వైభవంగా ఉగ్ర నరసింహ డోలోత్సవం భక్తులతో కిటకిటలాడిన ధర్మపురి క్షేత్రం
వైభవంగా ఉగ్ర నరసింహ డోలోత్సవం
భక్తులతో కిటకిటలాడిన ధర్మపురి క్షేత్రం
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి మార్చ్ 25 (ప్రజా మంటలు) : ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీనరసింహ, వేంకటేశ్వర బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా సోమ వారం సాయంత్రం శ్రీ ఉగ్ర నారసింహుని తెప్పోత్సవ, డోలోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించారు. సాయంత్రం క్షేత్ర సనాతన సాంప్రదాయ పద్దతిలో ఉగ్రనారసింహ స్వామి ప్రధానాలయం నుండి వేదమంత్రోచ్ఛాటనల, మంగళ వాద్యాలతో, భక్తజనం తోడు రాగా స్వామి ఉత్సవ మూర్తులను జయజయ ధ్వనాలతో ఊరేగించి, బ్రహ్మ పుష్కరిణి లోనికి కోనేరు ఉత్తర ద్వారం గుండా వేంచేపు చేయగా, అప్పటికే కోనేటిలో సోపానాలపై ఆసీనులై వేచియున్న భక్తజనం తమ ఇష్ట దైవాన్ని ఘనంగా స్వాగతించారు. అజ్ఞాత భక్తునిచే ప్రత్యేక నూతన నిర్మిత, బహూకృత హంస రూపు బల్లకట్టుపై స్వామిని ఆసీనులజేసి కోనేటి నీటిపై అయిదు ప్రదక్షిణలు నిర్వహించారు.
బ్రహ్మపుష్కరిణి సోపానాలపై నున్న భక్త జన సమూహం ప్రదక్షిణలను మెట్లపై నుండి అనుసరించారు. బుక్కా, గులాలు ఇత్యాది పూజా ద్రవ్యాలు ఉత్సవ మూర్తులపై చల్లి భక్తి శ్రద్దలతో కైమోడ్పులిడి ప్రార్ధించారు. అనంతరం కోనేరు మధ్య భాగానగల వేదికపైనున్న భోగ మటపంలోని ఊయలలో స్వామిని అసీనుల గావించి డోలోత్సవం విర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య భక్తులు ఇరుకైన మార్గం గుండా ప్రవేశించి మొక్కులు తీర్చుకున్నారు. స్వామి డోలు ఊగుచుండగా దర్శించిన భక్తులకు వేద పండితులు చతుర్వేద మంత్ర పఠనాలతో ఆశీస్సులు అంద చేశారు. జయజయ ధ్వానాలు మిన్నంటగా, పూజా ద్రవ్యాలను చల్లి భక్తులు తమ ఇష్ట దైవాన్ని కొలిచారు. అర్చకులు శ్రీనివాసాచార్య, వంశీ, విజయ్, అరుణ్ లచే భక్తులు తులసీ కంకణాలను కట్టించు కున్నారు.
ఆధ్యాత్మిక ప్రాసంగికులు, ప్రముఖ గాయకులు జగదీశ్ శర్మ నరసింహ శతక పద్యాలు వినిపించారు. దేవ స్థానం ఈఓ శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు జక్కు రవీందర్, సభ్యులు, సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ నేతృత్వంలో ఏర్పాట్లు చేయగా ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాం నరసింహా రెడ్డి, ఎస్ ఐ ఉదయ్ కుమార్ నేతృత్వంలో జగిత్యాల జిల్లాలోని ప్రత్యేక పోలీసు బృందాలు, హోంగార్డులు, ఎలాంటి అవాంఛనీయాలు చోటు చేసుకోకుండా బందోబస్తు చర్యలు చేపట్టారు. ప్రత్యేక బస్సుల ద్వారా భక్తులను గమ్యాలకు చేర్చారు.
ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల జెడ్పీ చైర్ పర్సన్, దావ వసంత, కరీంనగర్ డీ సీ ఎం ఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తమ్మ, వైస్ ఇందారపు రామయ్య, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, దేవస్థాన అర్చకులు, సిబ్బంది, భక్తులు దర్శనాలు చేసుకున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి: సీఎం రేవంత్రెడ్డిని కోరిన ఎమ్మెల్యే సంజయ్
హైదరాబాద్, ఆగస్టు 26 (ప్రజా మంటలు):
విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్కు చేరుకున్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డిని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
అర్బన్ హౌసింగ్ కాలనీలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన... కవి సాయంత్రం ఆధ్వర్యంలో పుస్తకాల ఆవిష్కరణ
సికింద్రాబాద్, ఆగస్ట్ 25 ( ప్రజా మంటలు):
మారుతున్న యాంత్రిక జీవన విధానం వల్ల తెలుగు భాష నిరాదరణకు గురి అవుతున్న సందర్భంలో కవి సాయంత్రం వంటి సాహిత్య సంస్థల కార్యక్రమాలు చూస్తుంటే తెలుగు భాషకు, సాహిత్యానికి పూర్వవైభవం రానున్నదని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు.
జనజాగృతి సంస్థలో... సిజేరియన్ ప్రసవాలను తగ్గించి సాధారణ ప్రసవాలను పెంచాలి
జగిత్యాల టౌన్, ఆగస్టు 24 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లాలో సిజేరియన్ ప్రసవాల సంఖ్య అధికంగా ఉన్న నేపథ్యంలో వాటిని తగ్గించి సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ముస్కు జైపాల్ రెడ్డి సూచించారు.
