వైభవంగా ఉగ్ర నరసింహ డోలోత్సవం భక్తులతో కిటకిటలాడిన ధర్మపురి క్షేత్రం
వైభవంగా ఉగ్ర నరసింహ డోలోత్సవం
భక్తులతో కిటకిటలాడిన ధర్మపురి క్షేత్రం
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి మార్చ్ 25 (ప్రజా మంటలు) : ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీనరసింహ, వేంకటేశ్వర బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా సోమ వారం సాయంత్రం శ్రీ ఉగ్ర నారసింహుని తెప్పోత్సవ, డోలోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించారు. సాయంత్రం క్షేత్ర సనాతన సాంప్రదాయ పద్దతిలో ఉగ్రనారసింహ స్వామి ప్రధానాలయం నుండి వేదమంత్రోచ్ఛాటనల, మంగళ వాద్యాలతో, భక్తజనం తోడు రాగా స్వామి ఉత్సవ మూర్తులను జయజయ ధ్వనాలతో ఊరేగించి, బ్రహ్మ పుష్కరిణి లోనికి కోనేరు ఉత్తర ద్వారం గుండా వేంచేపు చేయగా, అప్పటికే కోనేటిలో సోపానాలపై ఆసీనులై వేచియున్న భక్తజనం తమ ఇష్ట దైవాన్ని ఘనంగా స్వాగతించారు. అజ్ఞాత భక్తునిచే ప్రత్యేక నూతన నిర్మిత, బహూకృత హంస రూపు బల్లకట్టుపై స్వామిని ఆసీనులజేసి కోనేటి నీటిపై అయిదు ప్రదక్షిణలు నిర్వహించారు.
బ్రహ్మపుష్కరిణి సోపానాలపై నున్న భక్త జన సమూహం ప్రదక్షిణలను మెట్లపై నుండి అనుసరించారు. బుక్కా, గులాలు ఇత్యాది పూజా ద్రవ్యాలు ఉత్సవ మూర్తులపై చల్లి భక్తి శ్రద్దలతో కైమోడ్పులిడి ప్రార్ధించారు. అనంతరం కోనేరు మధ్య భాగానగల వేదికపైనున్న భోగ మటపంలోని ఊయలలో స్వామిని అసీనుల గావించి డోలోత్సవం విర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య భక్తులు ఇరుకైన మార్గం గుండా ప్రవేశించి మొక్కులు తీర్చుకున్నారు. స్వామి డోలు ఊగుచుండగా దర్శించిన భక్తులకు వేద పండితులు చతుర్వేద మంత్ర పఠనాలతో ఆశీస్సులు అంద చేశారు. జయజయ ధ్వానాలు మిన్నంటగా, పూజా ద్రవ్యాలను చల్లి భక్తులు తమ ఇష్ట దైవాన్ని కొలిచారు. అర్చకులు శ్రీనివాసాచార్య, వంశీ, విజయ్, అరుణ్ లచే భక్తులు తులసీ కంకణాలను కట్టించు కున్నారు.
ఆధ్యాత్మిక ప్రాసంగికులు, ప్రముఖ గాయకులు జగదీశ్ శర్మ నరసింహ శతక పద్యాలు వినిపించారు. దేవ స్థానం ఈఓ శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు జక్కు రవీందర్, సభ్యులు, సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ నేతృత్వంలో ఏర్పాట్లు చేయగా ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాం నరసింహా రెడ్డి, ఎస్ ఐ ఉదయ్ కుమార్ నేతృత్వంలో జగిత్యాల జిల్లాలోని ప్రత్యేక పోలీసు బృందాలు, హోంగార్డులు, ఎలాంటి అవాంఛనీయాలు చోటు చేసుకోకుండా బందోబస్తు చర్యలు చేపట్టారు. ప్రత్యేక బస్సుల ద్వారా భక్తులను గమ్యాలకు చేర్చారు.
ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల జెడ్పీ చైర్ పర్సన్, దావ వసంత, కరీంనగర్ డీ సీ ఎం ఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తమ్మ, వైస్ ఇందారపు రామయ్య, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, దేవస్థాన అర్చకులు, సిబ్బంది, భక్తులు దర్శనాలు చేసుకున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాలలో ₹100 కోట్ల ప్రభుత్వ భూమి వివాదం – బాధ్యత గల పౌరుడిగా భూ ఆక్రమణను వెలుగులోకి తెచ్చిన - మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో కాంగ్రెసు నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి తాటి పర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని స్పష్టం చేశారు.
