వైభవంగా ఉగ్ర నరసింహ డోలోత్సవం భక్తులతో కిటకిటలాడిన ధర్మపురి క్షేత్రం
వైభవంగా ఉగ్ర నరసింహ డోలోత్సవం
భక్తులతో కిటకిటలాడిన ధర్మపురి క్షేత్రం
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి మార్చ్ 25 (ప్రజా మంటలు) : ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీనరసింహ, వేంకటేశ్వర బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా సోమ వారం సాయంత్రం శ్రీ ఉగ్ర నారసింహుని తెప్పోత్సవ, డోలోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించారు. సాయంత్రం క్షేత్ర సనాతన సాంప్రదాయ పద్దతిలో ఉగ్రనారసింహ స్వామి ప్రధానాలయం నుండి వేదమంత్రోచ్ఛాటనల, మంగళ వాద్యాలతో, భక్తజనం తోడు రాగా స్వామి ఉత్సవ మూర్తులను జయజయ ధ్వనాలతో ఊరేగించి, బ్రహ్మ పుష్కరిణి లోనికి కోనేరు ఉత్తర ద్వారం గుండా వేంచేపు చేయగా, అప్పటికే కోనేటిలో సోపానాలపై ఆసీనులై వేచియున్న భక్తజనం తమ ఇష్ట దైవాన్ని ఘనంగా స్వాగతించారు. అజ్ఞాత భక్తునిచే ప్రత్యేక నూతన నిర్మిత, బహూకృత హంస రూపు బల్లకట్టుపై స్వామిని ఆసీనులజేసి కోనేటి నీటిపై అయిదు ప్రదక్షిణలు నిర్వహించారు.
బ్రహ్మపుష్కరిణి సోపానాలపై నున్న భక్త జన సమూహం ప్రదక్షిణలను మెట్లపై నుండి అనుసరించారు. బుక్కా, గులాలు ఇత్యాది పూజా ద్రవ్యాలు ఉత్సవ మూర్తులపై చల్లి భక్తి శ్రద్దలతో కైమోడ్పులిడి ప్రార్ధించారు. అనంతరం కోనేరు మధ్య భాగానగల వేదికపైనున్న భోగ మటపంలోని ఊయలలో స్వామిని అసీనుల గావించి డోలోత్సవం విర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య భక్తులు ఇరుకైన మార్గం గుండా ప్రవేశించి మొక్కులు తీర్చుకున్నారు. స్వామి డోలు ఊగుచుండగా దర్శించిన భక్తులకు వేద పండితులు చతుర్వేద మంత్ర పఠనాలతో ఆశీస్సులు అంద చేశారు. జయజయ ధ్వానాలు మిన్నంటగా, పూజా ద్రవ్యాలను చల్లి భక్తులు తమ ఇష్ట దైవాన్ని కొలిచారు. అర్చకులు శ్రీనివాసాచార్య, వంశీ, విజయ్, అరుణ్ లచే భక్తులు తులసీ కంకణాలను కట్టించు కున్నారు.
ఆధ్యాత్మిక ప్రాసంగికులు, ప్రముఖ గాయకులు జగదీశ్ శర్మ నరసింహ శతక పద్యాలు వినిపించారు. దేవ స్థానం ఈఓ శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు జక్కు రవీందర్, సభ్యులు, సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ నేతృత్వంలో ఏర్పాట్లు చేయగా ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాం నరసింహా రెడ్డి, ఎస్ ఐ ఉదయ్ కుమార్ నేతృత్వంలో జగిత్యాల జిల్లాలోని ప్రత్యేక పోలీసు బృందాలు, హోంగార్డులు, ఎలాంటి అవాంఛనీయాలు చోటు చేసుకోకుండా బందోబస్తు చర్యలు చేపట్టారు. ప్రత్యేక బస్సుల ద్వారా భక్తులను గమ్యాలకు చేర్చారు.
ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల జెడ్పీ చైర్ పర్సన్, దావ వసంత, కరీంనగర్ డీ సీ ఎం ఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తమ్మ, వైస్ ఇందారపు రామయ్య, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, దేవస్థాన అర్చకులు, సిబ్బంది, భక్తులు దర్శనాలు చేసుకున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మానసిక దివ్యాంగుల పట్ల మానవత్వం చూపిన పోలీసులు
జగిత్యాల జులై 17(ప్రజా మంటలు)మానసిక దివ్యాంగుల పట్ల స్థానిక పోలీసులు మానవత్వం చాటుకున్నారు. మతిభ్రమించి ఇంటి వారికి దూరమైపట్టణంలో వివిధ ప్రాంతాలలో తిరుగుతున్న మానసిక వికలాంగులను దాదాపు పది నుండి 15 మంది మానసిక వికలాంగులకు జగిత్యాల పట్టణ పోలీసులు చేయూతనిచ్చారు...
పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ... కురుమ సంఘం ఆధ్వర్యంలో వర్షాలు సమృద్ధిగా పడాలని కోరుతూ కప్పతల్లి ఆటలు, ప్రత్యేక పూజలు
జగిత్యాల జూలై 16 (ప్రజా మంటలు )
కురుమ సంఘం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం దేశంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ స్థానిక పోచమ్మ వాడ లోని పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రోకలి కి రెండు కప్పలను కట్టి ప్రత్యేక పూజలను నిర్వహించి డప్పు చప్పుల మధ్య ఇంటింటా తిరుగుతూ కప్పతల్లి... ఇంకుడు గుంతలు నిర్మిస్తే భూగర్భ జలాలు పెరుగుతాయి- మున్సిపల్ కమిషనర్ డి శ్రీనివాస్ గౌడ్
మెట్ పెల్లి జూలై 16 (ప్రజా మంటలు)జె ఎస్జెబి 3.0 ఆధ్వర్యంలోని క్యాచ్ ది రైన్ ప్రచారం జల ప్రతిజ్ఞ కార్యక్రమంలో భాగంగా సిడిఎంఏ అధికారి ఆదేశాల మేరకు జలసంచెయ్ జన భాగీ దారి (జే ఎస్జేబి )3.0 లో భాగంగా నిర్వహిస్తున్న క్యాచ్ ది రైన్ ప్రచార కార్యక్రమంలో వర్షపు నీరు సంరక్షణ... అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ల జారీకి కమిటీ ఆమోదం
జగిత్యాల జులై 15(ప్రజా మంటలు)
జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులు ఆన్లైన్ లో సమర్పించిన 697 దరఖాస్తులను జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యులు సమగ్రంగా క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన మొదటి & రొండవ విడత 506 ప్రస్తుతం మూడవ విడతలో 74 మొత్తం 580 మంది వర్కింగ్ జర్నలిస్ట్ లకు అక్రీడిటేషన్ కార్డులు జారీకి ఆమోదం... చిన్న రైస్ మిల్లర్లకు అండగా ఉంటాం: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, జూలై 15 (ప్రజా మంటలు):
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితను రాష్ట్రానికి చెందిన చిన్న రైస్ మిల్లర్ల ప్రతినిధులు బుధవారం హైదరాబాద్లో కలిసి తమ సమస్యలను వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత, రాష్ట్ర ప్రభుత్వం పెద్ద రైస్ మిల్లర్ల పట్ల ఒక విధంగా, చిన్న రైస్ మిల్లర్ల పట్ల మరో... పారిశుద్ధ్య కార్మికుడి మృతి కేసు ముగింపు: రూ.15.50 లక్షల ఎక్స్గ్రేషియా, కుటుంబానికి రెండు ఉద్యోగాలు
హైదరాబాద్, జూలై 14: (ప్రజా మంటలు)
యూసుఫ్గూడ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లో పారిశుద్ధ్య కార్మికుడు మీశాల సుధాకర్ మృతి చెందిన ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్ఆర్సీ) స్వప్రేరణతో నమోదు చేసిన కేసును గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఆదేశాల అమలు నేపథ్యంలో ముగించింది.టీజీహెచ్ఆర్సీ ఛైర్పర్సన్ డా. జస్టిస్ షమీమ్ అక్తర్... రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పెద్దపల్లి మున్సిపల్ ఏఈ..
