వైభవంగా ఉగ్ర నరసింహ డోలోత్సవం భక్తులతో కిటకిటలాడిన ధర్మపురి క్షేత్రం

On
వైభవంగా ఉగ్ర నరసింహ డోలోత్సవం భక్తులతో కిటకిటలాడిన ధర్మపురి క్షేత్రం

వైభవంగా ఉగ్ర నరసింహ డోలోత్సవం
భక్తులతో కిటకిటలాడిన ధర్మపురి క్షేత్రం

 (రామ కిష్టయ్య సంగన భట్ల)

ధర్మపురి మార్చ్ 25 (ప్రజా మంటలు) : ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీనరసింహ, వేంకటేశ్వర బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా సోమ వారం సాయంత్రం శ్రీ ఉగ్ర నారసింహుని తెప్పోత్సవ, డోలోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించారు. సాయంత్రం క్షేత్ర సనాతన సాంప్రదాయ పద్దతిలో ఉగ్రనారసింహ స్వామి ప్రధానాలయం నుండి వేదమంత్రోచ్ఛాటనల, మంగళ వాద్యాలతో, భక్తజనం తోడు రాగా స్వామి ఉత్సవ మూర్తులను జయజయ ధ్వనాలతో ఊరేగించి, బ్రహ్మ పుష్కరిణి లోనికి కోనేరు ఉత్తర ద్వారం గుండా వేంచేపు చేయగా, అప్పటికే కోనేటిలో సోపానాలపై ఆసీనులై వేచియున్న భక్తజనం తమ ఇష్ట దైవాన్ని ఘనంగా స్వాగతించారు. అజ్ఞాత భక్తునిచే ప్రత్యేక నూతన నిర్మిత, బహూకృత హంస రూపు బల్లకట్టుపై స్వామిని ఆసీనులజేసి కోనేటి నీటిపై అయిదు ప్రదక్షిణలు నిర్వహించారు.

 

బ్రహ్మపుష్కరిణి సోపానాలపై నున్న భక్త జన సమూహం ప్రదక్షిణలను మెట్లపై నుండి అనుసరించారు. బుక్కా, గులాలు ఇత్యాది పూజా ద్రవ్యాలు ఉత్సవ మూర్తులపై చల్లి భక్తి శ్రద్దలతో కైమోడ్పులిడి ప్రార్ధించారు. అనంతరం కోనేరు మధ్య భాగానగల వేదికపైనున్న భోగ మటపంలోని ఊయలలో స్వామిని అసీనుల గావించి డోలోత్సవం విర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య భక్తులు ఇరుకైన మార్గం గుండా ప్రవేశించి మొక్కులు తీర్చుకున్నారు. స్వామి డోలు ఊగుచుండగా దర్శించిన భక్తులకు వేద పండితులు చతుర్వేద మంత్ర పఠనాలతో ఆశీస్సులు అంద చేశారు. జయజయ ధ్వానాలు మిన్నంటగా, పూజా ద్రవ్యాలను చల్లి భక్తులు తమ ఇష్ట దైవాన్ని కొలిచారు. అర్చకులు శ్రీనివాసాచార్య, వంశీ, విజయ్, అరుణ్ లచే భక్తులు తులసీ కంకణాలను కట్టించు కున్నారు.

 

ఆధ్యాత్మిక ప్రాసంగికులు, ప్రముఖ గాయకులు జగదీశ్ శర్మ నరసింహ శతక పద్యాలు వినిపించారు. దేవ స్థానం ఈఓ శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు జక్కు రవీందర్, సభ్యులు, సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ నేతృత్వంలో ఏర్పాట్లు చేయగా ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాం నరసింహా రెడ్డి, ఎస్ ఐ ఉదయ్ కుమార్ నేతృత్వంలో జగిత్యాల జిల్లాలోని ప్రత్యేక పోలీసు బృందాలు, హోంగార్డులు, ఎలాంటి అవాంఛనీయాలు చోటు చేసుకోకుండా బందోబస్తు చర్యలు చేపట్టారు. ప్రత్యేక బస్సుల ద్వారా భక్తులను గమ్యాలకు చేర్చారు. 

ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల జెడ్పీ చైర్ పర్సన్, దావ వసంత, కరీంనగర్ డీ సీ ఎం ఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ధర్మపురి  మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తమ్మ, వైస్ ఇందారపు రామయ్య, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, దేవస్థాన అర్చకులు, సిబ్బంది, భక్తులు దర్శనాలు చేసుకున్నారు.

 

Tags
Join WhatsApp

More News...

International   State News 

మోంబాసా సాటర్ డే క్లబ్‌ ఫండ్‌ రైజింగ్‌లో MOMTA సభ్యుల ప్రదర్శన

మోంబాసా సాటర్ డే క్లబ్‌ ఫండ్‌ రైజింగ్‌లో MOMTA సభ్యుల ప్రదర్శన సికింద్రాబాద్, డిసెంబర్ 07 ( ప్రజామంటలు) : కెన్యా లోని మోంబాసా తెలుగు అసోసియేషన్ ( MOMTA) ఆధ్వర్యంలో ఫండ్ రైజింగ్  కొరకు "సాటర్ డే క్లబ్" నిర్వహించిన  అసోసియేషన్ సభ్యుల సాంస్కృతిక ప్రదర్శన ఆకట్టుకుంది. బోర్‌ వెల్లుల ఏర్పాటు, విద్యార్థుల విద్యా సహాయం, భారీ నీటి నిల్వ ట్యాంకుల విరాళం, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు...
Read More...

కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు సత్యసాయి సేవా సమితి చేయూత

కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు సత్యసాయి సేవా సమితి చేయూత కొండగట్టు, డిసెంబర్ 06 (ప్రజా మంటలు):స్థానికంగా జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 20 మంది చిరు వ్యాపారుల షాపులు పూర్తిగా కాలిపోవడంతో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయి. పరిస్థితి తెలుసుకున్న భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల తరఫున తక్షణ సహాయం అందించారు. సామ శ్రీనాథ్ కుటుంబ సభ్యులు, మహేష్ మొదలైన వారు...
Read More...
National  Comment 

కాసేపు హాయిగా నవ్వుకోండి..చాలా సీరియస్ అంశం?

కాసేపు హాయిగా నవ్వుకోండి..చాలా సీరియస్ అంశం? నేటి సామాజిక ఆలోచనలపై వ్యంగ్య రచన  (జర్నలిస్ట్ నాగ్ రాజ్ FB నుండి) ఇందాక ఆకలేసి, దారిలో పంచెకట్టు దోశ సెంటర్ కనిపిస్తే వెళ్లా.  మెనూ చెక్ చేసి,"ఓ ఘీంకారం దోశ.. టోకెన్ ఇవ్వు" అనడిగా. (అంటే ఏనుగు అరుపు కాదు) -ed  "అది ఘీంకారం కాదు, ఘీ కారం" అన్నాడాయన కోపంగా.  "ఓహ్,...
Read More...
Local News 

జగిత్యాలలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శుభాకాంక్షల పరంపర

జగిత్యాలలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శుభాకాంక్షల పరంపర జగిత్యాల డిసెంబర్ 07 (ప్రజా మంటలు): కన్వెన్షన్ హాల్‌లో శృంగేరి శారద పీఠ ఆస్థాన పండితులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారి మహాభారత ప్రవచన మహాయజ్ఞం రెండో రోజు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రవచన...
Read More...
State News 

ఇండిగో సీఈఓ కు dgca నోటీస్

ఇండిగో సీఈఓ కు dgca నోటీస్ న్యూ ఢిల్లీ డిసెంబర్ 06; ఇండిగో flights ఆలస్యాలు, క్రూ కొరత, ప్రయాణీకుల అసౌకర్యంపై దేశవ్యాప్తంగా వచ్చిన తీవ్ర విమర్శల నేపథ్యంలో, డీజీసీఏ నేరంగా ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. “మీపై తగిన అమలు చర్య ఎందుకు ప్రారంభించకూడదు?” అనే ప్రశ్నకు సంబంధించి, ఎల్బర్స్ 24 గంటల్లోపు వివరణ ఇవ్వాలని...
Read More...
National  Sports 