₹100 కోట్ల విలువ గల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని ఆరోపణల నేపథ్యంలో, జీవన్... న్యాయవాదులపై అనుచిత ప్రవర్తన కేసు - మానవహక్కుల కమీషన్ కు ఫిర్యాదు
మానవ హక్కుల కమిషన్ లో అడ్వకేట్ రామారావు ఫిర్యాదు జనగాం పోలీసులపై ఎఫ్ఐఆర్
సికింద్రాబాద్, అక్టోబర్ 29 (ప్రజామంటలు) :
గతంలో జనగాం సర్కిల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తించిన రఘుపతి, ఎస్ఐ తిరుపతి లపై న్యాయవాద దంపతులు గద్దల అమృత్రావు, కవితలతో అనుచిత ప్రవర్తన చేసిన ఘటనకు సంబంధించి జనగాం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు... గాంధీ రోగి సహాయకుల విశ్రాంతి భవన నిర్వాహణకు చేయూత
నిత్యవసరాలు, బ్లాంకెట్లు అందచేసిన ఎస్బీఐ లేడీస్ క్లబ్
సికింద్రాబాద్, అక్టోబర్ 29 ( ప్రజామంటలు):
గాంధీ ఆస్పత్రిలోని జనహిత సేవా ట్రస్ట్ నిర్వహిస్తున్న రోగి సహాయకుల విశ్రాంతి భవనాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేడీస్ క్లబ్, హైదరాబాద్ సభ్యులు బుధవారం సందర్శించారు. షెల్టర్ హోమ్లో ఉన్న లబ్ధిదారులతో మాట్లాడి వారి అవసరాలను తెలుసుకున్నారు.లబ్ధిదారులు మాట్లాడుతూ... ఎన్కౌంటర్ భయం వ్యక్తం చేసిన గ్యాంగ్స్టర్ జగ్గు భగవాన్పురియా — హైకోర్ట్లో పిటిషన్ దాఖలు
చండీగఢ్ అక్టోబర్ 39:
పంజాబ్కు తరలించే ముందు కస్టడీలో ఉన్న గ్యాంగ్స్టర్ జగ్గు భగవాన్పురియా తన ప్రాణ భయాన్ని వ్యక్తం చేస్తూ పంజాబ్-హర్యానా హైకోర్టును ఆశ్రయించాడు.
తనను పోలీసులు ఎన్కౌంటర్లో హతమార్చే అవకాశం ఉందని భగవాన్పురియా తన పిటిషన్లో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో హైకోర్టు, పంజాబ్ ప్రభుత్వాన్ని నోటీసు జారీ చేస్తూ, రాష్ట్రం నుండి వివరణ... చాచల్లో జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల ఆందోళన — వేతన సమానత్వం సహా డిమాండ్లు
గౌహతి అక్టోబర్ 29:
గువహటి నగరంలోని చాచల్ ప్రాంతంలో జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) ఉద్యోగుల సంఘం మరియు అఖిల అసోం హెల్త్ అండ్ టెక్నికల్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది.