ఇంట్లో రూ.32.31 లక్షల అక్రమ నగదు స్వాధీనం
పెద్దపల్లి, జూలై 14 (ప్రజా మంటలు):
పెద్దపల్లి మున్సిపాలిటీలో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న కల్లేపల్లి సతీష్ కుమార్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్హ్యాండెడ్గా చిక్కారు.కాంట్రాక్టర్కు సంబంధించిన బిల్లును ప్రాసెస్ చేసి టీయూఎఫ్ఐడీసీ (TUFIDC)కి పంపేందుకు రూ.2 లక్షల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా... ప్రభుత్వ ఉద్యోగం సాధించిన యువకునికి మారుతి స్నేహమండలి సత్కారం
జగిత్యాల జులై 12 (ప్రజా మంటలు) జగిత్యాల బ్రాహ్మణ వీధికి చెందిన మోతే ఆర్యన్ ఇటీవల బ్యాంకింగ్ పరీక్ష రాసి ఉద్యోగం సాధించిన నేపథ్యాన్ని పురస్కరించుకొని మారుతి స్నేహ మండలి వారిచే మోతే ఆర్యన్ కు జ్ఞాపిక అందజేసి శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆర్యన్ మాట్లాడుతూ ఉద్యోగం సాధించడానికి ప్రధానంగా ధైర్యంతో... కన్నయ్య కుమార్ మీ అర్హతను దృష్టిలో ఉంచుకొని మాట్లాడు
హైదరాబాద్ 12 జూలై (ప్రజా మంటలు) :
కాంగ్రెస్ పార్టీ నాయకుడు కన్నయ్య కుమార్ మీ అర్హతను దృష్టిలో ఉంచుకొని మాట్లాడాలని శివసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శివసేన పార్టీ అధినేత పైన చేసిన వాఖ్యల పైన శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ తీవ్రంగా స్పందించారు...... జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణానికి భూమిపూజ
రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 ఎకరాల భూమి కేటాయింపు – త్వరలో తాత్కాలిక భవనంలో తరగతుల ప్రారంభం
జగిత్యాల, జూలై 12 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రంలోని చలగల్ వాలంతరీ వ్యవసాయ క్షేత్రంలో కేంద్రీయ విద్యాలయ శాశ్వత భవన నిర్మాణానికి ఆదివారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నిజామాబాద్ ఎంపీ... ఎస్సీ గ్రూప్ 1 లోని ఉప కులాలకు కార్పొరేషన్ ద్వారా చైర్మన్ ను నియమించాలి
జగిత్యాల జులై 12(ప్రజా మంటలు) జిల్లాలో బేడ బుడగ జంగాల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి చేసింది. ఎస్సీ గ్రూప్-1లోని 15 ఉపకులాల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, రాష్ట్ర సంఘ అధ్యక్షుడు సిరిపాటి వేణును ఆ కార్పొరేషన్ చైర్మన్గా నియమించాలని డిమాండ్ చేసింది.
జగిత్యాలలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా... లారెన్స్ బిష్ణోయ్ను అమెరికాకు అప్పగించాలని కోరాలని యూఎస్ నిర్ణయం
హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుతో పాటు అంతర్జాతీయ నేరాలపై విచారణకు రంగం సిద్ధంవాషింగ్టన్/న్యూఢిల్లీ జూలై 12: భారతీయ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ను అమెరికాకు అప్పగించాలని (ఎక్స్ట్రడిషన్) అమెరికా న్యాయశాఖ (US Department of Justice - DoJ) అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం గుజరాత్లోని జైలులో ఉన్న బిష్ణోయ్పై అమెరికా దాఖలు చేసిన అభియోగాల... 