జగిత్యాలలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో జిల్లాలోని గైనకాలజిస్టులతో ప్రసూతి సేవలు, సిజేరియన్ సెక్షన్ ఆడిట్పై సమీక్షా సమావేశం... వృద్ధ మహిళకు ప్రాణభయం.. ఆస్తి, ఇన్సూరెన్స్ కోసం వేధింపులు -ప్రజావాణిలో ఫిర్యాదు
జగిత్యాల, ఆగస్టు 24 (ప్రజా మంటలు): తన చిన్న కుమారుడి మరణానంతరం ఆస్తి, ఇన్సూరెన్స్ హక్కులను వదులుకోవాలని ఒత్తిడి చేస్తూ కోడలు, ఆమె తల్లిదండ్రులు తనను వేధిస్తున్నారని ధర్మపురికి చెందిన వృద్ధ మహిళ దహగం దత్తప్రియ ప్రజావాణిలో ఫిర్యాదులో ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉందని, ముందస్తు పోలీసు రక్షణ కల్పించాలని ఆమె అధికారులను కోరారు.తన... సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన
హైదరాబాద్, ఆగస్టు 24 (ప్రజా మంటలు): తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధులకు వెల్లడించారు. బ్రిటన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్కు తిరిగి వచ్చిన సీఎం సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో... గురుకులాలు, ఫీజు రీయింబర్స్మెంట్పై ప్రభుత్వం నిర్లక్ష్యం- కొప్పుల
జగిత్యాల, ఆగస్టు 24 (ప్రజా మంటలు):
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన విద్యా అవకాశాలను ప్రస్తుత ప్రభుత్వం దెబ్బతీస్తోందని విమర్శించారు. సోమవారం... బైపాస్ రోడ్డుపై బయోమెడికల్ వ్యర్థాలు.. మున్సిపల్ హెచ్చరిక బోర్డు కళ్లముందే నిర్లక్ష్యం
జగిత్యాల, ఆగస్టు 24 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలో హాస్పిటల్ వ్యర్థాల నిర్వహణపై నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. బైపాస్ రోడ్డులోని మోతె డౌన్ చౌరస్తా వద్ద కెనాల్పై ‘బయో హజార్డ్’, ‘ఇన్ఫెక్షియస్’ అని ముద్రించిన హాస్పిటల్ వ్యర్థాలను గుర్తుతెలియని వ్యక్తులు పడేసి వెళ్లారు.
ఈ ప్రాంతంలో చెత్త వేస్తే రూ.5 వేల జరిమానా విధిస్తామని... నేటి అర్ధరాత్రి నుండి ఆటోల బంద్ _ప్రజలు సహకరించాలి
జగిత్యాల ఆగస్ట్ 23 (ప్రజా మంటలు)
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 9348422113
నేటి అర్ధరాత్రి నుండి జగిత్యాల జిల్లా స్థాయిలో రాష్ట్ర పిలుపుమేరకు ఆటోలు బంద్ నిర్వహిస్తున్నట్లు ఆటో డ్రైవర్లు తెలిపారు. విధి లేని పరిస్థితుల్లోనే తాము బందుకు శ్రీకారం చుట్టామని ప్రజలు తమ పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో... మహిళా ఉద్యోగి ఆరోపణలన్నీ ఆవాస్తవం - ది మనోహార్ హోటల్ చైర్మన్ డీవీ మనోహర్ వెల్లడి..
సికింద్రాబాద్,ఆగస్ట్ 22 (ప్రజామంటలు):
తమ సంస్థలో ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ కమ్ గెస్ట్ రిలేషన్స్ మేనేజర్గా పనిచేసిన కొరపు లావణ్య చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవమని, తీవ్ర నిరాధారమైనవని హోటల్ 'ది మనోహర్' చైర్మన్ డీవీ మనోహర్ స్పష్టం చేశారు. శనివారం బేగంపేటలోని హోటల్ 'ది మనోహర్'లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లావణ్య... యాదవులను కురుమ కులంలో కలపవద్దు
సికింద్రాబాద్,ఆగస్ట్ 22 (ప్రజామంటలు):
యాదవ సామాజిక వర్గాన్ని కురుమ కులంలో కలపడానికి కుట్రలు జరుగుతున్నాయని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం, కురుమ జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్, సభ్యులు ఆర్. జయప్రకాష్, టి. సుదర్శన్లను కలిసి... జర్నలిస్టులపై ఇక అక్రమ కేసులు చెల్లవా? వైరల్ మెసేజ్లో నిజమెంత?
న్యూఢిల్లీ, ఆగస్టు 22 (ప్రజా మంటలు):
దేశవ్యాప్తంగా జర్నలిస్టులకు సుప్రీంకోర్టు భారీ ఊరటనిచ్చిందంటూ సోషల్ మీడియా, వాట్సాప్లో వైరల్ అవుతున్న ఓ సందేశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. “పెన్నుతో వార్తలు రాసే జర్నలిస్టులు, వీడియో కెమెరాలతో వార్తలను కవర్ చేసే రిపోర్టర్లు, శాటిలైట్ న్యూస్ చానళ్లు, యూట్యూబ్ న్యూస్ ఛానళ్లు, ప్రింట్ మీడియా సంస్థల్లో పనిచేసే... ఘనంగా కుంకుమార్చనలు, విశేష సంఖ్యలో పాల్గొన్న మహిళలు
జగిత్యాల ఆగస్టు 21 (ప్రజా మంటలు)పవిత్ర శ్రావణమాసాన్ని పురస్కరించుకొని శ్రీ వరలక్ష్మి వ్రతం సందర్భంగా జిల్లా కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో శుక్రవారం సాయంత్రం నంబి వేణుగోపాల ఆచార్య ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు.
భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పూజా ద్రవ్యాలు ఆలయం పక్షాన అందజేశారు .
కార్యక్రమం అనంతరం తీర్థ... 