ఉద్యోగులు సమాన వేతనాలు, సేవా భద్రత, అలాగే ముఖ్యమంత్రి డా. హిమంత బిశ్వ శర్మ ఇచ్చిన హామీలను... “భారత్తో యుద్ధం చేస్తే నష్టపోయేది పాకిస్తానే” -పాకిస్తాన్కు అమెరికా మాజీ సీఐఏ అధికారి హెచ్చరిక
వాషింగ్టన్/న్యూ ఢిల్లీ, అక్టోబర్ 29:భారత్తో యుద్ధానికి ప్రయత్నిస్తే పాకిస్తాన్ ఘోర పరాజయాన్ని చవిచూసే అవకాశం ఉందని అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (CIA) మాజీ అధికారి జాన్ కిరియాకో (John Kiriakou) హెచ్చరించారు. తన 15 ఏళ్ల కౌంటర్టెరరిజం సేవా కాలంలో సగం కాలాన్ని పాకిస్తాన్లో గడిపిన ఆయన, పాకిస్తాన్ నిరంతరం భారతదేశాన్ని ప్రేరేపించడం... చెఫ్ మాధంపట్టి రంగరాజ్ – జాయ్ క్రిసిల్డా వివాదంపై భార్య శృతి స్పందన
🎬 జాయ్ క్రిసిల్డాతో రెండో వివాహం
చెన్నై, అక్టోబర్ 29 (ప్రజా మంటలు):
జాయ్ క్రిసిల్డా వ్యవహారంతో చెఫ్ మాధంపట్టి రంగరాజ్ మరోసారి వివాదాల మద్యలో నిలిచారు. ఈ కేసులో ఇప్పటివరకు మౌనం పాటించిన ఆయన భార్య శృతి, తొలిసారిగా స్పందిస్తూ తన భావాలను ఇన్స్టాగ్రామ్లో వ్యక్తం చేశారు.
‘మెహందీ సర్కస్’ సినిమాతో గుర్తింపు... మొంథా తుపాన్ ప్రభావం – ఐదు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
హైదరాబాద్, అక్టోబర్ 29 (ప్రజా మంటలు):
మొంథా తుపాన్ ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణలో పలు జిల్లాల్లో గురువారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. వరంగల్, హనుమకొండ, ములుగు, మహబూబాబాద్, సిద్ధిపేట జిల్లాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు.
తుఫాన్ కారణంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ... అంతర్ రాష్ట్ర దొంగల ముఠా నాయకుడు అరెస్ట్ జగిత్యాల అదిలాబాద్ నిర్మల్ జిల్లాలలో చోరీలు
జగిత్యాల అక్టోబర్ 29(ప్రజా మంటలు)గతంలో మహారాష్ట్రలోని నాందేడు, బాస్మత్ , దర్మబాద్, హింగోలి సైతం దొంగతనాలు. వివరాలు వెల్లడించిన డీఎస్పీ రఘు చందర్ తేదీ 13.10.2025 రోజున తెల్లవారుజామున జగిత్యాల జిల్లాలోని ధరూర్ గ్రామాలలో నాలుగు ఇండ్లలో జరిగిన దొంగతనాలు మరియు తేదీ 02.10.2025 నాడు మెట్పల్లి వైన్ షాప్ దగ్గర దొంగతనాలు చేసిన... మొంథా తుపాన్పై సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం — అన్ని శాఖలకు ఆదేశాలు
డోర్నకల్ జంక్షన్లో గోల్కొండ ఎక్స్ప్రెస్, గుండ్రాతిమడుగు స్టేషన్లో కోణార్క్ ఎక్స్ప్రెస్ - నిలిపివేత
హైదరాబాద్, అక్టోబర్ 29 (ప్రజా మంటలు):
మొంథా తుపాన్ ప్రభావం నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమీక్షించారు. రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. వరి కోతల సమయం కావడంతో... కార్తీక మాసం బొమ్మల కొలువు భలే..భలే..
గత 50 ఏండ్లుగా బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్న సుశీలమ్మ
సికింద్రాబాద్, అక్టోబర్ 29 (ప్రజామంటలు):
కార్తీక మాసం వేళ మల్కాజిగిరి, మిర్జాలగూడలోని భావిగడ్డ సుశీలమ్మ (80) ఇంట్లో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు అందరినీ ఆకట్టుకుంటోంది.1978లో కేవలం మూడు బొమ్మలతో ప్రారంభించిన ఈ సంప్రదాయాన్ని ఆమె 50 ఏళ్లుగా కొనసాగిస్తున్నారు.తిరుమల, అయోధ్య, కైలాసం, పల్లె... వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా యశోద హాస్పిటల్స్ లో అవేర్నెస్
సికింద్రాబాద్, అక్టోబర్ 29 (ప్రజామంటలు):
వరల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ డే సందర్భంగా బుధవారం సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో బ్రెయిన్ స్ట్రోక్ అవగాహన కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రధాన అతిథిగా హాజరై, యశోద హాస్పిటల్స్ గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటితో కలిసి ప్రారంభించారు.
ఈ... 