వైభవంగా ఉగ్ర నరసింహ డోలోత్సవం భక్తులతో కిటకిటలాడిన ధర్మపురి క్షేత్రం
వైభవంగా ఉగ్ర నరసింహ డోలోత్సవం
భక్తులతో కిటకిటలాడిన ధర్మపురి క్షేత్రం
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి మార్చ్ 25 (ప్రజా మంటలు) : ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీనరసింహ, వేంకటేశ్వర బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా సోమ వారం సాయంత్రం శ్రీ ఉగ్ర నారసింహుని తెప్పోత్సవ, డోలోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించారు. సాయంత్రం క్షేత్ర సనాతన సాంప్రదాయ పద్దతిలో ఉగ్రనారసింహ స్వామి ప్రధానాలయం నుండి వేదమంత్రోచ్ఛాటనల, మంగళ వాద్యాలతో, భక్తజనం తోడు రాగా స్వామి ఉత్సవ మూర్తులను జయజయ ధ్వనాలతో ఊరేగించి, బ్రహ్మ పుష్కరిణి లోనికి కోనేరు ఉత్తర ద్వారం గుండా వేంచేపు చేయగా, అప్పటికే కోనేటిలో సోపానాలపై ఆసీనులై వేచియున్న భక్తజనం తమ ఇష్ట దైవాన్ని ఘనంగా స్వాగతించారు. అజ్ఞాత భక్తునిచే ప్రత్యేక నూతన నిర్మిత, బహూకృత హంస రూపు బల్లకట్టుపై స్వామిని ఆసీనులజేసి కోనేటి నీటిపై అయిదు ప్రదక్షిణలు నిర్వహించారు.
బ్రహ్మపుష్కరిణి సోపానాలపై నున్న భక్త జన సమూహం ప్రదక్షిణలను మెట్లపై నుండి అనుసరించారు. బుక్కా, గులాలు ఇత్యాది పూజా ద్రవ్యాలు ఉత్సవ మూర్తులపై చల్లి భక్తి శ్రద్దలతో కైమోడ్పులిడి ప్రార్ధించారు. అనంతరం కోనేరు మధ్య భాగానగల వేదికపైనున్న భోగ మటపంలోని ఊయలలో స్వామిని అసీనుల గావించి డోలోత్సవం విర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య భక్తులు ఇరుకైన మార్గం గుండా ప్రవేశించి మొక్కులు తీర్చుకున్నారు. స్వామి డోలు ఊగుచుండగా దర్శించిన భక్తులకు వేద పండితులు చతుర్వేద మంత్ర పఠనాలతో ఆశీస్సులు అంద చేశారు. జయజయ ధ్వానాలు మిన్నంటగా, పూజా ద్రవ్యాలను చల్లి భక్తులు తమ ఇష్ట దైవాన్ని కొలిచారు. అర్చకులు శ్రీనివాసాచార్య, వంశీ, విజయ్, అరుణ్ లచే భక్తులు తులసీ కంకణాలను కట్టించు కున్నారు.
ఆధ్యాత్మిక ప్రాసంగికులు, ప్రముఖ గాయకులు జగదీశ్ శర్మ నరసింహ శతక పద్యాలు వినిపించారు. దేవ స్థానం ఈఓ శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు జక్కు రవీందర్, సభ్యులు, సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ నేతృత్వంలో ఏర్పాట్లు చేయగా ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాం నరసింహా రెడ్డి, ఎస్ ఐ ఉదయ్ కుమార్ నేతృత్వంలో జగిత్యాల జిల్లాలోని ప్రత్యేక పోలీసు బృందాలు, హోంగార్డులు, ఎలాంటి అవాంఛనీయాలు చోటు చేసుకోకుండా బందోబస్తు చర్యలు చేపట్టారు. ప్రత్యేక బస్సుల ద్వారా భక్తులను గమ్యాలకు చేర్చారు.
ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల జెడ్పీ చైర్ పర్సన్, దావ వసంత, కరీంనగర్ డీ సీ ఎం ఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తమ్మ, వైస్ ఇందారపు రామయ్య, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, దేవస్థాన అర్చకులు, సిబ్బంది, భక్తులు దర్శనాలు చేసుకున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అర్చకుల పట్ల అమర్యాద సరికాదు – ఈవోపై చర్యలు తీసుకోవాలి
జగిత్యాల, జనవరి 25 (ప్రజా మంటలు):
హిందూ మతానికి మూల స్తంభాలుగా, భక్తునికి భగవంతునికి మధ్య వారధులుగా అర్చకులు ఉంటారని భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ ఏసీఎస్ రాజు అన్నారు.
జగిత్యాలలోని భారత్ సురక్ష సమితి కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో సామాజిక సమరసతా వేదిక... జింబాబ్వేలో భూస్వాధీనాల బాధిత తెల్లజాతి రైతులు: పరిహారం కోసం అమెరికా జోక్యం కోరుతున్నారా?
జింబాబ్వేలో 2000వ దశకంలో అప్పటి ప్రభుత్వం చేపట్టిన హింసాత్మక భూస్వాధీన విధానాల వల్ల వేలాది మంది తెల్లజాతి రైతులు తమ భూములు, ఉపాధి కోల్పోయారు. ఈ రైతులకు పరిహారం చెల్లిస్తామని జింబాబ్వే ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటికీ పూర్తి స్థాయిలో చెల్లింపులు జరగలేదు.
ఈ నేపథ్యంలో, బాధిత రైతులు ఇప్పుడు అమెరికా ప్రభుత్వ జోక్యాన్ని కోరుతున్నారు.... ట్రంప్ ఆస్తులపై న్యూయార్క్ కోర్టు జప్తు చర్యలు
న్యూయార్క్ జనవరి 25:
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చెందిన ఆస్తులను న్యూయార్క్ కోర్టు జప్తు చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. ట్రంప్ సంస్థలపై నమోదైన భారీ ఆర్థిక మోసం కేసులో కోర్టు పెద్ద మొత్తంలో జరిమానా విధించింది. అధికారంలో ఉన్న దేశాధ్యక్షుని ఆస్తులు జప్తు చేయాలని కోర్ట్ ప్రకటించడం అమెరికా చరిత్రలోనే... మామల్లపురంలో విజయ్ పార్టీ కార్యకర్తల సమావేశం
చెన్నై / మామల్లపురం జనవరి 25:
తమిళనాడులోని మామల్లపురం (మహాబలిపురం)లో నిర్వహిస్తున్న తన పార్టీ కార్యకర్తల సమావేశంలో సినీ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ పాల్గొంటున్నారు. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణతో పాటు రాబోయే ఎన్నికల వ్యూహాలపై విస్తృతంగా చర్చ జరగనుంది.
తాజాగా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన విజయ్, పార్టీని రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేయడంపై... జాగ్రత్త! వందేమాతరం గౌరవంలో చిన్న తప్పుకు కూడా భారీ మూల్యం చెల్లించాలి
న్యూఢిల్లీ జనవరి 25 (ప్రజా మంటలు):
భారతదేశంలో త్వరలోనే **జాతీయ గీతం ‘వందేమాతరం’**కు సంబంధించిన నియమాలు మారే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు జన గణ మన (జాతీయ గీతం) సమయంలో మాత్రమే కఠిన ప్రోటోకాల్, చట్టపరమైన బాధ్యతలు ఉండేవి. అయితే ఇకపై కేంద్ర ప్రభుత్వం వందేమాతరానికి కూడా అదే స్థాయి గౌరవం, చట్టబద్ధత కల్పించేందుకు సిద్ధమవుతున్నట్లు... నిజామాబాద్లో గంజాయి ముఠా దాడి: మహిళా కానిస్టేబుల్ సౌమ్య పరిస్థితి విషమం
నిజామాబాద్, జనవరి 25 (ప్రజా మంటలు):
