ కోడ్ అఫ్ కండక్ట్, మీడియా సర్టిఫికేషన్ &మానిటరింగ్ కమిటీ మరియు సహాయ కేంద్రంను (కంట్రోల్ రూమ్) ఇప్పటికే ప్రారంభించామని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. జగిత్యాల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే...
Read More...
State News  Crime 

రంగారెడ్డి ల్యాండ్ రికార్డ్స్ ఏడి శ్రీనివాస్‌పై ఏసీబీ సోదాలు

రంగారెడ్డి ల్యాండ్ రికార్డ్స్ ఏడి శ్రీనివాస్‌పై ఏసీబీ సోదాలు హైదరాబాద్, డిసెంబర్ 04 (ప్రజా మంటలు): రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ (AD) శ్రీనివాస్ పై ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణల నడుమ ఏసీబీ (ACB) అధికారులు భారీ స్థాయిలో సోదాలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. సమాచారం ప్రకారం, రంగారెడ్డి...
Read More...
Local News 

గొల్లపల్లి మండల నామినేషన్ సెంటర్ ను పరిశీలించిన డీఎస్పీ రఘు చందర్

గొల్లపల్లి మండల నామినేషన్ సెంటర్ ను పరిశీలించిన డీఎస్పీ రఘు చందర్ (అంకం భూమయ్య)  గొల్లపల్లి డిసెంబర్ 04 (ప్రజా మంటలు): మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ లు జరుగుతున్న సందర్భంగా జగిత్యాల  డిఎస్పి రఘుచందర్ గొల్లపల్లి కేంద్రంలో నామినేషన్ ఎలక్షన్ కేంద్రాలను సందర్శించి భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించి,  సిబ్బందికి తగు సూచనలను  సూచించారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు...
Read More...