IND vs SA: జైస్వాల్ తొలి వన్డే సెంచరీ – భారత్‌కు ఘన విజయం, సిరీస్‌ కైవసం

IND vs SA: జైస్వాల్ తొలి వన్డే సెంచరీ – భారత్‌కు ఘన విజయం, సిరీస్‌ కైవసం విశాఖపట్నం డిసెంబర్ 06:   టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ వన్డేల్లో తన మొదటి సెంచరీ నమోదు చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో బోచ్ బౌలింగ్‌లో సింగిల్ తీసుకుని శతకం పూర్తి చేశాడు. ఆరంభంలో రోహిత్ శర్మ (75) వేగంగా రాణించినా మహరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కోహ్లీ (33*)తో కలిసి జైస్వాల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు....
Read More...
State News 

తెలంగాణ ను దేశంలో ఆదర్శంగా నిలపడమే లక్ష్యం: రేవంత్ రెడ్డి

తెలంగాణ ను దేశంలో ఆదర్శంగా నిలపడమే లక్ష్యం: రేవంత్ రెడ్డి నల్లగొండ డిసెంబర్ 06 (ప్రజా మంటలు): నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన ‘ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఇప్పటికే వరి ఉత్పత్తి, శాంతి భద్రతలు, విద్య, వైద్య రంగం, మాదకద్రవ్యాల నియంత్రణలో దేశంలో నంబర్‌ వన్‌గా నిలిచిందని తెలిపారు. ఇందులో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి,...
Read More...
Local News 

తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే :జగిత్యాల ఆర్డీవో మధుసూదన్

తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే :జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ జగిత్యాల డిసెంబర్ 06 (ప్రజా మంటలు): వయోవృద్ధులైన తల్లిదండ్రులను పోషించాల్సిన భాద్యత పిల్లలదే  నని  విస్మరిస్తే జైలు శిక్ష జరిమానా తదితర చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జగిత్యాల డివిజన్ ఆర్డీవో, వయో వృద్ధుల ట్రిబ్యునల్ చైర్మన్ పి. మధుసూదన్ హెచ్చరించారు. శనివారం ఆర్డీవో ఛాంబర్లో వృద్ధుల నిరాధరణ కేసులను విచారించారు. జగిత్యాల రూరల్ మండలం గుల్లపేట...
Read More...
Local News 

తులగంగవ్వ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు నివాళి

తులగంగవ్వ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు నివాళి మెటుపల్లి డిసెంబర్ 06:మెట్పల్లి అంబేద్కర్ పార్క్‌లో డా. బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా తుల గంగవ్వ ట్రస్ట్ చైర్మన్ డా. తుల రాజేందర్ కుమార్ అంబేద్కర్ సంఘాల నాయకులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు.
Read More...
Local News 

గ్రామాల్లో కోతుల బెడద నివారించే అభ్యర్థులనే గెలిపించండి : తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం పిలుపు

గ్రామాల్లో కోతుల బెడద నివారించే అభ్యర్థులనే గెలిపించండి : తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం పిలుపు సికింద్రాబాద్, డిసెంబర్ 06 (ప్రజామంటలు): తెలంగాణ గ్రామాలను వేధిస్తున్న కోతుల సమస్యను పరిష్కరించగల అభ్యర్థులనే రాబోయే సర్పంచ్‌ ఎన్నికల్లో గెలిపించాలని తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం (జై కిసాన్) విజ్ఞప్తి చేసింది. బషీర్ బాగ్  ప్రెస్‌ క్లబ్‌లో జరిగిన ప్రెస్‌ మీట్‌ లో ఫోరం ప్రతినిధులు మాట్లాడారు. కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమస్యను...
Read More...

రాయికల్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి  

రాయికల్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి   రాయికల్ డిసెంబర్ 6(ప్రజా మంటలు)*గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ అధికారులు సిబ్బంది విధి నిర్వహణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి*    అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి శనివారం         రాయికల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, నమోదు చేసిన రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి ఈ...
Read More...
Local News 

అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలి. -సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు

అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలి. -సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు మెట్టుపల్లి డిసెంబర్ 6 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): భారత రత్న డా. బి. ఆర్. ఆశయాలు కొనసాగించాల్సిన అవసరం ఉందని సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. శనివారం అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన...
Read More...