నిజామాబాద్ జిల్లాలో గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నంలో మహిళా కానిస్టేబుల్ సౌమ్యపై గంజాయి ముఠా దారుణంగా దాడి చేసింది. కారులో గంజాయి తరలిస్తున్న ముఠాను ఆపేందుకు ప్రయత్నించిన సమయంలో నిందితులు సౌమ్యను ఢీకొట్టి, ఆమె కడుపు మీద నుంచి కారు నడిపినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనలో... పాశ్చాత్య ప్రభావంతో లివ్-ఇన్ సంబంధాలు : విఫలం తర్వాత కేసులు
అలహాబాద్, జనవరి 24 ప్రత్యేక ప్రతినిధి):పాశ్చాత్య ఆలోచనల ప్రభావంతో యువత వివాహం లేకుండా లివ్-ఇన్ సంబంధాల్లోకి వెళ్తోందని, అలాంటి సంబంధాలు విఫలమైన తర్వాత అత్యాచారం వంటి కేసులు నమోదు అవుతున్నాయని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 'లైవ్ లా' లో ప్రచురించిన కథనం ప్రకారం, మహిళలకు అనుకూలంగా ఉన్న చట్టాల ఆధారంగా... డీఎంకే వైపు ఏఐఏడీఎంకే నేతల వలస
తమిళనాడులోని ముఖ్యమైన పార్టీల గుర్తులు
చెన్నై, జనవరి 24 (ప్రత్యేక ప్రతినిధి):
తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే వైపు ఏఐఏడీఎంకేకు చెందిన పలువురు మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చేరుతున్నారు. గత ఆరు నెలల్లో మాజీ మంత్రి–ఎంపీ అన్వర్ రాజా, మాజీ ఎంపీ వి. మైత్రేయన్, మాజీ ఎమ్మెల్యే కార్తిక్ తొండైమాన్ సహా,... జపాన్లో ఎన్నికల సమరానికి సానే తకైచి పాంక్నిర్ణయం
టోక్యో జనవరి 24:
జపాన్ అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP) నాయకురాలు మరియు 104వ ప్రధాన మంత్రి సానే తకైచి, గత అక్టోబర్లో పదవీ స్వీకరించినప్పటికీ, పార్లమెంట్ను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయం మేరకు ఫిబ్రవరి 8, 2026న దేశవ్యాప్త సాధారణ ఎన్నికలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
తకైచి... అంతర్జాతీయ భ్రూణ హత్యల నివారణ దినోత్సవ కరపత్ర ఆవిష్కరణ
జగిత్యాల జనవరి 24 (ప్రజా మంటలు)అంతర్జాతీయ భృణహత్యల నివారణ దినోత్సవం పురస్కరించుకొని పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం రూపొందించిన, కరపత్రాలను, ప్రముఖ పౌరాణిక పండితులు బుర్రా భాస్కర శర్మ, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత, జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ ఎన్.శ్రీనివాస్, ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బుర్రా భాస్కర శర్మ మాట్లాడుతూ పురి... జీవన్ రెడ్డి మీద ఉన్న ప్రేమ బిజెపి కార్యకర్తలపై లేదా..? ఎంపీ అరవింద్ ఒంటెద్దు పోకడలు మానుకోవాలి.
జగిత్యాల, జనవరి 24 (ప్రజా మంటలు)
40 ఏళ్ల పాటు కాంగ్రెస్ లో పని చేసిన జీవన్ రెడ్డిని కాంగ్రెస్ నాయకత్వం ఇబ్బంది పెట్టడం తనకు బాధ కలిగిస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించడాన్ని జగిత్యాల బిజెపి సీనియర్ నేతలు తీవ్రంగా ఖండించారు.
శనివారం బిజెపి సీనియర్ నేతలు సీపెళ్లి రవీందర్, అంకార్ సుధాకర్,... టీ-హబ్ స్టార్టప్ల కేంద్రంగానే కొనసాగాలి: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, జనవరి 24 (ప్రజా మంటలు):
టీ-హబ్ను పూర్తిగా స్టార్టప్ల కేంద్రంగా మాత్రమే కొనసాగించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను టీ-హబ్కు మార్చనున్నారన్న వార్తలపై సీఎం వెంటనే స్పందించారు.
అమెరికా పర్యటనలో ఉన్న సీఎం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో ఫోన్లో మాట్లాడి స్పష్టమైన ఆదేశాలు... 